ఖురాన్ ను గురించి ముస్లింలు చెప్చే అర్థరహిత మూర్ఖ వాదాలు-నేను ముస్లింగా వుండలేకపోతున్నాను ఎందుకని? part 5


5వ అధ్యాయం  (మొదటి భాగము)
ఖురాన్
నిర్దోషమని ఎవరు చెప్పినా వాస్తవానికి అలాంటిది అనంతమైన దోషానికే దారితీసింది. అది చెప్పిన వారికి, ఆమోదించిన వారికీ శాపంగానే పరిణమించింది. దోషరహిత గ్రంథంగా అవతారమెత్తింది. ఆమోదించటానికి వీలులేని స్థితిలోకి అలాంటి తత్వాలూ, సంస్థలూ దారి తీశాయి. పుస్తకం ప్రమాణాలను నిర్థారించి అవరోధంగా మారి తన విధులను నిర్వహిస్తుంది. క్రూరత్వం, మత మూర్ఖత్వం వాటిని అనుసరిస్తాయి. స్వేచ్ఛాలోచనకూ శాస్త్రీయ పరిశోధనకూ వ్యతిరేకంగా నడక సాగిస్తాయి. అజ్ఞానం దోషాలకు మూలం. నిజమైన అభివృద్ధికి బైబుల్లో చెప్పిన దేవతా పూజ అంతా పోవాలి. నిర్దోషం సామాన్యులదైనా, పురోహితులదైనా సమాజానికి హాని కలిగించేదే (టి. హెచ్. హక్సరే. సైన్స్ అండ్ హిబ్రూ ట్రెడిషన్, లండన్, 1895, పీఠిక, పుటః9)
      ఈ వాక్యాలు చదివే ముస్లింలు నన్ను క్షమింతురు గాక, వారికి ఖురాన్ అల్లా ఇచ్చిన గ్రంథం. వారి విశ్వాసాన్ని నేను గౌరవిస్తాను. కాని నేను అందులో భాగం పంచుకోను. దానిమీద ఆధారపడను. ప్రాశ్చవాదులు కొందరు దీనిపై ఆధారపడ్డారు. ఈ ధోరణి వలన ఇస్లాం ప్రభుత్వాలూ, వ్యక్తులూ కొంత తోడ్పడవచ్చు. కాని నేను అర్థాన్ని కప్పిపుచ్చి మోసం చేయదలచలేదు. ముస్లింలు ముస్లిమేతరుల భావాలను తెలుసుకోకుండా ఉండవచ్చు. పుస్తకాలు చదవకుండానూ ఉండవచ్చు. చదివితే మాత్రం వారికి విరుద్ధమైన విషయాలు చాలా ఉంటాయని గ్రహించాలి. రాన్ అల్లా గ్రంథంగా నేను నమ్మను. (మాక్సిమ్ రాడిసన్, మహమ్మద్, న్యూయార్క్, 1980, పుట 217-18)
      ఖురాన్ ను అరబిక్ లో రాశారు. దానిని సురలు అనే అధ్యాయాలుగానూ, ఆయాత్ అనే చరణాలుగానూ విభజించారు. సుమారు ఎనిమిదివేల పద్యపాదాలు, 6200 నుండి 6240 వరకూ చరణాలూ 114 సురలు ఖురాన్ లో ఉన్నాయి. తొమ్మిది, మొదటి ఫతీహాసుర తప్ప ప్రతి సుర కూడా దయామయుడైన దేవుని పేరిట అని మొదలవుతుంది. అవి కాలక్రమంలో ఎప్పుడు రాసినా, ఎవరు బాధ్యులైనా, ఖురాన్ లో మొదటగా సుదీర్ఘ సురలుగా రాశారు. మహమ్మద్ కు ఏ క్రమంలో వీటిని దైవం వెల్లడించినా ఉన్న తీరు అది.
      నేడు సాధారణ,  తాత్వికేతర ముస్లిం దృష్టిలో దేవుని వాక్యంగా ఖురాన్ తిరుగులేనిది, దేవుడు గాబ్రియేల్, పవిత్ర శక్తి ద్వారా మహమ్మద్ కు అరబిక్ లో దీన్ని అందజేశాడు. అది  నిత్యమూ, అపౌరుషేయము. దీని మూలం, స్వర్గంలో ఉంది. (మాతృ గ్రంథం 43.3, గర్భిత గ్రంథం 55.77, సంరక్షిత ఫలకం 85.22 ప్రవక్తకు దివ్య సందేశంగా దేవదూత చెప్పగా ఇతడు దాన్ని తిరిగి చెప్పి, ప్రపంచానికి వెల్లడించాడు. మహమ్మదుకు చెప్పిన తీరులోనే ఏ మార్పులూ లేకుండా వీటిని అట్టిపెట్టినట్లు నాగరిక ముస్లింలు చెపుతారు. పుట్టుక, మరణం, వివాహాల సందర్భంగా కొరాన్ పఠిస్తారు. గైలామ్ ఇలా రాశాడు. ఇది అతి పవిత్రమైనది. ఇతర పుస్తకాల పక్కన ఉంచకూడదు. వాటి పైనే అట్టిపెట్టాలి. ఖురాన్ పెద్దగా చదివేటప్పుడు తాగకూడదు, పొగ పీల్చరాదు. మౌనంగా వినాలి. రోగాలకూ ఉపద్రవాలకూ ఇది నివారిణి కామోత్తేజాన్ని కలిగించడానికి ఖురాన్ చదవమని షేక్ సెఫ్ జావి తన సుగంథ గార్డెన్ లో రాశాడు.
      ఖురాన్ యావత్తూ పిల్లలచే కంఠస్తం చేయించే పని ఆలోచనా రహితమని హర్ గ్రోంజే, గాల్యూమ్ (Hurgronje, Guilllaume) విమర్శించారు. కొన్ని చోట్ల ఖురాన్ లో కొన్ని భాగాలు కంఠస్తం చేయిస్తున్నారు. అందులో 6200 పైగా చరణాలున్నాయి. నిశిత పరిశీలన లేకుండా పోతుందని కూడా ఈ పండితులు అన్నారు. ఆలోచన స్తంభింపజేసి, కంఠస్తం చేసిన విషయాలను గురించి ఎలాంటి నిశిత ఆలోచనా చేయజాలని స్థితి ఏర్పడుతుంది. (Guillaume Alfred Islam)
లండన్ 1954 పేజి 74)
హర్ గ్రోంజే  పరిశీలన
      ఒకప్పుడు ప్రపంచ సంస్కరణ శక్తిగా ఉన్న ఈ గ్రంథం నేడు కొన్ని నిర్దుష్ట నియమాలతో పంతుళ్ళు, పాఠకులు వల్లెవేస్తున్నారు. నియమాలు జటిలం కాదు. కానీ ఆ మాటలలో ఏమి అర్థం ఉందో అని అలోచించడం లేదు. ఖురాన్ వల్లె వేస్తే  మంచిదనడం తప్ప మరేమీ లేదు. మామూలు పాఠకుల మాట అలా ఉంచి భాష్యాలు చదివిన పండితులు సైతం, వారు నిత్యం చేసే పనులు పాపాలని ఖండించే చరణాలు చదువుతూనే తమ క్రతువు సందర్భంగా తప్పు చేస్తున్నారని పఠిస్తూనే ఉంటారు.
    13 శతాబ్దాల క్రితం ప్రపంచాన్ని జయించతలపెట్టిన వారిని ప్రేరేపించిన నియమావళి, పవిత్ర సంగీత పాఠ్యగ్రంథంగా మారింది. ముస్లింలో చదువుకున్న యువత విలువైన జీవితం వృధా అవుతున్నది. ((Zwemer, The Influence of Anicism in Islamలండన్ 1920 పుట 25 ఉదహరించాడు).
దైవ వాక్యమా ?
    ముస్లిం భషాపండితుడు, వ్యాఖ్యాత (ఖురాన్ పై) సుయాతి 5చోట్ల ఖురాన్ పాఠాలు వివాదాస్పదమైనవని, వాటిలో మహమ్మద్ చెప్పినవి, గాబ్రియల్ చెప్పినవి ఉన్నాయని  కనుక దేవుని వాక్యాలనడం సరికాదన్నాడు. ఖురాన్ లో అనేక విషయాలు దేవుడు మాట్లాడి ఉండడని అలిదష్తే కూడా చూపాడు. (Ali Dasti, Twenty three years, A study of prophetic career of Mohammed, లండన్ 1985 పేజి 148).
ఫాతెహా అనే ప్రారంభ సుర
      దయామయుడైన దేవుని పేరిట, దేవుని శ్లాఘించుము, ప్రపంచాల అధిపతీ, కరుణామూర్తి, న్యాయ తీర్పు ఇచ్చే మూర్తీ, నిన్ను సేవిస్తాము. నిన్ను సహాయం కోరతాము. సక్రమ మార్గంలో నడిపించు. నీవు ఆగ్రహించే వారి బాటలోగాక, దోషుల మార్గంలోనే గాక, నీవు కరుణించిన పంథాలో నడిపించు.
    ఈ మాటలు దేవుణ్ణి ఉద్దేశించిన ప్రార్థన. దేవుణ్ణి కొలవడానికి సహాయం అర్థిస్తూ మహమ్మద్ వాడిన మాటలవి. సుర ముందు అను (చెప్పుము) అని చేర్చితే సరిపోతుంది. కొరాన్ లో 350సార్లు అను అనే పదం వస్తుంది. ఖురాన్ లో ఉత్తరోత్తరా ఈ పదాన్ని చేర్చారు. ఇబ్బందికర విషయాలు తొలగించడానికి ఆ పదం చేర్చారు.
      ప్రవక్త సహచరుడు, ఖురాన్ పై సాధికారంగల ఇబ్నమసూద్, ఫాతిహాను, సుర 113, 114లను నిరాకరించాడు. దేవుని శరణుజొచ్చుతాను అనేది ఖురాన్ లో భాగం కాదన్నాడు.
      నేను నీ కాపలాదారు కాదు  అని 6.104 సురలో రాసింది మహమ్మద్ మాటలే.
      దేవుని నుండి రుజువులు నీకు లభించాయి. వాటిని గుర్తించిన వారు బాగుపడతారు. పట్టించుకోనివారు నష్టపోతారు. నేను నీ కాపలాదారుని కాదు. దావూద్ తన అనువాదంలో రాస్తూ నేనూ  అంటే మహమ్మద్ అన్నాడు.
      సుర 114లో మహమ్మద్ మాటలు నేను (మహమ్మద్) దేవుడిని గాక మరొకరిని ఎందుకు అన్వేషించాలి. దేవుడే (ఖురాన్) పవిత్ర గ్రంథం పంపినప్పుడు...... అంటాడు.  మూల అరబిక్ లో లేని  అలా అను అనే పదాన్ని అనువాదంలో యూసఫ్ అలి చేర్చి, దానిపై ఎలాంటి వ్యాఖ్యానమూ చేయలేదు. సుర 111 కూడా దేవుడి వాక్యాలుగా తగవని, అవి మహమ్మద్ మాటలని అలి దష్తే రాశాడు. విశ్వ రక్షకుడు ఒక అమాయక అరబ్బును శపించి, అతని భార్యను కట్టెలు మోసేదానివి  అన్నాడన్నారు. మహమ్మద్ బద్ధ శత్రువు. మా అబు లాహబ్ కు ఈ సుర ప్రస్తావిస్తుంది. అబూలాహబ్ చేతులు పడిపోను. అతడి సంపద అతడికి  అక్కరకు రాదు. సంపాదన నిలవదు. అతడు సర్వనాశనం అవుతాడు మండే అగ్నిలో దహించుక పోతాడు.  ఈ మాటలు దేవుడివి కావు. మహమ్మద్ చేత ఇవి చెప్పించడమూ అనర్హమే.
      గోల్డ్ జిహర్ ఇలా రాశాడు.  ముతాజిలైట్ భక్తులు సహితం ఖురాన్ లో ప్రవక్త శత్రువులకు వ్యతిరేకంగా శాపనార్థాలు పెట్టిన వాటి గురించి సందేహాలు వెలిబుచ్చారు. అలాంటివి దేవుడు చెప్పినవి ఉండవన్నారు. సురక్షిత ఫలకాలపై ఉన్నత ఖురాన్ విషయాలు అలా ఉండవన్నారు. (ఇన్ ట్రడక్షన్ టు ఇస్లామిక్ థియాలజీ అండ్ లా, ఆండ్రాస్, రూథ్ హమోరి అనువాదం ప్రిన్ స్టన్ 1981, పుట 173).
      మహమ్మద్ దేవుని మధ్య ఎవరు మాట్లాడారనేది 17.1 సుర ప్రకారం గందరగోళం ఏర్పడిందని అలీ దస్తీ రాశాడు. (23సం.  ఎ స్టడీ ఆఫ్ ది ప్రోఫెటిక్ కెరియర్ ఆఫ్ మహమ్మద్, లండన్ 1985 పుట.150) మక్కా మసీదు ప్రార్థనా స్థలం నుండి నీ సేవకుడుని రాత్రిళ్ళు జెరూసలేం సుదూర ప్రాంత మసీదుకు తీసుకెళ్ళిన దేవుని స్తుతించుగాక. దేవుడు ద్రష్ట, శ్రోత, అతడికి మనం కృతజ్ఞతలు చూపాలి.
    దస్తీ పై మాటలను గురించి ఇలా వ్యాఖ్యానించాడు. మక్కా నుండి పాలస్తీనాకు సేవకుడిని తీసుకెళ్ళి దేవుని స్తుతి, దేవుడే పలికి ఉండడు. తనను తాను దేవుడు పొగడుకోడు. దైవాన్ని మహమ్మద్ పొగిడిన మాటలివి. ఆ తరువాత వాక్యం దేవుని గురించి మాట్లాడిందే. ముగింపు మాటలూ అంతే. అవన్నీ మహమ్మదు మాటలు.
