మహాభారతం పెనుభూతం-5 part

Truth about Gita





కైరోవద్ద పిరమిడ్లను పెనుభూతం వంటిదిగా కిప్లింగ్ అభివర్ణించాడు. మహాభారతానికి అదే వర్తించవచ్చు. పిరమిడ్ ఏడు అద్భుతాలలో ఒకటైతే, మహాభారతం 7 అభూత కల్పనలలో ఒకటిని చెప్పవచ్చు. పిరమిడ్ ఎత్తు 451 అడుగులు. మహాభారతం 18 పర్వాలలో, లక్ష శ్లోకాలలో ఉన్నది. ఒకప్పటి పిరమిడ్ పవిత్రత కోల్పోయి యాత్రికుల ఆకర్షణ స్థలంగా మారింది. మహాభారతానికి ఇంకా కొనసాగుతున్న పవిత్రత భారతదేశానికి పెద్ద ఉపద్రవం వంటింది. భారతీయుల జీవితాన్నీ, ఆలోచననూ అణచివేసే భారంగా అది తయారయింది.
మహాభారతం శతాబ్దాలుగా నేటి పెనుభూతస్థాయికి ఎలా చేరుకున్నదో గమనించాలి. వ్యాసుడు 8800 శ్లోకాలు చెప్పి జయ అని నామకరణం చేశాడు. వైశంపాయనుడు 24 వేల శ్లోకాలకు పెంచి భారతం అని పేరు పెట్టాడు. సౌతుడు లక్ష శ్లోకాలు పూర్తి చేసి మహాభారతంగా రూపొందించాడు. మధ్యలో మరెందరో జ్యోకం చేసుకొని యధాశక్తితో కలిపారు.
ఒక రచయిత కృషిలో జోక్యం చేసుకొని, రూపురేఖలో మార్చేసి, ముఖ్య సందేశాన్ని తారుమారు చేయటం హీనమైన నేరం. ప్రాచీన కాలం నుండి ఈ ఆధ్యాత్మిక దేశంలో అది సాగి పోతూనే వున్నది.
మత గ్రంధాలూ, ధర్మసూత్రాలూ రాజకీయ, ఆర్థిక రచనలూ, ఇతిహాసం, పురాణం అన్నీ యిలా మార్చేసారు. ఆ విధంగా చేయటంలో ప్రజాశక్తిని పెంపొందించినట్టూ, స్వర్గంలో స్థానం ఏర్పరచుకొన్నట్టూ భావించారు. అచ్చుయంత్రాలు వచ్చినా ఈ విధానాం ఆగలేదు.
మహాగ్రంధాలూ, ధర్మసూత్రాలూ రాజకీయ, ఆర్థిక రచనలూ, ఇతిహాసం, పురాణం అన్నీ యిలా మార్చేసారు. ఆ విధంగా చేయటంలో ప్రజాశక్తిని పెంపొందించినట్టూ, స్వర్గంలో స్థానం ఏర్పరచుకొన్నట్టూ భావించారు. అచ్చుయంత్రాలు వచ్చినా ఈ విధానం ఆగలేదు.
మహాభారతం, ఒక పెద్ద గేయం, సినిమా, రేడియో, టెలివిజన్, డ్రామాలు లేని రోజుల్లో గేయాలు పాడుకుంటూ కాలక్షేపం చేసేవారు. నాయకులూ, దేవుళ్ళూ కధా వస్తువులుగా ఉండేవి. రాజుల కొలువుల్లో సూతులు ఈ రచనలు చేస్తూ పోయారు. యజ్ఞయాగాదులలో వీరి అవసరం ఉండేవి. సంవత్సరాల తరబడి యజ్ఞాలు సాగుతుండగా విసుగు పుట్టకుండా గేయాలు పాడేవారు. రాజుల తృప్తి కోసం ఆ గేయాలను మారుస్తుండేవారు. మహాభారతం, రామాయణం పురాణాల కథాకాలక్షేపం అలా సాగేది.
