జ్యోతిష్యం మూధనమ్మకమా ,శాస్త్రీయమా?
పంచ పాండవులు మంచపు కోళ్ళవలె ముగ్గురే అంటూ రెండు చూపుతూ ఒక టి వేయబోయి సున్న పెట్టాడట !!
జ్యోతిష్యంలో భారతీయ జ్యోతిష్యం వేరు.అమెరికాలో చదువుకున్న తెలుగువారిలో కొందరితో సహా దీన్ని నమ్మడం, పాటించడమ గమనార్హం .
భారతీయ జ్యోతిస్య్హం ప్రకారం నవగ్రహాలపై అంతా ఆధారపడుతుంది .కాని నవ గ్రహాలలో రెండు -రాహువు, కేతువు - వునికిలోనే లేవు. లేని గ్రహాల ప్రభావం ఎలా వుంటుంది?
చంద్రుడు గ్రహం కాదు . భూమికి ఉపగ్రహం .
మిగిలిన వాటిలో సూర్యుడు గ్రహం కాదు. నక్షత్రం.గ్రహానికీ స్వయం ప్రకాశం లేదు.ఒక్క సూర్యుడు మాత్రమే మనకు వెలుగు ఇస్తాడు. గ్రహాల నుండి మనుషులపై ఎలాంటి ప్రభావమూ లేదు.
సూర్యుడినుండి ప్రతి క్షణమూ లక్షలాది కిరణాలు మనమీద ప్రసరిస్తాయి. అందులో పుట్టుక సందర్భంగా ఏకిరణ ప్రభావం ఎలా కొలుస్తారు? దాఖలాలు లేవు.
అలాగే తారలనుండి ప్రసరించే కిరణాలు మనమీద ప్రభావితం చూపుతున్నయనడానికి ఇంతవరకూ మన జ్యోతిష్యులకు ఒక్క ప్రమాణమూ లేదు. వీరికి వున్న ఆధారమల్ల, ప్రాచీన గ్రంధాల ఆధారమే. అవి శాస్త్రీయంగా రుజువు అయినవి కావు.
జ్యోతిష్యం శాస్త్రియం అని రుజువు పరిస్తే $ 1 మిలియన్ ఇస్తానని జేంస్ రాండి చేశిన చాలెంగ్ ఇప్పటికీ అమలులో వున్నది. వెభ్ సైట్ లో చూడంది.
జ్యోతొష్జ్యం కేవల గుడ్డి నమ్మకం.
అయితే కొన్ని తేడాలతో ఇలాంటి జ్యోథి ష్య అంధ విశ్వాసం అమెరికాలో వ్యాపించి వున్నది. రాండి సవాల్ వారూ ఎదురు కొనలేకపోయారు.
Innaiah Narisetti
0 comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.