    సుర 27.91 అనువదించేటప్పుడు చిత్తశుద్ధి లేకుండా మూర్ఖవాదన చేశారు. మహమ్మద్ అందులో స్పష్టంగా మాట్లాడినట్లు ఉన్నది. నన్ను ఈ నగరానికి సేవ చేయమని దేవుడు అజ్ఞాపించాడు.  అరబిక్ లో లేని అలా అను  పదాలను దావూద్, పికెట్ హాల్ వాక్యం ప్రారంభంలో చేర్చారు. సుర 81.15-29లో ప్రమాణం చేస్తున్నది మహమ్మదు. తిరుగాడే గ్రహాలూ, తలెత్తే తారలు సూర్యాస్తమయాలూ, ఉషోదయం ప్రమాణంగా చెపుతున్నాను. సుర 84.16-19 ప్రకారం తన పేగన్ వారసత్వాన్ని వదులుకోలేక మహమ్మదు ఇలా అంటాడు. సంధ్యాసమయ కాంతి, రాత్రిళ్ళు సంపూర్ణ చంద్రుని కాంతి ప్రమాణంగా చెపుతున్నాను. మహమ్మద్ మాట్లాడుతున్నట్లు ఇంకా ఉదాహరణలు ఉన్నాయి. (112.14-21, 111.1-10) ఇస్లాంకు వ్యతిరేకులు కాని బెల్, వాట్ లు కూడా ఇలా రాశారు. (ఆరబెల్, డబ్ల్యు.ఎం.వాట్, ఇన్ ట్రడక్షన్ టు ఖురాన్, ఎడిబరో, 1977 పుట. 66)
      ప్రతి భాగంలోనూ దేవుడే మాట్లాడాడంటే చిక్కులు ఎదురవుతున్నాయి. దేవుని సంబోధించిన సందర్భాలున్నాయి. ఒక వ్యక్తి తనను దూరంగా ఉన్న వ్యక్తిగా చూపవచ్చు. కాని దేవుని ఉద్దేశించి ప్రవక్త చెప్పిందీ అనూహ్యంగానే ఉన్నది. దేవుడు ప్రమాణం చేసినట్లు తనమీద తానే ఒట్టు పెట్టుకున్నట్లు అందరూ గుర్తించే భాగం ఒకటున్నది. 19.64 దేవుని ఆజ్ఞ వలన మేము వచ్చాము. మా ముందూ, వెనుకా, మధ్య ఉన్నదంతా దేవునిదే. స్వర్గభూమి మధ్య ఉన్నదంతా దేవునిదే. దేవుడు విస్మరించడు. అతడిని సేవించాలి. సహనంతో పూజించాలి.
    సుర 37.161-166లో దేవతలు స్పష్టంగా మాట్లాడినట్లు ఉన్నది. అంత స్పష్టంగా లేని చోట్ల కూడా ఇలాంటివి అన్వయించవచ్చు. దేవుడు తనను గౌరవంగా పిలుచుకున్నట్లు వ్యాఖ్యానించే దానికంటే దేవతలు మాట్లాడారని చెప్పటానికి వీలుగా మేము అని అర్థం వచ్చే వ్యాఖ్యానం చేస్తే సరిపోతుంది. దేవునికి అంటగట్టే కొన్ని విషయాలు సరిగా లేవు. దేవుని ఉద్దేశించినవి కూడా అతడే మాట్లాడినట్లు చెప్పటంతో గందరగోళం తప్పదు.
ఖురాన్ లో పరాయి  పదాలు
    ముస్లిం భాషావేత్తలు ఖురాన్ లో పరాయి పదాలు ఉన్నాయని గుర్తించినా సనాతనులు వారిని నోరు మూయించారు. ఒక సంప్రదాయం ప్రకారం ఖురాన్ లో అరబ్బీ తప్ప వేరే ఉన్నదని చెపితే దైవానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లే. సుర 12.1 అరబిక్ ఖురాన్ సృష్టించాం. అల్ సుయూతి వంటి భాషావేత్తలు సనాతనుల అభ్యంతరాలను తప్పుకోటానికి సొంత వాదనలు చేశారు. ఖురాన్ లో పరాయి పదాలున్నాయని అల్ తాలిబీ వాదించారు. ఐతే అరబిక్ లోకి మార్చుకున్నారు గనుక అవి అరబిక్ గానే పరిగణించాలి. అల్ సుయూతీ 107 పరాయి పదాలు, ఆర్థర్ జఫ్రి 275 పరాయి పదాలు ఖురాన్ లో పేర్కొన్నారు. ఇవి ఆరమిక్, హిబ్రూ, సిరియన్, యుధియోపియన్, పర్షియన్, గ్రీక్ పదాలు, ఖురాన్ అనే పదం సిరియన్ నుండి వచ్చింది. క్రైస్తవ ఆధారాల ద్వారా మహమ్మదు దానిని స్వీకరించి ఉండవచ్చు.
పాఠాంతరాలు
      ఖురాన్ ను గురించి ముస్లింలు చెప్చే అర్థరహిత మూర్ఖ వాదాలు గమనించాలంటే ఖురాన్ విభిన్న పాఠాంతరాలను అధ్యయనం చేయాలి. ఖురాన్ ఇది అని కచ్చితంగా చెప్పగల గ్రంథమేదీ లేదు. ఆ పవిత్ర పుస్తకానికి నిర్దుష్టత లేదు. ఖురాన్ దైవం ఇచ్చిందని ముస్లింలన్నప్పుడు ఏ ఖురాన్ అని అడిగితే చాలు. అతనిలో నిర్థారణ సడలిపోతుంది.
      క్రీ.త. 632లో మహమ్మదు చనిపోయిన తరువాత అతడి ప్రసంగాల సంకలనం జరగలేదు. అతని అనుచరులు తెలిసినంత వరకూ క్రోడీకరించి రాయటం మొదలు పెట్టారు. ఇబ్నమసూద్, ఉబయ్ కాబ్, అలీ, అబూబకర్, అల్అషారి, అల్అస్వాద్ మొదలైన పండితులు ఈ సేకరణ చేశారు. ఇస్లాం వ్యాపించే కొద్దీ మక్కా, మదీన, డమాస్కస్, కుఫా, బస్రా వంటి నగరాలలో  క్రోడీకరణ సాగిపోయింది. మదీనాలో అధికారికంగా క్రోడీకరించి ఉత్మన్, ఆప్రతులను ఇతర నగరాలకు పంపి మిగిలినవన్నీ నాశనం చేయమన్నారు.
      ఉత్మన్ ప్రామాణీకరించి, అధికారికంగా వెలువరించిన అనంతరం కూడా భిన్న పాఠాంతరాలు నాలుగవ ఇస్లాం శతాబ్దం వరకూ ఉన్నాయి. ఈ ప్రామాణిక గ్రంథంలో పద విరమణ సంచికలు లేవు. కొన్ని అక్షరాలు గుర్తించటానికి వీలులేకుండా ఉన్నాయి. (.F,Q,J,H., Kh, S-D, R-Z, S-Sh, D-Dh, T-Z .తేడాలు లేకుండా ఉన్నాయి. అందువలన భిన్న అర్థాలకూ, పాఠాంతరాలకూ దారితీసింది. అచ్చులవలన సమస్య ఇంకా పెరిగిపోయింది. అరబ్బులకు హ్రస్వ అచ్చులు చూపే సంజ్ఞలు లేనందున తరువాత రోజుల్లో వీటిని చేర్చారు. అరబ్బు లిపి హల్లులతో కూడినది. అచ్చులపైన, లేదా కింద చుక్కలూ, సంజ్ఞలూ చిన్న అడ్డు గీత, స్వల్ప విరామ గుర్తు పెట్టారు. హల్లుల విషయం పరిష్కరించిన తరువాత అచ్చులు నిర్ణయించటంలో భిన్న పాఠాంతరాలు వచ్చాయి.
      ఈ కష్టాలవలన వివిధ కేంద్రాలలో వారి సొంత ప్రమాణాలతో సంప్రదాయాలను పుస్తకాలలో చేర్చారు. ఉత్మన్ ఉత్తరువులు ఉన్నప్పటికీ అంతకు ముందే సేకరించిన గ్రంథాలు కూడా కొనసాగాయి. చార్లెస్ ఆడమ్స్ ఇలా రాశాడు. ఉత్మన్ తిరుగులేని ఉత్తరువులిచ్చినప్పటికీ వేలాది పాఠాంతరాలు అనేక చరణాలకు వచ్చాయి. వీటివలన ఉత్మన్ క్రోడీకరించిన వాటిని కూడా కొన్ని అవ్వయించారు. ఏది మూలమూ కాదో చెప్పలేని స్థితి ఏర్పడింది. (ఎన్ సైక్లోపీడియా ఆఫ్ రెలిజియన్ లో ఖురాన్, ఆడమ్స్ ఆర్ట్) కొందరు ముస్లింలు ఉత్మన్ క్రోడీకరించిన వాటికంటే ఇబ్నమసూద్, ఉబయ్ ఇబ్నకాబ్, అబూమూసా క్రోడీకరించిన వాటిని స్వీకరించారు. ఇబ్న ముజాహిద్ (క్రీస్తు తరువాత 935లో మరణించాడు.) గొప్ప కొరాన్ పండితుడు. అతని ప్రభావం వలన హల్లులతో నిర్ధారించిన ప్రమాణ గ్రంథం అచ్చులను పరిమితంగా వాడటం అంగీకరించారు. అందువలన 7 విధానాలు ఆమోదించబడ్డాయి.
      1. మదీనాకు చెందిన నఫీ (క్రీ.త. 785 మరణం)
      2. ఇబ్న కతీర్, మక్కా (737 మరణం)
      3. ఇబ్న అమీర్, డమాస్కస్ (736 మరణం)
      4. ఆబూ అమర్ బస్రా (770 మరణం)
      5. అసీమ్, కుఫా (744 మరణం)
      6. హంజ, కుఫా (772 మరణం)
      7. అల్ కి సాయ్, కుఫా (804 మరణం)
      ఇతర పండితులు పది పాఠాంతరాలనూ, మరికొందరు 14 పాంఠాంతరాలను ఆమోదించారు. ఇబ్న ముజాహిద్ పేర్కొన్న ఏడింటిలోనూ 14 పాఠాంతరాలకు అవకాశం ఉన్నది. ఈ ఏడూ రెండేసి ఆధారాల ద్వారా వచ్చాయి.
1.   నఫి, మదీనాకు వార్డ్, కాలూన్ వలన సంక్రమించాయి.
2.   అల్ బాజీ, కున్ బుల్ నుండి ఇబ్న కతీర్ కు, మక్కా
3.   హిషామ్, ఇబ్నదఖవన్ నుండి ఇబ్న అమీర్ కు
4.   అల్ దురి, అల్ సుసీ నుండి అబూ అమర్ కు
5.   హఫ్స్, అబూబకర్ నుండి అసిమ్ కు
6.   ఖలాఫ్, ఖలాల్ నుండి హంజాకు
7.   అల్ దురీ, అబుల్ హరిత్ నుండి అల్ కిసాయ్ కు సంక్రమించాయి.
      జెఫ్రీ ప్రకారం చివరకు 3 విధానాలు ఆధిక్యతలోకి వచ్చాయి. వార్ష్ (812లో మరణం), హఫ్స్ (805లో మరణం), అల్ద్ దూరి (860లో మరణం) అనే మూడు ఆధారాలు పూర్తిగా వివరణకు నోచుకోలేదు. (జఫ్రీ, ప్రోగ్రెస్ ఇన్ ది స్టడీ ఆఫ్ ది ఖురాన్ టెక్ట్స్, ముస్లిం వరల్డ్ సంపుటిః 25, పుటః 11)
      ఆధునిక ఇస్లాంలో రెండూ పాఠాంతరాలు వాడుకలో ఉన్నాయి. హఫ్సా ద్వారా కుఫాకు చెందిన అసీమ్ కు సంక్రమించిన కొరాన్ లో 1924 ఈజిప్టు ప్రతిగా అధికార ముద్రవేసి ఆమోదించారు. ఈజిప్టు వెలుపల ఆఫ్రికాలో కొన్ని చోట్ల వార్ ద్వారా నఫీకి సంక్రమించిన పాఠాన్ని స్వీకరించారు. ఛార్లెస్ ఆడమ్స్ ఇలా రాశాడు.