తొలుత ప్రాకృతంలో ఉన్నదంతా తరువాత సంస్కృతంలోకి మార్చారు. సూత్రధారుల స్థానంలో బ్రాహ్మణులు వచ్చారు. స్తోత్రపాఠాలలో అర్థాన్నీ, సందేశాన్నీ మార్చివేశారు. భూసురులుగా తమ స్థానాన్ని భద్రపరచుకున్నారు. దేవుళ్ళకు మించి తమకు ఉన్నత స్థాయి ఉన్నట్టు భృగులు తిరగరాసుకున్నారు. (Irawati Karve : Yuganta, Poona, 1966, Page 5). అందులో ఒకరు విష్టువు వక్షస్థలాన్ని తన్నినట్లు, బ్రహ్మ-శివులను అణచి పెట్టినట్లు పేర్కొన్నారు. (Vemuri Sreenivasa Rao, Purvagathalahari, Madras, 1952, Page. 327-328).
జర్మనీలో హెర్మన్ వోల్డెన్ బర్గ్ బుద్ధునిపై నిశిత పరిశీలనా చరిత్ర ప్రచురించారు. మహాభారతం చిన్న ఇతిహాసంగా ప్రారంభమై, భయానకంగా, గందరగోళంగా మారిందని అన్నాడు. వి.ఎస్. సుక్తాంకర్ ఇతడి ప్రస్తావన చేశాడు.
మహాభారతాన్ని క్రమబద్ధంగా విశ్లేషించిన వాడు హాప్ కిన్స్. ఇతడు ఇలా అన్నాడు. ఈ ఇతిహాసం మనకెలా చేరింది. ప్రతి అధ్యాయమూ మార్పులకు గురై విస్తరించిన ప్రక్షిప్తాలు చోటు చేసుకొని, హద్దూ పద్దూ లేకుండా ప్రతి లేఖ కూడా సొంత రచనలను ప్రవేశపెట్టి కలగా పులగం చేశాడు. (V.W. Hopkins : The Great Epic of India, 1969, Calcutta, Page: 400). విన్ సెంట్ స్మిత్ ప్రకారం నేటి లక్ష శ్లోకాలలో 20 వేలు మాత్రమే కురుపాండుల సంఘర్షణకు సంబంధించినవి. మిగిలినదంతా కలిపారు. (Vincent Smith, Oxford History of India).
మహాభారతంలోని మూల అంశం ఎప్పుడు రచించారు. విస్తరణ ఎప్పుడు, ఎలా జరిగింది. ఎప్పుడు ఆగింది. ఈ మార్పులన్నింటికీ కారణం ఏమిటి.?
భిన్న పండితులు విభిన్న అభిప్రాయాలు వెల్లడించారు. పాణిని కాలంలో మహాభారతం సంస్కృత ఇతిహాసంగా లేదు. మహాభారతం అనే పదాన్ని పాణిని తన వ్యాకరణంలో విశేషంగా వాడాడు. వాసుదేవుడిని, అర్జునుడిని దేవుళ్ళుగా ప్రస్తావించారు. యుధిష్టిరుని మాట గూడా ఉన్నది. (Max muller, A History of Sanskrit Literature) అంటే కృష్ణుడితో పాటు అర్జునుడిని గూడా దేవుడుగా కొలిచారు.
పాణిని వ్యాకరణంలో కుంతి, మాద్రీ ప్రస్తావన పాండురాజు భార్యలుగా కాదు. కుంతుల ప్రాంతం నుండి కుంతి, మద్ర ప్రాంతం నుండి మాద్రి వచ్చినట్లున్నది. (Radhakummud Mukherjee, Hindu Civilization, 1950 Bombay, Page : 141) భారతం మహాభారతం అనే ప్రస్తావన తొలుత అశ్వలాయన గృహ్యసూత్రాలలో ఉన్నది. ఇది కూడా మధ్యలో ప్రవేశపెట్టిందేనని వెబర్ అన్నాడు. (Albrecht Weber : The History of Indian Literature, 1914, Page : 189) ఏమైనా యీ సూత్రం ఎప్పుడు వచ్చిందన్నది కూడా నిర్ధారణ కాలేదు.
