జ్యోతిష్యం మూధనమ్మకమా ,శాస్త్రీయమా?


జ్యోతిష్యం మూధనమ్మకమా ,శాస్త్రీయమా?


పంచ పాండవులు మంచపు కోళ్ళవలె ముగ్గురే అంటూ రెండు చూపుతూ ఒక టి వేయబోయి సున్న పెట్టాడట !!
జ్యోతిష్యంలో భారతీయ జ్యోతిష్యం వేరు.అమెరికాలో చదువుకున్న తెలుగువారిలో కొందరితో సహా దీన్ని నమ్మడం, పాటించడమ గమనార్హం .
భారతీయ జ్యోతిస్య్హం ప్రకారం నవగ్రహాలపై అంతా ఆధారపడుతుంది .కాని నవ గ్రహాలలో రెండు -రాహువు, కేతువు - వునికిలోనే లేవు. లేని గ్రహాల ప్రభావం ఎలా వుంటుంది?  
చంద్రుడు గ్రహం కాదు . భూమికి ఉపగ్రహం .
మిగిలిన వాటిలో  సూర్యుడు గ్రహం కాదు. నక్షత్రం.గ్రహానికీ స్వయం ప్రకాశం లేదు.ఒక్క సూర్యుడు మాత్రమే మనకు వెలుగు  ఇస్తాడు. గ్రహాల నుండి మనుషులపై ఎలాంటి ప్రభావమూ లేదు. 
సూర్యుడినుండి ప్రతి క్షణమూ లక్షలాది కిరణాలు మనమీద ప్రసరిస్తాయి. అందులో పుట్టుక సందర్భంగా ఏకిరణ ప్రభావం ఎలా కొలుస్తారు? దాఖలాలు లేవు. 
అలాగే తారలనుండి ప్రసరించే కిరణాలు మనమీద ప్రభావితం చూపుతున్నయనడానికి ఇంతవరకూ మన జ్యోతిష్యులకు ఒక్క ప్రమాణమూ లేదు. వీరికి వున్న ఆధారమల్ల, ప్రాచీన గ్రంధాల ఆధారమే. అవి శాస్త్రీయంగా రుజువు అయినవి కావు. 
జ్యోతిష్యం శాస్త్రియం అని రుజువు పరిస్తే $ 1 మిలియన్ ఇస్తానని జేంస్ రాండి చేశిన చాలెంగ్ ఇప్పటికీ అమలులో వున్నది. వెభ్ సైట్ లో చూడంది. 
జ్యోతొష్జ్యం కేవల గుడ్డి నమ్మకం. 
అయితే కొన్ని తేడాలతో ఇలాంటి జ్యోథి ష్య  అంధ విశ్వాసం అమెరికాలో వ్యాపించి వున్నది. రాండి సవాల్ వారూ ఎదురు కొనలేకపోయారు.  
Innaiah Narisetti

తెలుగు పత్రికా రంగ వైతాళికులు,కీర్తిశేషులు, ప్రముఖులు

మన పాత్రికేయ వెలుగులు


హైదరాబాద్ లో వయోధిక పాత్రికేయ సంఘం వారు 2011లో 370 జర్నలిస్ట్ ల సమాచార గ్రంధం వెలువరించారు.కె.లక్ష్మణరావు సమన్వయ కర్తగా, గి.ఎస్.వరదాచారి, దాసు కేసవరావు, ట్.ఉడయవర్లు, సంపాదకులుగా క్రిషి చేశారు.

వైతాళికులు భాగంలో భాగంలో 23 పుటలు వీరేశలింగం మొదలు జి.ఎస్. భార్గవ వరకు సంక్షిప్త వివరాలు అందించారు.

కీర్తి శెషులు అధ్యాయంలో 27 నుండి 74 పేజీలు విలువైన వ్యక్తుల విషయం వున్నది.

77 నుండి 136 పుటలలో విలువైన సమాచారం, చిత్రపటాలు వున్నవి. 137 నుండి 145 వరకు కేవలం ఫోటోలు, పేర్లు మాత్రమే ప్రచురించారు.

అమెరికాలో వున్న 5 గురు ప్రముఖ తెలుగు జర్నలిస్ట్ ల వివరాలు ఫోటోలతోసహా విడిగా వెల్లదించారు.