      ఖురాన్ వివిధ పాఠాంతరాలను గురించి అవగాహన లేకపోవటం గమనించాలి. లిఖిత మౌఖిక పాఠాలలో ఏడు రకాల పుస్తకాలున్నాయి. ఈ ఖురాన్ పాఠాంతరాల తేడాలు వాస్తవం. పవిత్ర గ్రంథం అనే ముస్లిం భావనకు ఖురాన్ పాఠాంతరాలు పవిత్రతను పోగొడుతున్నాయి. 7 రకాల కొరాన్లు సంకీర్తనల తేడాలు అని కొందరు వివరించబోయారు. కాని అందులోనూ భిన్నత్వం ఉన్నది. (ఏడమ్స్ ఆర్ట్, ఎన్ సైక్లోపీడియా ఆఫ్ రెలిజియన్ లో ఖురాన్)
      గైలామ్ కూడా పాఠాంతరాలను ప్రస్తావించి వీటి ప్రాధాన్యత స్వల్పమయిందేమీ కాదన్నారు. (ఇస్లాం లండన్ 1954 పుటః 189)
      సనాతన ముస్లింలకు భిన్న పాఠాంతరాలు. పఠనాలు తీవ్ర సమస్యలను సృష్టిస్తున్నాయి. ఉత్మన్, గ్రంథం నుండి విభేదిస్తున్న వాటిని వారు దాచి పెడుతున్నారు. ఆర్థర్ జఫ్రీ దాచిపెట్టే అంశాన్ని ఇలా రాశాడు. కీర్తి శేషులు ప్రొఫెసర్ బర్గ్ స్ల్రాసర్ పురావస్తు గ్రంథాలనుండి ప్రాచీన కూఫీ క్రోడీకరణలు ఫొటోలు తీశారు. అజర్ లైబ్రరీలో వింత లక్షణాలున్న పాఠాంతరాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాటిని ఫొటో తీయడానికి ఆయన అనుమతి ఇవ్వలేదు. పాశ్చాత్య పండితుడికి భిన్నత్వాల పాఠాంతరాలు చూపగూడదని సనాతనులు భావించారు. వారి ఆసక్తి దృష్ట్యా ఇలా దాచిపెడుతున్నారు. (మోరే, పుటః121, ఇస్లాం ఇన్వేజన్ యూజిన్, 1992)
నిర్దుష్ట (సంపూర్ణ) అరబిక్
    ఖురాన్ లో శైలి బలహీనతలను సుప్రసిద్ధ పండితుడు నాల్డెక్ వివరించాడు. (ఎన్ సైక్లోపేడియా బ్రిటానికా, 11వ ప్రచురణ, 15వ సంపుటి, పుటః 898-906)
      ఖురాన్ లో అనేక భాగాలు ఆకర్షణీయమైన భాష నిర్మాణంతో ఉన్నప్పటికీ, రమణీయకత దృష్టితో చూస్తే నమ్మకం లేని వాళ్ళకు సహితం ఇది ఉత్తమ శ్రేణికి చెందింది కాదు. సుదీర్ఘంగా ఉండవలసిన చోట హఠాత్తుగా ఆపేశారు. తప్పనిసరిగా చూపించవలసిన సంబంధాలు, సంఘటనల క్రమం వదిలేశారు. కనుక వీటి చరిత్ర అవగాహన చేసుకోటం కష్టం. కృత్రిమ పదజాలం కొన్ని చోట్ల ఉన్నది. క్రమంగా చెప్పుకుంటూ పోవటం అనేది లేనేలేదు. జోసఫ్ చరిత్రతో పోల్చి చూస్తే వంశక్రమాల చరిత్ర బైబుల్లో అభినందనీయంగా సృష్టించి రాశారు. ఖురాన్ లో ఇలాంటి దోషాలు మరికొన్ని చోట్ల కూడా దొర్లాయి. భావాల పొందిక లేదు. వాక్య నిర్మాణంలో వక్రంగా ఉంటుంది. ఇలా ఎందుకు రాశారో తెలియదు. చాలా వాక్యాలు ఎప్పుడు ఆనాడు అని గాలిలో మాట్లాడినట్లు రాశారు. భాష్యకారులు దానికి ఇష్టం వచ్చిన అర్థాలు చేర్చే అవకాశం ఇచ్చారు. పదాలు అనవసరంగా పునరావృతం చేశారు. మహమ్మదు శైలిలో నిపుణుడు కాదు.
    ప్రవక్త శైలిని గురించి అలీదస్తీ విమర్శలున్నాయి. ఖురాన్ లో వ్యాకరణ దోషాలను అలీదస్తీ చూపాడు. (23 ఇయర్స్ లండన్, 1985, పుటః 49-50) ఉదాహరణకు 162 చరణంలో సుర 4లో దోషాలు చూడవచ్చు. అలాగే సుర 49 చరణం 9, సుర 20 చరణం 63లోనూ ఇలాంటి దోషాలున్నవి. దీనిపై అలీ దస్తీ ఇలా వివరణ ఇచ్చాడు. ఓతమన్ అయేషా, హధామెనే  అని మాంత్రికులకు సంబంధించిన పదాన్ని చదివారు. ముస్లిం పండితులు ఇలాంటి వాటిపట్ల కళ్ళు మూసుకున్నారు. దైవ వాక్యాలుగా కొరాన్ ను పేర్కొన్నందున దోషాలు ఉండవనీ, హద్యానె అని ఓత్ మన్, ఆయేషాలు చదవటం తప్పనీ, హదానె అనటం సరైందనీ పేర్కొన్నారు.
      ఖురాన్ లో మామూలు నియమ నిబంధనలను అతిక్రమించే సందర్భాలు వందకు పైగా ఉన్నాయని అలీ దస్తీ చూపాడు.
కనిపించని చరణాలు, చేర్చిన చరణాలు
      ప్రవక్త భార్య ఆయేషా సంప్రదాయం ప్రకారం రాళ్ళతో కొట్టటం వ్యభిచారంలో శిక్షగా ఉన్నదని చెప్పారు. అది ఖురాన్ లో భాగంగా ఉండేది. నేడది కనిపించటంలేదు. తొలి ఖలీఫాలు అలాంటి శిక్షలు అమలు జరిపారు. నేటి కొరాన్ ప్రకారం వ్యభిచారానికి 100 కొరడా దెబ్బలు మాత్రమే విధించాలి. కొరడా దెబ్బలు కాక నేటికీ ఇస్లాం చట్టం రాళ్ళతో కొట్టే శిక్షను ఎందుకు ఆమోదిస్తున్నదో అర్థం కాదు. ఈ సంప్రదాయం ప్రకారం వంద చరణాలు కనిపించటం లేదు.  రాజకీయ కారణాలవలన అలీకి అనుకూలమైన చరణాలన్నీ ఉత్మన్ వదిలేశాడని షియాలంటారు.
      ప్రవక్త కొన్ని చరణాలు మరచిపోయి ఉండవచ్చు. అతని అనుచరులకు కొన్ని జ్ఞాపకం ఉండకపోవచ్చు. రాసిన వారు కొన్నింటిని వదిలేసి ఉండవచ్చు. మహమ్మదు కొన్ని చరణాలు వదిలేశాడనటానికి సైతాను చరణాల ఉదంతమే ఉదాహరణ.
      ఆధునిక పాశ్చాత్య పండితులేగాక ముస్లింలు సైతం చాలా చరణాలను ప్రశ్నించారు. ఆలీని ఇస్లాం తొలిరోజులలో అనుసరించిన కారిజైట్లు, జోసెఫ్ కు సంబంధించిన సుర చాలా తీవ్రమైనదిగా భావించి అందులోని కామ సంబంధమైన కథ ఖురాన్కు చెందింది కాదన్నారు. వాన్స్ బ్రోకు ముందు కూడా డిసాసీ, వైల్, హర్ష్ ఫీల్డ్, కాసనోవా వంటి పండితులు కొన్ని సురలు, చరణాలను అధికారికం కావన్నారు. వారి వాదనలు ఒక పట్టాన ఆమోదించటం లేదు. వాన్స్ బ్రో వాదనలు యువతరం పండితులను ఆకర్షించాయి. వృద్ధ పండితుల నిరోధక ధోరణులు ఇందులో లేవు.
      చాలామంది పండితులు ఖురాన్ లోకి అనేక విషయాలు వచ్చి చోటుచేసుకున్నాయని నమ్ముతున్నారు. కొన్ని మారుమూల పదాల వివరణలో ఇలాంటి వాటిని చొప్పించారు. 42.36-38 సురలు వలె కొన్ని రాజకీయ స్వభావంతోనూ, మొండి వాదనలతోనూ ప్రవేశపెట్టారు. ఉత్మన్ ఖలీఫాగా ఉన్నత స్థానానికి పోవడం, ఆలీని వ్యతిరేకించటం కొన్ని సురలలో కనిపిస్తుంది. ప్రాసకోసం, మకుటం కోసం కొన్ని చేర్చారు. సంబంధాల పొందిక కోసం కొన్ని చేర్చారు.
      మార్పులనూ, చేర్పులనూ జాగ్రత్తగా పరిశీలించిన బెల్, వాట్ ఖురాన్ శైలిలో ఒకే తీరు లేకపోవటం, మార్పులకు సాక్ష్యం అన్నారు. (ఇన్ ట్రడక్షన్ టు కొరాన్, ఎడింబరో 1977, పుట 93.)
      ఖురాన్ మార్పులు చేశారనటానికి కొన్ని భాగాలు మొరటుగా కనిపించటం ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. హఠాత్తుగా చరణశైలి మారటం, వేరే చరణంలో క్రితం చరణం పదాలను పునరుచ్ఛరణ చేయటం, పొందికగా  ఉన్నచోట కొత్త విషయాన్ని చేర్చటం, ఒకే విషయాన్ని భిన్న తీరులలో చెప్పటం, వాక్య నిర్మాణంలో వ్యాకరణ జటిలత్వం, ఒక్కొక్క చరణం సుదీర్ఘంగా ఉండటం, సన్నివేశంలో హఠాత్తు మార్పులు చేయటం, సర్వనామాలలో ఏకవచనం నుండి బహువచనంకు పోవటం, ద్వితీయం నుండి ఉత్తమ పురుషానికి పోవటం, పరస్పర విరుద్ధ ప్రకటనలు ఒకచోటే ఉంచటం, భిన్న సమయాలకు సంబంధించిన వాటిని ఒకచోటే ఉంచటం, మొదలైనవన్నీ చేర్సులకూ, మార్పులకూ సాక్ష్యం.
    క్రీ.త. 830లో అల్ కింది ఖురాన్ ను విమర్శిస్తూ, ఇలా రాశాడు. (ముస్లిమ్స్, వ. రిపిన్, పుటః26 సంపుటి 1, లండన్, 1991) ఖురాన్ ను చదివేవారికి అందులో చరిత్రలు మిళితమై కలగాపులగంగా మారినట్లు తెలుస్తుంది. అనేక మంది అందులో చేతులు పెట్టారు. కనుక తేడాలు వచ్చాయి. ఇష్టఇష్టాలను బట్టి మార్పులూ, చేర్పులూ చేశారు. దైవం నుండి వచ్చిన గ్రంథం అలా ఉంటుందా ?
      సుర 20లో 15వ చరణం ఏ మాత్రం అక్కడ ఉండటానికి తగదు. మిగిలిన సురలు శైలికి దీనికీ భిన్నత్వం ఉన్నది. 78వ సురలో ఒకటి నుండి 5 వరకూ కృత్రిమంగా చేర్చారు. అక్కడ రాగం, ధోరణి, మిగిలిన వాటికంటే భిన్నంగా ఉన్నాయి. 32-35 చరణాల మధ్య 33-34 చరణాలను ప్రవేశపెట్టారు. 74వ సురలో 31వ చరణం ప్రవేశపెట్టిందే. భిన్నత్వం స్పష్టంగా చూడవచ్చు. 50వ సురలో 24-32 చరణాలు కృత్రిమంగా జొప్పించారు.
      కొన్ని పదాలూ సమాసాలూ అరుదుగా ఉన్న వాటిని వివరించటానికి సొంత పదాలను చేర్చారు. ఇలాంటి వివరణలు 12 చోట్ల ఉన్నాయి. 101.9-11 సుర గురించి బెల్ వాట్ పేర్కొంటూ తరువాత చేర్చిన వాటికి ఉదాహరణగా దాన్ని చూపారు. (ఇన్ట్రడక్షన్ టు కొరాన్, పుట.94-95, ఎడింబరో, 1977)
      ఇలా చేర్చినవి ఎంత స్వల్పమైనవి ఐనా కొరాన్ దైవదత్తమనీ, మహమ్మదుకు అది సంక్రమించిందని చెపుతున్న ముస్లిం పిడివాదానికి చావుదెబ్బ కొట్టాయి. ఇస్లాం అధికారిక వాదానికీ, పాశ్చాత్య భాషా పండితులు కనుగొన్న దానికీ సమన్వయం కుదర్చటం అసాధ్యమని రెగిన్ బ్లాకర్ తన ఇన్ట్రడక్షన్ టు కొరాన్ లో రాశాడు.
అబ్దుల్లా, సాద్ అబీసార్ కథ (అలీదస్తీ, పుట 98)
      మదీనాలో ఒక రచయితను దైవ ప్రేరణలు రాయడానికి నియోగించారు. ప్రవక్త అనుమతితో చరణాల చివరి మాటలను అతడు అనేక సందర్భాలలో మార్చాడు. దేవుడు శక్తిమంతుడూ, వివేకి అని ప్రవక్త చెప్పగా అబ్దుల్లా రాస్తున్నప్పుడు తెలిసినవాడు, వివేకి అని మార్చులు సూచించగా ప్రవక్త అభ్యంతర పెట్టలేదు. ఇలాంటి మార్పుల పరంపర గమనించిన అబ్దుల్లా దైవ ప్రేరణలను ఒక లేఖకుడు సూచించనంత మాత్రాన మార్చారంటే, అందుకు నిరసనగా అబ్దుల్లా ఇస్లాంను వదిలేశాడు. మక్కా వెళ్ళిపోయి కొరాషియైట్లలో  చేరాడు.
    మక్కాను వశపరచుకొన్న ప్రవక్త అబ్దుల్లాను చంపమన్నాడు. ఉత్మన్ అతి కష్టంమీద మహమ్మదు క్షమించటట్లు చేశాడు.
ఖురాన్ లో కొన్ని భాగాల తొలగింపు
    బైబిల్ లో పరస్పర విరుద్ధాలు రాసిన విలియం హెన్రీబర్, కొరాన్ లో కొల్లలుగా ఉన్న పరస్పర విరుద్ధాల గురించి ఎగిరి గంతేసి ఉంటాడు. కాని అతడి ఆనందం ఆట్టే కాలం నిలవ లేదు. ముస్లింలు ఒక చక్కని సాకు అడ్డం పెట్టుకున్నారు. హుగ్స్ దీనిని వివరిస్తూ రాశాడు. మహమ్మద్ ప్రవక్త కాలంలో ప్రధానంగా కనిపించిన అవకాశవాదం ఒక చట్టంగా రూపొందింది. (డిక్షనరీ ఆఫ్ ఇస్లాంలో ఆర్ట్ ఖురాన్ పుటః520) సిద్ధాంతం ప్రకారం ఖురాన్ లో ఉత్తరోత్తరా వచ్చిన దైవ ప్రేరణలతో లోగడ ఉన్న కొన్ని భాగాలను తొలగించి నింపారు. సుర 2.105లో మహమ్మద్ ఈ విషయం నేర్పాడు.
