కొండ దేవర నుండి జాతీయ దేవుడి వరకు-19- Truth about Gita


ఏ దేశమైనా ఆదిమ తెగల స్థాయి నుండి ఎదుగుతూపోతుంది. అలాగే దేవుళ్లు కూడా. కృష్ణుడి విషయంలో అంతే జరిగింది. కృష్ణుడు రాజపూత్ తెగల కులదేవతగా తొలుత ఉండేవాడని భారతీయ శాస్త్రాలను అధ్యయనం చేసిన ఫ్రెంచి పండితుడు బర్త్ భావించాడు. (A Barth : Religions of India, New Delhi, 1969) యాదవులు ఏనాడూ ఏకంగా లేనందునవారు సమైక్య పడలేకపోయారు. యాదవులు రాజపూత్లయితే సంప్రదాయం ప్రకారం క్షత్రియకులంలో కింది స్థాయికి చెందినవారే ఉండాలి. కృష్ణుడి సామాజిక అంతస్తును మహాభారతంలో ప్రశ్నించిక పోలేదు. ద్వారకలో గడిపినపుడు కృష్ణుడికి తన వారి నుండి గౌరవం లభించలేదు. పైగా ఖండన మండలకు గురి అయ్యాడు. మహాభారతంలో కృష్ణుడు ఒకసారి నారదుడితో ఫిర్యాదు చేస్తూ తానెవరికొసం అయితే శ్రమిస్తున్నాడో వారే పరుష వాక్యాలు పలుకుతున్నారని వాపోయాడు. అందువలన అక్కడ కులదేవతగానో, రాజపూత్ ల సమైక్య జాతులకు దేవుడుగానో ఉండే అవకాశం లేదు.
మధుర, బృందావన్ ప్రజలకు, సూరసేనులకూ కులదేవత అయి ఉండవచ్చు. పశ్చిమ తీరాన ఉన్న ద్వారకకు వెళ్ళిన కృష్ణుడి చర్యలు విని వారి నుండి గౌరవం లభించి ఉండవచ్చు. కృష్ణుడి బాల్య చేష్టలూ, యువకుడిగా శృంగార చేష్టలూ, కథలుగా, వ్యాపించటం కూడా యిందుకు తోడ్పడి ఉండవచ్చు. ద్వారకలో యాదవ కులం తాగితందనాలాడుతూ, అగ్ని మంటలకు ఆహుతి కావటంతో వారి పట్ల సానుభూతి వచ్చింది. మధుర, బృందావన్ ప్రాంతంలో కృష్ణుడు కులదేవత కావటానికి యిది తోడ్పడి ఉండవచ్చు.
క్రీ.పూ. 4వ శతాబ్దంలో చంద్రగుప్త కొలువులో సెల్యూకస్ కు రాయబారిగా మెగస్ధనీస్ వచ్చాడు. క్రీ.పూ. 304-299 మధ్య ఇతడు భారతదేశాన్ని గురించి తాను చూసింది రాశాడు. చరిత్ర క్రమపద్ధతిలో లేని మనకు అతడు రాసిందెంతో ఉపయోగంగా ఉన్నది. ఈ దృష్ట్యా మనం చారిత్రక దృష్టినీ, అవగాహనూ పెంపొందించుకోవాలి.
మెగస్ధనీస్ తన రాయబారిగా, నివేదికలో హెరాక్లస్ అనే హిందూ దేవుని గురించి ప్రస్తావించాడు. అతడే కృష్ణుడు, మధురను మెధర్ అన్నాడు. కృష్ణపురాణాన్ని క్లేసొబొరా అన్నాడు. యమునానదిని అయోబారే అన్నాడు. కనుక మెగస్థనీస్ రాసిన దాన్ని బట్టి కృష్ణుడు ఆదిమవాసి దేవుడుగా క్రీ.పూ. భక్తుల్ని ఆకర్షించాడు. దీనిని బట్టి క్రైస్తవ ప్రభావం కృష్ణుడిపై ఉన్నదని వాదించిన వెబరోలాసెన్, లోరిన్ సర్ రాతలకు ఆధారాలు లేవని అర్ధం అవుతున్నది.