పాణినికి ముందు సంస్కృత ఇతిహాసంగా మహాభారతం లేదు. ఈ వ్యాకరణ శాస్ర్తజ్ఞుడు ఎప్పటి వాడో సరైన కాలనిర్ణయం లేదు. (V. Rangacharya, Video India 1937, Madras Page : 69, 70) క్రీ.పూ. ఐదవ శతాబ్దంలో ఉండవచ్చునని భావిస్తున్నారు. మహాభారతం పాణిని అనంతరం క్రీ.పూ. 4-3 శతాబ్దాల మధ్య వచ్చి ఉండవచ్చునని రాప్ సన్, బార్నెట్, హాప్ కిన్స్, మెగ్డోనెల్, వింటర్నిజ్డ్ పండితులు భావిస్తున్నారు. వెబర్, వైద్యా అభిప్రాయం ద్వారా చెప్పించారన్నారు. అశ్వమేధపర్వంలో క్రీ.పూ. 3వ శతాబ్దానికి చెందగా, రాధాకుముద్ ముఖర్జీ క్రీ.పూ. 2వ శతాబ్దానికి తెచ్చారు.
మహాభారతం నేటి అవతారం దాల్చింది క్రీ.త. 4,5 శతాబ్దాలలోనే మార్పులూ, చేర్పులూ అన్నీ 4వ శతాబ్దం వరకూ జరుగుతూ వచ్చాయి. కలియుగంలో మనిషి పతనం ఆరంభం అయిందన్నారు. మహాభారతాన్ని అతి గౌరవంగా చూచే వి.యస్. సుక్తాంకర్ క్రీ.త. వెయ్యివరకూ అనేక చేర్పులు చేశారంటూ ఒప్పేసుకున్నారు. బండార్కర్ ప్రాచీన పరిశోధనా సంస్థవారు ప్రచురించిన మహాభారతంలో చాలా చేర్పులు జరిగాయన్నారు. విష్ణు అవతారవర్ణన, భీష్ముడి వైష్ణవ ధర్మాల్ని తెచ్చి పెట్టారన్నారు. ఇవి 2500 శ్లోకాల వరకూ ఉన్నాయి. ఇటీవలే యిలా జరిగినప్పుడు పూర్వకాలం యింకా ఎన్ని జరిగి ఉంటాయో ఊహించాల్సిందే. (V.S. Suktankar : On the Meaning of Mahabharata, Bombay 1957, Page : 22).
అంధ విశ్వాసంతో సనాతనులు ఈ విధంగా యిష్టం వచ్చినట్లు మలుచుకుంటూ పోయారు. వ్యాస మహాభారతంలో లక్ష శ్లోకాలున్నట్లు 5వ శతాబ్దంలో ఒక శాసనం పుట్టించారు.
మార్పులేమీ జరగలేదని వాదించారు. ఈ సంఖ్యను అట్టి పెట్టటానికి పాత వాటిని కొన్నిటిని తొలగించటం, కొత్తవాటిని చేర్చటం సునాయసంగా జరిపారు.
వ్యక్తిగత దేవుడనే భావనను పెంపొందించాలనేది ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తున్నది. గౌతమబుద్ధుడు దేవుడున్నాడనీ, లేడనీ చెప్పలేదు. అతని శిష్యులు బుద్ధుడు చనిపోగానే అతడిని దేవుణ్ణి చేశారు. అతని జీవితాన్ని గురించి కథలు అల్లారు. వేద, బ్రాహ్మణవాదాన్ని దెబ్బ తీసేటంతగా బౌద్ధం పెరిగిపోయింది. ఇందుకు మారుగా క్రీస్తుపూర్వం 3,4 శతాబ్దాలకు మధుర ప్రాంతంలో గోవుల్ని కాచుకునే తెగల నాయకుడిని అడ్డం పెట్టి దేవుణ్ణి చేశారు. ద్రౌపదీ స్వయం వరంలో హఠాత్తుగా మహాభారత కథలోనికి కృష్ణుడు వచ్చేశాడు. అప్పటి నుండీ కృష్ణుడు పెరిగిపోయి దేవుడయ్యాడు. అంతవరకూ కురురాజులకు అనుకూలంగా ఉన్న కథను పాండురాజుల వైపు తిప్పారు. జనమేజయుడి యజ్ఞంలో ఈ మార్పు జరిగినట్లు పిఠాపురానికి చెందిన పెండ్యాల శాస్ర్తి, ప్రాచీన భారతాన్ని అధ్యయనం చేసిన పాశ్చాత్యులు భావించారు. జనమేజయుడు పాండు సంతతి వారు. ఉదారంగా దానాలు చేశారు. అతడికి తృప్తి నిచ్చేటట్లు కథను మార్చారు. ఐనా దోషాలు కనిపిస్తూనే ఉన్నాయి.

సామాజిక అంతస్తులలో పురోహిత వర్గాన్నీ, ఉన్నత స్థాయిలో పెట్టటానికి ప్రయత్నించారు. మహాభారతం బ్రాహ్మణుల విజ్ఞాన సర్వస్వమని రాప్ సన్ పండితుడు సృష్టీకరించాడు. బౌద్ధ కాలాన్ని గురించి రాసిన రైస్ డేవిస్ మహాభారతం పురోహితుల చేతుల్లో మార్పుచెందిందన్నారు. బౌద్దుల వలన దెబ్బతిన్న ప్రతిష్ఠను పునరుద్ధరించడానికి బ్రాహ్మణులు యిలాంటి పనిచేశారు. ప్రజా బాహుళ్యంలో ఉన్న కధల్ని బ్రాహ్మణులు సానుభూతితో స్వీకరిస్తున్నారని చూపడానికి కూడా యిలా చేశారు. వేదసాహిత్యంలో లేనివన్నీ ఇందులో సజీవంగా ప్రవేశపెట్టారు. ఆర్యులకు సంబంధించిన ఈ అంశాలు మహాభారతంలో చోటు చేసుకున్నాయి. (Rhys Davis : Buddhist India) ఏమైనా అమానుషంగా ప్రక్షిప్తాలు జరిపారు. గుప్తులకు ముందు మాహాభారతాన్ని తిరగరాయటం గమనిస్తే ఆటవిక ఆచారమైన సతీ సహగమనం కూడా తిరగదోడారని కోశాంబి అన్నారు. (An Introduction to the study of Indian History), బ్రిటిష్ వారు శాసన బద్ధంగా నిషేధించిన సతి 150 సం.రాల తరువాత తిరిగి ప్రవేశించింది. అలాగే భారతీయుల జీవితాన్ని ప్రభావితం చేయటంలో మహాభారతం పుస్తకాలను మించిపోయిందని సర్ పెర్సివల్ గ్రీవిత్స్ అన్నారు. పాండురాజు భార్యల మధ్య ఎవరు సతీసహగమనం చేయాలనే అంశంపై వివాదాన్ని మహాభారతంలో ప్రవేశపెట్టారు. దీన్ని తిరగరాసినప్పుడు తిరోగమన ప్రభావం ఘోరంగా పరిణమించింది. కులధర్మంగా చంపేయమని భగవద్గీత బోధించింది కూడా మహాభారతంలో తెచ్చిపెట్టారు.
V R Narla Telugu : Innaiah Narisetti

No comments:

Post a Comment