      దేవుడు రద్దు చేసిన చరణాలు లేదా మీరు మరచిన వాటి స్థానే, ఇంకా శ్రేష్ఠమైనవి లేదా అలాంటివి ప్రవేశపెడతాము  5 నుండి 500 వరకు ఇలా ప్రవేశపెట్టి, తొలగించిన చరణాలున్నాయని అల్ సుయూతి చెప్పాడు.
      మార్గోలియత్ ఇలా రాశాడు. ఒక సందేశాన్ని అందివ్వడానికి ఉపసంహరించడానికి దైవానికి అధికారం ఉన్నదని మహమ్మద్ చెప్పాడు. అలాంటి రాజీ ప్రతిపాదన ఎలా చేర్చారనేది మిత్రులు శత్రువులూ అశ్చర్యపోవడం సహజం.
    అల్ సుయూతి ఉదాహరణనిస్తూ 2.240 సుర తొలగించి 234 చరణం ప్రవేశపెట్టారన్నారు. ఇలా చేయటం ఎలా సాధ్యపడుతుంది ? సంప్రదాయ ముస్లిం సురలు, చరణాలు కాలక్రమంగా లేవు. పెద్ద అధ్యాయాలను తొలుత అట్టిపెట్టారు. సిద్ధాంత కారణాలుగా భాష్యకారులు ఈ క్రమాన్ని నిర్ణయించారు. మక్కా మదీనా కాలాలకు సంబంధించిన సురలను గురించి స్థూలంగా అంగీకారం ఉన్నది. దేవుని నిత్యం అనే పదం కాలానికి ఎలా బందీ అయిందో గమనించాలి.
      ముస్లింలు ఒక ఊబిలోనుంచి బయటపడి  మరొక దానిలో ప్రవేశించారు. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అయిన దేవుడు తన ఆజ్ఞలను తిరగదోడడం సమంజసమా ?  తరచు వాటిని మార్చుకుంటూ అతడు పోయాడా ? అన్నీ తెలిసిన వాడైతే తొలుతే సరిగా ఎందుకు చెప్పలేదు. ఉత్తమ చరణాన్ని ముందే ఎందుకు బయటపెట్టలేదు. దస్తీ ఇలా రాశాడు. (23 ఇయర్స్, ఎ స్టడీ ఆఫ్ ది ప్రోఫెటిక్ కెరియర్ ఆఫ్ మహమ్మద్, పుట 155, లండన్, 1985)
      ఆ రోజుల్లోనూ వెక్కిరించే వారున్నారు. సుర 16, 103, 104 చరణాలలో వారికి సమాధానం ఇచ్చారు. ఒక చరణానికి బదులు, ఇంకో చరణం ప్రవేశపెట్టినప్పుడు ఏది ఇవ్వాలో దైవానికి తెలుసు. కాని ఇదంతా మీరల్లినదేనని వారు వెక్కిరించారు.  వారికి తెలియదు. వారితో చెప్పండి.  పవిత్రదేవత నమ్మకస్తులకు నిర్ధారణగా చెప్పే నిమిత్తం వాటిని దైవం నుండి తెచ్చింది.’ “ఖురాన్ దైవదత్తమైతే అందులో మానవుడి సంపూర్ణతలకు తావు లేదు. కాని కొరాన్ చరణాలలో పొందికలేని విషయాలు స్చష్టం. ఏది ఇవ్వాలో దైవానికి తెలుసుననుకోండి. ఒక చరణం స్థానే మరొకటి రావడంతో అభ్యంతర పెట్ఠేవారి అనుమానాలు బలపడ్డాయి. హెజాజీ అరబ్బులవంటి నిరక్షరాస్యులు సహితం దేవుడు ఉత్తమమైన దానినే ఇస్తాడనీ, మనుషులవలె క్షణికంగా మారడనీ తెలుసుకున్నారు.
    ఖురాన్ లో ఈ విధంగా తొలగింపులు చేసే పద్ధతిని వెక్కిరించటం సహజం. నిత్యమూ, అపౌరుషేయమూ, విశ్వజనీనమూ అయిన దేవుని మాటలను, కాలదోషం పట్టాయని మార్పు చేయటం ఎలా వీలవుతుంది. దేవుని మాటలలో కొన్ని మాత్రమే బాగున్నాయని అనగలమా?
      మూర్ చెప్పినట్లు 1200 చరణాలను తొలగించి వేరే వాటిని ప్రవేశపెట్టారు. ఒకవైపున దైవదత్తంగా ఖురాన్ పారాయణం చేస్తూ, కొన్ని భాగాలు సరైనవి కాదనగలమా? ఖురాన్ లో 3 శాతం తప్పుడువని గుర్తించారు.
      ఒక ఉదాహరణ చూద్దాం. ఖురాన్ సుర 2.219లో మద్య నిషేధం ప్రస్తావించినందున ముస్లింలు తాగగూడదన్నారు. సుర 16.67లో సారాయి. ఆరోగ్యప్రదమైన పోషక ద్రవం లభిస్తుందని ఉన్నది. (రాడ్ వెల్) మత్తెక్కిన వారున్నారని దావూద్ ప్రస్తావించాడు. పికెట్ హాల్ రాసిందానిలో మత్తు పదార్థ సేల్ ప్రస్తావించాడు. యూసఫ్ ఆలీ సాకార్ అనే మాటను సంపూర్ణ ద్రవపదార్థంగా పేర్కొని ఇది సారాయి కాదన్నాడు. పులిసిన ద్రాక్షరసం అనే అర్థంలో సాకార్ ను వాడితే త్రాగేవారని అడ్డుపెట్టని రోజుల్లో ఈ విషయం అన్వయించి చూసుకోవాలన్నాడు. నిషిద్ధం మదీనా నుండి వచ్చిందనీ, సుర మక్కాకు చెందిందనీ అన్నాడు.
      పండితులు తప్పుకోవటానికి వీలుగా సమయోచిత తొలగింపు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఇస్లాం పండితులకు సమస్యలు తలెత్తాయి. తొలి సురలలో మక్కాకు సంబంధించిన వాటిలో సహనబోధ ఉన్నది. సహనం స్థానంలో అసహనాన్ని ప్రవేశపెట్టి మదీనా సుత్తాలు చంపడాన్ని సిఫారసు చేశాయి. 124 చరణంలో సహనం ఓర్పు ఉండగా దాని స్థానే నమ్మకం లేని వారిని ఎక్కడ కనిపించినా చంపమని 9.5 సుర చెపుతున్నది.
ఖురాన్ సిద్ధాంతాలు
    దేవుడు తప్ప మరొక దైవం లేదు. ఇస్లాం రాజీపడని ఏకేశ్వరాధన పాటిస్తుంది. దేవుడులో భాగం పంచుకోటం అనేది గొప్ప పాపంగా పరిగణిస్తుంది. బహుదేవతారాధన, విగ్రహారాధన, పేగన్ వాదం, బహుముఖ దివ్యత్వం, అరబిక్ దృష్టిలో ఘోరమైన పాపాలే బహుదేవతావాదం కంటే ఏకేశ్వర వాదం ఉన్నతమైనదని మత వాదులూ 19వ శతాబ్దంలో సాంస్కృతిక పరిణామ వాదులూ, నిశిత పరిశీలన లేకుండానే భావించారు. బహుదేవతారాధనకు తాత్వికులు ఇటీవలి వరకూ శ్రద్ధవహించలేదు.  తాత్వికంగా, అధిభౌతికంగా, బహుదేవతారాధనకంటే ఏకేశ్వరవాదన ఉన్నతమైనదా?  ఐతే ఏ విధంగా ? బహుదేవతారాధన నుండి ఏకేశ్వర వాదనకు సహజ పరిణామం జరగి ఉంటే, ఏకేశ్వర వాదం నుండి నాస్తిక వాదానికి సహజ పరిణామం జరగ లేదా ? ఏకేశ్వర వాదన పోయి ఉన్నతమైన నాస్తిక వాదం, అజ్ఞేయవాదం ద్వారా రాలేదా?
1.         ఏకేశ్వర వాదం తాత్వికంగాగానీ, అధిభౌతికంగాగానీ, బహుదేవతారాధనకంటే ఉన్నతమైనది కాదు. ఒకే దేవుడు ఉన్నాడనటానికి రుజువులేమీ లేవు.
2.         చారిత్రకంగా మాట్లాడితే ఏకేశ్వరవాదానికి రహస్యంగా జనం స్థాయిలో బహుదేవతారాధనను పాటించింది. అధికారిక పిడివాదం ఎలా ఉన్నా ఇది వాస్తవం.
3.         మూఢనమ్మకాలు ఏకేశ్వర వాదానికి కుదించటం కాక ఒకే దేవుడు అతడి దూతలో కేంద్రీకరించాయి.
4.         ఏకేశ్వరవాదం తరచు అసహనంలో ఉగ్రరూపం దాల్చింది. దీనితో పోల్చిచూస్తే చారిత్రకంగా బహుదేవతారాధన పక్షాన మత యుద్ధాలు జరగలేదు. ఏకేశ్వరవాదన సిద్ధాంతం నుండి అసహనం తార్కికంగా జనించింది. దీనికి ఏకేశ్వర వాదమే సమాధానం చెప్పాలి. గోర్ వైడల్ ఇలా రాశాడు. (న్యూ స్టేట్స్ మన్ సొసైటీ, 1992, జూన్ 26, పుటః12)
      ఏకేశ్వరవాదం మన సంస్కృతిలో పెద్ద దోషం. పాత నిబంధన నుండి యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాలు అమానుషంగా పరిణమించాయి. ఆకాశ దేవుళ్ళ మతాలివి. పితృస్వామ్య పెత్తనంతో కూడినని. దేవుడు సర్వశక్తివంతమైన పితామహుడు.  ఈ మతాలు వాటిననుసరించిన పురుషులు ఆయా దేశాలలో 2వేల సంవత్సరాల నుండి స్త్రీలను జుగుప్సతో చూశారు. ఈ ఆకాశ దేవుడు ఈర్ష్యాపరుడు. పూర్తిగా విధేయత కావాలంటాడు. అతనిని నిరాకరిస్తే మతం మార్చాలనీ, లేదా చంపేయాలంటాడు. ఆకాశ దేవుని ప్రయోజనాన్ని తీర్చగల రాజకీయం నియంతృత్వంలోనే ఉన్నది. ఉదార స్వభావంతో కూడిన ఉద్యమాలు దేవుని పెత్తనానికి ప్రమాదకరాలు. ఒకే దేవుడు, ఒకే రాజు. ఒకే పోప్, ఒకే కర్మాగార యజమాని, కుటుంబానికి తండ్రి నాయకత్వం ఈ ధోరణిలోవే.
5.         అరేబియా బహుదేవతారాధనను ఇస్లాం తొలగించలేదు. అరబ్బుల ఆధ్యాత్మిక అవసరాలను అది తీర్చింది. ఈ లోకంలోనే అవకాశాలు పొందే తీరు చూపింది. ఏకేశ్వరాధన ఆధిక్యత సమర్ధనీయం కాదు. అరేబియాలో ఇస్లాంను అనుకరించే కారణాలను చరిత్రకారులు పాక్షికంగా చూచారు.
6.         అరబ్బుల నైతిక స్ధాయిని పెంచేబదులు ఇస్లాం అన్ని విధాలైన అవినీతి ప్రవర్తనలను ఆమోదించింది.
      ఏకేశ్వర వాదన ఒకరకంగా ఆదిమ దేవుళ్ళనుండి క్రమాన్ని తెచ్చి మూఢనమ్మకాలను తగ్గించిందనాలి. ఇది పైకి కనిపించేంత నిజం కాదు. (జివెర్బలోస్కీ ఇలా పరిశీలించాడు. ఎన్ సైక్లోపీడియా ఆఫ్ రెలిజియన్ లో బహుదేవతారాధన) బహుదేవతారాధన స్థానే ఏకేశ్వరాధన వచ్చినప్పుడు కొందరు దేవతల్ని రద్దు పరచటం లేదా దయ్యాలుగా మార్చటం, దేవతలూ, దూతలుగా స్థాయి తగ్గించి చూడటం గమనించవచ్చు. అంటే ఏకేశ్వరాధన విధానం ఆచరణలో బహుదేవతారాధనను కొనసాగిస్తున్నదన్నమాట.
    హ్యూం ఇలా పరిశీలించాడు. (ఎంక్వైరీస్ కన్ సర్నింగ్ ది హ్యూమన్ అండర్ స్టాండింగ్స్ అండ్ కన్ సర్నింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మోర్ ల్స్, ఆక్స్ ఫర్డ్, 1966, పుట 56)
    మత సూత్రాలు మానవుడి మస్తిష్కంలో మారుతూ వచ్చాయి. విగ్రహారాధన నుండి మతవాదనకూ, తిరిగి దానికి మారుతూ తిరోగమించడం గమనించవచ్చు. మానవులు సుఖాన్వేషణలో ఈ అదృశ్య శక్తుల భావాలను దేనికీ అంటిపెట్టుకొనక మారుతూ వచ్చారు. పరిమిత శక్తినీ, మానవ విధిని నిర్ధారించే శక్తినీ, ప్రకృతిని నడిపించే శక్తినీ ఆపాదించారు. తమ దేవతలను సంపూర్ణ స్థాయికి పెంచారు. ఏకత్వం, అనంతత్వం, సాధారణత్వం, ఆధ్యాత్మికత అనే లక్షణాలు అంటగట్టారు. ఇవేవీ ప్రారంభించిన దశలో కొనసాగలేదు. మానవుడికీ, దేవతలకీ మధ్య కొందరు దూతలు బయలుదేరారు. వీరంతా మానవ స్వభావం గలవారే కనుక వారిని కూడా ఆరాధించారు. ఆవిధంగా విగ్రహారాధనా, ప్రార్థనలూ, స్తుతి కొనసాగాయి.