కృష్ణుణ్ణి దేవుడుగా ఉన్నత స్థాయికి తీసుకురావటానికి చాలా కాలం పట్టింది. పాణిని కాలంలో అర్జునుడితో పాటే కృష్ణుడు పూజలందుకున్నాడు. తరువాత అర్జునుడిని తొలగించి ఆ స్థానం బలరాముడికి (సంకర్షణకు) యిచ్చారు. హిందువుల దేవుళ్ళలో ప్రతిమ స్వరూపంగల దేవుడు తొలుత బలరాముడే ఆ తరువాత తండ్రి మాయలతో పాటు ప్రద్యుమ్నుడు కూడా చేరాడు. ఉత్తరోత్తరా కృష్ణ - జాంబవతి కుమారుడు సాంబ, ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు దేవుళ్ళ జాబితాలో చేరారు. వీరందరినీ స్థాన భ్రష్టుల్ని చేయటానికి కృష్ణుడికెంత కాలం పట్టిందో తెలియదు.
కుటుంబ సభ్యులను అధికారంలో, కీర్తిలో భాగం పంచుకోకుండా ఆపటం కష్టం అని కృష్ణుడికి బాగా తెలుసు. అందుకే వ్యూహాలలో వారిని చేర్చారు. పురాణాలు దశావతారాలు గురించి అనేక రకాలుగా చెప్పాయి. ఒక జాబితా ప్రకారం 22 అవతారాలున్నాయి. భాగవత పురాణాలను బట్టి ఈ జాబితా అనంతం (T.S. Rukmani : A Critical Study of Bhagavatha Purana, Varanasi 1970)
వేద సాహిత్యంలో అవతారాలు లేవు. ఎ.పి. కర్మార్కర్ దశావతారాలు ఇతిహాసకాలంలో రాలేదని అన్నారు. మహాభారతంలో ఈ అవతారాలను చేర్చారన్నాడు. (A.K. Karmarkar : Religion And Philosophy of Ethics in the Cultural History of India, Vol. II) బ్రహ్మసూత్రాలలో అవతారాల ప్రసక్తి లేదు. సుంగుల కాలంలో అవతారాల గురించి ప్రచారం జరిగినట్లు చెప్పవచ్చు. క్రీ.పూ. 2వ శతాబ్దంలో తిరోగమనవాదం వచ్చింది. చంద్రగుప్తుడి వంశీకులైన బృహద్రధుణ్ణి హత్య చేసిన తరువాత ఈ ధోరణి ప్రబలింది. హిందువులలోనే అవతారాల సిధ్ధాంతాన్ని గురించి చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. ఉపనిషత్తులలో తొలుత నిర్గుణ బ్రహ్మను ప్రతిపాదించగా, తరువాత సగుణబ్రహ్మ వచ్చింది. ఈ రెండింటికీ రాజీకుదిర్చిన తరువాత అది గీత రూపం దాల్చింది. గీతలో వైవిధ్యాలను ఆవిధంగా అర్థం చేసుకోవచ్చు (J.N. Farquhar : The Crown of Hindusim, New Delhi, 1971).
గీతలో తానే అవతారాన్ననీ, గతంలో భూమిపైకి అనేకమార్లు అవతరించాననీ భవిష్యత్తులో కూడా వస్తాననీ చెప్పాడు. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపడి ఒక ప్రశ్న వేస్తాడు. వివస్వతుకు (సూర్యుడికి) యోగజ్ఞానాన్ని బోధించానన్నావు. వివస్వతుడు నీకంటే ఎన్నో యుగాల ముందు లేడా. అన్నాడు. (అధ్యాయం 4, శ్లోకం 4).
