మానవుడుగా కృష్ణుడు-Truth about Gita





అధ్యాయం ఎనిమిది

పురాణాల్లోని కృష్ణుడిని మనం ఇష్టపడవచ్చు, పడకపోవచ్చు. అది మన అభిరుచిని బట్టి ఉంటుంది. మహాభారతలో కృష్ణుడిని గమనిస్తే అయిష్టత యేర్పడుతుంది. కృష్ణ భక్తులవలె గాక, హేతుదృక్పథంతో చూస్తే అలా అనిపిస్తుంది. భక్తులకు వారి దేవుడే సర్వస్వం. భక్తికి అలాంటి ప్రభావం ఉన్నది. రాముడికీ, కృష్ణుడికీ సమానంగా భక్తిని చూపడాన్ని ఏమనుకోవాలి? ఇరువురూ విష్ణువు అవతారాలే అంటారు. ఐనా, ఎంత తేడా ఉన్నది. రాముడు సత్యం వైపుకు మొగ్గుతాడనీ, కృష్ణుడలా కాదనీ అంటారు. రాముడు ఏకప్రత్నీ వ్రతుడు. కృష్ణుడు కాదు. రెండ మూడు సందర్భాలు మినహాయించితే, రాముడు ధర్మయుద్ధం చేశాడు. కృష్ణుడు చేయలేదు. ఐనా, భక్తులకు తేడా కనిపించటం లేదంటే భక్తి ప్రభావమే కారణం.
భక్తుల సంగతి అలా వుంచి, మహాభారతంలో కృష్ణుడిని విదేశీ పండితుల దృష్టిలో చూద్దాం. ఇందులో బ్రిటిషువారిని స్వీకరించటం లేదు. దేశాన్ని పరిపాలించిన సామ్రాజ్యవాదులుగా వారికి భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత ఉండవచ్చు.
ఇ.డబ్ల్యు. హాప్ కిన్స్ భారతీయ శాస్ర్తాలను పరిశీలించిన అమెరికన్ పండితుడు. (1857-1932). అతడు సంస్కృతం, పహ్లవి, గ్రీస్, లాటిన్ భాషలను అధ్యయనం చేశాడు. హిందువుల కులం, నీతిపై రాశాడు. భాష, కవిత, నీతి దృష్ట్యా మహాభారతాన్ని విశ్లేషించారు. ఏల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా చాలా ఖ్యాతి పొందారు. కృష్ణుడు పవిత్రమైన మోసకారి అని స్పష్టంగా రాశాడు. (The Great Epic of India) గీత చివరలో ధృతరాఘ్ర్టనితో సంజయుడు చెప్పిన మాటలను బట్టి, కృష్ణుడి విశ్వరూపాన్ని చూచి ముగ్ధుడైనట్లు పేర్కొన్నారు. కురుక్షేత్ర యుద్ధం చివరిలో ఆ కృష్ణుడు మోసగాడని సంజయుడంటారు. 18 రోజుల్లో సంజయుడి అభిప్రాయం మారటానికి తగిన కారణం ఉండి ఉండాలి. సంజయుడి అభిప్రాయాన్నే హాప్ కిన్స్ గూడా సమర్ధించాడు. అర్జునుడికి రధసారధిగా ఉన్న కృష్ణుడు తాను పోరాటం లోకి దిగనని చెపుతూనే కురుపాండుల మధ్య వైరం పెంచాడు. కుయుక్తులనూ, విచక్షణ లేని ధోరణినీ కృష్ణుడు ప్రదర్శించాడు.
ఆస్ర్టేలియా పండితుడు మోరిస్ వింటర్నిట్ట్ భాష, తత్త్వాలను, భారత శాస్ర్తాలనూ అధ్యయనం చేశారు. ఆక్స్ ఫర్డ్ లోఉన్నప్పుడు రుగ్వేదం ముద్రణకు మాక్స్ ముల్లర్కు సహాయపడ్డాడు. మాక్స్ ముల్ల ర్ తయారు చేసిన 49 ప్రాచ్యపవిత్ర గ్రంధాలకు పద సూచికలో తోడ్పడ్డారు. ప్రాగ్ లో భారతీయ శాస్ర్తాలను బోధించాడు. భారతీయ సాహిత్యం పై 16 వంద పేజీలు రాశాడు. 1937లో అతను చనిపోయినప్పుడు రవీంద్రనాథ్ టాగోర్ అతడి సత్యాన్వేషణకు జోహారులర్పిం చాడు. కృష్ణుడిపై వింటర్నిట్జ్ రాస్తూ కుట్రలన్నీ అతడి నుంచే వచ్చాయనీ, మోసాలకు ప్రోత్సాహకారి అనీ, పాండవుల ప్రవర్తనను సమర్ధిస్తూ పోయాడనీ అన్నారు. పాండవులకు కృష్ణుడు జిత్తులమారి స్నేహితుడుగా రాశాడు. (Mauric Winternitz : A History of Indian Literature, Vol-I, Part-II, Calcutta).
మాక్స్ వెబర్ (1864-1920) జర్మనీ సామాజిక శాస్ర్తజ్ఞుడు. ప్రపంచమతాలను సామాజిక శాస్ర్త దృష్టితో పరిశీలించటం అతని ప్రత్యేకత. భారతదేశంలో శాస్త్రీయ దృక్పధాన్ని సాగనివ్వకుండా మతం అడ్డుపడుతుందని రాశాడు. కృష్ణుడు మహాభారతంలో అతి ఘోరమైన నేరాలను తనవారితో చేయించాడనీ అన్నాడు. (Max Weber : The Religion of India, New York, 1967, Page : 189).
