-నెను ముస్లింగా వుండలెక పోతున్నాను ఎందుకని --New serial


కొత్త సీరియల్-నెను ముస్లింగా వుండలెక పోతున్నాను ఎందుకని ప్రారంభిస్తున్నాము .ఇంగ్లిష్ లొ ఈ రచనను ప్రొమిథియా ప్రచురణలు అమెరికాలొ వెలువరించారు.దీని రచయత-ఇబన్ వారక్ అమెరికాలొ ఎక్కడొ వుంతూ పరిశొధనలు గావిస్తున్నారు. ఆయన అసలు పేరు తెలియదు.ఇండియా-పాకిస్తాన్ నుండి ఫ్రాన్స్ మీదుగా అమెరికా వచ్చి మానవ వాదిగా పరిణమించారు .పరిశొధనాత్మకంగా  గావించిన రచన తెలుగులొ అనువదించి ప్రచురించడానికి అనుమతించారు. ఇతల భాషలలోకి అనువాదాలు రాగా బుహుళ ప్రచారం పొందినది .మూల గ్రంధాల ఆధారంగా సాగిన రచనను అందిస్తున్నాము.-నరిసెట్టి ఇన్నయ్య


పరిచయం
  కథ చెప్పడమే కాదు. వినడం కూడా చేతకావాలన్నాడు రాచకొండ విశ్వనాథశాస్త్రి పుస్తకాలు రాయడం ఒక ఎత్తు. వాటిని అచ్చు వేయడానికి ధైర్యం కావాలి. సాల్మన్ రష్డీ, తస్లీమా నస్రీన్ (బంగ్లాదేశ్ లజ్జ రచయిత్రి) రచనలు వెలువడిన తరువాత, చాలమంది ప్రచురణకర్తలు వివాదాస్పద రచనలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా ముస్లింలను, మహమ్మద్, కొరాన్, ఇస్లాం చట్టాలను విమర్శించే గ్రంథాల జోలికి పోకూడదనుకుంటున్నారు. అలాంటి సందర్భంలో అమెరికాలోని హ్యూమనిస్టు ప్రచురణ సంస్థ ప్రామిథిస్ వారు ధైర్యంగా ఈ పుస్తకాన్ని ఇటీవలే వెలువరించడం ఆహ్వానించదగిన మార్పు.
పుస్తక రచయిత ముస్లిం. ఇస్లాంను బయటివారు విమర్శించిన రచనలు చాలా ఉన్నాయి. వాటిని ముస్లింలు అంతగా పట్టించుకోరు. కాని తమలోని ఒక వ్యక్తి విమర్శిస్తే, చంపేసేవరకూ, అమానుషంగా ప్రవర్తిస్తారు. శటానిక్ వర్సెస్ రాసిన సాల్మన్ రష్డీని చంపేయమని ఇస్లాం అధిపతి అయోతుల్లా ఖొమినీ ఉత్తర్వులు జారీచేశారు. బంగ్లాదేశ్ లో తస్లీమా నస్రీన్ కు తలదాచుకునే అవకాశం లేక, స్వీడన్ కు పారిపోవాల్సిన దుర్గతి పట్టించారు. వారి పుస్తకాలను నిషేధించారు. మళ్ళీ ఈ దేశాలన్నీ మానవ హక్కుల పత్రం పాటిస్తామని సంతకాలు చేసిన వారే. ఇబన్ వారక్ రచన చాలా లోతుపాతులతో, నిశిత పరిశీలనతో, అనేక మంది రచయితలను పట్టి చూచి రాసిన గ్రంథం. అంతా అయిన తరువాత ఇక తాను ముస్లింగా ఉండలేనంటున్నాడు. అది ధైర్యానికి నిదర్శన ప్రకటన.
బెర్ట్రాండ్ రస్సెల్ నేనెందుకు క్రైస్తవుణ్ణి కాదు అనే రచన చేస్తే ప్రపంచంలో ఇతర మతస్తులు మెచ్చుకున్నారు. ఇబన్ వారక్ అంటాడు. రసెల్ రచనలో క్రీస్తుకు బదులు అల్లాను  పెడితే, అదంతా ముస్లింలకు యధాతధంగా వర్తిస్తుంది. అలాగే అన్ని మతాలకూ చెందుతుంది. నేనెందుకు హిందువును కాలేదు అని ఇటీవల రామేంద్ర బీహార్ నుండి ఒక రచన ప్రచురించాడు. అదికూడా రసెల్, ఇబన్ వారక్ ధోరణిలోనే.