కృష్ణుడు చిక్కుముడులతో, కథలతో, అర్జునుడిని ఊరుకోబెడతాడు. ఈ పద్ధతిలో దైవాన్ని విడమరచి చెప్పవచ్చునని శంకరాచార్యుడు కూడా అంటాడు. గీతపై భాష్యం రాస్తూ కృష్ణుడు పుట్టాడనీ, పుట్టలేదనీ అంటాడు. ఇదెలా సాధ్యమంటే మాయ ద్వారా అంటాడు. మాయను అడ్డం పెట్టుకుంటే ఇక చర్చ, వివాదం ఉండదు. (Shankarchargya : The Bhagavadgeetha with Commentary) మాయావాదులు తింటారు, తాగుతారు, ప్రేమిస్తారు, పిల్లలను గంటారు. డబ్బు సంపాదిస్తారు. రాజకీయాధికారం స్వీకరిస్తారు. అధికారంలో ఉన్న వారిని గుప్పిట్లో పెట్టుకుంటారు. విలాస జీవితం గడుపుతారు. అదంతా మాయే. కృష్ణుడు గీతాబోధనలో తనను అవతారంగా చెప్పుకున్నప్పుడు అదంతా మాయగా చూడలేక పోతే, అందుకు గత జన్మలోని పాపపుణ్యాలు అడ్డువస్తున్నాయన్నాడు.
కృష్ణుడు కులదేవతనుండి విష్ణు అవతారంగా ఎదగటానికి శతాబ్దాలు పట్టింది. గీతలో విష్ణువు పేరు 3 సార్లూ, హరి పేరు 2 సార్లూ కనిపిస్తుంది. కృష్ణుడు తనను, విష్ణువుగా, ఆదిత్యుడిగా ఒకసారి చెప్పుకుంటాడు. అర్జునుడు రెండుసార్లు కృష్ణుడిని విష్ణువుగా సంబోధిస్తాడు. ఐతే, సూర్యుణ్ణి దృష్టిలో పెట్టుకొని అలా పిలిచాడు. సంజయడు రెండుసార్లు కృష్ణుడిని హరి అంటారు, (W. Hill, P. Douglas : The Bhagavadgeetha, Madras, 1959) కృష్ణుడు విష్ణువుగా, హరిగా రూపొందటం గీత తరువాత ఎంతో కాలానికిగాని జరగలేదు.
గీతలో కృష్ణుడు తాను భూమి మీదికి అవతరించటానికి ధర్మం పోయి, అధర్మం ప్రకోపించినప్పుడు అవతరిస్తాన్నాడు. అదే గనుక కృష్ణుడి (విష్ణువు) ఉద్దేశం అయితే, స్వర్గంలో యోగనిద్రను అనుభవిస్తూనే ఉండవచ్చు గదా అని అరవిందుడన్నాడు. అరవిందుడు తానే అవతారం అన్నట్లు కొన్ని సందర్భాలలో ప్రవర్తించాడు. అతని రచనల్లోని పులుముడు వాదాన్ని ఆయన భక్తులే వివరించాలి. (Sri Aurobindu : Essays on the Geetha, New York, 1950).
గాంధీ ఈ అవతారాలను గురించి పట్టించుకోకపోలేదు. అన్ని మతాలు అవతారాలను సమ్ముతున్నాయన్నాడు. గాంధీ వివరణ ప్రకారం రజనీష్, సాయిబాబాలు తమను అవతారాలుగా చెప్పుకోవచ్చు. కృష్ణుడన్నట్లు అవతారానికి ప్రధాన లక్షణం మాయే. అవతార పురుషులు ఈ మాయనే ప్రదర్శిస్తున్నారు. మానవరూపంలో దేవుళ్ళమనే భ్రమ అమాయక జనాలకు కల్పిస్తున్నారు.
భగవాన్ దాస్ తన సొంత వివరణతో కృష్ణుడి విష్ణు అవతారాన్ని గురించి చెప్పాడు. అతడు అనిబిసెంట్ సహచరుడు. భారతరత్న, మూఢనమ్మకాలకు హేతుబద్ధత కల్పించదలిచాడు. అతని రచనల శీర్షికలు అలాగే ఉంటాయి. విష్ణువు ఎందుకు అవతరించిందీ వివరిస్తూ సుందోపసుందులు నాశనమైనట్లే, కురుపాండవుల తీవ్రవాదాన్ని అణచటానికి అవతరించాడన్నాడు. (Bhagavandas : Krishna, Madras 1959)
ఆర్.కె. పాండె కృష్ణుడి గోపికాలీలల్ని వివరిస్తూ రుషులు కృష్ణుణ్ణి ప్రార్థించారనీ, తమను సన్నిహితంగా ఉండనియ్యమని కోరారనీ కనుక వారందరినీ గోపికలుగా అవతారం ఎత్తమని కృష్ణుడు వారి కోరికను తీర్చాడనీ రాశాడు. గోపికల వస్త్రాలను అపహరించుకుపోవటం పాండె వివరిస్తూ దోషం రూపంలో ఉన్న వివస్త్ర స్నానాన్ని రూపుమాపాలని అలా చేశాడన్నారు. ఈ వివరణ యిచ్చిన పాండె తరువాతి జన్మలో గోపికగా జన్మించి కృష్ణుడికి సన్నిహితంగా ఉండవచ్చు. (R.K. Pandey : The Concept of Awataras).