సుక్తాంతర్ కృష్ణుడిని బాగా అధ్యయనం చేసి రాశాడు. విరుద్ధాల పుట్ట. యుద్ధరంగంలో తాత్త్వికుడు. తన సైన్యాన్ని శత్రువులకు అప్పజెప్పాడు. సర్వశక్తివంతుడైన తాను యుద్ధారంభంలో ఆయుధాలు చేబట్టనని ప్రతినపూనాడు. నిష్పక్షపాతంగా ఉండవలసిన ఈ దేవుడు కౌరవ సంహారానికీ, పాండవ విజయానికీ, నీతిరీతి లేని రాజకీయవాదిగా రహస్యకుట్రలు పన్నాడు. యుద్ధరంగంలో నిలబడి ఈ అవతరా పురుషుడు కింది స్థాయి నీతిని భోదించాడు. జిత్తులమారిగా ప్రవర్తించాడు. (V.S. Suktankar : On the Meaning of Mahabharata, 1957, Bombay)
పరస్పరం విరుద్ధాలు అన్నపుడు అందులో వివేచనలూ, వాదనకూ చోటు లేదు. కృష్ణుడు ఈ విరుద్ధాల పుట్ట అనీ, చిక్కు సమస్యవంటి వాడనీ సుక్తాంకర్ అన్నాడు. జీవితం గూడా అలాంటిదేకదా అన్నాడు. మనిషి దేవుడుగానూ, దేవుడు మనిషిగానూ కృష్ణుడిలో చూచిన సుక్తాంకర్ రెండు దృక్పధాలనూ సమర్థించే ప్రయత్నం చేశారు.
కృష్ణుడు చెప్పిందాన్ని బట్టి శత్రుగృహంలోకి తప్పుడు త్రోవలో, స్నేహిడింటిలోనికి సరైన మార్గంలో ప్రవేశించాలన్నాడు. (సభాపర్వం). జరాసంధుడి కోటలోకి అలాగే కృష్ణుడు ప్రవేశించాడు. భీమార్జునులను వెంట బెట్టుకొని బ్రాహ్మణ వేషంలో లోనికి వెళ్ళాడు. బ్రాహ్మణులను సత్కరించటానికి వచ్చిన జరాసంధుడిని భీముడితో చంపించాడు. భీమ-జరాసంధుల 14 రోజుల మల్లయుద్ధం అబద్ధమని పిఠాపురం పెండ్యాల శాస్త్రి రాశాడు. (Mahabharata Charitramu, 1933 Page 166). కంసుని, శిశుపాలుని చంపించటంలో కూడా కృష్ణుడు అలాంటి ఎత్తుగడనే అవలంబించాడు.
భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధనులను చంపించటంలో మోసపూరిత ఎత్తుగడలను సుక్తాంకర్ సహితం కాదనలేక పోయాడు. ఐతే, అందుకేవో కుంటిసాకులు చెప్పాడు.
కౌరవులు కూడా అక్రమ మార్గావలంబన చేశారనీ, కాగా వారు తెలివిగా, లోపాయకారీగా చేశారనీ అన్నాడు. పాండవులు కొన్ని దోషాలు చేశారంటూనే సుక్తాంకర్ మాట తప్పించాడు. పాండవులతో పాటు కౌరవులు గూడా తప్పుచేశారని చెప్పిన సుక్తాంకర్ రెండు దోషాల వలన ఒక మంచి జరిగినట్లయింది. ఐతే ఉభయ పక్షాల మీద నెపం వేసిన సుక్తాంకర్ దోషులలో కృష్ణుని చేర్చకపోవటం గమనార్హం.
మనోరమ జవహరి మహాభారతంలో అక్రమ చావుల్ని గురించి రాసింది. కృష్ణుడి సలహాతో పాండవులు పోరాట నియమాలను ఉల్లఘించారన్నారు. కృష్ణుడు తరచూ పరోక్ష సలహాలిస్తుండేవాడు. భీముడితొడలు విరగ్గొట్టమని అర్జునుడి ద్వారా చెప్పించాడు. కృష్ణుడి సోదరుడు బలరాముడు ఈ అక్రమ పోరాటం పట్ల ఆగ్రహించి భీముడిని చంపటానికి ఉద్యమిస్తాడు. బలరాముడు గ్రహించకుండా ఉండేటందుకే అర్జునుడి ద్వారా తన దుస్సలహాలు కృష్ణుడు అందచేస్తాడు. పైగా బలరాముడిని శాంతించమంటాడు. అక్రమ పోరాటాన్ని సమర్ధించి అలా అయితేనే దుర్యోధనుణ్ణి చంపగలుగుతామని యుధిష్టిరునితో చెపుతాడు.
యుధిష్టిరుడు ఈ అక్రమ పోరాటం పట్ల మొసలి కన్నీరు కారుస్తూ భీముడు కింద పడిన దుర్యోధనుడి తల తన్నినందుకు ఆక్షేపిస్తాడు. ఐతే, కృష్ణుడి సలహాను పాటించి భూమిని జయించామంటాడు. ధర్మరాజు తనపట్ల సంతృప్తి వహించినా దేవతలు మాత్రం చనిపోతున్నధుర్యుధనుని పైన పూలవర్షం కురిపిస్తారు. (Salya Parva) మహాభారతాన్ని పరిష్కరించిన సుక్తాంకర్ ఈ సంఘటనలను ఎవరో చేర్చారంటూ వదిలేసాడు.

By Narla Venkateswararao Telugu: Innaiah Narisetti

No comments:

Post a Comment