    పైన పేర్కొన్నది ఖురాన్ లో ఇస్లాంలో ఎంతో సత్యం. దేవదూతలూ, అగ్ని వాయుదేవతలనూ అధికారికంగా ఖురాన్ గుర్తించింది. (డిక్షనరీ ఆఫ్ ఇస్లాం) ఎడ్వర్డ్ లేన్ ఇస్లాంలో ఆధ్యాత్మిక  జీవులను  5 తీర్లుగా విభజించారు. ఇందులో మారిడ్స్  (Marids) అన్నిటికంటే శక్తివంతమైనది. కోతులూ, పందులూ మనుషులుగా మారినట్లే జాన్ అనేది జిన్ గా మారింది. మంచీ చెడుల మాట అటుంచి జిన్ జాన్ అనే వాటిని కలిపి వాడేస్తున్నారు. సైతాన్ పాపానికి ప్రతిబింబం. ఇఫ్రిత్, మారిడ్స్ శక్తివంతమైన పాపాత్ములు. స్వర్గం నుండి వచ్చే తారల తాకిడికి దోషులైన జిన్ లు నాశనమవుతున్నాయి.  ఈ జిన్ లు మానవులతో కలిసి తమ సంతతిని పెంచుకుంటున్నాయి. ఇబ్లిన్ ముఠా అధిపతి 5గురి సంతానంలో జిన్ కూడా ఉన్నది. తిర్ అనే మరో శక్తి ఉపద్రవాలనూ, నష్టాలనూ, హానికలిగిస్తుండేది. అల్ అవార్ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుంది. సూత్ అబద్ధాలను సూచిస్తుంది. దాసివ్ భార్యాభర్తల మధ్య ద్వేషాన్ని పెంచుతుంది. ఈ జిన్ 3 విధాలు. రెక్కలు ఉండి ఎగిరేదొకటి, పాములు, కుక్కలతో కూడిందొకటి, మనుషులవలె సంచరించేది మరొకటి. గ్రీక్, రోమన్, నోర్స్ బహుదేవతారాధన గాథలవలె ఇక్కడ మూఢనమ్మకాలకు కొదువలేదు.
దేవుడికీ మనుషులకీ మధ్య మధ్యవర్తులు
      ఇస్లాంలో రుషుల ఆరాధన దేవుడికీ, మానవుడికీ మధ్య దూతగా ఉండేవారి ప్రయోజనాన్ని చూపుతున్నట్లు హ్యూం వివరించాడు. దీనినే గోల్డ్ జిహర్ ఇలా రాశాడు. (ముస్లిం స్టడీస్ 2 సంపుటాలు, లండన్ 1967-71, రెండవ సంపుటి, పుట 259)
      ఇస్లాంలో భక్తులు దేవుడికీ మనుషులకూ మధ్య దేవదూతలనూ, మధ్యవర్తులనూ సృష్టించుకున్నారు. పాత సంప్రదాయాలలో వీరిని  ఇస్లాం తొలగించింది. రుషుల ఆరాధన అక్కడ అన్వయించవచ్చుననీ కార్లహాస్ చెప్పాడు. ఏకేశ్వరాధనలో మానవుడికీ, దేవుడికీ మధ్య ఉన్న అంతరాన్ని బహు దేవతారాధన తృప్తిని సమకూర్చిపెడుతున్నది.
    ముస్లిం సిద్ధాంతంలో దయ్యమనే భావన రెండు శక్తివంతమైన వాటికి దారితీస్తున్నది. దయ్యాన్ని అజాజిల్ అన్నారు. అది అగ్నిలో నుండి వచ్చింది. భూమిలో నుండి ఆదామును దేవుడు సృష్టించినప్పుడు అతడి ఉత్తరువుల ప్రకారం ఆదాం ముందు మోకరిల్లటానికి దయ్యం నిరాకరించింది. అప్పుడు ఈడెన్ తోట నుండి దయ్యాన్ని బహిష్కరించారు. తరువాత ఈ శక్తిని దేవుడు నాశనం చేయవలసి ఉన్నది. ప్రపంచంలో యుద్ధాలూ, కరువులూ, రోగాలూ మూకుమ్మడిగా జాతి హత్యలూ చూస్తే దయ్యమే శక్తివంతమైనదిగా కనిపిస్తున్నది. దీనిని దేవుడు ఇప్పటికే ఎందుకు నాశనం చేయలేదని చిక్కు సమస్య. ఆదాం ముందు మోకరిల్లి పూజించటం సైతానుపట్ల దేవుడు పొందికగా వ్యవహరించినట్లు కాదు. దేవుని తప్ప మరెవరినీ పూజించరాదని దేవుడే నిషేధించాడు కూడా.
      ఖురాన్ లో దేవుని ఉనికికి తాత్విక వాదన ఏదీ లేదు. సంజ్ఞలు అనే భావన బహుశ ఇందుకు సమీపంలో ఉన్నదనవచ్చు. సహజ సంఘటనలు దేవుని శక్తికి సంజ్ఞలు అంటున్నారు.
      భూమి ఆకాశాలను సృష్టించటం, మానవుడి సృష్టి, పశువుల వలన మానవుడికి ప్రయోజనాలూ, రాత్రింబవళ్ళూ, సూర్యుడు ప్రకాశించడం, చంద్రుడూ, తారలూ, గాలిమార్పు, వర్షం, ఎండిన భూమిలో చిగురించి పంటలు రావడం, సముద్రంలో నౌకల ప్రయాణం, పర్వతాల స్థిరత్వం, ఛాయలు, ఉరుములూ, మెరుపులూ, ఇనుము, అగ్ని, వినటం, చూడటం, అవగాహన, వివేచనా ఇవన్నీ దైవ ఉనికికి నిదర్శనాలుగా చూపారు. (ఇన్ ట్రడక్షన్ టు ఖురాన్, పుటః 122, బెల్, వాట్, ఎడింబరో, 1977)
    తాత్వికంగా దీనినే ప్రయోజన వాదం అంటారు.  దేవుని ఉనికికి ఆధారాలు చూపటానికి అందులోనూ తాత్వికులు లోపం గమనించారు. మహమ్మద్ కొరాన్ లో చూపిన వాటన్నిటికీ, దేవుడు లేదా విశ్వకర్మ లేకుండానే వివరించవచ్చు. ఏకేశ్వరాధనలోకి వస్తే ఒకే విశ్వకర్మ ఎందుకుండాలి ? హ్యూం ఇలా రాశాడు. (ఎసెన్షియల్ వర్క్స్ ఆఫ్ డేవిడ్ హ్యూం, న్యూయార్క్, 1965, పుట 192-193, 5వ భాగం)
    దైవ ఏకత్వాన్ని గురించి రుజువు పరచటానికి ఎలాంటి వాదనలు చేస్తారు. ఇల్లు, ఓడ, పట్టణం, సంక్షేమం రాజ్యం నిర్మించడానికి ఎందరో చేతులు కలుపుతారు. అలాగే ప్రపంచ నిర్మాణానికి కూడా అనేకమంది దేవతలు ఎందుకు కలవరు ? ఇది కూడా మానవ వ్యవహారాలను పోలినదే. ఒకే దైవాన్ని సర్వశక్తివంతం అనిచెప్పి దాని ఉనికి రుజువు చేయలేక బలహీనపడేదానికంటే అధికార వికేంద్రీకరణ చేసి విస్తృత అధికారాలు ఒక్కరిలో లేకుండా చూపవచ్చు. అనేకమందిని ఏకం చేసి ఒక పథకాన్ని అమలు చేయవలసి వచ్చినప్పుడు సంపూర్ణంగా ఏదైనా చేయాలంటే ఇంకెందరు దేవతలు కావాలి అనేది అలోచించుకోవాలి.
    అవసరం లేకుండా కారణాలను పెంచుకుంటూ పోవటం వాస్తవ తత్వానికి విరుద్ధం. కాని ప్రస్తుత విషయానికి ఈ సూత్రం అన్వయించేటట్లు లేదు. ఒకే దేవుడికి అన్ని లక్షణాలు ఉంటే, మిగిలిన దేవతల అవసరం లేదు. ఒకే దేవుడిలో అన్ని లక్షణాలూ ఉన్నాయా ? లేక వివిధ దేవుళ్ళలో అని విస్తరించి ఉన్నాయా అనేది నిర్ధారించలేని వివాదాస్పద విషయం. విశ్వాన్ని సృష్టించటానికి విపరీతమైన శక్తి, అధికారం ఒక్కనిలోనే మూర్తీభవించి ఉండాలని అనటం అవగాహనకు మించిపోయిన విషయం.
    అరేబియా నుండి బహుదేవతారాధనను తొలగించటం మహమ్మదు చేసిన గొప్ప పనుల్లో ఒకటి అని అంటారు. ఏకేశ్వర వాదుల తలబిరుసుతనమే ఇది. బహుదేవతారాధనకు భిన్నంగా ఏకేశ్వరవాదనను అనుకూలంగా అంగీకరించాల్సిన వాదనలేమీ లేవు. బహుదేవతారాధనలో అంతర్గతంగా అసందర్భాలేమీలేవు. (ఎసెన్షియల్ వర్క్స్ ఆఫ్ డేవిడ్ హ్యూం, పుటః 203, 7వ భాగం, న్యూయార్క్, 1965) విశ్వపథకాన్ని గురించి ఖురాన్ వాదించిన ధోరణిని హ్యూం విమర్శిస్తూ విశ్వారంభానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ అసంభవాలే అన్నాడు. ఈ విశ్వక్రమాన్ని ఒక తీరులో నమ్మటం కుదిరేపని కాదన్నాడు. అందుకు తగిన పరికరాలేవీ లేవన్నాడు. మన అనుభవం కూడా పరిమితం, అసంపూర్ణం అన్నాడు. ఏదో ఒక ప్రతిపాదన నిర్ధారించాలంటే అందుకు తగిన నియమం ఏదీ అని కూడా ప్రశ్నించాడు.
      ఏకేశ్వరాధన అసహనంతో కూడినదని గుర్తించారు. ఖురాన్ లోనే ద్వేష ప్రచారం ఉన్నది. విగ్రహారాధనలకూ, బహుదేవతారాధనలకూ పేర్లు పెట్టారు. అరేబియాలో ప్రవక్తకాలం నాడు విగ్రహారాధకులు ఎలాంటి సహనం చూపలేదనీ,  ఇస్లాంను ఆమోదించటమో లేక చావో తేల్చుకోమన్నారనీ ముస్లిం రచయితలు ఏకగ్రీవంగా పేర్కొన్నారు. (డిక్షనరీ ఆఫ్ ఇస్లాం) ఏకేశ్వరాధనలో ఇమిడి ఉన్న పిడివాదం ఏమంటే సత్యానికీ, దైవానికీ అదొక్కటే మార్గమని చెప్పటం, మిగిలినవన్నీ వక్రమార్గాలనీ, నరకానికి దారితీస్తాయనీ అన్నారు. లూయీ ఇలారాశాడు. సంప్రదాయ క్రైస్తవం, ఇస్లాం రెండూ యూదువాదం నుండీ విభేదించినా, విశ్వసత్యాలను తమకే తెలుసుననే విషయంలో అంగీకారానికి వచ్చారు. మనిషికి తుది దైవసందేశం తమ ద్వారానే వచ్చిందని ఉభయులూ అన్నారు. తాము లేకుంటే వేరే మోక్షమార్గం లేదన్నారు. (రేస్ అండ్ స్లేవరీ ఇన్ ది మిడిల్ ఈస్ట్, న్యూయార్క్, 1990, పుట. 175)
    క్రైస్తవులూ, మహమ్మదీయులూ, అలాగే మిగిలిన మతాలూ అనుసరించిన క్రూరత్వం ప్రపంచానికి తెచ్చిపెట్టిన ధోరణులను ఆలోచించమని షోపెన్ హార్ అన్నాడు. (ఆర్ధర్ షోపెన్ హార్, పరేర్గా అండ్ పేరాలిపోమెనా, 2 సంపుటాలు, అనువాదం ఇ.ఎఫ్.జె. పెయిన్ పుట. 356-59) అతడింకా ఇలా అన్నాడు. మూర్ఖవాదం, అనంత హింసాచర్యలూ, మత యుద్ధాలూ, హింసాపూరిత ఉన్మాదం ఒకసారి ఆలోచించండి. క్షమించటానికి వీలులేని మత యుద్దాల దారుణ కాండను దైవేచ్ఛ పేరిట 200 సంవత్సరాలపాటు సాగించిన విషయం గుర్తు తెచ్చుకోండి. ఇస్లామునూ, క్రైస్తవాన్ని షోపెన్ హార్ ఖండించాడు. స్పెయిన్ నుండి మూర్స్, యూదులను నిర్దాక్షిణ్యంగా బహిష్కరించి రూపుమాపారు. విభేదించిన వారిని విచారణల పేరుతో రక్తంలో ముంచారు. మహమ్మదీయులు మూడు ఖండాలలో దారుణ రక్తపాత దాడులు జరిపారు. తొలుత మహమ్మదీయులూ, తరువాత క్రైస్తవులూ ఇండియాలో జరిపిన దాడులను విస్మరించరాదు. ప్రాచీన దేవాలయాలను నాశనం చేసి, విగ్రహాలను పగులగొట్టి ఏకేశ్వరాధన పేరుతో ఎలా ఆగ్రహాన్ని వెల్లడించారో స్మృతులలో మెదలేటట్లు చూపారు. మహమ్మదు గజనీ నుండి ఔరంగజేబు వరకూ ఈ నరహత్యలో పాల్గొన్నారు. హిందువులూ, బౌద్ధులూ శాంతియుత చరిత్రతో కొనసాగుతుండగా ఏకేశ్వర వాదులు వారి క్రూరత్వాన్ని చూపారు. అసహనం ఏకేశ్వరవాదంలోనే ఉన్నది. అక్కడ దేవుడు మరొకరిని సహించని ఈర్ష్యాపరుడు. బహు దేవతలు బ్రతుకూ, బ్రతకనివ్వు అనే సూత్రాన్ని పాటించారు. ఒకే మతంలో భిన్న దేవతలు సహచరులుగా ఉన్నారు. ఇది ఇతర మతాలలోని దేవతలకు విస్తరించి సమానహక్కు లిచ్చేవరకూ పోయారు. రోమన్లు ఇష్టపూర్వకంగా ఫ్రైజియనులను, ఈజిప్టియనులను, తదితర దేవుళ్ళనూ ఆమోదించారు. ఏకేశ్వర వాదన మతాలు యుద్ధాలూ, హింసలూ, భావచ్ఛేదాన్ని సహించకపోవటం, వేరే దేవుళ్ళ విగ్రహాలను విచ్ఛిన్నం చేయటం, ఇండియాలో దేవాలయాలను, ఈజిప్టులో, కొలీసీలను నాశనం చేయటం కేవలం ఈర్ష్యతోనే.