కృష్ణుడిపై ఎన్నో గ్రంధాలు వెలువడ్డాయి. వాటన్నిటినీ చదవటం సాధ్యపడే విషయం కాదు. భారతీయ విద్యాభవన్ వాళ్ళు ప్రచురించిన పుస్తకాలను బట్టి భారతదేశాన్ని ఆధునిక యుగంలోకి అడుగు పెట్టకుండా ఉండే ప్రయత్నం కనిపిస్తున్నది.
డార్విన్ సిద్ధాంతం లోతుపాతులు తెలియకుండానే కొందరు అందులో అవతారాలకు సమర్ధన ఉన్నదంటున్నారు. ఆత్మ, దాని ప్రయాణం అనే భ్రమల్ని డార్విన్ సిద్ధాంతం కొట్టిపారేసింది. సృష్టివాదాన్ని పటాపంచలు చేసింది. దేవుడు దిగివచ్చాడనే నమ్మకాన్ని తృణీకరించింది.
జీవితానికి భౌతిక ఆధారాలు చూపింది. జ్ఞానార్జనకు ఇంద్రియాల ప్రాధాన్యతను పేర్కొంది. అర్హత లేని జీవులు నశించినట్లు చూపింది. మానవుడు దిగజారిన దేవతకాదనీ, పైకి ఎదుగుతున్న జంతువనీ రుజువు పరచింది. క్రైస్తవుల మత సిద్ధాంతాన్ని దెబ్బతీసిన డార్విన్ సిద్ధాంతం హిందూ మతానికి తోడ్పడుతుందను కోటం భ్రమ.
ఇటీవల జీవశాస్త్రాలలో పరిశోధనల వలన డార్విన్ ప్రతిపాదనలు దేవుడికింకా దూరమై మానవుడి కింకా దగ్గరయ్యాయి. జీవరాశులున్ను మేఘాల నుండి మానవుడు ఆవిర్భవించినట్లు ఫ్రెడ్ హోయల్, విక్రమ్ సింఘే సిద్ధాంత ప్రతిపాదన చేశారు. అది మత ప్రాతిపదిక కాదు. మన సంప్రదాయవాదులు పురాణాలలో అది కూడా చెప్పారని చూపగల సమర్ధులే. మన ఉపనిషత్తు దార్శనికులు ఈ విషయాలను ఆనాడే తెలుసుకున్నారని కూడా అనగలరు. బ్రహ్మపదార్థం అంటే హోయల్ చెప్పే జీవకణానికి కూడా చెప్పగలరు. (Holye, Wickramasinghe : Life cloud, the origin of life in the universe, New Year, 1978)
దశావతారాలలో మనవాళ్ళు పదవ అవతారం ఇంకా రావాలంటున్నారు. శూద్రులను శిక్షంచటానికి అది ఉద్దేశించారట. కల్కి అవతారం క్షత్రియుడంటున్నారు. అవసరమైనప్పుడు విష్ణువు పంది అవతారమైనా ఎత్తుతాడుగాని, వైశ్యుడుగానూ, శూద్రుడుగానూ రాడు. వారు పాపయోనికి పుట్టినవారు గదా! (Pandey, Delhi 1Written by late Narla Venkateswararao Telugu: Innaiah Narisetti

1 comment:

srini said...

చాలా మంచి విషం కక్కారు.ధన్యవాదములు.

Post a Comment