వివిధ పత్రికల వివేష సంచికల అట్ట ఆకర్షణీయమేగాక, చరిత్రను చాటుతున్నది.

తెలుగు పత్రికా రంగ వైతాళికులు,కీర్తిశేషులు, ప్రముఖులు



400 రూపాయల్వెల పెట్టారు. డాలర్ ధర ఇవ్వలేదు.

ప్రతులకు : ప్లాట్ 24, జర్నలిస్ట్ కాలని, రోడ్ 3, బంజార హిల్ల్స్, హైదరాబాద్ 500034, ఇండియా.పుస్తకం రిఫరెన్స్ గా ఉపకరిస్తుంది.తరువాతి ప్రచురణలో తప్పులు సవరించి,మేలు ప్రతిని అందిస్తామన్నారు. 1/4 డెమి సైజ్ లో వున్నది. మంచి పేపర్పై ప్రచురించారు. చక్కని ప్రయత్నం, క్రిషి



నరిసెట్టి ఇన్నయ్య

రండి! కొత్త దేవుళ్ళను సృష్టిద్దాం..






ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అంతకుమించి దేవుళ్ళున్నారు. గతం నుండి గమనిస్తే ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు దేవుళ్ళు పుట్టుకొస్తూనే వున్నారు. దేవుళ్ళ చరిత్ర చూస్తే పాత వాళ్ళు కొందరు గతించడం, కొత్తవాళ్ళు చిగురించడం స్పష్టం. ప్రాంతాల వారీగా, దేశాల వారీగా దేవుళ్ళున్నారు. ఎక్కడికక్కడ జనం అలవాట్లు, ఆచారాలు, చివరకు వేషభాషలు కూడా దేవుళ్ళకు వచ్చాయి.



బాగా జన బాహుళ్యంలో వ్యాపించిన దేవుళ్ళు కొందరే వున్నారు. యూదుల దేవుడు ప్రాచీన హేబ్రూ భాష మాత్రమే తెలిసినవాడు. క్రైస్తవుల దేవుడు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాడు. యూరోప్ వాసుల వాణిజ్య వ్యాపార విస్తృతితోబాటు, దేవుణ్ణి వెంట బెట్టుకెళ్ళి ప్రచారం చేసి పెట్టారు. ముస్లింల దేవుడు 7వ శతాబ్ది నుండి ఆరంభించి, ఉధృతంగా విస్తరించాడు.



బౌద్ధం బాగా ప్రాచీనమైనా చాలాకాలం ఇండియాకు, ఆసియా ఖండానికి పరిమితమై సరిపెట్టారు. ఇప్పుడిప్పుడే పాశ్చాత్య దేశాలకు బౌద్ధం కొంత విస్తరించకపోలేదు.



హిందువుల దేవుళ్ళు ఇండియాకు మాత్రమే సరిపెట్టుకున్నారు. వీరి సంఖ్య అపరిమితంగా వుంది. అందులో ప్రధానమైనవారు ముగ్గురే కాగా, చిలవలపలవలుగా మిగిలినవారు తలెత్తారు.



దక్షిణ అమెరికాలో, చైనాలో, ఆఫ్రికాలో దేవుళ్ళు వేరే లేకపోలేదు. మొత్తం మీద దేవుళ్ళు చరిత్ర, పరిణామం విజ్ఞాన సర్వస్వసంపుటాలకు మించిపోయింది. దానికి యింకా ఫుల్ స్టాప్ పెట్టలేదు.



ఎన్ని పేర్లు పెట్టినా, ఎన్ని మతాలున్నా, ఎన్ని రూపాలు కనబడినా అసలు దేవుడు ఒక్కడే అనేవారున్నారు.



విశ్వవ్యాప్తంగా ఒకే శక్తి వున్నదని అది అతీతమైనదని నమ్మేవారు కనిపిస్తారు.



దేవుడు సర్వాంతర్యామి అని, సర్వజ్ఞుడు అని, సర్వ శక్తివంతుడు అని వర్ణించిన వారూ వున్నారు.



దేవుళ్ళను గురించి రాసినా, మాట్లాడినా, సినిమాలు తీసినా, అదంతా మానవ ప్రక్రియమాత్రమే.