      హ్యూం వంద సంవత్సరాలకు ముందే షోపెన్ హార్ పేర్కొన్న విషయాలను ప్రస్తావించి బహుదేవతారాధనలో సదవకాశాలేమిటో వివరించాడు. (డేవిడ్ హ్యూం, ఎన్ క్వైరీస్ కన్ సర్నింగ్ ది హ్యూమన్ అండర్ స్టాండింగ్ అండ్ కన్ సర్నింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మోరల్స్, ఆక్స్ ఫర్డ్, 1966,          పుటః 59.
     
     
విగ్రహారాధనలో వైవిధ్యాలు, స్పర్థలు
      విగ్రహారాధనలో కొన్ని సదవకాశాలున్నాయి. దేవుళ్ళకు వివిధ పరిమిత అధికారాలు మాత్రమే ఉండేవి. దైవత్వంలో భాగం పంచుకోవటానికి  క్రతువులూ, ఉత్సవాలూ, సంప్రదాయాలూ అందుకోవటానికి ఇతర దేవుళ్ళకు అవకాశం ఉండేది. ఏకేశ్వరాధన వాదులు ఇతర దేవతలను పూజించటం అపవిత్రంగా భావించారు. తమ వ్యతిరేకులను అపవిత్రంగా చూచారు. తాము పూజించేదీ, విశ్వసించేది మాత్రమే దైవం అమోదిస్తాడన్నారు. అందుకు భిన్నమైన వాటిని ఏ రూపంలోనూ దేవుడు ఆమోదించడన్నారు. దీని వలన స్పర్థలూ, పరస్పర వైరుధ్యాలూ తీవ్రరూపం దాల్చాయి.
    విగ్రహారాధకుల సహనం నాటినుండి నేటివరకూ స్చష్టమే. అన్ని మతాల అసహనం దైవ ఏకత్వంలోనే జనించింది. యూదుల సంకుచిత ఆధ్యాత్మిక భావన అందరికీ తెలిసిందే. అంతకంటే దారుణసూత్రాలతో ఇతరులనందరినీ ఖండిస్తూ మహమ్మదీయవాదం ఉన్నది.
    మహమ్మదును గురించి ప్రొ. వాట్ రాసిన రెండు సంపుటాల జీవిత చరిత్ర చాలా ప్రభావితమైన, ముఖ్యమైన రచనగా భావిస్తారు. క్రోన్, బాస్క్వే వంటి పండితులు సందేహాన్ని వ్యక్తపరిచినా ఇప్పటికి చాలామంది వాట్ వాదననే ఆమోదిస్తారు. మధ్య అరేబియాలో ఉన్న బహుదేవతారాధనకంటే మహమ్మదు బోధించిన ఏకేశ్వరాధన ఉన్నతమయిందన్నారు. ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను మహమ్మదు సందేశం తీర్చిందన్నాడు. మక్కా ఆనాడు సాంఘిక రుగ్మతలతో ఆధ్యాత్మిక సంక్షోభంతో ఉండగా స్థానిక దేవతలూ, ఆచారాలూ పరిష్కారాన్ని చూపలేకపోయాయన్నాడు. నైతికంగా దిగజారిన విగ్రహారాధనలో ఉన్న మక్కా వారిని మహమ్మదు వచ్చి, ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయికి తీసుకెళ్ళారన్నాడు. మక్కాలో సాంఘిక రుగ్మతలున్నాయనే వాదనకు ఆధారాలు లేవని క్రోన్, బాస్క్వేలు వాదించారు. క్రోన్ ఇలా రాశాడు. (మెక్కన్ ట్రేడ్ అండ్ ది రైజ్ ఆఫ్ ఇస్లాం, ఆక్స్ ఫర్డ్, 1987, పుటః 234-45)
      సంప్రదాయాలను చూస్తే మక్కావాసులు సామాజికంగా, మతపరంగా, రాజకీయ, నైతిక రంగాలలో జయప్రదంగా ఉన్నారు. ముస్లిం కళ్ళతో ఇస్లాం చరిత్రను ఆయన చూశారు. మక్కావాసులు నైతికంగా దిగజారారని ముస్లిం ఆధారాలు రాశాయి. తీరాచూస్తే వారి సంప్రదాయాలు విచ్ఛిన్నమైనందుకు ఇలా జరగలేదనీ, చాలా చక్కగా సమాజం సాగిపోయిందనీ తెలుస్తున్నది. సంప్రదాయ జీవితంనుండి మక్కావాసులు ఇస్లాంలోకి మారారు. అందుకే వారికి శిక్ష వేశాయి. ఈ ఆధారగ్రంథాలు జీవితానికి కట్టుబడి ఉండే వారు మానవ ద్వేషులుగా, అవినీతిపరులుగా కనిపిస్తారు. మహమ్మద్ కు వ్యతిరేకి అయిన అబూసూఫ్ యాన్ సంపన్నుల పక్షానికి నాయకుడు తప్పుడు దేవుళ్ళమీద అతడు ఒట్టుపెట్టలేదు. అలాచేస్తే ఏ నమ్మకం లేనివాడికింద జమ.
ఆధ్యాత్మిక సంక్షోభం ఏదీ ఆరవ శతాబ్దపు అరేబియాలో లేదు
    అరేబియాలో మూకుమ్మడిగా ఇస్లాంలోకి ఎలా మారారు ? సమాజం ముఠాలతో ఉండేది. ఎవరి ముఠాకు వారి దేవుళ్ళు ఉన్నారు. ఆ దైవాన్ని పూజిస్తే సహాయం అందుతుందనీ, వర్షాలు కురుస్తాయనీ, పంటలు పండుతాయనీ, రోగాలు ఉండవనీ, రక్షణ ఉంటుందనీ, నమ్మారు. ఆదిమ ముఠాల దేవుళ్ళకు పరమసత్యాలు, జీవితానికి అర్థం తెలుసు అని చెప్పలేదు. నిత్య జీవితంలో వారి జోక్యం లేదు. ఒక దేవుడిని వదిలేసి మరొక దైవాన్ని స్వీకరించడంలో జీవిత దృక్పథం మారనక్కరలేదు. ఆటవిక ముఠా లక్షణాలను తీవ్రమైనవిగా, జాతిపట్ల గర్వించదగినవిగా ఉన్నట్లు ముస్లిం దైవం భావించింది. తమ దేవుళ్ళకంటే ముస్లిం దేవుడు అధిక ఫలాన్ని చూపాడు. అరబ్ రాజ్యేర్పాటు, దండయాత్రలు చూపాడు. ఉమ్మా  (ఒక జాతి లేదా ప్రజ) ఏర్పాటు కనబరిచాడు. నమ్మకంలేని వారిపై జిహాద్  (పవిత్రయుద్ధం) ప్రకటించారు. మహమ్మద్ సఫలతకు ఇవే తోడ్పడ్డాయి. అరేబియాను, ఇతర భూభాగాలను జయించటం వలననే, అరేబియా సమైక్యత సాధ్యమైంది. మహమ్మద్ మదీనాలో విజయం సాధించగా, అనుచరులు పెరిగారు. అల్లా గొప్ప దేవుడయ్యాడు. జయం పొందిన దేవుడు నిజమైన దేవుడయ్యాడు. జయం పొందని దేవుళ్ళు తప్పుడువారయ్యారు. అరేబియా సారవంతం కాకుండా ఎండిపోతుండగా దండయాత్రలు అవసరమయ్యాయని బెకర్ రాశాడు. క్రోనే ఇలా అంటాడు.
      దండయాత్రల రుచి చూసిన అరేబియాలో భౌతికంగా దిగజారుడు పరిస్థితి ఉన్నదనక్కరలేదు. ముందు స్వదేశ ముఠాలతో ప్రారంభించి, సారవంతమైన ప్రాంతాలకు ప్రాకారు. తమ అవసరాలు తీర్చగల వనరులు లభించాయి. దండయాత్రల విధానాన్ని మహమ్మద్ యొక్క దేవుడు ఆమోదించాడు. నమ్మకం లేని వారి మీద ఎక్కడైనా పోరాటం సాగించమన్నాడు. మహమ్మద్ దండయాత్ర చేయగా, అనుచరులు ఇష్టపడ్డారు. దేవుడు ఇలా చేయమన్నాడు. ఇంకేం కావాలి  ?
            పదార్థాల అవసరాల కోసం పవిత్ర యుద్దాన్ని అడ్డం పెట్టుకున్నారనే భ్రమ వద్దు. భౌతిక అవసరాలకోసమే యుద్ధం చేశారు. నా సేవకులు భూమిని సంక్రమింపజేసుకుంటారని దేవుడు చెప్పాడు. ఇరాక్ ను గురించి ఖదీసీయా యుద్ధ సందర్భంగా అరబ్బు సైనికులకు ఇలా చెప్పారు. పట్టుదల ఉంటే వారి ఆస్తులు, ఆడవాళ్ళూ, పిల్లలు, దేశం యావత్తూ మీదే. అంతకంటే దేవుడు స్చష్టంగా ఇంకేం చెప్పాలి ? ఇతరుల భూమి, స్త్రీలు, పిల్లల్ని ఆక్రమించ్ హక్కు మాత్రమే గాక, విధి కూడా ఉన్నదన్నాడు. పవిత్రయుద్ధంలో విధేయతే ముఖ్యం. ఆటవిక తీవ్రస్థాయిని మహమ్మద్ దైవం అత్యున్నత మతధర్మానికి తీసుకెళ్ళింది.
      ఆనాడు ఆధ్యాత్మిక సందేహాలు, సంక్షోభాలు లేవు. ఆటవిక ముఠాల సందేహాలు తీర్చటానికి గాక, నాడు ప్రజలు తీవ్రస్థాయిలో దండయాత్రలు చేసే స్వభావంతో ఉన్నారు. దానిని మహమ్మద్ అవసరాల నిమిత్తం ఉపయోగపరచాడు. దోపిడీలు చేయించాడు. స్త్రీలను భూముల్ని స్వాధీన పరుచుకున్నారు. అల్లా విఫలం కాలేదు. గనుక, మిగిలిన దేవతల్ని వదిలేశారు. అల్లా ఫలితాలను ఇచ్చాడు. అందులో ఆదిభౌతిక దృష్టిలేదు.  ఓకమ్స్ తర్కాన్ని హఠాత్తుగా అరబ్బులు అన్వయించలేదు. 19వ శతాబ్దంలో సైతం అరేబియాలో కొంతభాగం పేగన్ తత్వంతో ఉండేదని క్రోన్ రాశాడు.
      వాట్ సిద్ధాంతం లోపాల్ని 1909లోనే డా. మార్గోలియత్ గ్రహించాడు. కొత్తగా మారిన వారిని ఇస్లాం, నైతికంగా స్థాయి పెంచిందనడానికి ఆధారాలు లేవన్నాడు. పేగన్లకంటే ముస్లింలు నైతికంగా అధికులు అనడానికి దాఖలాలు లేవన్నాడు. పైగా, సాక్ష్యాధారాలు అందుకు భిన్నంగా ఉన్నాయి.
      దోపిడీ ముఠాలకు మహమ్మద్ అధిపతిగా ఉండగా దిగజారుడు రీతులు పొడసూపాయి. ఒట్టుపెట్టుకున్నవారు దానికి కట్టుబడనక్కరలేదని తెలుసుకున్నారు. దేవుడిపేరిట సొంత సమాజంలో వారి రక్తాన్ని చిందించారు. ఇస్లాం పేరిట అబద్ధాలాడినా, ద్రోహం చేసినా దైవం ఆమోదముద్ర వేసింది. అసభ్యమైన భాషను ముస్లింలు వాడారు. నమ్మకం లేనివారి భార్యల్ని, ఆస్తుల్ని కాజేసినా, ప్రవక్త కాదనలేదు. (మహమ్మద్ అండ్ ది రైజ్ ఆఫ్ ఇస్లాం, మార్గోలియత్ పుటః 149 లండన్ 1905)
      అంతేకాదు. మానవ స్వేచ్ఛను ఏకేశ్వరాధనావాదం అణచివేసింది. అది నియంతృత్వానికి దారితీస్తుందని పండితులు వాదించారు. బహుదేవతారాధనలో బహుళత్వం, సృజన, మానవ స్వేచ్ఛ ఉన్నది. పురుషాధిపత్యంగా ఏకేశ్వరాధన ఉందని స్త్రీ ఉద్యమకారులు అన్నారు. స్త్రీల పట్ల సున్నితత్వం లేని, మార్పుకు వ్యతిరేకి అని ఏకేశ్వరవాదాన్ని చిత్రించారు.