ఈ రచనలో 17 అధ్యాయాలు ఉన్నవి. ఇబన్ వారక్ చాలా పరిశోధన చేసి ప్రతి అంశాన్ని పట్టిచూచి, రాశాడు. రష్డీ వ్యవహారంతో తొలి అధ్యాయం ఆరంభమవుతుంది. 1989 ఫిబ్రవరిలో ఇరాన్ అధిపతి అయోతుల్లా ఖొమినీ ఫత్వా జారీ చేసి సాల్మన్ రష్డీని చంపమన్నాడు. పాశ్చాత్యులలో కొందరు ముస్లింలను దువ్వడానికిగాను ఈ చర్యను సమర్థించారని, ఖొమిని చర్యను ఖండించలేకపోయారని ఆయన చూపారు. ఫ్రెంచి తత్వవేత్త ఫూకోసైతం ఖొమిని చర్యల్ని ఆహ్వానించి, ఇరాన్ లో దారుణాల పట్ల కళ్ళు మూసుకున్నట్లు రచయిత ప్రస్తావించారు. శాస్త్రీయ రంగంలో పరిశోధనలు, రుజువులు, ప్రగతిని కొంతవరకు క్రైస్తవులు స్వీకరించి, మత ఛాందసాన్ని సవరించారని, ఇంకా ముస్లింలు ప్రారంభించ లేదని రచయిత అన్నారు. అయితే శాస్త్రీయ ఉప్పెనకు కొరాన్ తట్టుకోలేదని కూడా ఆయన అన్నాడు.
రెండో అధ్యాయంలో ఇస్లాం పుట్టుపూర్వోత్తరాలు, యూదు క్రైస్తవ మతాల గ్రంథాల ప్రభావం సుదీర్ఘంగా చర్చించారు. విగ్రహారాధన వ్యతిరేకించే ముస్లింలు మక్కాలో కాబా నల్లరాతిని ప్రతిష్ఠించి, ఆరాధించే రీతులు ఎలా వచ్చాయో వివరించారు. ఇది ఆకాశం నుండి వూడిపడిన ఉల్క అని కీ.శే.కారల్ శాగన్ రాశారు. మక్కా మీదుగా ఎమెన్, సిరియా వెళ్ళే ఒంటె వ్యాపారస్తుల కాబావద్ద ఆగి, పక్కనే ఉన్న ఊట బావి నీటితో సేద తీర్చుకొని వెళ్ళేవారని రచయిత పేర్కొన్నారు.
మూడో అధ్యాయంలో మూలాధారాల పరిశీలనో ఎదుర్కొంటున్న సమస్యల్ని, రచయిత కూలంకషంగా చూచారు. ఖురాన్ గురించి ముస్లిం సనాతనులు చెప్పే అబద్ధాలు మొదలు, మహమ్మద్, సంప్రదాయల వెనుక ఎంతవరకు నిలబడగల చరిత్ర ఉందో చూపారు.
నాలుగో అధ్యాయంలో మహమ్మద్ సందేశాలను రచయిత విప్పి చూపారు. మహమ్మద్ గురించి రాసిన వాళ్ళలో చాలామంది వ్యతిరేకులు కాదని, అయినా వాస్తవాలు తెలిపారని, ముస్లింలు అదంతా గ్రహిస్తే అంత అభిలషించరని రచయిత అన్నారు. మహమ్మద్ లో మక్కా కాలంలో మహమ్మద్ చిత్త శుద్ధిగల  మత నమ్మకస్తుడుగా ఉన్నాడు.
ఖురాన్ గురించి ఐదవ అధ్యాయం విపులంగా పరిశీలిస్తుంది. ముస్లింలు ఖురాన్ పవిత్రమనీ, దైవదత్తమనీ, సత్యమనీ నమ్ముతారు. అలాంటి గ్రంథంలో పరస్పర విరుద్ధాలు, ప్రక్షిప్తాలు, భిన్న పాఠాంతరాలు ఉండడాన్ని రచయిత చూపాడు.  ఖురాన్ సూచించే శిక్షలో మానవహక్కుల్ని ఎలా ఉల్లంఘిస్తున్నాయో రచయిత పేర్కొని ఇస్లాం దేశాలన్నీ మానవహక్కుల పత్రం అంగీకరించిన విషయం గుర్తు చేశారు. బైబిల్ వలె ఖురాన్ కూడా సృష్టివాదం, ఒప్పుకోగా, సైన్స్ అందుకు విరుద్ధంగా పరిణామ వాదానికి సాక్ష్యాధారాలు చూపుతున్నది. అలాగే జీవం కూడా.
ఇస్లాంలో నియంతృత్వం ఎలా ఉందో రచయిత మరొక అధ్యాయంలో చూపాడు. ఇస్లాం అంతా  విధులలో కూడినది. పుట్టిన దగ్గరనుండి చనిపోయే వరకూ జీవితాన్ని అదుపులో పెట్టడం ఇస్లాం పని. కనుకనే ఇస్లాంలో సెక్యులరిజం లేదు. అంటే మతం-రాజ్యం విడిగా చూడడం లేదు. ఇస్లాం యావత్తు నాలుగు స్తంభాలపై ఆధారపడుతుంది. ఖురాన్, సున్నా, (ప్రవక్త ప్రవచనాలు), వీటిని గురించి ఒక అంగీకారానికి వచ్చిన ముస్లిం పండితుల మాటలు. ఉపమానాలతో కూడిన వాదన. రచయితననుసరించి ఖురాన్ 7-9 శతాబ్దాల మధ్య రాసిందే. ఇందులో యూదు, క్రైస్తవ, జొరాస్ట్రియన్, సమారిటన్ నుండి స్వీకరించి చేర్చినవి చాలా ఉన్నాయి. ఇందులో శాస్త్రీయంగా నిలబడని దోషాలు, వ్యాకరణ భాషా దోషాలు, కాలదోషం, పరస్పర విరుద్ధ విషయాలు, అసంబద్ధాలు పేగన్ల పట్ల అసహనం, హింస, హత్య, స్త్రీ పురుష అసమానతలు, బానిసత్వాన్ని అంగీకరించండం, అమానుష శిక్షలు, మానవ వివేచన పట్ల జుగుప్స ఉన్నాయి. దైవదత్తమైన వాటిలో ఇలా ఉండడం అర్థం లేనిదని రచయిత ఉద్దేశం. ఉదారత, తల్లిదండ్రులపట్ల గౌరవం వంటివి ఉన్నప్పటికీ అసంబద్ధాల మధ్య అవి మునిగిపోయాయి.
ఇస్లాంలో పురోహిత వర్గం లేదని ముస్లిం పండితులు చెబుతారు. కాని ఇస్లాంకు సరైన వ్యాఖ్యానం చేసే పేరిట అన్ని చోట్ల పురోహిత వర్గం తిష్ఠవేసి పెత్తనం చేస్తున్నది. ఉలేమాలు వీరే. ముస్లింలలో నిశిత పరిశీలన, శాస్త్రీయ దృక్పథం పెంపొందకుండా నిరోధిస్తున్నది ఈ ముల్లాలే. వెయ్యేళ్ళ క్రితం ఆనాటి పరిస్థితులలో వచ్చిన షరియా చట్టాలు నేడు చారిత్రకంగా చూడాలేగాని, తు.చ.తప్పక పాటిస్తే నైతిక ప్రగతి ఉండదని రచయిత ఘంటాపథంగా చెప్పారు.
మానవహక్కులుః ముస్లిం దేశాలు ఇస్లాంను పాటిస్తూనే. మానవ హక్కుల్ని అంగీకరిస్తూ సంతకాలు చేశాయి. ఐక్యరాజ్య సమాఖ్యలో వీరు సభ్యులే. కాని ఆచరణలో అడుగడుగునా మానవ హక్కుల్నిఇస్లాం అడ్డుకుంటున్నది. ఇస్లాం స్త్రీలు పురుషులు సమానం కాదు. పురుషుడి సాక్ష్యంలో సగం విలువ మాత్రమే స్త్రీ సాక్ష్యానికి ఉంటుంది. స్త్రీలకు అన్ని విధాల స్వేచ్ఛను ఇస్లాం పరిమితం చేస్తుంది. ముసుగు వేసుకోమంటుంది. మానవ హక్కుల ప్రకారం స్త్రీ పురుషులకు హక్కులు స్వేచ్ఛ, భావాలు సమానంగా ఉండాలి. కాని ఇస్లాం ప్రకారం స్త్రీలు ముస్లింలు కాని వారిని పెళ్లి చేసుకోరాదు. ముస్లిం దేశాలలో నివసించే ముస్లిమేతరులకు కోర్టులో కాని, మరెక్కడా  సమాన హక్కులు లేవు. ముస్లిం దేశాలలో నాస్తికులు, నమ్మకం లేనివారు చంపబడాల్సిందే. ముస్లిం దేశాలలో ఇతరమతాల వారు తమ ప్రార్థనలు చేసుకోడానికి, బాహాటంగా గుడి, చర్చి నిర్మించడానికి, పవిత్ర గ్రంథాలు చదవడానికి వీల్లేదు. మానవహక్కులు బానిసత్వాన్ని వ్యతిరేకిస్తుండగా ఇస్లాం గుర్తిస్తున్నది. బానిస స్త్రీలతో లైంగిక సంపర్కం ముస్లింలకు ఖురాన్ అనుమతిస్తున్నది. (సుర 4ః3) మానవహక్కుల ప్రకారం క్రూరమైన, అమానుషమైన శిక్షలు, మానవత్వాన్ని దిగజార్చే శిక్షలు ఉండరాదు. ఇస్లాం ప్రకారం కొరడాతో బహిరంగంగా కొట్టడం, చేతులు కాళ్ళు నరకడం, రాళ్ళు విసరి చంపడం అనుమతిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమని మానవహక్కులు చెబుతుండగా, ఇస్లాం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. ముస్లింలలో ఇతరులు మతం మార్చుకొని చేరవచ్చు. కాని ముస్లింలు మతం మార్చుకొని వేరేపోవడానికి వీల్లేదు.
ప్రజాస్వామ్యం - ఇస్లాం పొసగనివని, మానవ హక్కులకు ఇస్లాంలో అవకాశం లేదని రచయిత వివరంగా చెప్పాడు. ముస్లింలు ఇతర ప్రపంచంతో పాటు ముందుకు సాగడానికి, మతాన్ని రాజ్యాన్ని విడదీసే సెక్యులరిజం అవసరమని రచయిత అన్నారు.
స్త్రీలు-ఇస్లాం - స్త్రీలపట్ల ఇస్లాం ఎలా ప్రవర్తిస్తున్నదో చాలా వివరంగా రచయిత ఒక అధ్యాయంలో చర్చించారు. క్రైస్తవులవలె ఇస్లాం కూడా పురుషుని సృష్టి ముందు జరిగిందని భావించారు. స్త్రీలపట్ల ఇస్లాం చాలా క్రూరంగా, హేయంగా ప్రవర్తించిన ఉదాహరణలు రచయిత చూపాడు.
స్త్రీ బహిస్టు సమయంలో ఖురాన్ తాకరాదు. కాబా చుట్టూ తిరగరాదు. ప్రార్థన చేయరాదు. ఉపవాసం ఉండరాదన్నారు. స్త్రీ పురుష అసమానత్వం ఖురాన్ లో నిర్దష్టంగా ఉంది. (సుర 2.282) ఆస్తిహక్కులో కూడా అబ్బాయికి రెండురెట్లు, అమ్మాయికి ఒక భాగం చెందాలన్నారు.
రక్తపాతంతో కూడిన పగ సాధింపు ఇస్లాంలో పేర్కొన్నారు. (సుర 2.178) స్త్రీలకంటే పురుషులు వివేచనలో అధికులని ఇస్లాం న్యాయవేత్తలు పేర్కొన్నారు.
ముస్లిం స్త్రీల ముసుగు వారి బానిసత్వానికి గృహ నిర్బంధానికీ, తక్కువగా చూడడానికి నిదర్శనంగా నిలచింది. ముస్లిం స్త్రీలు అనేకదేశాలలో బయటకు వచ్చి, తమ స్వేచ్ఛా స్వాతంత్రాలను వెల్లడిస్తున్నా, మొత్తం మీద ఇస్లాం వారిని చిన్న చూపు చూస్తూనే ఉంది. రచయిత ఈ రంగంలో సోదాహరణలతో వివరణ ఇచ్చారు.
ఇస్లాం సాహిత్యంలో వైన్, స్త్రీల గురించి రమణీయమైన కవితలు, సాహిత్యం ఈ రచయితే ప్రస్తావించారు. వైన్ దైవదత్తమని మహమ్మద్ ఒకచోట ఖురాన్ లో ప్రస్తావించాడు. (16.69) మరొకచోట వైన్ నిషిద్ధం, అని కూడా చెప్పాడు (5.92)
ప్రతి మతం ఆహార పానీయాలలో నిషేధాలు పాంటించింది. హిందువులు, క్రైస్తవులు దీనికి మినహాయింపుకాదు. ముస్లింలు పందిని నిషేధించారు. చైనాలో ముస్లింలు పంది మాంసం తింటూనే, దానిని పోర్క్ అనకుండా మటన్ అని సరిపెట్టుకుంటున్నారు. మొరాకోలో రహస్యంగా తింటున్నారు.
లైంగిక ఆచారాలలో పురుషాయితం, స్త్రీల పట్ల స్త్రీలు అనుసరించే రీతుల్ని కూడా రచయిత ప్రస్తావించారు. ముస్లిం కవుల కవితల్ని చూపాడు.
మహమ్మద్ః రచయిత ఒక అధ్యాయంలో మహమ్మద్ వ్యక్తిత్వాన్ని అంచనా వేశారు. చరిత్రలో ఆయన గొప్ప వ్యక్తి అన్నారు. మక్కా కాలమంతటా మహమ్మద్ చిత్తశుద్ధితో ప్రవర్తించాడన్నారు. మదీనా కాలంలో మహమ్మద్ మారిపోయినట్లు చెప్పారు.
ముస్లింలకు తప్ప ఇతరులకు ముక్తి లేదని, మానవాళికి ఈ సందేశం అందించడానికి దైవం నిర్ణయించినట్లు చెప్పారు. ఇది పెద్ద భ్రమ అని రస్పెల్ ను ఉదహరిస్తూ రచయిత పేర్కొన్నారు.
ఖురాన్ దైవదత్తమనీ, అదే అంతిమ సత్యమనీ మహమ్మద్ చెప్పడంతో కొత్త భావాలకు, స్వేచ్ఛకు స్వస్తి పలికినట్లయిందని రచయిత స్పష్టం చేశారు.
పాశ్చాత్య దేశాలలో ముస్లింలపట్ల, ఇస్లాం, ఖురాన్ గురించి రాజీ ధోరణిలో ప్రవర్తించడం వలన, ప్రజాస్వామ్య విలువల పట్ల రాజీపడినట్లయిందని రచయిత హెచ్చరించారు. స్వేచ్ఛకూ, ఇది లేని వారికీ పోరాటం జరుగుతుందనీ, 21వ శతాబ్దంలో ముందుకు పోవాలంటే స్వేచ్ఛతో కూడిన, ప్రజాస్వామిక మానవ హక్కులు పాటించాలని రచయిత అంటున్నారు.
సాల్మన్ రష్డీ శటానిక్ వర్సెస్ వంటిది కాదీ పుస్తకం. ఒక ముస్లిం పండితుడు ప్రజాస్వామిక, స్వేచ్ఛా పిపాసిగా ఆక్రందనతో రాసిన పుస్తకం ఇది. అయితే ముస్లింలలో ఉన్న అసమానం దృష్ట్యా ఈ రచనకు సుప్రసిద్ధ ప్రచురణ సంస్థ అమెరికాలో చేబట్టింది. బహుశ ఇస్లాం గురించి ఇంత వివులంగా, సమగ్రంగా ఇటీవల ఏ రచనా వెలువడలేదేమో.
భారతదేశంలో హమీద్ దల్వాయ్, ఎ.బి.షా వంటి వారు చేసిన రచనలు చాలా మందిని ఆలోచింపజేశాయి. ఈ రచన బహుళ ప్రచారంలోకి వస్తే ఇంకా కళ్ళు తెరుస్తారు. ఖురాన్ గురించి కూలంకషంగా చర్చించిన అనంతరం, సుమారు 6వేల సురా సూత్రాలతో కూడిన ఖురాన్ ను రోజూ ముస్లిం పిల్లలకు నూరిపోసి, కంఠస్తం చేయించడం కూడా రచయిత ప్రస్తావించారు.
నరిసెట్టి ఇన్నయ్య 

Why I am not a muslim by Ibn Warrak
Telugu by: Innaiah Narisetti
Will appear in serial


1 comment:

Sudhakar said...

తెలుగు లైన్లు ఒక దానిమీద ఒకటి కలగాపులగంగా పడి కనిపిస్తున్నాయ్ మీ బ్లాగులో. చదవటం కష్టంగా వుంది. బహుసా నాకే ఈ సమస్య ఉందేమో...

Post a Comment