పరిమితమైన మానవుడు సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడి గురించి ఎలా మాట్లాడగలడు? అలా మాట్లాడేవారికి దైవంతోబాటు అన్ని లక్షణాలు వుండి వుండాలి. లేవు గనక వూహిస్తున్నారు.



ఇంతకూ యీ దైవ భావన ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎప్పుడు వచ్చింది?



మానవుల శక్తి పరిమితం. తెలియని అంశాలు అపరిమితం, క్రమేణా తెలుసుకుంటూ సాగిపోతున్నారు. ఈలోగా తెలియని వాటికి కారణాలు వెతకడం సహజం. కారణాలు తెలియనప్పుడు, అంతవరకూ, ఆగకుండా, దైవభావం తెచ్చిపెట్టారు. మనుషులకు తెలియనివాటికి, కారణం దైవం అని నమ్మారు. ఉరుములు, మెరుపులు, పిడుగులు, వర్షాలు, ఎండలు, భూకంపాలు, తుఫాన్ లు, గ్రహాలు, నక్షత్రాలు, అంతరిక్షం, భూగర్భం, సముద్రాలు యిత్యాది అన్నీ దైవ సృష్టి అని నమ్మారు. అంటే కార్యకారణ వాదం గట్టిగా అంగీకరించారన్నమాట. ప్రతి దానికీ కారణం వుండాలి. మనకు తెలియనప్పుడు అదే దైవం అన్నారు. తర్కం బాగున్నది. ఆ మాటమీదే నిలిస్తే, ప్రతిదానికీ కారణం వుండాలి అంటే, సరే బాగుంది.



అయితే, వీటన్నిటికి కారణమైన దేవుడికి కారణం ఏమిటి? ఆ మాట అడగొద్దు అన్నారు. అది తప్పు అన్నారు. శిక్షించారు. నరకానికి పోతావన్నారు. ఇంకా ఏమో అన్నారు. అక్కడ కార్యకారణ వాదం విఫలమైంది.



అన్నిటికీ కారణం దేవుడే అయితే, స్వయంగా సృష్టించే శక్తి అయితే, ఆ మాట ప్రకృతికి ఎందుకు అంటగట్ట కూడదు?



కొత్త దేవుళ్ళు



దేవుళ్ళ చరిత్ర చూస్తే అందరూ పరిణమించిన వారే. కొందరు శక్తివంతంగా తయారైతే, మరికొందరు పేలవంగా తేలిపోయారు. ఎహోవా, జీసెస్, అల్లా, బుద్ధుడు, బ్రహ్మ, విష్ణు, శివ యిలా ఎవరిపేరు విన్నా అదే కథ. ప్రజల్నిబట్టి వారి భాషలోనే పవిత్ర గ్రంథాలు, దేవుళ్ళు అందించారు. చదువు రాకపోయినా గ్రంథాలు రాయడం దైవ శక్తికి నిదర్శనంగా మానవులు చూపారు!



అట్లా వుండగా, ప్రతి శతాబ్దిలో కొత్త దేవుళ్ళను సృష్టించారు. ఇంకా పుట్టిస్తూనే వున్నారు. ఇండియాలో షిర్డీసాయి, అయ్యప్ప, వెంకటేశ్వరుడు, ఇంకా మాతలు, బాబాలు అందరూ స్థానిక దేవుళ్లే.



క్రైస్తవులలో కేథలిక్కులతో ఆరంభించి, క్రమేణా చీలి, ప్రొటస్టెంట్.లు, మెథడిస్టులు, బాప్టిస్టులు, మర్మోన్లు, సైంటాలజిస్టులు, కొన్నివందల శాఖలు చేరాయి. ముస్లింలలో సున్నీలు, ప్రథాన శాఖగా ఉన్న తరువాత షియాలు, ఖుర్ద్ లు, ఇంకా అనేక చిన్న ప్రాంతీయ శాఖలు వున్నాయి. బౌద్ధులలో హీనయాన, మహాయానం ముఖ్యం కాగా, చిన్న శాఖలు వుండనే వున్నాయి.



చీలిన శాఖలు శివమెత్తి అనేక సందర్భాలలో దేవుడి పేర కొట్టుకున్నారు. చంపుకున్నారు. ఇంకా అది సాగుతూనే వున్నది.



దేవుడి జీవితం ప్రభావం



మనుషులే దేవుళ్ళను పుట్టించారు. క్రమేణా ఆ దేవుళ్ళకు బానిసలయ్యారు. తామే దేవుళ్ళను పుట్టించామని మరిచిపోయారు.



నేడు ప్రపంచ వ్యాప్తంగా దేవుడిని నమ్ముతున్నవారు యించుమించు అత్యధిక సంఖ్యలో వున్నారు. ఇది 90 శాతం వరకూ లేకపోలేదు. ఇందులో తారతమ్యాలున్నాయి. వ్యక్తిగతంగా దేవుడుంటాడని కొందరనుకుంటారు. శక్తిగానే మిగిలాడని కొందరు నమ్ముతారు. వివిధ అవతారాలను విశ్వసించేవారూ వున్నారు. దేవుడికి పెళ్ళి చేయడం, సంతానం కలగడం, కొందరికి బహుభార్యాత్వం యివన్నీ మనుషులు అంటగట్టినవే.



దేవుడిని నమ్మించడానికి ఎత్తుగడలు పాటించారు. అందులో ముఖ్యాంశం “పవిత్ర గ్రంథాలు” మనుషులు రాసినా, వాటిని గౌరవించి, ఆరాధించి, పాటించాలంటే, పవిత్రం అని ముద్ర వేయాలి. అదే చేశారు. ఇంచుమించు అన్ని మతాలకు పవిత్ర గ్రంథాలున్నాయి. కొండ గుహల్లో చదువురాని వ్యక్తులకు దేవుడు వీటిని అందించిన కథలున్నాయి. వేదాలను అపౌరుషేయాలన్నారు. మూలగ్రంథాల సృష్టి ఆధునిక కాలాలవరకూ, సాగింది. క్రైస్తవులలో మోర్మోన్.లు, సైంటాలజీ శాఖలు ఆ పని చేశాయి. మూలగ్రంథాలన్నీ మనుషులు సృష్టించడంతో వుండవలసిన దోషాలు, పరస్పర విరుద్ధ విషయాలు, సెక్స్, కిరాతకాలు, నీతి సూత్రాలు అన్నీ వున్నాయి. మత గ్రంథాలను సైంటిఫిక్ గా సమర్థించే ప్రయత్నాలు సాగాయి. కాని ఫలించలేదు.



దేవుడి చుట్టూ, స్వర్గం, నరకం, కర్మ, పాపం, పుణ్యం, పునర్జన్మ, ప్రార్థనలు, యోగ, మొదలైనవన్నీ ఆకర్షణలుగా అల్లారు పురోహిత వర్గం. దేవుడికి మనుషులకు మధ్య దళారులుగా నిరంతర వ్యాపారం చేస్తున్నారు.



దేవుడున్నాడా? లేడా? అనేది నమ్మకస్తుల సమస్య. రుజువు చేయవలసింది నమ్మకస్తులే. వున్నాడని గట్టిగా నమ్మి ఇతరులకు బోధ చేస్తున్నారు. వారే రుజువు చేయాలి. అలా చేయనంత వరకూ వారు చెప్పేది నిజం కాదని అనడంలో తప్పులేదు. సైంటిఫిక్.గా దేవుడున్నాడని రుజువు చేస్తామంటున్నవారు ఎక్కడా సఫలం కాలేదు. సైంటిఫిక్ మెథడ్ తనను తాను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ సాగుతుంటుంది. దోషాలను ఒప్పుకుంటుంది. అంతా తెలిసింది అని ఎప్పుడూ అనదు. తెలుసుకోవడం అనంతంగా, నిరంతరంగా సాగే ప్రక్రియ. దానికి పవిత్ర గ్రంథాలుండవు. పెత్తందారీతనం వుండదు. ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, ఐన్ స్టయిన్.తో సహా రుజువుకు నిలవాల్సిందే. అది మతానికి అన్వయిస్తే ఏ దేవుడూ నిలవడు!!

INNAIAH NARISETTI

మరణించిన తరువాత ? After life what?









మనిషి చనిపోయిన తరువాత ఏమౌతుంది ? పునర్జన్మ వుంటుందా ? స్వర్గానికి నరకానికి పోతారంటారు. ఏది పోతుంది ?



ఆత్మ అనేది మరణానంతరం స్వర్గానికి లేదా నరకానికి వెడుతుందంటారు.



ప్రపంచంలో అన్ని కాలాల్లో యించుమించు అన్ని మతాలు మరణానంతరం గురించి నమ్మకాలు పెట్టాయి. కొన్ని మతాలు పాపం చేసిన వారు నరకానికి పోతారన్నాయి. మరికొన్ని మతాలు పుణ్యం చేసిన వారు స్వర్గానికి చేరుకుంటారన్నారు. స్వర్గ నరకాలు అంటే ఏమిటి? అవి అసలు ఉన్నాయా? ఆ విషయం వేరే చర్చించవచ్చు. ముందు ఆత్మ సంగతి తేల్చాలి.



మనిషి శరీరంలో మెదడు అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. మనిషి మరణించడం అంటే మెదడు కూడా మరణించడమే. మన శరీరం, అందులో ముఖ్యమైన మెదడు గురించి, నిరంతర శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. ఇప్పటి వరకు తెలిసిన దానినిబట్టి ప్రొటీన్లతో కూడిన శరీరం మనది. వాటి తీరుతెన్నులు పెద్ద జీవాణువుల సంకేతాల మయం (డి.ఎన్.ఎ.) మన మెదడులో యిమిడివున్న జ్ఞాపకాలు సూక్ష్మ జీవకణాల వలన పనిచేస్తాయి. వాటిని న్యూరాన్.లు అంటారు. న్యూరాన్ల మధ్య సంబంధాలు అత్యంత క్లిష్టమైనవి. శరీరం అందులోని మెదడు చనిపోయినప్పుడు న్యూరాన్ లు, డి ఎన్ ఎ అన్నీ కూడా చనిపోతాయి.



అంటే శరీరం లేకుంటే మెదడు వుండదు. మెదడు లేకుంటే జ్ఞాపకాలు వుండవు. మనిషి చైతన్యం, ఆలోచనలు, కలలు, అనుభూతులు, స్మృతులు అన్నీ మెదడుకు చెందినవే. మెదడు యావత్తు చేసే పనినే చైతన్యత అని, మానసికం అనీ అంటారు. మెదడు లేకుండా స్వతంత్రంగా చైతన్యతకు, మనస్సుకు అవకాశం లేదు.



ఆ దశలో నమ్మకస్తులు, మతాలు ఆత్మ అనే భావాన్ని వాడుకలోకి తెచ్చాయి. శరీరం అందులోని మెదడు మరణించినా, ఆత్మ వుంటుందని నమ్మారు. స్వర్గానికి, నరకానికి పోయేది యీ ఆత్మ మాత్రమే. పునర్జన్మ ఎత్తేది కూడా ఆత్మ అని నమ్మారు.



అన్ని మతాలకు ఆత్మపై విశ్వాసం మూలం. అది నమ్మితే గాని, ముందుకు సాగడానికి వీల్లేదు. ఒకసారి నమ్మిస్తే, బోలెడంత మతవ్యాపారం జరపవచ్చు. మతాలలోని పురోహిత వర్గాలు చేస్తున్న పని యిదే.



నమ్మకాలకు మెదడులో మూలస్థానం నొసలు భాగంలోని మెదడులో వున్నట్లు కనుగొన్నారు (Anterior Paratingulate Cortex).



విశ్వంలో జీవశక్తి వున్నదని, అందులో భాగమే మన శరీరంలో ఆత్మగా వుంటుందని నమ్మమంటున్నారు. ఇంద్రియాతీతంగా శక్తుల్ని గమనించవచ్చని చెప్పారు. జోసెస్ రైన్ వంటివారు జీవితమంతా శ్రమపడి, చివరకు ఇంద్రియాతీత శక్తి విషయంలో విఫలమయ్యారు.



శాస్త్రీయ పరిశీలన వలన అన్ని నమ్మకాలకు మూలం మెదడు అనేది కచ్చితంగా నిర్ధారణ అయింది.



చిన్నతనంలోనే నమ్మకాలు నూరిపోయడం వలన అవి నిజాలని, వాటిని పాటించడం పరిపాటి అయింది. స్వర్గంలో అమ్మాయిలను అనుభవించడం కూడా నిజమేనని నమ్ముతున్నారు. ఇవన్నీ మతపరంగా వచ్చినవే.



సైన్స్ చదివినా, నమ్మకాలను పోగొట్టుకోవడం లేదు. రెండిటినీ వేరు చేసి, దేనికదే పాటిస్తున్నారు. అదే పెద్ద చిక్కు. ముస్లింల మదరసాలలో, క్రైస్తవుల సండే పాఠశాలల్లో, బౌద్ధుల ఆరామాలలో యిదే జరుగుతున్నది. మిగిలిన మతాలు అంతే. ఆ నమ్మకాలకోసం ప్రాణత్యాగాలకు, హింసకు అరాచకత్వానికి దిగుతున్నారు.



రుజువు, ఆధారం శాస్త్రీయంగా కావాలంటే పునర్జన్మ ఆత్మ, స్వర్గ నరకాలు నిలబడవు. దేవుడి సంగతి సరేసరి. ఆ పేరిట మనుషులు రాసిన పవిత్ర గ్రంథాలలో పవిత్రత ఏమీ లేదు. వున్నదల్లా మూర్ఖ నమ్మకమే. దాని చుట్టూ క్రతువులు ఆచారాలు, శిక్షలు, ఎన్నో అల్లారు.



మెదడులో ఏ భాగం దేనికి పనిచేస్తుందో తెలుసుకుంటున్నారు. కొన్నిటిని స్పష్టంగా కనుగొన్నారు. మరికొన్ని యింకా పరిశోధనలో వున్నాయి. మెదడుకు దెబ్బ తగిలినప్పుడు ఆ భాగం ప్రభావితం చేసే శరీర భాగం దెబ్బ తినడం చూచారు. చూపుకు, వినడానికి, వాసన గ్రహించడానికి, స్పర్శకు ఏ భాగం మెదడులో అజమాయిషీ చేస్తున్నదో గుర్తించారు. శస్త్ర చికిత్సలు వాటి ఆధారంగా చేయగలుగుతున్నారు. కాని ఇదంతా అభివృద్ధి చెందుతున్న సైన్స్. ఇంకా ఎంతో గ్రహించవలసి వున్నది. ఒక విధంగా యిది నిరంతర కృషి.



మెదడులో కోట్లాది న్యూరాన్లు వుండగా, నమ్మకాలకు సంబంధించిన న్యూరాన్లు ఒక భాగంలో వున్నాయి. అవే మన విశ్వాసాలకు స్థానంగా పనిచేస్తున్నాయి. మనలో నమ్మకాలు ఏర్పడిన తరువాత, వాటిని గుడ్డిగా అనుసరించడం అలవాటుగా మారింది.



న్యూరాన్లు కోట్లాది వున్నాయన్నాం గదా. అవి అతి సాధారణంగా అనిపించినా, చాలా జటిలమైనవి కూడా. మెదడులో యివి పనిచేసే తీరు అంతా ఎలక్ట్రో మాగ్నటిక్ – విద్యుదయస్కాంత పద్ధతిలో సాగుతుంటుంది. అవన్నీ అవగాహన చేసుకోవడం క్రమంగా జరుగుతున్నది.



ఆశ్చర్యకర విషయం ఏమంటే సాధారణంగా నమ్మే వాటిని గురించి ఆధారాలు, సాక్ష్యాలు వెతకరు. నమ్మేస్తారు అంతే. వాటికి కారణాలు వెతికి సమర్థించుకుంటారు కూడా. కాని వాటికి భిన్నంగా వ్యతిరేకంగా శాస్త్రీయ పద్ధతి చేరితే, ఒక పట్టాన ఒప్పుకోరు. అదే నమ్మకాలకు – మత నమ్మకాలకు – ఆయువుపట్టు.



మతపరంగా ఆలోచిస్తే ప్రపంచంలో విషయాలు అర్థంకావు. జనం ఏదీ తెలుసుకోలేరు. జనానికి జీవితంలో ఉపయోగపడేవన్నీ సైన్స్ ఆలోచన ద్వారా వస్తున్నవే. ప్రార్థనలు చేస్తే అవిరావు.



నమ్మకాలకు, మత విశ్వాసాలకు శాస్త్రీయ (సైంటిఫిక్) ఆధారాలు చూపడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకని? సైన్స్ క్రమపద్ధతిలో పురోగమిస్తుంది గనుక. దాని ఉపయోగాలు స్పష్టం గనుక. కాని ఎంత తిప్పలు పడ్డా సైన్స్ ద్వారా మత విశ్వాసాలను రుజువు చేయలేకపోతున్నారు. అప్పుడప్పుడూ చేసిన అలాంటి ప్రయత్నాలు చతికిల బడుతూనే వున్నాయి. దేవుడు, ఆత్మ, స్వర్గనరకాలు, పునర్జన్మ, అవతారాలు అలాంటివన్నీ సైన్స్ ఆధారంగా నిలబడవు. గుడ్డిగా నమ్మితేనే నిలుస్తాయి. అందుకే సైన్స్ ను దూరం పెట్టి నమ్మకాలు పాటిస్తారు.



సైంటిస్టులు ఎక్కడైనా చెప్పిన మాటల్ని నమ్మకాలకు ఆధారంగా చూపబోతారు. సైన్స్ లో పెత్తందారీతనానికి, అధికారిక ప్రకటనలకు తావులేదు. ఎంత పెద్దవాడు చెప్పినా, ఆధారాలు చూపడం తప్పనిసరి.



మత విశ్వాసాలకు సైంటిఫిక్ ఆధారాలు యిచ్చే ప్రయత్నం తెలివితక్కువ తనానికి పరాకాష్ఠ. సైన్స్, మూల సూత్రం స్వయంగా పరిశీలించుకుంటూ సరిదిద్దుకుంటూ, పోవడం తప్పులు చేస్తే తప్పు జరిగిందని ఒప్పుకొని సవరించుకోవడంలోనే సైన్స్ పురోగమిస్తున్నది. సైన్స్.కు పవిత్ర (హోలీ) గ్రంథాలుండవు. పురోహిత పెత్తందారీ దళారులు వుండరు. ఆధారాలు, రుజువులు వుంటాయి. అందరికీ అవి సమానం ప్రపంచంలో ఎవరైనా ప్రయోగించి, విషయ నిర్ధారణ చేయవచ్చు. అవేవీ మతాలలో వుండవు.



న్యూటన్ మూఢనమ్మకాలు



సైన్స్ లోకంలో ఐజక్ న్యూటన్ గొప్ప సైంటిస్ట్. ఆయన కనుగొన్న గురుత్వాకర్షణ శక్తి ఆధారాలకు, రుజువులకు నిలచింది. అవి ఎక్కడ ఎవరైనా చేయవచ్చు.



అలాంటి గొప్ప సైంటిస్ట్ న్యూటన్.కు చాలా మూఢనమ్మకాలుండేవి. వాటిని ఎవరూ నమ్మలేదు. పట్టించుకోలేదు. ఎందుకని? అవి ఆధారాలు లేని వ్యక్తిగత విశ్వాసాలు గనుక అలాగే ఎడిసన్ విషయంలోనూ జరిగింది. ఈ సంగతి గ్రహిస్తే మనం గ్రహించవలసింది. రుజువులకు నిలిచే విషయాలే తప్ప, సైంటిస్ట్ ప్రకటనలు కాదు.



అలాగే సైన్స్ లో ప్రాంతీయతలు, దేశాభిమానాలు వుండవు. ఎక్కడైనా ఎవరైనా సైన్స్ ఆధారాలకు పరీక్ష పెట్టవచ్చు. రుజువు చేయవచ్చు. హైదరాబాద్ సైన్స్, అమెరికా సైన్స్ వుండదు. అది విశ్వ వ్యాప్తం ఇది గ్రహించాలి. పిల్లలకు ప్రశ్నించడం ప్రోత్సహిస్తే, మూఢనమ్మకాలు దూరం అవుతాయి.



- ఎన్. ఇన్నయ్య.