ముస్లిం దైవభావన
    దైవం సర్వశక్తివంతమని ఖురాన్ లో చాటారు. మానవేచ్ఛ సంపూర్తిగా దైవేచ్ఛకు లోబడి ఉంటుంది.  ఆ మాటకొస్తే మానవేచ్ఛ అంటూ లేదు. నమ్మనివారు కూడా దైవేచ్ఛవలనే అలా ఉంటారు. మానవ స్వేచ్ఛకంటే విధి నిర్ణయమే ముస్లిం సిద్ధాంతంలో ప్రధానం. అదే కొరాన్ లో ఉంది. మక్ డొనాల్డ్ ఇలా అన్నాడు. స్వేచ్ఛాయుత ఇచ్ఛ, ముందే నిర్ణయమైన విధి అనేవి పరస్చర విరుద్ధాలు. వాటి ప్రస్తావన కొరాన్ లో చూస్తుంటే మహమ్మద్ అవకాశవాద బోధకుడనీ రాజకీయవాది అనీ, క్రమబద్ధమైన మతవాది కాదని స్చష్టపడుతుంది. ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం, ప్రధమ ప్రచురణ, కాదర్, ఆర్ట్)
      మహమ్మద్ సిద్ధాంతంలో మంచి చెడ్డలకు చెందిన కేవల సిద్ధాంతం తఖ్ దీర్ - ఆరవసూత్రం సనాతనుల ప్రకారం ఈ ప్రపంచంలో మంచి చెడ్డలన్నీ దైవేచ్ఛనుండే వచ్చాయి. అవి తిరుగులేని నిర్థారణలు. విధి ఫలకాలపై అవి భద్రపరచబడ్డాయి.
    ఖురాన్ లోని కొన్నింటిని ఉదహరిస్తే ఈ సిద్ధాంత వివరణ జరుగుతుంది.
            సూర. 54.49 అన్నీ స్థిర నిర్ణయాలతో సృష్టి అయ్యా.యి.
      3.139 జీవిత కాలాన్ని సృష్టికర్త నిర్థారించాడు. అతడి అనుమతి లేనిదే ఎవరూ చావరు.
      87.2 దేవుడు అన్నీ సృష్టించి, తులనాత్మకత ఏర్చరిచాడు. వాటి విధిని జరిపిస్తూ మార్గం చూపుతాడు.
      8.17 దేవుడే చంపాడు, కనుక ఫలమంతా దేవుడిదే. మీది కాదు.
      9.51 దేవుడు నిర్ణయించినదే తప్ప మనమీదకేదీ రాదు.
      13.30 సార్వభౌమత్వమంతా దైవాధీనమే.
      14.4 తన ఇచ్ఛ ప్రకారం దైవం దారితప్పిస్తుంది నడిపిస్తుంది.
      18.101 నమ్మకం లేనివారి (ఇన్ ఫిడిల్స్) కళ్ళు మూసుకుపోతాయి. వారికి వినే శక్తి పోతుంది.
      32.32 తలచుకుంటే అన్ని ఆత్మలకూ మార్గం చూపేవాళ్ళమే. నా మాట గుర్తించారు. నరకాన్ని జిన్, మనుషులతో నింపుతాను.
      45.26 మహమ్మద్ వారితో చెప్పండి. అల్లా నీకు జీవితం ప్రసాదించాడు. మరణించేటట్లు చేస్తాడు. పునరుత్థానం వరకూ సమీకరిస్తాడు.
      57.22 సృష్టికి ముందే పవిత్ర గ్రంథంలో జరగాల్సిన సంఘటనలన్నీ రాశారు.
      కొరాన్ లో మనిషి స్వేచ్ఛాయుత ఇచ్ఛకు ఒకరకంగా అనుమతించారు.
      41.16 థామూద్ కు మార్గం చూపుతామన్నా, వారు అంధత్వాన్ని కోరుకున్నారు.
      18.28 దేవుని నుండి సత్యం వస్తుంది. ఇచ్ఛగలవారు నమ్ముతారు. లేదా నమ్మకపోతారు.
      ముస్లిం క్రీడ్ అనే గ్రంథంలో వెన్సింగ్ రాస్తూ, ముందే నిర్ణయించిన ఇస్లాంలో ఆధిక్యత వహించిందన్నాడు. (వెన్సింక్, పుటః 51-52 కేంబ్రిడ్జి, 1932) స్వేచ్ఛాయుత ఇచ్ఛను చూపే సంప్రదాయం ఒక్కటీ లేదు. డమాస్కస్ కు చెందిన జాన్ ఇలా అంటాడు. క్రీ.త. 8వ శతాబ్దిలో అతడు ఇస్లాంకు సుపరిచితుడు. క్రైస్తవానికీ ఇస్లాంకు ప్రధాన తేడా విధినిర్ణయం. స్వేచ్ఛాయుత ఇచ్ఛకు గల తేడా అన్నాడు.
      మహమ్మద్ తుది రోజులలో విధి నిర్ణయం గురించి గట్టిగా మాట్లాడాడు. ఇందులో రాజీలేని కర్మవాదం కనిపిస్తుంది.
      ముందే విధి నిర్ణయం అనే సిద్దాంత పరిశీలనకు పూర్వం, ఖురాన్ లో నరకం గురించి చూద్దాం. ఖురాన్ నరకయాతనలు చాలా ఆనందంగా ఆలోచించి దేవుడు ప్రవేశపెట్టాడు. కనీసం 30సార్లు జొహానుం అనే పదం వస్తుంది. ముస్లింలకు పశ్చాత్తాప నరకం ఇది. ముస్లింలు అందరూ ఖురాన్ ప్రకారం నరక ద్వారాలగుండా వెడతారు. (సుర 19.72) మీలో ఒక్కరూ నరక ద్వారాలగుండా వెళ్ళకుండా ఉండజాలరు. అది దైవనిర్ణయం అల్ నార్ అనే పదానికి అర్థం ఏమిటంటే పదేపదే విజృంభించే అగ్నిజ్వాల అని. నరకాగ్ని గుండాలకు పర్యాయపదాలుగా ఈ క్రింది సురలలోని మాటలు చూడవచ్చు.
      లాజా (జ్వాల) సుర 97.5
      అల్ - హుతామా (అణచివేత) సుర 104.4
      సెయిర్ (ప్రజ్వలన) సుర 4.11
      సాఖర్ః సుర 54.47, పాపులు దైషులు, ఉత్సాహంగా ఉంటారు. కానీ నరకానికి లాగేసిన తరువాత సాఖర్ స్పర్శ చూస్తారు.
      అల్ జాహిం అగ్నిగుండం, హవియాహ్ సుర 2, 101లో ప్రస్తావించారు. మహమ్మద్ పరిమిత ఊహ గలవాడైతేస నరకయాతనలు వివరించడంలో పరవశుడై పేర్కొన్నాడు. సలసల కాగే నీరు, చర్మం వలిచివేయుట, మాంసం కాల్చుట, పేగులు హతమార్చుట. పుర్రె అణచివేయుట ఉన్నాయి. చరణాలకి చరణాలు, సురలకి సురలు ఈ అగ్ని గురించి జ్వాలల గురించీ చెప్పాయి. సుర 9.69లో దైవనమ్మకం లేనివారిని శాశ్వతంగా మాడ్చేస్తుంటారన్నారు.
      అలాంటి విధానంలోని విలువలు ఎలాంటివి ? A. S. మిల్ ఇలా అంటాడు. (త్రి ఎస్సేస్ ఆన్ రెలిజియస్, పేజీ. 113-14, లండన్, 1874) దేవుడు కావాలని మనుషుల్ని నరకంలో నింపుతాడనేది జుగుప్సాకరమైన ఆలోచన. దేవుడే వారిని సృష్టించి, వక్రమార్గాన నడిపిస్తే, అందుకు వారు బాధ్యులు కాదు. అత్యున్నత దైవం నరకాన్ని సృష్టించాడు. అతడిని పూజించాలి. మనుషుల్ని వారి విధికి బలిచేసేటట్లు సృష్టిస్తున్నాడు. క్రైస్తవుల క్రూరత్వం దీనిముందు ఎందుకూ కొరగాకుండా పోతున్నది. ముందే నిర్థారణ అయిన భావనకు, ముస్లిం దైవభావనకు మిల్ వ్యాఖ్యానాలు ముటాలిస్ లకే వర్తిస్తాయి.
      ఈ విధానాన్ని నైతికం అనలేం. నైతిక బాధ్యత అనేది నీతిలో ప్రధానం. తన చర్యలకు మనిషి బాధ్యుడు కావాలి. హేతుబద్ధమైన ఆలోచన చేయగలగాలి. కావాలని చేసే విధానం ఉండాలి. ముందే నిర్ధారించిన కొరాన్ విధానంలో యాంత్రికంగా మనిషి ఉంటాడు. అలాంటిచోట మనిషి నరకంలో తగలబడుతుంటే దేవుడు ఆనందిస్తుటాడు. మానవుడు తన చర్యలకు తాను బాధ్యుడు కాదు. సురలలో చూపినట్లుగా మనిషిని శిక్షించడం, అతనిని బాధ్యుడిగా చూపడం అసమంజసం.
      కామం గురించి ఇస్లాం అభిప్రాయాలపై బాస్క్వే ఇలా అంటాడు. (L’Ethique Sexualite de L’Islam, Paris, 1966) ఇస్లాంలో నీతిలేదు. అల్లాకు లొంగి ఉండమని ముస్లింకు చెబుతారు. మంచి, చెడు అనేది ఖురాన్ నిర్వచనం ప్రకారం, తరువాత ఇస్లాం చట్టం అనుమతించిన మేరకు నిషేధించిన వరకూ పాటించాలి. సోక్రటీస్, యూథిపైర్ లో ప్రశ్నించినట్లు - పవిత్రమైనందుకు దేవుళ్ళు గౌరవిస్తున్నారా, దేవుళ్ళు ఇష్టపడినందుకు అదీ పవిత్రమైందా ?  దీనికి సనాతన ముస్లిం నిర్దుష్టంగా సమాధానమిస్తాడు. దేవుడేది కావాలంటే అది మంచిది. ఏది వద్దంటే అది చెడ్డది. అంతేగాని హేతుబద్ధంగా మంచీ చెడూ లేదు. ఇది సంతృప్తికర సమాధానం కాదు- ప్లేటో ప్రకారం చూస్తే, మాకే ఇలా సూచిస్తాడు. (ది మిరకిల్ ఆఫ్ థీయిజం, ఆక్స్ ఫర్డ్, 1982, Mackie, పుటః 256)  దైవేచ్ఛను బట్టి నైతిక విషయాలు ఉంటే, దేవుడు మంచివాడని, తన సృష్టినుండీ మంచిని అశిస్తాడని మితవాదులు అనడం అర్థరహితం మరో గ్రంథంలో మాకీ ఇలా రాశాడు.
      (జె. ఎల్. మాకి, ఎథిక్స్, లండన్ 1977, పేజీ 230)
      ముస్లింలు దేవుడిని మంచివాడనడంతో దేవుడు తననుతాను ఇష్టపడతాడనీ తన ధోరణి తనుకు నచ్చుతుందనీ అనడమే. నిరంకుశుడికి లోబడి ఉండడమే నైతిక నియమంగా ఉంది. ఇది గ్రహించి, మతవాదులు కొందరు, పవిత్రం గనుక దేవుడు ఇష్టపడతాడనే సూత్రాన్ని కోరుకున్నారు. అంటే నైతిక ప్రవర్తన దైవం పై ఆధారపడరాదనే అర్థం ఉంది. నీతి సర్వస్వతంత్రం. మత నమ్మకాల ప్రస్తావన లేకుండా అధ్యయనం చేసి చర్చించవచ్చు. దీనిలో నైతిక స్థాయికి మత ప్రాతిపదికలు లేవు.
    మత విధానానికి భిన్నంగా నైతిక విలువలు స్వతంత్రంగా ఉండడం మంచిదనవచ్చు. ఇదే విషయాన్ని రస్సెల్ ఇలా పేర్కొన్నాడు. (వై ఐయాం నాట్ ఎ క్రిస్టియన్ - రస్సల్, లండన్, 1979, పేజి, 19) మంచి చెడ్డల మధ్య తేడా ఉందని కచ్చితంగా తెలిస్తే, పరిస్థితి ఇలా ఉంటుంది. ఆ తేడా దైవనిర్ణయమా కాదా ?దైవ నిర్ణయమైతే, మంచి చెడ్డలతేడా దేవుడికి లేదన్నమాట. అప్పుడు దేవుడు మంచివాడనడం అర్థరహితం, మతవాదులవలె దేవుడు మంచివాడంటే, మంచిచెడ్డలలో అర్థం ఉందనీ, అవి స్వతంత్రంగా దైవానికీ భిన్నంగా వాటి మంచి చెడ్డలు ఉన్నాయి. అవి దైవం వల్ల రాకపోగా, దైవానికి ముందే ఉన్నాయి కూడా  స్వతంత్ర నైతిక బాధ్యత నుండీ తప్పించుకోలేం.
      నరక భావన నైతికంగా అభినందనీయం కాదు. దేవుడు దయామయుడనీ, రెండు సురలు తప్ప, అన్నీ చెప్పాయి. (సుర 9, ఫాతెహా) తనను నమ్మనందుకు దయామయుడైన దేవుడు శాశ్వతంగా ఎవరినైనా నరకంలో ఉంచుతాడా ? రస్సెల్ అంటాడు తన స్వభావంలో ఎవరికైనా దయవుంటే, అలాంటి భయాలు, ఘోరాలు ప్రపంచంలో ప్రవేశపెట్టడు  ఆంటోని ఫ్లూ ఇలా రాశాడు.
