ఇద్దరు భగవాన్లు=20 serial- Truth about Gita



ఒక ఆటవిక హీరోని జాతీయదేవుడుగా పైకెత్తాలంటే ఒక పవిత్ర గ్రంధాన్ని అతని పేరిట సమకూర్చాలి. కృష్ణుడి విషయంలో వెయ్యేళ్ళు పట్టింది. అయినప్పటికీ ఆ గ్రంధాన్నీ, దాని సందేశాన్ని గురించీ ఏకాభిప్రాయం లేదు. కృష్ణుడి అనంతరం గీత వచ్చిందని నిశిత పరిశీలన చేసే పండితులంతా అంగీకరిస్తున్నారు. అది కూడా దశల వారీగా వచ్చింది. ఆర్.జి. భండార్కర్ యీ విషయమై రాస్తూ భగవద్గీత రచించినప్పుడు వాసుదేవుడు లేడనీ, అలాగే బుద్ధుడి ప్రవచనాలు గ్రంధస్తం చేసేటప్పుడు బుద్ధుడు లేడనీ అన్నాడు. అయినా, ఇరువురినీ భగవంతుడని అన్నారు.
సన్యసత్వం అనేది ఆర్యేతర భావన. భారతదేశంలో ఆ భావనకు ఆర్యులు విముఖులు. జీవితాన్ని అనుభవించాలనే సుఖజీవితం గడిపారు. యాజ్ఞవల్క్యుడికి ఇద్దరు భార్యలుండేవారు. క్రమేణ హరప్పా ద్రావిడులనుండి ఆర్యేతర భావంగా సన్యాసాన్ని తెచ్చుకున్నారు. మూడు అగ్ర కులాలు మాత్రేమే సన్యసత్వాన్ని పుచ్చుకోవచ్చన్నారు. జీవితం చివరి దశలో ఇది చేపట్టాలన్నారు. శూద్రులూ, ఛండాలరు కూడా సన్యాసులు కావచ్చని బుద్ధుడన్నాడు. తల్లిదండ్రుల అనుమతితో పిల్లలు కూడా చేరవచ్చునన్నారు. బుద్ధుడు ఇదంతా చాలాల పరిమితంగానే చేశాడు. కుష్టురోగుల్నీ, రుణగ్రస్తుల్నీ, బానిసల్నీ, సన్యాసులు కావటానికి అంగీకరించలేదు. బుద్ధుడు చేసినదంతా వర్ణాశ్రమ ధర్మాలను దెబ్బతీసేదిగా ఉన్నది. కింది కులాలకు చెందిన మంగలి, మత్స్యకారులూ, పాకీవారూ బుద్ధుని శిష్యులలో ఉన్నారు. కొందరు స్ర్తీలను కూడా సన్యాసులు కావటానికి బుద్దుడు అంగీకరించాడు. వైశాలికి చెందిన ఆమ్రపాలిని సంఘంలో చేర్చుకున్నాడు. ప్రసేనజిత్తురాజు అభ్యంతరం పెడుతున్నా ఒక ఛండాల స్త్రీని, శ్రావస్తికి చెందిన బ్రాహ్మణులనూ బుద్ధుడు సంఘంలో చేర్చుకున్నాడు. ఆ విధంగా అరమరికలు లేకుండా చేర్చుకోవటం వలన మితం తప్పింది. లోగడ బానిసగా ఉన్న గోపాలుడు గొప్ప తాత్త్వికుడిగా చెప్పుకున్నాడు.
సన్యాస భావనలు కాదంటే వర్ణాశ్రమ ధర్మాన్ని కాదనడమే అవుతుంది. కనుక రెండవ భగవాన్ గా కృష్ణుడు వచ్చి అర్జునుడికి నిష్కామకర్మ అంటూ బోధచేశాడు. కులధర్మాన్ని పాటించమన్నాడు. అది గీత సారాంశం. రాధాకృష్ణన్ ప్రకారం ఆధునిక మనస్తత్వ శాస్ర్తంలో గొప్ప విషయాలు ఇందులో ఉన్నాయి. వాస్తవం ఏమంటే కింది కులాలవారిని వారి వృత్తులలో అట్టి పెట్టి, విద్య, వికాసాలకు దూరంగా ఉంచాలని ప్రయత్నించాడు. చెప్పులు కుట్టేవారు జన్మాంతర విషయాలను దృష్టిలో పెట్టుకొని తన వృత్తిని మార్చకుండా కొనసాగించాలన్నాడు. శంబుకుడు ధైర్యంగా తపసు చేసినందుకు రాముడు అతడిని తలసరికేసాడు. ఈ చర్యను కాళిదాసు అభినందించాడు.
మొదటి భగవానుడు సంఘం వెలుపల కులపద్ధతిని ఆమోదించాడు. ఐతే పుట్టకను బట్టిగాక, అభిరుచి, గుణగణాలను బట్టి కులం ఉంటుందన్నాడు. మానవుడి వృత్తిని అతడి కులం నిర్ణయిస్తుందనీ, తల్లిదండ్రులను బట్టి కాదనీ అన్నాడు. (Lord Chalmers ; Twither Dialogue of the Buddha, London 1926 : c. Kunhan Raja : Dhamrapada, Madras, 1956)
రెండవ భగవానుడు కులాన్ని ఆవిధంగా చూస్తే ప్రమాదమని, తానే సృష్టించినట్లు చెప్పుకున్నాడు. లోగడ జన్మలను బట్టి ఈ కులనిర్ధారణ జరుగుతుందన్నారు. ఇది మొండివాదన గనుక ఒప్పుకోవాలి, లేక నిరాకరించాలే తప్ప, వాదించేదేమీ లేదు.
మొదటి భగవంతుడు నీతిని అనుసరించమన్నాడు. క్రూరత్వాన్ని ద్వేషించమన్నాడు. జనన, మరణాల బంధనుండి తప్పించుకోవచ్చున్నాడు. రెండవ భగవంతుడు కులధర్మం ప్రధానం అన్నాడు. ఎటువంటిదైనా సరే కులవృత్తిని పాటిస్తే వచ్చే జన్మలో సుఖం ఉంటుందన్నారు. కల్పిత బ్యాంక్ పేరిట పోస్టు డేటు వేసిన చెక్కులాంటిదే కృష్ణుడి హామీ. వీటిని అనుసరించటం కష్టమని కృష్టుడికి తెలుసు. అందుకనే సహృదయంతో, భక్తితో తనకేది సమర్పించినా అంగీకరిస్తానన్నాడు. మరణించేముందు తనను తల్పుకుంటే తన వద్దకు చేరుకుంటారన్నాడు. ఎంత అవినీతి పరులైనా కృష్ణుడి నామం జపిస్తే మోక్షం పొందుతారు. అమరత్వానికి అది హామీ పత్రం వంటిది.
బుద్ధుడు నిర్మాణం ఉత్తమ మార్గమన్నాడు. అందుకు అష్టాంగ మార్గాలూ సూచించాడు. సారనాధ్ లో తొలిబోధనగా ఈ విషయాలు చెప్పారు. రెండవ భగవానుడు ఇంకా ఉదారంగా భక్తులు ఏమార్గాన్ని అనుసరించినా తనవద్దకే చేరుకుంటారన్నారు. ఐతే తనను కొలిచే వారికి స్వర్గంలో ఉత్తమ స్థానం లభిస్తుందన్నాడు.
ఇరువురు భగవాన్లూ శాఖాహారులు కాదు. ఆహారం కోసం జంతుబలిని బుద్ధుడు ప్రోత్సహించకపోయినా, భక్తులు మంసాహారాన్నిచ్చిపన్పుడు నిరాకరించ లేదు. అడుక్కునే వారికి ఎంపిక చేసే హక్కులేదన్నాడు. చుండ అనే భక్తుడు ఇచ్చిన పంది మాంసం తిన్న తరువాతనే బుద్ధుడు చనిపోయాడు. ఎవరూ మద్యపానం చేయకూడదన్నాడు.
కృష్ణుడు మాంసాహారి, మద్యం సేవించడు. మత్తుపానీయాలకు అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు గీత వెల్లడించలేదు. క్షత్రియులకు చంపడం కులధర్మం అన్నారు. యుద్ధరంగంలో బంధుప్రీతి లేకుండా క్షత్రియుడు హతమార్చాలి. అతనికి అప్పుడే ఇహపరలోకముక్తి లభిస్తుంది.
బుద్ధుడు చేపలు తప్ప మరే జీవులకూ హాని చేయరాదన్నాడు. (E.H. Brewster : The Life of the Gothama, The Budha) రాజ్యాల మధ్య యుద్ధాన్ని బుద్ధుడు ఖండించలేదు. వ్యక్తులపై హింసను మాత్రమే బుద్ధుడు ఖండించాడు. రాజ్యాల మధ్యపోరాటాలు తప్పవేమొ అన్నాడు. వినయ పిటక జాతక కధలలో యుద్ధాలకూ, వ్యూహాలకూ ఆయుధాలకూ సంబంధించిన ప్రస్తావన ఉన్నది. వాటిని ఖండించలేదు కూడా. (G.S.P. Mishra : The Age of Vinaya, 1972, New Delhi)
గీత అహింసను చెప్పలేదు. ఒక చోట మాత్రం యీ ప్రస్తావన ఉన్నది. (5వ అధ్యాం, 5వ శ్లోకం) అహింస, సమానత్వం గీత ప్రయోజనానికే విరుద్ధం. అంచలవారీ అసమానత్వాలకు దారి తీసిన కులవిధానంలో సమానత్వం కుదరదు. ఎవరో కావాలని అహింస, సమానత్వపదాలను ఒక చోట గీతలో చేర్చారు. బుద్ధిజం వ్యాప్తిని అరికట్టడానికి గీతను అల్లారు. మహాభారతం యావత్తునూ బ్రాహ్మణ విజ్ఞాన సర్వస్వం అనవచ్చునని ఎన్.జె. షిండే అన్నాడు. అంగీరసుడు, భృగుడు మహాభారతానికి ప్రస్తుత రూపాన్నిచ్చారన్నాడు. దాన్ని ధర్మశాస్త్రంగా, నీతి శాస్త్రంగా చూపారన్నాడు. (N.J. Shende, The Authorship of Mahabharatha, Vol. 24, Annals of the Bhandarkar Rosearch Institute, Poona, 1943). నా దృష్టిలో గీత-బంధాల బైబిల్ మాత్రమే.
By late Narla Venkateswararao      Telugu : Innaiah Narisetti

2 comments:

Seetharam said...

ఇది మొండివాదన గనుక ఒప్పుకోవాలి, లేక నిరాకరించాలే తప్ప, వాదించేదేమీ లేదు.

immidisetti v v r s vara prasad said...

క్రుష్ణుడు యాదవకులానికి చెందినవాడు. కాబట్టి, గీత కులాలను ప్రోత్సహించని చెప్పడం అవివేకం.. గీత బాద్యతలను మాత్రమే చెప్పింది. పలితం ఎలా ఉన్న అంగీకరించాలని చెప్పింది.. దళితులు అనే మాట హిందూ సంప్రదాయం లో లేదు. ఇది కల్పించారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, సత్యం సత్యమే కదా? గీత వాసు దేవునికంటే ముందుదా? వెనుకదా" అనే దానికంటే అది మనవ జీవనానికి ఎంత వరకూ సరిపోతుంది అనేది ఆలొచించాలి.

Post a Comment