      (The terror of Islam in P.Kurtz and T. Madiganted, detending the Enlightenment Buffalo NY 1987, పేజి, 277) మానవుల నేరాలు, దైవ శిక్షణలలో చాలా విచక్షణ ఉంది. కొరాన్ నరక సిద్ధాంతం క్రూరత్వానికీ, హింసకూ, దైవానుమతితో పరపీడన పరాయణానికీ నిదర్శనం. ఇస్లాం భయంపై ఆధారపడిందనీ, నీతిని చెడగొడుతుందనీ స్పష్టపడుతున్నది. (నేను తప్ప దేవుడు వేరే లేడు. నాకు భయపడు సుర 16.2) ఖురాన్ లో ఆద్యంతాలూ దేవునిపట్ల భయం ఉంది. మనిషి నిరంతరం భయపడుతూ, దైవ సంభ్రమంలో అప్రమత్తతతో బతకాలి.
            (గిబ్, హెచ్.ఎ.ఆర్. ఇస్లాం ఆక్స్ ఫర్డ్, 1853, పేజి. 38)
      తోటివారిపట్ల మన ప్రవర్తన, సానుభూతి, ఉదారత్వం స్థానే, దైవశిక్షలు తప్పించుకోడానికి, బహుమతులు పొందడానికి జీవితం సాగించాలన్నమాట.
మాకీ వాదన
      (ది మిరకిల్ ఆఫ్ థీయిజం, ఆక్స్ ఫర్డ్ 1982 పేజి. 256)
      దైవాజ్ఞలను నీతివిధానాలుగా మానవులు ఆమోదించాలి. వీటికి మానవ సంక్షేమం, ప్రయోజనాలతో నిమిత్తం లేదు. అందులో నిరంకుశ, నిర్హేతుక నీతి ఉండొచ్చు. దైవాజ్ఞల నుండి కష్టమైన సమస్యలకు పరిష్కార మార్గాలు నైతికంగా చూడవచ్చు. కాని అలాంటి దైవాజ్ఞలు ఆధారపడదగ్గవి లేవు. బైబిల్ కొరాన్ వంటి దైవదత్తాలనేవి కూడా. సంకుచిత ఆటవిక కాలదోష నిర్ణయాలమయంగా, ఖండనీయంగా ఉన్నాయి. హాన్స్ కుంగ్ ఇలా అన్నాడు. మన నీతికి మనమే బాధ్యులం. మత నమ్మకానికి నీతిని అంటగట్టడం, దాని విలువను తొలగించడమే.
దేవుని బలహీనతలు
      దేవుడు సర్వజ్ఞుడు. సర్వశక్తిమంతుడు. దయామయుడని అంటారు. అయినా, అతడు నిరంకుశుడుగా, తన వారిని అదుపులో పెట్టుకోలేని వాడుగా ఉంటాడు. అతడు కోపిష్టి, గర్విష్టి, అసూయాపరుడు. సంపూర్ణ జీవికి ఉండాల్సిన లక్షణాలు కావు. అతడు స్వయం సంవూర్ణుడైతే, మనుషులెందుకు అవసరమయ్యారు ?  సర్వశక్తిమంతుడైతే, మనుషుల సహాయం ఎందుకు    అడిగాడు ?  ఎక్కడో మూలనున్న ఒక అరేబియా వర్తకుడిని తన చివరి సందేశకుడుగా ఎందుకు ఎంపిక చేశాడు ? తాను సృష్టించిన వారి నుండే, పొగడ్తలు, వూజలు ఎలా కోరుకుంటున్నాడు ?  యాంత్రికంగా ఉండే మానవులను సృష్టించిన దేవుడు, తనకు రోజూ 5 సార్లు నేలగరిచి ప్రార్థనలు చేసే నిర్ణయం ఎందుకు చేశాడు ? పొగడ్తలు కావాలనుకోవడం నైతిక దైవస్థాయికి తగ్గట్టు లేదు.  కొరాన్ దైవాన్ని గురించి పాల్ గ్రేవ్ ఇలా రాశాడు.
      (డిక్షనరీ ఆఫ్ ఇస్లాం పేజీ 147)
      అన్ని జీవులకూ భిన్నంగా ఉన్నతంగా ఉండే దేవుడు ఒకడే, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు. అతడికి నియమాలు, ప్రమాణాలు, పరిమితులు లేవు. అతడు కేవలం ఇచ్ఛాపరుడు. అతడు తన జీవులకు ఏదీ తెలుపడు. వారి నుండి ఏదీ ఆశించడు. వారిదంతా అతడికి చెందిందే. (సుర 8.17)
      అలాంటి సర్వశక్తివంతుడు రాగద్వేషాలకతీతంగా ఉంటాడని అనుకుంటాం. కాని వాస్తవం అలా లేదు. అతడు బహూకరించేకంటే బాధపెట్టటమే ఎక్కువ. నిర్మాణం కంటే నిర్మూలనే ఎక్కువ. తాను  సృష్టించిన జీవులు బానిసలనీ, జుగుప్సాకరమైన పరికరాలనీ, తమ ఆధిక్యత గుర్తించాలనీ దేవుడి లక్షణాలుగా చూపారు. (సుర 59, 3.47, 8.30)
      దేవుడు అందుబాటులో లేనంత ఉన్నతంగా ప్రేమకూ, ఆనందానికీ అతీతంగా తోటివారూ, సలహాదారులూ, సంతానం లేకుండా నిరాకారంగా, నిర్వికారంగా తనకు తానే కారణంగా ఉంటాడు.
టాల్ గ్రేవ్ అభిప్రాయం
      భయానకంగా, దారుణంగా చిత్రించిన దైవరూపం ఖురాన్ లో ఉన్నది. అరబిక్ గ్రంథంలో ఇలా ఉండటం ఎవరైనా గమనించవచ్చు. దైవానికి సంబంధించిన పై మాటలన్నీ ఆ గ్రంథం నుండి స్వీకరించినవే.
    సమకాలీనులలో సంప్రదాయాలనుబట్టి మహమ్మద్ భావాలను ప్రత్యక్షసాక్షులు అలా చెప్పారు. అందుకు ఉదాహరణగా నెజ్ద్ లోని వహాబీలు అభినందించి ఆమోదించిన విషయాలను ప్రస్తావిస్తారు.
    మానవుని సృష్టించదలచిన దేవుడు మట్టిని చేతబుచ్చుకొని సృష్టించాడు. ఆ సృష్టి ముందే ఉన్నది. రెండు ముద్దలు చేసి ఒకదానిని నరకంలోకి విసిరాడు. అది పట్టించుకోను అన్నాడు. మరొకటి స్వర్గంలోకి విసిరి నాకు నిమిత్తం లేదు అన్నాడు.
    ఇందులో ముందే నిర్ధారించటం, ముందే ఖండించటం అనేది ఖురాన్ చూపుతుంది. స్వర్గ నరకాలు ప్రేమ, ద్వేషాలకు అతీతాలు. ఒక జీవిని శాశ్వతంగా నరకంలో కాల్చివేస్తూ మరొకజీవిని స్వర్గంలో అప్సరసల మధ్య ఉంచుతూ, తన ఇచ్ఛ ప్రకారం దేవుడు అనందిస్తూ ఉంటాడు. ఆ విధంగా మానవులంతా దేవునికి ఒకే బానిస స్థాయిలో ఇహ, పర లోకాలలో ఉంటారు.
దేవదూతగా మహమ్మద్
    ప్రతి మతం దైవం నుండి ప్రత్యేకంగా ఆజ్ఞలు వచ్చినట్లు నటించింది. అవి కొందరు వ్యక్తులకు సంక్రమించాయనీ, యూదులకు మోజెస్ ఉన్నాడు. క్రైస్తవులకు జీసస్ క్రైస్ట్, దైవ దూతలూ, సెయింట్స్ ఉన్నారు. టర్కులకు వారి ప్రవక్త ఉన్నాడు. వీరంతా దైవదత్తమైన గ్రంథాలూ, లేదా ఆజ్ఞలను చూపారు. మోజెస్ కు దేవుడు చెప్పాడని యూదులన్నారు. దైవ ప్రేరణతో వాక్యాలు వచ్చినట్లు క్రైస్తవులన్నారు. స్వర్గం నుండి దేవదూత ఖురాన్ ను తెచ్చినట్లు దేవుడైన అల్లా చెప్పారు. అందరూ తమ మతాన్ని కాదన్నందుకు ఇతరులను నమ్మకంలేని వారుగా దూషించారు. నా మట్టుకు నేను వీరెవరినీ నమ్మను. థామస్ పెయిన్, ది ఏజ్ ఆఫ్ రీసన్ (సెకాకస్. 1974, పుట 270)
      మానవ జాతికి మహమ్మద్ ను తన దూతగా అల్లా ఎంపిక చేశారు. మహమ్మద్ స్వయంగా దేవుని చూశానన్నాడు. సుర 53.2-18. ఇస్లాం తత్వవేత్త అయిన ముస్లిం, పాశ్చాత్య భాష్యకారులలో సానుభూతిపరులూ దీనిని నిరాకరించారు. దైవ సందేశాన్ని తరచు గేబ్రియల్ దేవదూత మహమ్మద్ కు దైవసందేశాన్ని అందజేసేవాడు. దైవాన్నీ లేదా దేవదూతనూ చూచినట్లు మహమ్మద్ కెలా తెలుసు ?  తన అనుభవాలు దైవదత్తాలని అతనికి ఏ విధంగా తెలియ వచ్చింది ?  ఒకవేళ అతడు చిత్తశుద్ధితో ఉన్నాడనుకొన్నా అందులో పొరపాటు ఉండకూడదా ? దైవాన్ని ప్రత్యక్షంగా చూశామనే వారంతా మానసిక రోగలక్షణాలతో ఉన్నట్లు తెలుస్తున్నది. మహమ్మద్ విషయంలో దేవుడే, లేక దేవదూత స్వయంగా సందేశం ఇచ్చాడని ఎలా తెలుస్తుంది. పెయిన్ ఇలా రాశాడు. (ది ఏజ్ ఆఫ్ రీజన్, పుటః 52) ఒక వ్యక్తికి దైవదత్తంగా వచ్చిన సందేశం మరే వ్యక్తికీ రాకపోవటం ఒక ఉదాహరణగా నిజమనుకొందాం. అలా స్వీకరించిన వ్యక్తి తనకు దైవం చెప్పింది మరొకరికి చెప్పగా, అతడు ఇంకొకరికి చెప్పగా, అలా చెపుతూ పోతున్నప్పుడు వారెవరికీ అది దైవసందేశంగా ఉండదు. మొదటి వ్యక్తికి మాత్రమే దైవసందేశం అవుతుంది. మిగిలిన వారికి విన్న విషయం గనుక అది నమ్మనవసరం లేదు.
      మాట, రాతపూర్వకంగా మరొకరి ద్వారా వచ్చిన భావాలనూ, దైవదత్తం అనటం పరస్పర విరుద్ధం, మొదట సంక్రమించిన వారికి అది దైవదత్తం. అప్పటినుండి అతడు చెప్పిందంతా నమ్మాలని ఇతరుల ముందు భావించనక్కరలేదు. అది ఎవరికీ ప్రత్యక్షంగా చెప్పింది కాదు. మోజెస్ తనకు దైవం రెండు శిలాఫలకాలమీద ఆజ్ఞలను అందించాడని ఇజ్రాయెల్ వాసులకు చెప్పినప్పుడు వారికి మరే విధమైన ప్రమాణాలూ, ఆధారాలూ లేవు. ఒక చరిత్రకారుడు చెప్పిందేతప్ప, నాకూ మరే ప్రమాణమూ లేదు. ఆజ్ఞలలో దైవత్వానికి సంబంధించిన సాక్ష్యాధారాలేవీ లేవు. దైవానికి చెందకుండానే శాసనాలు రూపొందించిన ఏ వ్యక్తి అయినా అలాంటి నియమాలు చెప్పగలడు.
      ఖురాన్ స్వర్గంలో రాశాడనీ, ఒక దేవదూత మహమ్మద్ కందించిందనీ అన్నప్పుడు నేనా దేవదూతను చూడలేదు. గనుక నమ్మకపోవటానికి నాకు హక్కున్నది.
      వాన్స్ బ్రో, క్రోన్, కుక్ సిద్దాంతాలను పరిశీలించిన తరువాత పెయిన్, మోజెస్, మహమ్మద్ ల గురించి చెప్పింది ఉచితంగా తోస్తుంది.
      పెయిన్ పేర్కొన్నట్లు దైవదత్తాలనుకున్న అంశాలు బైబుల్, ఖురాన్ ప్రకారం అంతర్గత సాక్ష్యాధారాలేమీ లేకుండా ఉన్నాయి. ఖురాన్ లో దైవానికి అర్హమైన లక్షణాలు ఏవీ కనిపించవు. బైబుల్, ఖురాన్ల మధ్య పరస్పర విరుద్ధ విషయాలున్నాయి. వీటిలో  ఏది సరైనది ? ఉభయులూ దైవదత్తాలనే అంటున్నారు. ఈ దైవదత్తాలకు సరైన ఆధారాలు లేవు. (మేకీ, ఎథిక్స్, లండన్, 1977, పుట 232)
      దైవం తనకు తాను బహిర్గత పరచదలుచుకున్నప్పుడు ఒక వ్యక్తికే వెల్లడించటం విచిత్రం. ప్రపంచ కప్ ఫుడ్ బాల్ ఆటల్లో కోట్లాది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా  తిలకిస్తుండగా ఫుట్ బాల్ స్టేడియంలో దేవుడు ఎందుకు బయటపడలేదు. పెట్రీషియా క్రోన్ ఈ విషయంలో వ్యాఖ్యానిస్తూ, ఒకే వ్యక్తికి దేవుడు వెల్లడించటం, మిగిలిన వారంతా అతనివద్ద దైవజ్ఞానాన్ని కొనుగోలు చేయాలనటం, కాలక్రమేణ అతడి స్థానంలో ఒక సంస్థ వెలియడం, చివరకు కొందరి అదుపులో దైవం ఉండటం విడ్డూరం అనిపిస్తుంది. (1994, జనవరి 21, టైమ్స్ లిటరరీ సప్లిమెంట్, పుటః 12)

రచయిత అనువాదం
ఇబ్నవారక్ నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment