నోవా-ప్రళయం-నేను ముస్లింగా వుండలేకపోతున్నాను ఎందుకని?-

writer Ibn with Translator Innaiah

5వ అధ్యాయం  (రెండవ భాగము)

అబ్రహాం, ఇస్మాయిల్, మోజెస్, నోవా, తదితర ప్రవక్తలు
    చాల్డియాలో అబ్రహాం పుట్టాడన్నారు. కుమ్మరి కుమారుడన్నారు. కుండలు చేస్తూ బ్రతికాడన్నారు. అతడు మక్కా వెళ్ళి 300 మైళ్ళు ప్రయాణం చేసి ఎడారులు దాటి పోయాడనటం విడ్డూరం. అతడు దండయాత్రలు చేయదలుకుంటే అస్సీరియా వంటి దేశంపై పోయేవాడు. అతడు పేదవాడైతే విదేశాలలో సామ్రాజ్యాలు స్థాపించిన దాఖలాలు లేవు.
    (వోల్టేర్, డిక్షనరీ ఫిలాసఫీ, అనువాదం బెస్టర్ మన్, లండన్, 1971, పుటః 17)
      చరిత్రకారుని దృష్టిలో ఫ్రెంచివారు హెర్టర్ కుమారుడు ఫ్రాంకస్ కానట్లే, అరబ్బులు అబ్రహాం కుమారుడైన ఇస్లాయిల్ సంతతీ కాదు.
    (మాక్సిమ్ రాడిన్ సన్, లే అరబ్స్ (Lee Arabs) పారిస్, 1991, పుటః 136)
    అబ్రహాం మక్కాకు వచ్చినట్లు ఎక్కడా లేదు.
    (వాల్ట్ ముస్లిం, క్రిష్టియన్ ఎన్ కౌంటర్స్, లండన్, 1991, పుటః 136)
    చారిత్రక పద్ధతుల శాస్త్రీయ విధానాలు ఆమోదించాల్సిందే.
    (వాట్, పుటః 135, ముస్లిం, క్రిస్టియన్ ఎన్ కౌంటర్స్)
      మక్కాలోని పవిత్ర మసీదులో కాబాను అబ్రహాం, ఇస్మాయిల్ నిర్మించారని ముస్లిం సంప్రదాయం చెపుతున్నది. పురావస్తు పరిశోధనా సాక్ష్యాధాలేవీ ఇందుకు సంబంధించి లేవు. తన మతానికి అరేబియా పుట్టుపూర్వోత్తరాలు అంటగట్టడానికి మహమ్మద్ ఈ కథను అల్లాడని, స్నోక్ హర్ గ్రోంజే స్పష్టం చేశాడు. మహమ్మద్ ఈ విధంగా తన మత స్వతంత్ర ప్రతిపత్తిని చూపి ఇస్లాంలో కాబాను అరబ్బులకు చెందిన చారిత్రక, మత విషయాలతో జోడించాడు. ఖురాన్ అధ్యయనం చేయటంలో పెంటకాక్ నుండి స్వీకరించిన విషయాలను గమనించాలి. బైబుల్ విమర్శలో అలాంటి ప్రభావం కనిపించకపోవటం ఆశ్చర్యం, మోజెస్ లోని 502 చరణాలు 36 సురలలోనూ, అరహాంలోని విషయాలు 25 సురలలోనూ, సుహూ 28 సురలో, 131 చరణాలలోనూ కనిపిస్తుంది. కొరాన్ లో పెంటకాక్ ను తారాత్ గా ప్రస్తావించారు.
      బైబుల్ కథనాలను పరిశీలించిన పండితులు దానిలోని చరిత్రను సందేహించారు. అలాంటి పరిశోధనలను ఇస్లాం తప్పించుకోలేదు. 17వ శతాబ్దంలోనే లా పెరేరీ, స్పినోజా, హాబ్స్ వంటివారు పెంటకాక్ ను మోజెస్ రాయలేదని వాదించారు. మోజెస్ అనంతరం ఉన్నవారెవరో రాసి ఉంటారని స్పినోజా స్పష్టం చేశాడు. (ధియోలాజికో పొలిటికల్ ట్రీటైజ్, అనువాదం ఎల్విన్, న్యూయార్క్, 1951, పుటః 124)
      19వ శతాబ్దంలో గ్రాఫ్, వెల్ హాసన్ వంటి విమర్శకులు పెంటకాక్ లో నలుగురు భిన్న రచయితలు ఉన్నారని నిర్దుష్టంగా చెప్పారు. ఇదే విషయాన్ని రాబిన్ లెన్ ఫాక్స్ విడమరిచి చెప్పాడు.
(ఆర్. ఎల్. ఫాక్స్, ది అన్ ఆధరైజ్డ్ వెర్షన్, లండన్, 1991, పుటః 176)
      బైబుల్లోని నాలుగు, ఆధారాలను 5వ వ్యక్తి క్రీస్తు  పూర్వం 528-400 మధ్యలో కలిపి రాశాడు. అలా కలవడంలో అనేక సృష్టి విషయాలలో ఉత్తమమైన వాటిని స్వీకరించారు. అతడొక ఉపసంపాదకుడు వంటివాడు. చరిత్రకారుడు కాదు. కానీ, ఎవరైనా అతనితో నీవు కలిసి రాసినదంతా చరిత్ర కాదు అని చెబితే దిగ్ర్భాంతి చెందేవాడు. చారిత్రక వాస్తవాలు ఇందులో కనీసస్థాయిలోనే ఉండే అవకాశం ఉన్నది. శతాబ్దాల తరబడి ఈ విషయాలు ప్రాథమిక ఆధారాలను బట్టి రాసినవి కావు. నోటిమాటగా అన్నేళ్ళు అట్టిపెట్టటం కష్టం. బేబెల్ టవర్, జేకబ్ అబ్రహాంల దోపిడీలు నమ్మే ఆధారాలు లేవు. బైబుల్లో జోస్ ఫ్ కథ చారిత్రక సత్యాలకు నిమిత్తంలేని అల్లిక మాత్రమే.
      తోర రాసిందీకాదు, మోజెస్ కు ఇచ్చిందీ కాదు. అలాగే అబ్రహాం విషయంలో నమ్మదగినదేదీ లేదు. చరిత్రకారుడెవరూ ముస్లిం ఆధారాలలోకి వెళ్ళి బైబుల్ విషయాలను సరిచూడడు. అబ్రహాం, మోజెస్ తదితరులను గురించి ముస్లింలు పేర్కొన్నవి యూదుల గ్రంథాలనుండి స్వీకరించారు. కాబా నిర్మాణం వంటివి అల్లిన గాథలే.
      చరిత్రకారులు మరికొంచెం దూరం వెళ్ళి అబ్రహాం అసలు లేడన్నారు. అబ్రహాం సంచారాలు చారిత్రకాలు కావన్నారు. ఎహోవా సేవకుడుగా సంచారాలన్నీ గాథలే. వీటిని ఒకచోట చేర్చి కూర్చారు. థామ్ సన్ ఇలా రాశాడు.
      పురావస్తు శాఖ పరిశోధనలు ఇలాంటి ఆధారాలను రుజువు చేయలేదు. పిత్రుస్వామ్య సంప్రదాయాలను చారిత్రకాలు కాదన్నది. క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో పాలస్తీనా చరిత్ర ఆధారంగా జెనెసిస్ సాహితీ సంప్రదాయాలనుబట్టి అలాంటివేవీ సంభవాలు కావని చెప్పవచ్చు.  అబ్రహాంను చారిత్రక పురుషుడుగా చూపే శ్రమంతా వృథా (ధామ్ సన్, ది హిస్టారిసిటీ ఆఫ్ ది పేట్రియార్కల్ నెరేటివ్స్, లండన్, 1974, పుటః 328)
      లేస్ ఫాక్స్ ఇలా అన్నారు. ఏనియాస్, హెరాక్లీస్ వలె అబ్రహాం కూడా గాథలకు చెందడమే తప్ప చరిత్రకారులు వాటిని నమ్మరు. (ఫాక్స్, ది అనాథరైజ్డ్ వెర్షన్, లండన్, 1991, పుటః 176)
నోవా-ప్రళయం
    నోవాచే నౌకానిర్మాణం, జంతువుల్ని కాపాడటం, ప్రపంచ ప్రళయం అనేవన్నీ జెనెసిస్ నుండి కొరాన్ స్వీకరించింది. క్రైస్తవులు ఈ కథల్ని వాస్తవమని భావించటంలేదు. కొద్దిమంది సనాతన వాదులు మాత్రం ఇంకా నావలో మిగిలిన వాటికోసం అన్వేషిస్తుంటారు. హేతుబద్ధమైన ఆలోచనలకు దూరంగా గూడుకట్టుకొన్న ముస్లింలు సాక్ష్యం కనిపిస్తున్నా నిరాకరిస్తున్నారు. పై గాథలో అసంబద్ధాలను చూపిస్తాను. స్పష్టమైన దానికోసరం వృథా అనిపిస్తున్నా దీనిని ఎక్కువమంది పట్టించుకుంటారని ఆశిద్దాం.
      ప్రతి జీవి నుండి ఒక జంటను తీసుకురమ్మని నోవాకు చెప్పాడు. (సుర 11.36-41) కొంతమంది జంతు శాస్త్రజ్ఞులు  కోటి కీటకాలు ఉన్నట్లు అంచనా వేశారు. అవన్నీ నౌకలో పట్టాయా ? (మార్గస్ లిన్ కె.వి. షవార్జ్ ఫైవ్ కింగ్.డమ్స్, శాన్ ఫ్రాన్సిస్ కో, 1982, పుటః224-39) కీటకాలకు ఎక్కువ స్థలం కేటాయించక పోవచ్చు. కనుక పెద్ద జంతువుల సంగతి చూద్దాం. ప్రాకే జంతువులు 5వేల రకాలున్నాయి. 9 వేల పక్షిజాతులున్నాయి. పాలిచ్చే జంతువులు 4,500 జాతులున్నాయి.  ఫైలమ్ కార్డేటో వర్గంలో 46 వేల రకాలున్నాయి. ఎంత ఓడైతే ఇవన్నీ పడతాయి. 90వేల జాతుల్లో పాములూ, ఏనుగులూ, పక్షులూ, గుర్రాలూ, హిప్పోలు, రెయినోలు అలా ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ నోవా తొందరగా ఎలా చేర్చాడు. అమెజాన్ నుండి కొన్నిటినీ, ఆస్ట్రేలియా నుండి కంగారూను ఎలా తెచ్చాడు. నోవా ఎక్కడ ఉన్నాడో ధృవ ప్రాంతాల ఎలుగుబంటికి ఎలా తెలిసింది ?
      ఇంతకంటే అసంబద్ధతలుంటాయా?  అని ఇంగర్ సాల్ అడిగాడు. (సమ్ మిస్టేక్స్ ఆఫ్ మోజెస్, పుటః 149) ఇలాంటి పుక్కిటి గాథను వాస్తవంగా స్వీకరించరాదని అనుకోవచ్చు. లేదా, దేవుడికీ, అన్నీ సాధ్యమే అనుకోవచ్చు. దేవుడు ఇలాంటి చిక్కులతో కూడిన, ఎంతో వ్యవధి తీసుకున్న పద్ధతి ఎందుకు అనుసరించాడు ? నోవాను, ఇతర ధర్మాత్ములను ఏదైనా అద్భుతంతో కాపాడవచ్చుగదా?
      భూగర్భ శాస్త్రం ఏదీ విశ్వ ప్రళయాన్ని సూచించడం లేదు. స్థానికంగా జలప్రళయాన్ని సూచించడంలేదు. స్థానికంగా జలప్రళయాలున్నా.  కనీసం మధ్యప్రాచ్యం అంతా అనుసరించినవి కూడా లేవు. మెసపటోమియా గాథలనుండి బైబుల్లో జలప్రళయాలు ప్రస్తావించగా వాటి ఆధారంగా ఖురాన్ లో పేర్కొన్నారు. మెసపటోమియా, హీబ్రూ కథలలో ఏ ఒక్క ప్రళయాన్నీ దృష్టిలో పెట్టుకోనక్కరలేదు. (అర్.ఎల్.ఫాక్స్, ది అనాధరైజ్డ్ వెర్షన్, లండన్, 1991, పుటః 176).
డేవిడ్, సంకీర్తనలు
      డేవిడ్ కు సంకీర్తనలు సంక్రమించాయని ఖురాన్ ద్వారా ముస్లింలు నమ్ముతున్నారు. తారాత్ లో మోజెస్ కి ఇచ్చినట్లే (సుర 4.163-65) బైబుల్ పండితులు డేవిడ్ రచనలపట్ల సందేహాలు వెలిబుచ్చారు. క్రీస్తుపూర్వం వేయి సంవత్సరంలో డేవిడ్ ఉంటే ఈ కీర్తనలు క్రీస్తుపూర్వం 539 ప్రాంతంలో సమకూర్చారు. సంకీర్తనల విభాగంలో ఐదు సంకలనాలు జెరూబాబెల్ దేవాలయంలోపాడటం కోసం రాశారు. ఇవన్నీ ప్రవాసానంతర సంకలనాలే. జెరూబాబెల్ దేవాలయంలో పాడటం కోసం రాశారు. ఇవన్నీ ప్రవాసానంతరం సంకలనాలే. ఇందులో డేవిడ్ రాసినవేవీ లేవు. హాన్ మోనియా రాజూల గౌరవార్థం వారిని స్తుతిస్తూ ఇందులో చాలా ఉన్నాయి. ఈ రాజులు 142-63 బి.సి.లో ఉన్నారు. (హోవెల్ స్మిత్ ఇన్ సర్చ్ ఆఫ్ ది రియల్ బైబుల్, లండన్, 1943, పుటః 75)
ఆదాము, పరిణామం, సృష్టి, ఆధునిక విశ్వవాదం
    చాలామంది ముస్లింలు ఇంకా పరిణామం అనే వాస్తవంతో కుదురుకోలేదు. మానవజాతి పుట్టుపూర్వోత్తరాలలో శాస్త్రీయంగా పరిశీలించినప్పుడు ఆడం-ఈవ్ కథకు స్థానం లేదు. (వాట్, ముస్లిం, క్రిస్టియన్ ఎన్ కౌంటర్స్, లండన్, 1991, పుటః 134-35)
      సృష్టిని గురించి ఖురాన్ ఇచ్చే విరుద్ధ విషయం భాష్యకారులకు సమస్యలు తెచ్చిపెట్టింది.
      స్వర్గం, భూమి, వాటి మధ్య ఉన్నదంతా 6 రోజుల్లో అలసట లేకుండా సృష్టించాం  సుర 50.37)
      రెండు రోజుల్లోభూమిని దేవుడు సృష్టించాడనటంలో నీకేమైనా సందేహం ఉందా ? అతనితో సమానులను చూపుతావా  ? అతడు ప్రపంచాధిపతి భూమిపై పర్వతాలను నెలకొల్పి పోషక విశేషాలను సర్వత్రా పంపిణీచేసి నాలుగు రోజుల్లో కార్యక్రమం ముగించారు. తరువాత పొగ ఆవరించిన ఆకాశం విషయం పట్టించుకొన్నారు. భూమి, ఆకాశాల నుద్దేశించి, మీరు లొంగి ఉంటారా లేదా ? అని అడిగితే, ఉంటామన్నాయి. ఆకాశమంతా ఏడు లోకాలుగా పూర్తిచేసి ప్రతిదానికీ విధులను అప్పగించి కిందిస్థాయి వాటికి వెలుగు, సంరక్షణ దూతలను సమకూర్చాడు. ఇది సర్వజ్ఞుడి, సర్వశక్తివంతుడి చర్య. (సుర 41.9)
      భూమికి రెండు రోజులు, దాని పోషణకు నాలుగు రోజులు ఏడు స్వర్గాలకు 2 రోజులు మొత్తం ఎనిమిది రోజులు పని జరిగింది. (సుర. 41) కాని సుర 1 ప్రకారం సృష్టి అంతా 6 రోజుల్లోనే జరిగింది. భాష్యకారులు ఈ తేడాను సర్ది చెప్పటానికి అడ్డగోలుగా రాశాడు.
      భూమీ, ఆకాశాలూ, జీవులూ అన్నీ దేవుడూ, అతని శక్తికి రుజువులన్నారు. (లెవీ. 1957, పుటః 2.4) జీవులను, ముఖ్యంగా మనిషినీ వృథాగా సృష్టించలేదు. (సుర. 21.16) మనుషులూ, జిన్ కూ దైవారాధనలో ప్రత్యేక విధుల్ని కేటాయించారు. దేవుడికి లొంగి ఉండే అవకాశాన్ని తొలుత భూమి, ఆకాశాలకూ, పర్వతాలకూ ఇచ్చినా, అవి నిరాకరించటంతో ఆ సదవకాశం మనిషికి దక్కింది.  సుర. 33.72 (లెవీ. 1957, పుట 2.4)
      ఈ సిద్ధాంతాన్ని గురించి మనం ఏమనుకోవాలి. భూమి ఆకాశాలు, పర్వతాలూ, వ్యక్తులుగా పేర్కొనటమే గాక దైవాన్ని తృణీకరించాయి. సర్వశక్తివంతమైన దేవుడు విశ్వాన్ని సృష్టించి, నమ్మమని తన సృష్టిని అడిగితే, ఆ భారాన్ని సృష్టి నిరాకరిస్తున్నది.
      అల్లా, ఉండు  అనటంతో సృష్టి ఏర్పడింది. అంతకు ముందు దేవుని సింహాసనం నీటిపై తేలుతూ ఉండేది. భూమి ఆకాశాలన్నీ జలమయాలే. అల్లా విభజన చేసి దోషరహితంగా స్వర్గాన్ని నిర్మించి కప్పులేకుండా, స్తంభాలు లేకుండా భూమిపైన ఏర్చరచాడు. జీవ ప్రపంచం అంతా ఏడు పొరలతో కూడిన దశలో ఉన్నది. ఉప్పు, తీపి నీటిని ఏర్పరచి రెండూ కలియకుండా చూశారు. (లెవీ. 1957, పుటః 2,5)
      ముందు భూమినీ, తరువాత స్వర్గాన్నీ సృష్టించారు. చంద్రుడికి స్వయంప్రకాశకాన్నిచ్చారు. సుర 10.5 - మనిషి సంవత్సరాలను తెలుసుకొని లెక్కించటానికి వీలుగా అదీ చంద్రాకారాన్నీ, శుక్లాలనూ ఏర్పరచారు. సుర 10.5 (లెవీ, 1957, పుటః 2, 5)
      ఆడంను మట్టినుండి సృష్టించారు. దానిని భద్రపరచి అందులోని రక్తాన్నీ, మాంసాన్నీ, ఎముకలనూ, చర్మాన్నీ సృష్టించి, దానికి మరొక సృష్టిని జత చేర్చారు. (సుర 23.12)
      మరొక వివరణ ప్రకారం మనిషిని రేతస్సు నుండి సృష్టించారు. (సుర 77.22) ఇంకొక సూత్రం ప్రకారం ప్రాణులన్నింటినీ నీటినుండి సృష్టించారు. (సుర 21.31, 25.56, 24.44) మనుషుల కోసం జంతువులను సృష్టించాడు. జంతువుల యజమానులు మనుషులే. వాటిపై స్వారీ చేయవచ్చు. కొన్నిటిని తినవచ్చు. వాటిపాలు తాగవచ్చు. ఇతర ఉపయోగాలూ స్వీకరించవచ్చు. (సుర 36.71)
      జిన్ ను అగ్ని నుండి మానవుడికి ముందే సృష్టించారు. అదిగూడా మానవుడితోపాటే ఉంటుంది.
      ముస్లిం భాష్యకారులు పరస్పర విరుద్దాలను సర్ది చెప్పుకోటంలో సమస్యలను ఎదుర్కోలేదు. కాని శాస్త్రీయ పరిశీలకులు అలాంటి అస్పష్ట, గందరగోళ  సృష్టి వాదానికి శాస్త్రీయ సత్యాలను అన్వేషించే ప్రయత్నం చేయలేదు. ఎవరికేది కావాలో అలాంటివన్నీ గాథలలో, నమ్మకాలలో ఉన్నాయి. ఖురాన్ లోనే, సంప్రదాయాలలోనే జ్ఞానం యావత్తూ ఉన్నదని చాలామంది ముస్లింలు అనుకొంటారు. ఇబ్న హజమ్ హేతుబద్ధంగా రుజువు చేయగలిగిందంతా ఖురాన్ లో ప్రవక్త ప్రవచనాలలో  ఉన్నదన్నారు. కొత్త శాస్త్రీయ పరిశోధనలో కనుగొన్నదానిని ఖురాన్ ముందే ఊహించిందని ముస్లిం మతవాదులు చెపుతారు. విద్యుత్ నుండి సాపేక్షతా సిద్ధాంతం వరకూ భౌతిక, రసాయనిక జీవశాస్త్రా వరకూ కొరాన్ లో చూశారు. (ఆషా, 1989, పుటః 14) ఈ ముస్లింలు జీవులన్నిటికీ నీటి ఆధారాలను ఖురాన్ లో చూస్తున్నారు. (సుర 21.31) నీటి కొలునులో జీవం అరంభమైనట్లు డార్విన్ చెప్పాడు. అది ఖురాన్ లో ఉన్నదంటున్నారు. గాలిద్వారా పరపరాగ సంపర్కం మొక్కలలో జరిగే తీరును విజ్ఞానశాస్త్రం చెప్పగా  ఖురాన్ లో ఉన్నదన్నారు. (సుర 15.22) ఎ.జి.కైరన్స్ - స్మిత్ అనే రసాయన శాస్త్రజ్ఞుడు ప్రాణాధారాలు మట్టిలో ఉండవచ్చునని సూచించగా ముస్లింలు ఎగిరి గంతేసి ఖురాన్లో ఆడం మట్టినుండే సృష్టి అయ్యాడన్నారు. (డాకిన్స్. పుటః 148-65)
నీటిపైన దైవ సింహాసనం తేలియాడడం
      ముస్లింలు ఖురాన్ అంతా నిజమని నమ్ముతారు. గనుక, విశ్వం భూమిపై జీవం పుట్టుక గురించి ఆధునిక విజ్ఞానం  చెప్పేదానిలో పొసగదని చూపదలిచాను. ఖురాన్ లోనే అసంబద్ధమైన పొందిక లేని విషయాలున్నాయి. సృష్టించిన రోజులకు సంబంధించి తేడాలు చూశాం. అల్లా ఉండు  అంటే అతడి ఇచ్ఛప్రకారం సూర్యుడు లేకముందే రోజులు ఎలా ఉంటాయి ? రోజు అంటే భూమి తనచుట్టూ తాను ఒకసారి తిరగటం. సృష్టికి ముందు నీటిపైన దైవ సింహాసనం తేలియాడిందన్నారు. సృష్టికి ముందు ఈ నీరు ఎక్కడనుండి వచ్చింది ? దైవ సింహాసనం మానవత్వ ఆరోపణతో ఉండగా, సనాతనులు అదే పట్టుకు కూర్చున్నారు. ఆడం సంవత్సరాలు తెలుసుకోటానికి చంద్రుడూ, దాని దశలూ సృష్టించారని చెప్పారు. (సుర 10.5) బేబిలోనియా, ఈజిప్టు, పర్షియా, చైనా, గ్రీక్ నాగరికతలు కాలమానానికి సూర్యుని ప్రమాణం వాడారు. దీని ప్రకారం అరేబియాలో దృష్టి వెనకబడే ఉన్నది.
విశ్వ సృష్టికి నాంది
      ఇప్పుడు విశ్వం పుట్టు పూర్వోత్తరాలు గురించి ఆధునిక రీతులు చూద్దాం.
      1929లో ఎడ్విన్ హబుల్ తాను కనిపట్టిన విషయం బయటపెడుతూ సుదూరాలలో ఉన్న పాలపుంతలో భూమి నుండి దూరంగా జరిగిపోతున్నాయని వెల్లడించాడు. అంటే విశ్వం విస్తరిస్తున్నదని దీని సారాంశం. కాఫ్ మన్ ఈ విషయం ఇలా వివరించాడు. (యూనివర్స్, న్యూయార్క్, 1986 పుటః 110-16) విశ్వం కోట్లాది సంవత్సరాలుగా విస్తరిస్తూ పోతున్నది. గతంలో విశ్వంలోని పదార్థం అంతా ఒకేచోట కుదించుకొని ఉండాలి. విశ్వవ్యాప్తి ప్రారంభం కావటానికి పెద్ద పేలుడు సంభవించి ఉండాలి. అదే విశ్వసృష్టికి నాంది. విశ్వం వయసు 15-20 బిలియన్ సంవత్సరాలుగా అంచనా వేస్తున్నారు. పెద్ద పేలుడు తరువాత 10 సెకండ్లకు విశ్వం ఎంత సాంద్రతతో ఉన్నదంటే నేడు మనకు తెలిసిన పదార్థ నియమాలు కాలం, ప్రదేశాన్ని పదార్థాన్ని వివరించలేకపోయింది. మొదట మిలియన్ సంవత్సరాలపాటు పదార్థం, శక్తి ఒక అగ్ని గోళంలా ప్రోటానులు, ఎలక్ట్రాన్లు ఢీకొంటూ కొనసాగాయి. మరొక మిలియన్ సంవత్సరాల తరువాత ప్రొటాన్లు, ఎలక్ట్రానులు కలిసి హైడ్రోజన్ అణువులేర్పడ్డాయి. సూర్యమండలం జనించటానికి పది బిలియన్ సంవత్సరాలు ఆగవలసి వచ్చింది. బిలియన్ల సంవత్సరాల క్రితం అదృశ్యమైన నక్షత్రాలలోని పదార్థం సూర్యమండలంగా రూపొందింది. సూర్యుడు వయసులో చిన్న నక్షత్రం. కేవలం 5 బిలియన్ సంవత్సరాల క్రితమే పుట్టింది. హైడ్రోజన్, హీలియం మినహాయిస్తే సూర్యమండలంలో మిగిలినవన్నీ నక్షత్రాల నుండి 10 బిలియన్ సంవత్సరాల క్రితం చెదురు, మదురుగా వెదజల్లగా వచ్చి కూడాయి. ఈ నక్షత్రాల రస్మిలోనే మనం ఆవిర్భవించాం. (కాఫ్ మన్, పుటః 110) సూర్యమండలం ఇలాంటి రస్మి, గేస్ తో ఏర్పడింది. ఇందులోని గ్రహాలు ఈ రస్మికణాల కూడలిగా రూపొందాయి. అలాగే బయట గ్రహాలు కూడా జనించాయి. వంద మిలియన్ సంవత్సరాల క్రితం సూర్యకేంద్రంలో ధర్మో, న్యూక్లియర్ రియాక్షన్లు రావటానికి అనువుగా ఉన్నది. (కాఫమన్, పుట 116)
      పైన వివరించిందంతా కొరాన్ కు భిన్నంగా ఉన్నది. ఖురాన్ సుర 41.12లో చెప్పినట్లు భూమి, ఆకాశంకంటే  ముందు పుట్టలేదు. ముందు సూర్యమండలం, అంతకుముందే తారామండలం జనించాయి. ఆకాశమనేది అస్పష్టమైనది. సూర్యమండలం, పాలపుంత, విశ్వం అనే వాటిలో దేనిని ఖురాన్, బైబుల్ స్వర్గమంటున్నాయో, 6, 8, 2 రోజుల్లో సృష్టించామంటున్నాయో ఎంత వివరించినా అర్థం కాదు. సుర 10.5లో చెప్పినట్లు చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు. సూర్యకాంతి పరావర్తనం చెందుతుంది. భూమి చుట్టూ తిరుగుతుంది గాని అందుకు భిన్నంగా తిరగదు.
      పెద్ద ప్రేలుడుకు సంబంధించి ఖురాన్ లో ముందే ఉన్నదని ఎవరైనా అంటే, ఆధునిక విశ్వజ్ఞానం పదార్థశాస్త్రం, గణితంపై ఆధారపడేవన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ గణితం ముఖ్యంగా 17వ శతాబ్దంలో కేలిక్యులస్ రూపొందటంతో ఆభివృద్ధి, అవగాహన సాధ్యపడింది. కొరాన్ లో అస్పష్టత వలేకాక ఆధునిక విశ్వవిజ్ఞాన సిద్ధాంతాలు పెద్ద ప్రేలుడుకు సంబంధించిన నిర్దుష్ట విషయాలూ, గణితం ఆధారంగా అంచనా వేయ గలిగారు. ఇవి సాధారణ భాషలో చెప్పినప్పుడు గణిత నిర్దుష్టత సన్నగిల్లుతుంటుంది.
జీవం, పుట్టుక, పరిణామ సిద్దాంతం
      4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది. తరువాత బిలియన్ సంవత్సరాలకు రసాయనిక పరిణామం వలన తొలుత జీవం ఏర్పడింది. రష్యా జీవ రసాయనిక శాస్త్రజ్ఞుడు ఒపేరిన్ 1938లో జీవం పుట్టుక ప్రచురించాడు. భూమిపై ఉన్న రసాయనిక పదార్ధాలపై బయటినుండి వచ్చిన ధార్మిక అణువులు ప్రతి చర్యకు లోబడగా మార్పులు సంభవించాయన్నాడు. ఈ రసాయనిక చర్యకారణంగా నిర్జీవ మిశ్రమం నుండి సజీవ సముద్రాలు రూపొందాయని అన్నారు. వీటిలో ఎమినో యాసిడ్లు జీవ నిర్మాణానికి ప్రాతిపదికలు. వాటి నుండి ప్రొటీను అణువులు నిర్మితమయ్యాయి. కాలానుగుణంగా ఈ రసాయనిక ఎంపిక వలన జీవరీతులు స్థిరపడి అనేక దిశలుగా పెంపొందాయి. అవే ఉత్తరోత్తరా జీవ పదార్థానికి నాంది అయ్యాయి. (హెచ్. బర్క్స్. ఎవల్యూషన్ అండ్ అన్ బిలీఫ్, పుట 17-18, ఎన్ సైక్లోపీడియా ఆఫ్ అన్ బిలీఫ్, 1వ సంపుటి) ఓపెరిన్ కాలం నుండి మిల్లర్, ఫాక్స్, పొన్నంపెరుమా వంటి శాస్త్రజ్ఞులు నిర్జీవ రసాయనిక పదార్థాల నుండి సజీవ పదార్థాలను పరిశోధనాలయంలో సృష్టించారు.
      ఇప్పటికీ జీవితం పుట్టుక గురించి జీవ రసాయనిక వివరణ ఇవ్వటంలో వివాదం ఉన్నది. జీవాణువులు, ముందు జనించాయా లేక వాటికి అవసరమైన అమినో ఆమ్లాలు వచ్చాయా అనేది స్పష్టపడలేదు. జీవం తనంతట తాను తిరిగి సృష్టించుకోవడానికి శక్తి కలిగి ఉన్నప్పుడు జీవపదార్థం ఆవిర్భవించింది. నిర్జీవ సమ్మిశ్రితం రసాయనిక పరిణామంగా పెంపొంది జీవ పరిణామానికి దారితీసింది. ఇది భిన్న రూపాలలో పరిసరాలకు అనుగుణంగా ఇమిడే స్వభావాన్ని రూపొందించుకున్నది.
    1859లో డార్విన్ తన పరిణామ సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించాడు. అందులో డార్విన్ ముందు మాటగా ఇలా రాశాడు. (ది ఆరిజన్ ఆఫ్ స్వీసిస్, లండన్, 1872)
      జీవోత్పత్తిని గ్రహిస్తే జీవుల పరస్పర సంబంధాలను బట్టి వాటి గర్భోత్పత్తి విధానాల రీత్యా భౌగోళికంగా వ్యాపించిన దృష్ట్యా ఏజీవికాజీవి స్వతంత్రంగా సృష్టికాలేదని, ఒక జీవినుండి మరొకటి సంక్రమిస్తూ భిన్న రూపాలు దాల్చాయని తెలుస్తుంది. ఐతే ఇన్ని ఆధారాలున్నా అనేక జీవులు వాటి మనుగడకు అనుగుణంగా శారీరక నిర్మాణాన్నీ ఇముడ్చుకున్నాయనేది గ్రహిస్తే ఎంతో అబ్బురమైన విషయంగా తోస్తుంది.
    పరిణామం ఎలా సంభవించింది అని డార్విన్ ప్రశ్నించుకొని సహజమైన ఎంపిక ద్వారా అని సమాధానమిచ్చాడు. సుదీర్ఘమైన ఈ సహజ ఎంపిక జీవులలో సంభవించింది. (రూజ్. పుట. 47) డార్విన్ ఇలా వివరణ ఇచ్చాడు.
      ప్రతి జీవులలోనూ బ్రతికేవారికంటే ఎక్కువే జనిస్తూ వచ్చాయి. ఇది మనుగడ పోరాటంగా సాగింది. ఏ జీవి ఐనా పరిసరాలకు పొందికగా మారితే బ్రతకటానికి ఎక్కువ అవకాశాలుండవు.   అలాటి జీవి తాను మారిన రీతిలో తన జీవులకు సంక్రమింపజేస్తూ సాగిపోయింది. డార్విన్, ది ఆరిజిన్ ఆఫ్ స్విసీస్, పీఠిక).
మానవ పరిణామం
      ప్రకృతిలో మానవుడి స్థానాన్ని పరిణామ సిద్ధాంతం స్పష్టంగా సూచిస్తున్నది. ఇతర జీవులతోపాటు మానవుడు ఆవిర్భవించి పరిణమించాడా అనటానికి వాగ్ట్, లుబాక్, బుకానర్, రోల్, హెకెల్ వంటి ప్రకృతి వాదులూ, తాత్వికులూ ఈ సిద్ధాంతాలను పెంపొందించారు.
      18వ శతాబ్దంలో డాలామాటర్ మనిషిని జంతువుగా వర్గీకరించి చూపాడు. (లిన్నాస్ (1707-78) మనిషిని కోతులతో వర్గీకరించి వివరించాడు. కింది జాతి జంతువులతో మానవుడి సంబంధాలు అనే సిద్ధాంతంలో టి.హెచ్.హక్సలే కుక్క అండాభివృద్ధి పరిశీలించి ఇలా చెప్పాడు. (హక్సలే, మేన్స్ ప్లేస్ ఇన్ నేచర్ అండ్ అదర్ ఎస్సేస్ 1914, పుట 52-62)
      వెన్నెముక ఉన్న జంతువుల పరిణామ చరిత్ర ఇలాగే ఉంటుంది. మానవుడు వేరేనా ? కుక్క, పక్షి, కప్ప, చేప కంటే భిన్నంగా, ఇతర జీవజాలంతో అనుబంధం లేకుండా మానవుడు ఉన్నాడా ? లేక, వాటివలె క్రమంగా నెమ్మదిగా, పోషక పదార్థాలతో, మార్పులు చేసుకుంటూ, అలాంటి విధానాలతోనే వచ్చాడా ? సమాధానంలో సందేహం లేదు. మానవుడి ఆభివృద్ధి కూడా తొలుత ఇతర జంతుజాలానికి పోలి ఉంది. నిస్సందేహంగా అతడు కోతులకు సన్నిహితంగా ఉన్నాడు. కుక్కలకు, కోతులకు ఉన్న సంబంధంకంటె ఇది చేరువగా ఉంది. మానవ అండంలో మార్పులు ఇతర జంతువుల అండంలో జరుగుతున్న మార్పులవంటివే. అభివృద్ధి చెందడంలో మానవుడు కోతికి సమీపంలో ఉన్నాడు. పరిణామంలో ఉత్తరోత్తరా మానవుడికీ, కోతికీ తేడాలు స్పష్టంగా పెంపొందాయి. ఈ విషయం రుజువు పరచవచ్చు. కొందరిని కలవరపరచవచ్చు. కాని వాస్తవం అంతే.
      శాస్త్రీయ పద్ధతుల సాక్ష్యాధారాలతో పరిణామక్రమం మనముందున్నది. ఇందుకు అనేక శాస్త్ర విభాగాలు తోడ్పడ్డాయి. భూగర్భ శాస్త్రం, జీవ భూగోళం, పోల్చి అధ్యయనం చేయడం, రసాయనిక శాస్త్రం, అండశాస్త్రం, పరస్పర ఆధార జీవులశాస్త్రం, శారీరక నిర్మాణం, మనస్తత్వం ఇవన్నీ ఉన్నాయి.
      సాక్ష్యాధారాలన్నీ మానవుడి పరిణామాన్ని సూచిస్తున్నాయి. పూర్వీకులు కోతిని పోలినవారే. ఇందులో మానవుడి ప్రత్యేకసృష్టి జరగలేదు. బైబుల్, కొరాన్ లో అడం, ఈవ్ ల సందర్భం అర్ధరహితం, వర్గీకరణలో మానవుడితోపాటు కోతులు తదితరాలున్నాయి. మన పూర్వీకులు చెట్టు చేమలవరకూ సాగాయి. మన పూర్వీకుల వంశవృక్షం చివరకు సముద్రంలో తేలి మొక్కలవరకూ ఉన్నా అశ్చర్యం లేదు. (జె.జి.యంగ్ An introduction to the study of Man, Oxford, 1974, పుటః 402)
సృష్టికర్త దేవుడు
    బైబుల్లో ఉన్న ప్రథమ కథ అర్థం చేసుకున్నారా ? దేవుడికి విజ్ఞానం అంటే నరకంవలె భయంకరమనిపించిందా ? దేవుడి గొప్ప పొరపాట్లలో మానవుడే ప్రముఖుడు. అతడు దేవుడికి ప్రత్యర్థిగా నిలిచాడు. విజ్ఞానంతో దేవుళ్ళు, పురోహితులు పసలేకుండా పోయారు. పురోహితుల బంధాల నుండి  మానవుడిని విజ్ఞానం విమోచన చేసింది. (నీషే. ది పోర్టబుల్ నీషే ఎడిటెడ్ జడబ్ల్యు కాఫ్ మన్, న్యూయార్క్ 1974, పుట 628, ది యాంటీ క్రైస్ట్)
      విశ్వం, జీవం పుట్టుకలో గాని, పరిణామంలో గాని దైవజోక్యానికి ఎక్కడా ఆధారాలు లేవు. దేవుడి పేరిట వివరించటం అంటే ఏ వివరణ లేకపోవటమే. అన్వేషణను చంపటమే. జిజ్ఞాసను ఆర్పేయటమే. విజ్ఞానాభివృద్ధిని హతమార్చడమే. జీవుల అద్భుత ఆశ్చర్యకర భిన్నత్వాన్ని సంక్లిష్టతను అదేదో మంత్రజాలంగా వివరించబోవటం మనకు సహాయపడినట్లుకాదు. జీవాణువు ఎలా వచ్చిందీ అనేదానికి దైవాన్ని ప్రవేశపెడితే అందులో ఏ వివరణ ఉండదు. డాకిన్స్ ఈ విషయమై రాస్తూ దేవుడు ఉన్నాడనీ, జీవాణువు ఎప్పుడూ ఉన్నదనీ, ప్రాణం ఎప్పుడూ ఉన్నదనీ చెప్పి తృప్తి పడడమే. (డాకిన్స్. ది బ్లైండ్ వాచ్ మేకర్, లండన్, 1988, పుట 141, 249)
      డార్విన్ కూడా సర్ ఛార్లెస్ లేల్ కు రాసిన ఉత్తరంలో తన సిద్ధాంతాన్ని గురించి ఇలా వ్యాఖ్యానించాడు. సహజంగా ఎంపిక చేసే సిద్ధాంతానికీ, ఇంకేదైనా జోడిస్తే అలాంటిది పనికిరాదని తోసిపుచ్చుతాను. ఇందులో అద్భుతాలకు తావు లేదు. డాకిన్స్ దీనిపై వ్యాఖ్యానిస్తూ ఈ విషయం కొట్టిపారవేయదగిన స్వల్ప అంశం కాదన్నాడు. ఆద్భుతాలతో నిమిత్తం లేకుండా క్లిష్టమైన జీవులన్నీ ప్రకృతిలో ఇముడుతూ పరిణమించాయి.  ది బ్లైండ్ వాచరఅ అనే పుస్తకంలో అదే ప్రధానంగా పేరొన్న విషయం దేవుడు దూకులాటలతో ఉన్న పరిణామం డార్విన్ దృష్టిలో పరిణామమే కాదు పరిణామంలోని కీలక అంశాన్ని ఈ దైవ జోక్యం చులకన చేస్తుంది.
      ఆధునిక విశ్వవిజ్ఞానం పెద్ద పేలుడు సంభవించి అదే విధంగా స్టీఫెన్ హాకింగ్ స్పష్టం చేశాడు. (ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్, లండన్, 1988, పుటః 122, 143-49) గెలీలియో పట్ల తమ ధోరణి సవరించుకోవటానికి వేటికన్ ఒక శాస్త్రజ్ఞుల  సమావేశం జరిపింది. సమావేశం చివరలో పోపును కలవటానికి ఏర్పాటు జరిగింది. పెద్ద పేలుడు తరువాత విశ్వపరిణామాన్ని పరిశీలించటం బాగానే ఉన్నదనీ, కాని పెద్ద పేలుడు జోలికి పోవద్దనీ, ఆ క్షణంలోనే సృష్టి జరిగింది. గనుక అది దైవ కార్యమని పోపన్నాడు. సమావేశంలో నేను మాట్లాడి వచ్చిన అంశం అదేనని ఆయనకు తెలియదు. కాలాకాశాలు పరిమితమనీ, హద్దులు లేవనీ అంటే అది లేదనీ, సృష్టి లేదనీ చెప్పాను.
హాకింగ్ ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ లో ఇలా రాశాడు
    క్వాంటమ్ సిద్ధాంతంలో గురత్వాకర్షణ కొత్త అవకాశాలకు దారితీయగా అందులో కాలాకాశాలకు హద్దులు, లేవనీ, కనుక హద్దులవద్ద ప్రవర్తన అంటూ ప్రత్యేకించి చెప్పనవసరం లేదనీ తేలింది. శాస్త్రీయ నియమాలతో ఒకే దశ అంటూ లేదు. కాలాకాశాల అంచున నిలబడి దేవుడికీ విజ్ఞప్తి చేసుకునే అవకాశం లేదు. ఈ కాలాకాశాలకు హద్దులేర్పరచే కొత్త నియమం రూపొందించనక్కరలేదు. హద్దులు లేకపోవటమే ఒక హద్దు. విశ్వం స్వయం సంపూర్ణం. వెలుపల నుండి దీన్ని ప్రభావితం చేసేదంటూ ఏమీలేదు. ఇందులో సృష్టించేదే లేదు. వినాశనమైపోయేదీ  ఏదీ లేదు. విశ్వం ఉన్నది.
    అలాంటప్పుడు సృష్టికర్తకు చోటెక్కడ అని హాకింగ్ అడిగాడు.
      విశ్వవ్యాప్తంగా కార్యకారణ నియమం పనిచేస్తుందని తెలిసిన మానవుడు ఈ సంఘటనలో ఎవరో జోక్యం చేసుకుంటారనే భావాన్ని స్వీకరించలేడు. భయంతో కూడిన మతానికి అతడి దృష్టిలో ఎలాంటి ఉపయోగమూ లేదు. (ఐనస్టైన్, ఐడియాస్ అండ్ ఒపీనియన్స్, 1989, ఢిల్లీ, పుటః 39)
      పీటర్ ఆక్టిన్స్ తన వాదనలో ఎలాంటి జోక్యం లేకుండానే విశ్వం ఉనికిలోకి రావచ్చనీ, దేవుడు తన విశ్వరూపాన్ని ఈరకంగా చూపాడనే అవసరం లేదనీ పేర్కొన్నాడు. (క్రియేషన్ రివిజిటెడ్, ఆక్స్ ఫర్డ్, 1992, పీఠిక, పుటః7)
      పెద్ద్ ప్రేలుడుకు సంబంధించి దేవుడి ప్రస్తావనతెస్తే, విజ్ఞానం వేసే ప్రశ్నలకు సమాధానం రాదు. అలాంటప్పుడు దేవుడి మూలం ఏమిటి అని ప్రశ్నించవలసివస్తుంది. ఫ్యూయర్ బాహ్ ఇలా అన్నాడు. (ది ఎస్సేస్ ఆఫ్ క్రిస్టియానిటీ, బఫెలో, 989,  పుటః 195-196) మతం దృష్టిలో ప్రపంచం శూన్యం, వాస్తవాల ప్రపంచం కాదది. ఆలోచనాపరుడు ఆనందాలు మతానికి తెలియవు. ప్రకృతి అన్వేషకుడు మతానికి దూరం. జీవుల చైతన్యం అనంతంగా సాగిపోతున్న రీతులు మతంలో లేవు.
    శాస్త్రజ్ఞుడు ఆశ్చర్యంతో జీవిత క్లిష్ట విషయాలను వివరించటానికి పూనుకుంటాడు. శాస్త్రీయ ప్రతిపాదనలు చేసి పరీక్షకు పెడతాడు. వాటిని నిరాకరించటానికి కూడా సిద్ధపడతాడు. విశ్వ రహస్యాలను వెలుపలకు తెస్తాడు. అదంతా దేవుడి సృష్టి అని మతవాదులు తృప్తి పడతారు.
ప్రళయం, కరువు
    ఖురాన్ లో దేవుడు సుఖదుఃఖాలకీ, కరువు కాటకాలకీ కారణభూతుడన్నారు. సుర 7.56లో దేవుని దయవలన వర్షం వస్తుందన్నారు. కాని బంగ్లాదేశ్ వంటి ముస్లిం ప్రాంతం వరదలతో వేలాదమందిని పొట్టన బెట్టుకుంటే అదీ దైవదయేనా ?  1991 గాలివానలో గంటకు 200 కిలోమీటర్లు గాలివీయగా లక్షమంది చనిపోవటం, ఆ వరదలలో కోటిమందికి రక్షణ లేకుండా పోవటం గమనార్హం. అక్టోబరు నుండి ఏప్రిల్ వరకూ బంగ్లాదేశ్ కరువుకాటకాలతో బాధపడటం జరుగుతున్నది. సుర 57.22 ప్రకారం అన్నీ దైవదత్తాలే. పవిత్ర గ్రంథంలో లేవిదేదీ ప్రపంచంలో జరగదు.
      పేద ముస్లింలను తరచు బాధిస్తున్న భూకంపాలు, ఉప్పెనలు దయామయుడైన దేవుడు పంపాడంటే ఎలా నమ్మడం ? 1750లో లిజ్బ్ స్ భూకంపంలో అనేకమంది చర్చిలలో ప్రార్థనలు చేస్తుండగా చనిపోయారు. 18వ శతాబ్దంలో వోల్టేర్ వంటి రచయితలపై ఈ సంఘటనల ప్రభావం ఉన్నది. అమాయకులు ఎందుకు హతం కావాలి ? చర్చికి వెళ్ళినవారు శిక్షించబడగా, వ్యభిచారం చేసేవారు రక్షింపబడటానికి కారణం, ఏమిటి ?
అద్భుతాలు
      మహమ్మద్ ఎలాంటి అద్భుతాలు చేయలేదని 18వ శతాబ్దంలోని ప్రకృతి మతవాదులు పేర్కొంటూ ఇస్లాం హేతువాదాన్ని అతిశయోక్తిగా చెప్పారు. తాను దైవదూతను మాత్రమేనని, అద్భుతాలు చేయజాలననీ కొరాన్ లో మహమ్మద్ చెప్పాడు. (సుర 29.49, 13.27-30, 17.92-97) ఐనప్పటికీ ముస్లింలు నమ్మే అద్భుతాలు ఖురాన్ లో 4 చోట్ల ఉన్నాయి.
1.   సుర 54.1, 2 ప్రకారం కాలం సమీపించింది. చంద్రుడు చీలిపోయాడు. నమ్మకం లేనివారు అది కాసేపట్లో తొలగిపోతుందంటారు.
2.   బదర్ యుద్ధంలో ముస్లింలకు సహాయం, సుర 3.120, 121 ప్రకారం దేవుడు సహాయపడితే చాలదు. 3 వేల దేవదూతలను పై నుండి పంపినంతమాత్రాన చాలదు. పట్టుదలగా ఉంటే, దేవునికి భయపడితే, శత్రువు వచ్చినా ఐదువేల దేవదూతలతో దేవుడు సహాయపడతాడు.
3.   రాత్రి ప్రయాణం, మక్కా నుండి జెరూసలేంకు రాత్రిళ్ళు తమ సేవకుడిని తీసుకెళ్ళి దేవుడిని స్తుతించాలి. సుర 17.1
4.   ముస్లింల దృష్టిలో ఖురానే ఓ పెద్ద అద్భుత సృష్టి. సుర 29.48
      ఇస్లాం సంప్రదాయాలలో మహమ్మద్ చేసిన అద్భుతాలలు ఉన్నాయి ఒకసారి రోగ గ్రస్తులను నయం చేయుట, మరోసారి ఒక పిల్లవాడితో వెయ్యిమందికి అన్నం పెట్టించుట వంటివి ఉన్నాయి.
      విజ్ఞానం పెరుగుతుంటే అద్భుతాలలో నమ్మకం తగ్గుతున్నది. ప్రకృతి నియమాలు పనిచేసే తీరులో మానవ వ్యవహారాలలో జీవజోక్యాన్ని మనం నమ్మటంలేదు. ప్రకృతి నియమాలు కనుగొంటుంటే అద్బుతాలలో నమ్మకం సన్నగిల్లుతున్నది.
డేవిడ్ హ్యూం ఇలా వాదన
(ఎస్సెన్షియల్ వర్క్స్ ఆఫ్ డేవిడ్ హ్యూం, న్యూయార్క్, 965, పుటః 114-115)
      మనుషులంతా ఎందుకు చనిపోతారు ? ఈ విషయాన్ని గాలికి వదిలేయటానికి వీలులేదు. ప్రకృతి నియమాలలో వీరికి పొందిక ఉండాలి. వీటిని అధిగమించటం అంటే అద్భుతం జరగాలి. నియమాలకు లోబడి జరిగిందేదీ అద్భుతం కాదు.  చనిపోయిన వ్యక్తి తిరిగిరావటం అద్బుతం. ఏ కాలంలోనూ ఇది జరగలేదు. అందరం అనుభవిస్తున్నాం. కనుక అద్భుతాలకు ఆధారాలు లేవు. అద్భుతం అబద్ధమని చూపటమే. ఒక అద్భుతం. ఎవరన్నా రుజువు చేయగలిగితే అప్పుడు అలోచించవచ్చు.
    అద్భుతం జరగలేదని మన అనుభవాలు చెపుతున్నాయి. ప్రజలను మోసగిస్తున్నారు. భ్రాంతిలో పడవేస్తున్నారు. అతిశయోక్తులు చెపుతున్నారు. నమ్మకం ఉండాలంటున్నారు. ఫ్యూయల్ బాహ్ అన్నట్లు అద్భుతం అన్నది ఊహాజనిత మంత్రగత్తె, పరస్పర విరుద్ధాల కోర్కెలను అది తృప్తిపరుస్తుంది. కొరాన్ లోని అద్భుతాలు ఏనాడో జరిగాయి. వాటిని రుజువు పరచే స్థితిలో లేము.
      అద్భుతాలకు వ్యతిరేకంగా మనదృష్టిని  తప్పించుకొన్న వాదన ఒకటి హాస్పర్స్ చేశాడు.
      చాలా అద్భుతాలు సర్వశక్తివంతుడికి అర్హమైనవి కావని అనుకుంటాం. దేవుడు తనను నమ్మించటానికి మారుమూల కొద్దిమందికి అద్భుతాలు చేసి చూపడం దేనికి ? కొద్దిమంది రోగాలను నయం చేసేబదులు బాధితులనందరినీ బాగుచేయవచ్చుకదా ? పోర్చుగీసు గ్రామంలో చదువురాని ముగ్గురు పిల్లలు ఫాతిమాను దర్శించినట్లు 1917లో ఒక అద్భుతంగా ప్రచారం చేశాడు. ఆకాలంలోనే జరుగుతున్న మొదటి ప్రపంచయుద్ధ మారణకాండను ఆపేయొచ్చుగదా ? అసలు ఆరంభించకుండానే ఉండవచ్చు కదా ? (జాన్ హాస్పర్స్, యాన్ ఇంట్రడక్షన్ టు ఫిలాసాఫికల్ ఎనాలిసిస్, లండన్, 1973, పుటః 454)
ఖురాన్ లో జీసస్ కన్యద్వారా పుట్టుక
            కన్య మేరీకి జీసస్ అద్భుతంగా పుట్టాడని ఖురాన్ చెపుతుంది. సుర 19.16-21, 3.45-48 ఇలా చెపుతుంది.
      చూడు, దేవతలిలా అన్నారు. ఓ మేరీ  ! నీకు దేవుడు ప్రసాదించే బిడ్డపేరు జీసస్ క్రైస్ట్. అతడు బాల్య, యవ్వన దశలో జనంతో మాట్లాడతాడు. పుణ్యాత్ముడుగా ఉంటాడు. అందుకు మేరీ, ఓ దేవా ! పురుషుని సంపర్కంలేని నాకు కుమారుడెలా పుడతాడు ?  అని అడిగింది. దేవుడిలా అన్నాడు. దేవుడు తలుచుకున్నది సృష్టిస్తాడు. కావాలి అంటే అది అవుతుంది. దేవుడు అతనికి పవిత్ర గ్రంథాన్ని, వివేచనను, తౌరాత్ ను దివ్యసువార్తను చెపుతాడు.
    సనాతన క్రైస్తవ మత సిద్దాంతం నమ్ముతున్నా, ఉదార క్రైస్తవ వాదులూ, ఇంగ్లండ్ డరమ్ బిషప్ సహితం ఈ కథను యధాతథంగా ఒప్పుకోవటం లేదు. కన్య అనే పదానికి పవిత్రమని వ్యాఖ్యానిస్తున్నారు. మార్టిన్ లూథర్ (1483-1546) 16వ శతాబ్దంలో రాస్తూ మేరీ బిడ్డను కన్నదని చెపుతూనే కన్య అని నమ్మమనటంతో ప్రపంచ దృష్టిలో వెర్రివాళ్ళమయ్యాం. ఇది హేతు విరుద్ధం. సృష్టికి వ్యతిరేకం, ఆడం, ఈవులతో దేవుడు మీ కడుపు పండి వృద్ది చెందుగాక అన్నాడు. (ఫ్యూయర్ బాహ్, పుటః 304)
      క్రైస్తవ బైబుల్ పండితులు ఈ కన్య పుట్టుకను చూచిన విధానాన్ని బట్టి ముస్లింలు తమ నిర్ణయాలను కూడా ఆలోచించుకోవాలి. ఖురాన్ లో ఈ సత్యాలను అక్షరాలా వ్యాఖ్యానించటానికి వీలులేదని గ్రహించాలి. ఛార్లెస్ గైగ్నేబర్ట్ (1867-1939) రాస్తూ కన్యకు పుట్టుక గురించి నిశిత పరిశీలన చేశాడు. (హాఫ్ మన్  అర్. జోసెఫ్, పుటః 233-512, జీసస్ ఇన్ హిస్టరీ అండ్ మిత్, బఫెలో, 1986) గైగ్నేబర్ట్ గ్రీస్-రోమన్ కాలం నాటి కన్య ప్రసవించేగాథకు సమాంతర విషయాలను ఉదహరించాడు.
      పెర్సియన్ అనే అతను దాన అనే కర్మకు పుడతాడు. దాన దానిమ్మపళ్ళు తిని గర్భం దాల్చిఆటిస్ ను కన్నది. ఇలాంటి కథలు ప్రచారంలో ఉన్న సమాజంలో జీసస్ ను దివ్య పురుషుడుగా చూపటానికి క్రైస్తవులు ప్రయత్నించారు. ఏ కథనూ కావాలని అనుకరించకపోయినా నమ్మకాల ప్రభావం వారిపైన ఉన్నది.
    అడాల్ఫ్ హార్నక్ (1851-1930) వంటి పండితులు కన్యకు పుట్టే ఉదంతాలను పాత నిబంధనల దివ్య సందేశాల నుండి వ్యాఖ్యానించారన్నారు. సుర 7.14లోని గాథ క్రీస్తుపూర్వం 132లో అనువదించినట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా జాడా రాజు అహజ్ తనపై సిరియా ఇజ్రాయిల్ రాజులు దాడి చేస్తారని భయపడ్డాడు. అహజ్ కు ప్రవక్త ఇలా హామీ ఇచ్చాడు. కన్య ఒక కుమారుని కంటుంది. అతనికి ఇమాన్యుయేల్ అని పేరు పెట్టు. తేనె, వెన్న ఆహారంగా పెట్టు. మంచిని  స్వీకరించి చెడును నిరాకరించటం అతడికి తెలుస్తుంది. ఇది జరిగేలోపు నీవు గర్హించే రాజులిరువురూ వెళ్ళిపోతారు.
    క్రైస్తవులు ఈ విషయాన్ని ఈసయ్య నుండి గ్రహించి సందర్భం లేకుండా దానికి ప్రవక్త అర్థాన్ని కల్పించారు. హిబ్రూలో కన్య అనే పదం వాడలేదు.  యువతి అని ప్రయోగించారు. గైగ్నేబర్ట్ ఇలా రాశాడు.
      సనాతన మతవాదులు హిబ్రూపదానికి  కన్య అనే అర్థాన్నివృధాగా కల్సించారు. ప్రవక్తకు అద్భుతాలు చెప్పే ఆలోచనలేదు. యూదులు క్రైస్తవులపై దాడి మొదలు పెట్టగానే వారిలోని ఘోరతప్పిదాలను కూడా వెల్లడించారు. దైవాంశతో పుట్టాడని క్రైస్తవులు నమ్మి క్రీస్తు పుట్టుకకు గ్రీక్ పదం పార్థియన్ అనేదానికి కన్య అని  అర్థం కల్పించారు. గైగ్నేబర్ట్ ఈ కన్యత్వ ప్రసవ సిద్దాంతాన్ని ఒప్పుకోలేదు. హార్నెక్ మాత్రం అంగీకరించాడు.
      కన్యకు పుట్టిన విషయం నమ్మలేదు కానీ, పాల్, జాన్, మార్క్ లు జీసస్ ను దేవుని కుమారునిగా  చిత్రించారు. మేథ్యూ, లూక్ లు అద్భుతాలలో నమ్మకాన్ని ప్రదర్శించారు. దేవుడు జీసస్ ను తన పథకం ప్రకారం ఈ లోకంలోకి తీసుకువచ్చాడనీ వారి ఉభయుల మధ్య సంబంధం ప్రత్యేకమైనదన్నారు. జీసస్ దేవుని కుమారుడు అనటంలో, మానవులకర్థమయ్యే భాష అదే గనుక దానిని ప్రయోగించామన్నారు. ఇది ఉపమానంగా మాత్రమే స్వీకరించాలి.
    జీసస్ ఈ సంబంధాన్ని తానుగా ఎక్కడా అన్వయించలేదు. ఇజ్రాయెల్ లో ప్రవక్త ప్రాధాన్యత కూడా కనిపించలేదు. అంటే యూదులు దేవదూతగా జీసస్ కు ప్రాధాన్యత కల్పించలేదు. వారి దృష్టిలో ప్రవక్త అంటే కుమారుడని కాక సేవకుడని, యహోవా మనిషని అర్థం. కానీ, పాలస్తీనా కంటె భిన్నమైన అర్థంలో గ్రీక్ దేశంలో వ్యాఖ్యానం వ్యాపించింది. దేవుడు మనిషిని పుట్టించటం అనే భావన దేవుడికీ, క్రీస్తుకూ ఉన్న సంబంధం గ్రీస్ లో అశ్చర్యపరచలేదు. యూదులకు భిన్నంగా గ్రీకులు సానుభూతితో దేవదూతను స్వీకరించారు. గనుక అక్కడే క్రైస్తవ జాతులలో ఈ ఉదంతం వ్యాపించి ఉండవచ్చు. గ్రీక్ లో సేవకుడు, కుమారుడు అనే అర్థం వచ్చే పదాలను దేవుడికీ, దేవదూతకూ వాడారు. కన్యకు పుట్టటం కూడా ఒక గాథగా వ్యాపించింది. ఈసయ్య 7.14లో మాథ్యూ, లూక్ లు ఈ విషయాలను సమర్థించారు. అతడు దేవుని బిడ్డడే, అతడు పవిత్రాత్మచే  జన్మించినవాడే.
జీసస్ పుట్టుక
      సుర 19.22-34 ప్రకారం జీసస్ పుట్టుక పేర్కొన్నారు. సుర 19.22 ప్రకారం ఖురాన్ ఇలా చెప్పింది. అతనిని ప్రసవించిన తరువాత ఆమె బిడ్డను తీసుకొని మారుమూలకు వెళ్ళిపోయింది. అక్కడ ఆమెకొక వాణి వినిపించింది. విచారించకు నీపాదాల చెంత జలపాతం ఏర్చరచారు. నీ సమీపంలో ఖర్జూర చెట్టును కదిలిస్తే పండ్లు నీకు అందిస్తుంది. వాటిని తిని నీరు తాగి నీకెవరైనా కనిపిస్తే, నేనెవరితోనూ మాట్లాడను, దైవం మీద ఒట్టు పెట్టుకున్నానని చెప్పు.
    తరువాత బిడ్డను జనం వద్దకు తీసుకురాగా, ఓ మేరీ, ఆరన్ సోదరీ నీ తండ్రి చెడ్డవాడు కాదు.  నీ తల్లి వ్యభిచారిణి కాదు. అన్నప్పుడు ఆమె బిడ్డను చూపెట్టింది. పసివానితో మేము ఎలా మాట్లాడతాము ?  అన్నారు వారు. అప్పుడు బాలుడు ఇట్లా అన్నాడు. నిజంగా నేను దైవ సేవకుడిని, నాకు పవిత్ర గ్రంథం ఇచ్చి, ప్రవక్తను చేసి పంపాడు. నన్ను ఆ దేవుడే ప్రార్థించమని, దానాలు చేయమనీ, తల్లిని గౌరవించమనీ పంపాడు. నేను పుట్టినప్పుడు, మరణించినప్పుడు సజీవంగా మళ్ళీ లేచినప్పుడు నన్ను దేవుడు కరుణిస్తాడు.
    లెటో అనే ఆమె కోస్ఫో బేల కుమార్తె. ఆమె అపోలోకు జన్మనిచ్చింది. అపోలో తల్లి గర్భంలోంచి మాట్లాడాడు. ఇలాంటి కథనే కేలిమాకస్ కూడా చెప్పాడు. (305-249 క్రీ.పూ.)
      బుద్ధుని పుట్టుకలో కూడా మాయాదేవి కలలో ఒక తెల్ల ఏనుగు కుడి ప్రక్కగా వచ్చినట్లు కలగన్నది.  ఆమె కుమారుడు గొప్ప చక్రవర్తిగానీ, లేదా బుద్ధుడుగానీ అవుతాడని బ్రాహ్మణులు చెప్పారు. 10 నెలల అద్భుత గర్భం తరువాత మాయాదేవి లుంబినీ వనంలో ప్రవేశించగా రావి కొమ్మను పట్టుకోగా కుమారుడు కుడిపక్కగా జనించాడు. పుట్టగానే బుద్ధుడు లేచి ఉత్తర దిశగా 7 అడుగులు వేసి అదే తన చివరి జన్మ అని విశ్వాన్ని ఆవరించబోతున్నాననీ చెప్పాడు. జీసస్ పుట్టుకను గురించి ఖురాన్ లో ఆధారాలేమిటో  అంతకుముందే వ్యాఖ్యానించాం.
జీసస్ ఉన్నాడా ?
జీసస్ చారిత్రక ఆధారాలను సందేహించే పండితులన్నారంటే ముస్లింలకు ఆశ్చర్యంగా ఉంటుంది. ముస్లింల దృష్టిలో జీసస్ ఖచ్చితంగా ఉన్నాడు. క్రీస్తు మిధ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు. బ్రూనోబాయర్ (1809-1882) జె.ఎం.రాబర్ట్ సన్ (1856-1933), ఆర్థర్ డ్రూస్ (1865-1935), వాన్ డెన్ బర్గ్ వాన్ ఐసింగా, ఆల్ బర్ట్ కాల్ట్ హాఫ్, గైఫా (1967 పారిస్), ప్రాస్ పర్ ల్ ఫారిక్ (పారిస్, 1959), డ.బ్ల్యు.బి. స్మిత్ (1957 ది బర్త్ ఆఫ్ ది గాస్పెల్), లండన్ యూనివర్సిటీలోని ప్రొ.జి.ఎ.వెల్స్, జీసస్ హిస్టారిసిటీ, ఎన్ సైక్లోపేడియా ఆఫ్ ఆన్ బిలీఫ్, 1వ సంపుటి), జోసెఫ్ హాఫ్ మన్ ఈ పరిస్థితిని సమీక్షిస్తూ ఇలా రాశారు.
      పిపండితాభిప్రాయం ప్రకారం చారిత్రక వ్యక్తి స్థానే మిథ్యాపూరిత ఆచారాన్ని ప్రవేశపెట్టినట్లు చెపుతున్నారు. చారిత్రక వ్యక్తి ప్రతిపాదన అనవసరమనీ, బైబుల్లోని జీవిత ప్రస్తావనలకు వీటిని జోడించనక్కరలేదని మరి కొందరంటున్నారు. చారిత్రక వ్యక్తి కొత్త నిబంధన ప్రకారం మరుగున పడి ఉండవచ్చునని అనుకోవచ్చు (హాఫ్ మన్ ది ఆరిజన్ ఆఫ్ క్రిస్టియానిటీ, పుటః 179)
    క్రీస్తు లేడనటానికి లభిస్తున్న ఆధారాలు అంత కొట్టిపారవేయదగినవేమీ కాదు.
      ముస్లింలకూ, క్రైస్తవులకూ జీసస్ గాథపై చర్చ, వాదోపవాదాలూ సమానంగా అన్వయించాలి కూడా. ఇస్లాం పై రాసిన గ్రంథమేదీ బాయర్ అభిప్రాయానికి గానీ, జీసస్ చారిత్రకతను గురించి రేడికల్ డచ్ వారి సిద్ధాంతం కానీ చర్చించలేదు. చదువుకున్న వారంతా వీటిని తప్పక పట్టించుకోవాలి. నాగరికత చరిత్రలో క్రైస్తవ తొలిదశ చరిత్ర ప్రధానమైనది. ముస్లింల దృష్టిలో జీసస్ దైవ ప్రవక్తలలో ఒకడు. అనేక అద్భుతాలు జరిపిన చారిత్రక వ్యక్తి. అతడు మళ్ళీ తుది రోజు వచ్చి క్రైస్తవ వ్యతిరేకులను చంపేస్తాడు. జీసస్ లేకుంటే దాని ఫలితంగా ఖురాన్ చెప్చేదంతా కొట్టిపారవేయవలసే వస్తుంది.
      జీసస్ చారిత్రక సమస్యే కాక మనకు తెలిసినది ఎంత అని పరిశీలించాలి. ముస్లింలతో సహా ఇది అందరికీ చెందిన విషయం. జీసస్ ఉన్నాడని ముస్లింలు నమ్ముతున్నారు. 200 సం.ల పాటు నిస్పాక్షిక పరిశీలన చేసి, గొప్ప చరిత్రకారులు బయటపెట్టిన విషయాన్ని శ్రద్ధతో పట్టించుకోక తప్పదు. సత్యం పట్ల ముస్లింలు, క్రైస్తవులూ దృష్టి పెట్టాలి.  జీసస్ ఉన్నాడనే క్రైస్తవ మత సిద్దాంతకర్తలు సహితం అతని జీవితానికి సంబంధించిన కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదంటున్నారు. కొత్త నిబంధనలోని క్రీస్తు గాథలు చారిత్రక ఆధారాలు లేనివని మితవాద క్రైస్తవవాదులు కూడా ఒప్పుకుంటున్నారు. ఎర్నెస్ట్ కేస్ మెన్ ఇలా రాశాడు. గత రెండు శతాబ్దాలుగా కొత్త నిబంధన లోని అద్భుత కథలకు సంబంధించి తీవ్రచర్చలు సాగాయి. మతపరమైన విజ్ఞానంతో దీనికి సంబంధించిన పోరాటం ఆగిపోయింది. అద్భుతాలు జరిగాయనే భావన ఓడిపోయింది. (హాఫ్ మన్ జి.ఎ.లారే, జీసస్ ఇన్ హిస్టరీ అండ్ మితో, పుటః 135-136).
      ఖురాన్ లో జీసస్ కథలు వాస్తవమని కథలు వాస్తవమని ఆమోదించలేదు. చాలా కథలు, మూఢ నమ్మకాలతో కూడినవి.  అందలి అద్భుతాలు మాత్రం పట్టించుకో దగినవి కావు. జీసస్ ఉనికిని రుజువుగా ఖురాన్ ను ఏ క్రైస్తవ మత పండితుడూ స్వీకరించడు. ఏ చరిత్ర కారుడూ ఆధారాలకోసం కొరాన్ చూడడు. ఇది సంఘటనలు జరిగిన తరువాత 600 సంవత్సరాలకు మానవుడు రాసిందిగా చరిత్రకారుడు గ్రహిస్తాడు. ఖురాన్ కథలు ఏ ఆధారంతో వచ్చాయో ఆ బైబుల్ గాథల్ని చారిత్రకాలు కావని మనం అంటున్నాం. జీసస్ లేడని చెప్పే సిద్ధాంతాన్ని ఒప్పుకోకపోయినా కొత్త నిబంధన చరిత్రకారులు చెప్పే నిర్ణయాలు కొత్త వెలుగునిస్తున్నాయి. వీటికి, ఇస్లాం పండితులు ముస్లిం సంప్రదాయాల గురించి చెప్పే వాటికి చాలా పోలికలున్నాయి.
      2. క్రైస్తవానికి అన్వయించే విమర్శలే ఇస్లాంతో సహా అన్నిమతాలకూ వర్తిస్తాయి.
      3. గత 150 సంవత్సరాలుగా యూరోప్, అమెరికాలలో జీసస్ చారిత్రక సత్యాన్ని గురించి చర్చిస్తున్నా, చంపుతామని ఏ పండితుడినీ ఎవరూ బెదిరించలేదు. 1842 బాయర్ ను మత శాస్త్ర పదవినుండి బోన్ యూనివర్సిటీలో తప్పించారు. అయినా అతడు జీవితాంతం ప్రచురణ సాగించాడు. జీసస్ లేడని చెబుతున్నప్రొఫెసర్ వెల్ లండన్ యూనివర్సిటీలో ఉపాధ్యాయుడుగా ఉన్నాడు. ఇస్లాం లోకం ఇందులో గుణపాఠం నేర్చుకోవాలి.
      4. గత 150 ఏళ్ళుగా ముస్లిం పిడి వాదం వలన పరిశోధన, చర్చ జరగడం లేదు. అలాంటి చర్చ జరిగితేనే గత మూర్ఖ వాదం పోయి వివేచన వికాసంలోని అస్థిరత్వాన్ని గ్రహించగలమని జోసెఫ్ హాఫ్ మన్ అన్నారు.
      5. ముస్లిం, క్రైస్తవ భక్తి విశ్వాసాల వలన చరిత్రను నిష్పాక్షికంగా చూడలేకపోతున్నారు.  చారిత్రక సత్యం బాహ్య నిజానికి చేరువుగా తీసుకెడుతుంది. అందులో ఊహలు, తృణీకరణలు ఉంటాయి. నిశిత పరిశీలన హేతుబద్ధవాదనలు, సాక్ష్యాలు సమర్పించడం ఉంటాయి. వ్యక్తిగత మత నమ్మకాన్ని తెచ్చిపెడితే, పిడివాదంతో మాదే సరైనదని వాదిస్తే, గతానికి చెందిన చరిత్రను నిశితంగా, సందేహంతో పరిశీలించడం కుదరదు. (ఆర్.జి. కౌలింగ్ వుండ్ ను ఉదహరించిన హాఫ్ మన్ గ్రంథం జీసస్ ఇన్ హిస్టరీ అండ్ మిత్, 1986 బఫెలో పుటః 199)
వాదోపవాదనలు
స్ట్రాస్
      డేవిడ్ స్ట్రాస్ రాస్తూ సువార్తలను చారిత్రక జీవిత ఆధారాలుగా స్వీకరించలేమని, అది వారి ఉద్దేశం కూడా కాదని పేర్కొన్నారు. తొలి క్రైస్తవులు మతం మార్పిడి చేయటానికి కలగాపులగం మత గాథల్ని ప్రచారంలోకి తెచ్చారు (లైఫ్ ఆఫ్ జీసస్ క్రిటికల్లీ ఎక్జామిన్డు 1835 హాఫ్ మన్, లారే ప్రచురించిన జీసస్ ఇన్ హిస్టరీ అండ్ మిత్, పుటః 13)
      కొత్త నిబంధనలోని కథలన్నీ యూదులు అశించిన దివ్యవాణి ఫలితమేనని స్ట్రాస్ చెప్పాడు.
      సువార్త ప్రచారకులు తాము అనుకున్నదే జీసస్ చేత చెప్పించారు. పాత నిబంధనలో తమకు తెలిసిన దాన్ని దైవదూత నోటితో తినిపించారు. దేవదూతకు సంబంధంలేని విషయాలు కూడా భవిష్యత్తు వాణిగా పలికించారు.  ఈసయ్య 35లో అంధుల కళ్ళు తెరువబడతాయి. అనే వాక్యాన్ని బేబిలోని యూదులు ప్రవాసం నుంచి బయటపడి సంతోషంగా వ్యక్తం చేసిన మాటలు. దానినే మత ప్రచారకులు గుడ్డితనాన్ని పోగొడతాడని వ్యఖ్యానించి జీసస్ చేత ఆ పనులు చేయించారు. (స్ట్రాస్, ఎన్ సైక్లోపీడియా అఫ్ అన్ బిలీఫ్, పుట 657, రెండవ సంపుటి)
బాయర్
    పాత నిబంధనలోని ప్రవక్తలను స్వీకరించి తొలి క్రైస్తవులు జీసస్ క్రైస్ట్ ను అదేవిధంగా చిత్రించారు. జీసస్ క్రీస్తు అనే వ్యక్తి లేడు. యూదు-గ్రీకు, రోమన్ భావాల మిళితం వలన మొదటి శతాబ్దం మధ్యలో క్రైస్తవం తలెత్తింది. గ్రీక్ పదంలో గోస్ అనేది క్రైస్తవులూ వాడారు. దీనిని హెరాక్లిటన్, స్టాయిక్స్, పైలో నుండి స్వీకరించారు. పైలో దృష్టిలో లోగోస్ అంటే సృజనాత్మక శక్తి. ఇది ప్రపంచాన్ని అదుపులో పెడుతుంది. దీని ద్వారా మనుషులు దైవాన్ని తెలుసుకుంటారు. జాన్ సువార్తలో లోగోస్ ను దేవునితో సమానం చేసి జీసస్ క్రైస్త్ అవతారంగా చూపారు.
      క్రైస్తవం మీద ప్రభావాలను చూపిన మరికొన్ని ఆధారాలను బట్టి 4వశతాబ్దంలో క్రైస్తవ వ్యతిరేక రచయితలు కొన్ని పోలికలు చూపారు. జీసస్ జీవితానికి, టైనాలోని అపోలోనియస్ అనే కొత్త పైథాగరియన్ ఉపాధ్యాయునికి పోలికలున్నాయన్నారు. అతడు క్రైస్తవ శకానికి కొంచెం ముందుగా జన్మించాడు. సంచారకుడుగా, సన్యాసి జీవితం గడుపుతూ, తనకు అద్భుత శక్తులున్నాయంటూ, రోమన్ చక్రవర్తులూ, డొమీషియన్ల కాలంలో ప్రాణాలు గుప్పిట పెట్టుకుని తిరిగాడు. అతడు దేవుని కుమారుడుగా అనుచరులు చూపారు. వారి కళ్ళ ఎదుటే తిరిగి పునరుజ్జీవనం పొంది స్వర్గానికి అవరోహించాడన్నారు మిత్రాల మార్మిక సంప్రదాయాలు క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దం మధ్యలో రోమన్ సామ్రాజ్యం ఉండేది. ఇందులో రహస్య క్రతువులూ, ఆచారాలూ, కొత్తవారిని దశల వారీగా ప్రవేశపెట్టటం అందలి విశేషాలు. దీనికి క్రైస్తవుల బాప్టిజానికి పోలికలున్నాయి.
      తొలి క్రైస్తవులు జీసస్ చేత చెప్పించే మాటలు క్రైస్తవుల అనుభవాలు, నమ్మకాలూ, ఆశలూ ప్రతిబింబించేవి మాత్రమే. మార్క్ 1.14-15 చూడండి. జాన్ ను జైల్లో పెట్టిన తరువాత జీసస్ దివ్యవాణి ప్రచారం చేస్తూ గలీలీకి వచ్చారు. సమయం ఆసన్నమయింది. దేవుని రాజ్యం సంక్రమిస్తుంది. పశ్చాత్తాప పడండి. సువార్తను నమ్మండి. ఈ మాటలు క్రీస్తు ఎన్నడూ అనలేదు.
      తొలి క్రైస్తవుల నమ్మకాలు ఆధ్యాత్మిక విమోచనలో వారి విశ్వాసం, క్రైస్తవం రానున్నదనే ఆశ ఈ మాటలు చెప్పించాయి. వీటికి చారిత్రక ఆధారాలు కల్పించటానికి ప్రయత్నించారు. పాత నిబంధన కాలం నుండి సామ్రాజ్యవాదం వరకూ ఇలాంటి విమోచనా ప్రయత్నాల క్రమం చూడవచ్చు.  ప్రతి కొత్త తరం వారూ ప్రాచీన ప్రతిజ్ఞలన్నీ తమ కాలంలో తీరతాయని అనుకొన్నారు. పాత నిబంధన ననుసరించి తొలి క్రైస్తవులు రక్షకుడు రాకముందే ఎలిజా భూమి మీదకు తిరిగి వస్తాడనుకున్నారు. బాప్టిస్టు జాన్ తిరిగి వచ్చిన ఎలిజాగా స్వీకరించారు. తరువాత రక్షకుడు వస్తాడనుకొన్నారు. జాన్ పేరును ఎలిజాగా చూపారు. మార్క్ 9.13 (ఎన్ సైక్లోపీడియా ఆఫ్ అన్ బిలీఫ్, 1వ సంపుటి, బాయర్ పై వెల్స్ వ్యాసం, పుట 44-46).
రెడే
      విలియం రెడే 20వ శతాబ్దం ఆరంభంలో రాస్తూ లాయర్ కు తాను రుణపడినట్లు చెప్పారు. మార్క్ సువార్త తొలి క్రైస్తవుల మత విశ్వాసాలతో ఉన్నదన్నారు. ఇది జీవిత చరిత్ర అనటంకన్నా జీసస్ ను దైవదూతగా తొలి క్రైస్తవులు ఆశించిన విధానంగా ఉన్నదన్నారు. (హాఫ్ మన్, లారే, పుటః 15, జీసస్ ఇన్ హిస్టరీ అండ్ మిత్)
కాల్టాఫ్
    అల్బర్ట్ కాల్టాఫ్ 20వ శతాబ్దంలో రాస్తూ క్రైస్తవ పుట్టుపూర్వోత్తరాలు చారిత్రక స్థాపకుడు లేకుండానే చూపవచ్చునన్నాడు. రోమన్ సామ్రాజ్యంలో యూదుల దివ్యవాణి ఆశలు మతసామాజిక పరంగా ప్రజ్వరిల్లినప్పుడు క్రైస్తవం తలెత్తిందన్నారు. (హాఫ్ మన్, లారే పుటః16) సామాజిక మతపరంగా చూస్తే ఆనాడు నైతిక సాంఘిక శక్తుల వ్యక్తీకరణ క్రీస్తురూపంలో వచ్చింది.
క్రైస్తవేతర సాక్ష్యం
      రోమన్ సామ్రాజ్య కాలంలో మొదటి శతాబ్దంలో సుమారు 60మంది చరిత్రకారులు ఉన్నప్పటికీ, క్రైస్తవ సంప్రదాయాల వెలుపల అందరూ అంగీకరించిన క్రైస్తవ కథనం లేదు. జోసఫస్, టాసిటస్, సుయోటోనియస్, యుక్లైనీలు రాసింది అసంపూర్తిగా ఏమంత ఉపయోగపడకుండా ఉన్నది. (గార్డెన్ స్టైన్, యాన్ యాన్ థాంలజీ ఆఫ్ యథీయిజం అండ్ రేషనలిజం, బఫెలో, న్యూయార్క్, 1980 పుటః 178)
సువార్తలు
    మాథ్యూ, మార్క్, బాక్, జాన్ సువార్తలు జీసస్ శిష్యులు రాసినవి కావు. ప్రత్యక్షంగా చూసి రాసినవీ కావు.  క్రీస్తు శిలువ అనంతరం 40 నుండి 80 సంవత్సరాల లోపు తెలియని రచయితలు ఎవరో రాశారు. మేథ్యూ, మార్క్, లూక్ రాసిన దానిలో పోలికలెక్కువగా ఉన్నందున వాటిని సువార్త త్రయంగా పేర్కొంటారు. తొలుత మార్క్ రాసి ఉండవచ్చు. మిగిలిన ఇరువురూ అతన్ని ఉదాహరణగా పెట్టుకొన్నారు. సువార్తల్లో జీసస్ చేత చెప్పించిన మాటలు చారిత్రక పురుషుని పలుకులు కావు. హాఫ్ మన్ ఇలా ముగించాడు.
      చారిత్రక జీసస్ ను గురించి ప్రస్తావించటం కష్టం. గాథలను అల్లుకుపోయే రోజులు          ఆనాడు అద్భుతాల వాతావరణాన్ని సృష్టించింది. మత స్థాపనకూ, ఆచారాలకూ ఒక స్థాపకుడుండ నక్కరలేదనీ, మార్మిక మతం రుజువు చేస్తున్నది. తొలి క్రైస్తవులు పాటించిన సంప్రదాయాలను సువార్తలుగా పండితులు పేర్కొంటున్నారు. (హాఫ్ మన్, పుటః 177, ది ఆరిజిన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ)
      పిల్గాత్ కు ముందు  విచారణలు తీవ్రమైన సమస్యలను తెచ్చిపెడుతున్నది. చారిత్రక సంఘటనలుగా లేక మతనమ్మకాలుగా తొలి క్రైస్తవులు వాటిని సృష్టించారు. పాత నిబంధనలు దివ్యవాణి నుండి మార్క్ రాసిన వాటిలో చాలా స్వీకరించారు. నైన్ హామ్ ఈ విషయం తెలిపాడు (హాఫ్ మన్, పుటః 184)
పాల్ లేఖలు
    మార్క్ సువార్తకు ముందు పాల్ లేఖలు రాశాడు. వాటిలో జీసస్ జీవితాన్ని గురించి వివరాలు లేకపోవటం ఆశ్చర్యం. జీసస్ తల్లిదండ్రులూ, కన్నెకు పుట్టుట, జన్మస్థలం, బాప్టిస్టుగా జాన్ ప్రస్తావన, యజమానిని గురించి పీటర్ తెలియదనుట మొదలైన అంశాలేవీ లేవు. జి.ఎ.వెల్స్ ఈ విషయమై రాస్తూ వాటిలో జీసెస్ కాల, ప్రదేశాల ఉనికి ప్రస్తావనే లేదన్నారు. విచారణ జరిగిన తీరుగానీ, శిలువ వేసిన విషయం గానీ లేదన్నారు. అద్భుతాల ప్రస్తావన తీసుకురాలేదన్నారు. (హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ ఎన్ సైక్లోపీడియా ఆఫ్ అన్ బిలీఫ్, సంపుటి 1 పుటః 364) సువార్తల్లో జీసస్ కు అంటగట్టిన సిద్ధాంతాలు పాల్ కు తెలిసి ఉన్నా వాటి ప్రస్తావన రాలేదు.
      పాల్ అనంతరం తొలి లేఖల్లో చారిత్రక వివరాలేమీ లేవు. క్రీస్తు తరువాత 90కి ముందే ఈ లేఖలు రాశారు. క్రీస్తు తరువాత 90-110 రాసిన ఉత్తరాలలో దివ్యవాణి వివరాలు లభించాయి. దీనినిబట్టి వెల్స్ ఇలా నిర్ణయించాడు. (హిస్టారిసిటీ ఆఫ్ జీసస్, పుటః 365)
      లేఖలలో తొలుత జీవిత విశేషాలు లేకపోవటం, జీసస్ పట్ల ఆసక్తి లేనట్లు చెప్పజాలం. పాల్ మాత్రమే కాక ఇతర లేఖకుడు జీసస్ కు చారిత్రకతను ఎందుకు ఇవ్వలేదో వివరించలసి ఉన్నది. జీసస్ ఉన్నట్లు మొదటి శతాబ్దం చివరిలో కనుగొన్నారని గ్రహిస్తే అసలు విషయం అర్థం అవుతుంది. కాని అతని ఉనికిని చారిత్రకంగా స్వీకరిస్తేనే గందరగోళం వస్తుంది.
మార్క్ సువార్త ఎప్పుడు
    మనకు తెలిసిన జీసస్ జీవితం ఎప్పుడు, ఎందుకు రూపొందింది ?  మార్క్ సువార్త తొలుత వచ్చింది. అందులో జీసస్ జీవిత వివరాలున్నాయి. కొత్త నిబంధన నిపుణులు  ఈ రచన తేదీని క్రీ.త. 70గా పేర్కొంటున్నారు. జి.ఎ.వెల్స్ దీన్ని క్రీ.త. 90గా చెపుతున్నాడు. పాలస్తీనా క్రైస్తవులు రోమ్తతో యూదుల యుద్ధం వలన అధిగమించినప్పుడు జెంటైల్ క్రైస్తవులు మొట్టమొదటిసారిగా జీసస్ ను, పిలాత్ నూ కలిశారు. పాలస్తీనా క్రీ.త.30లో జరిగిన దానికి వీరు చెప్పేది అసంపూర్తి విషయమే. (వెల్స్, ఫ్రీ ఎన్ క్వైరీ వ్యాసం. 1983, సంపుటి 3, సంచిక 4) జీసస్ జీవితాన్ని గురించి చారిత్రక ఆధారాలను నిరాకరిస్తున్న వారిని నోరు మూయించటానికి కథలు అల్లి, పునరుజ్జీవ గాథను వాస్తవమంటూ క్రైస్తవులు రాశాడు.
ఇస్లాం ఆవిర్భావం, క్రైస్తవ పుట్టుపూర్వోత్తరాలు
      క్రైస్తవ పుట్టుపూర్వోత్తరానికి, ఇస్లాం తలెత్తటానికి పేర్కొన్న సిద్ధాంతాలలో పోలికలు కనిపిస్తున్నాయి. మహమ్మదుకు సంప్రదించిన సంప్రదాయాలు చాలావరకు తప్పుడువని గోల్డ్ జిహర్ కొట్టిపారేశారు. మొదటి రెండు శతాబ్దాలలో ఇస్లాం మత, చారిత్రక, సాంఘికాభివృద్ది వలన ఈ సంప్రదాయాలు తలెత్తాయన్నారు. శాస్త్రీయమైన చరిత్రకు సంప్రదాయాలు ఆధారం కావు. తొలి ముస్లిం సమాజ ధోరణులకు ప్రతిబింబంగానే సంప్రదాయాలున్నాయి. క్రైస్తవ సమాజాలు తమ అనుభవాలనూ, ఆశలనూ జీసస్ కు అంటగట్టినట్లే అక్కడా జరిగింది.
      ఖురాన్ లో జటిలమైన భాగాలను వివరించటానికి అరబ్బు కథకులు కూడా మహమ్మదుకు సంబంధించిన జీవిత విశేషాలు అల్లారు.
      షాట్ వ్యాఖ్యానాలు న్యాయసంబంధమైన విషయాలలో ఎలా ఉన్నాయో చూడాలంటే, మార్క్ సువార్తపై రేడే నిర్ణయాలను పోల్చి చూడవచ్చు. (లా అండ్ జస్టిస్, ది కేంబ్రిడ్జి హిస్టరీ ఆఫ్ ఇస్లాం 4 సంపుటాలు, పుట 156, కేంబ్రిడ్జి హిస్టరీ ఆఫ్ ఇస్లాం 4 సంపుటాలు, పుట 156, కేంబ్రిడ్జి, 1970) వాదోపవాదాలతో సంప్రదాయాలను సమకూర్చి విరుద్ధ సిద్ధాంతాలను ఆచారాలను తిప్పికొట్టడానికి ప్రయోగించారు. ఈ వాదోప వాదాల సందర్భాలను ఉన్నత అధికారిక రీతుల నుండి సంక్రమించాయన్నారు. ప్రవక్త జీవితం నుండి వివరాలను కొన్ని అల్లి తమ న్యాయ సిద్ధాంతాలకు మద్దతు సమకూర్చుకున్నారు.
      రేడే ఈ విషయంలో తొలి క్రైస్తవ నమ్మకాలు, ఆశయాలూ మార్క్ సువార్తలో ఎలా వచ్చాయో, అవి జీసస్ జీవిత నిజ విషయాలెలా కావో చూపాడు. (హాఫ్ మన్, లారే, పుటః 15 జీసస్ ఇన్ హిస్టరీ అండ్ మిత్)
      తొలి రోజుల్లో ఈ రెండు మతాలూ ప్రత్యర్థి సంప్రదాయాలతో తారసిల్లగా తమను సమర్థించుకోవడానికి ఇలా అరేబియన్, పాలస్తీనియా నుండి అవి ఆవిర్భవించినట్లు చూపారు. క్రైస్తవం ఎలాగైతే యూదు, గ్రీక్, రోమన్ భావాలనుండి తలెత్తిందో, అలాగే ఇస్లాం కూడా తాత్మాడిక్ యూదు, సిరియా క్రైస్తవులూ, గ్రీక్, రోమన్ భావాలనుండి ఆవిర్భవించింది.
      మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు స్థిరమైన సువార్తలుగాని, కొత్త నిబంధన కానీ లేదని మోర్టర్ స్మిత్ పేర్కొన్నాడు. (హాఫ్ మన్, లారే, పుటః 48) 9వ శతాబ్దం వరకూ ఖురాన్ నిర్దష్ట ప్రతి లేదనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్నది.
తీర్పు రోజు
    తుది రోజు ఇస్లాంలో కేంద్ర సిద్ధాంతంగా ఉంది.  ఖురాన్ లో దీనిని సూచించడానికి చాలా పదాలు వాడారు. సిరియా క్రైస్తవం నుండి ఈ తుది రోజుకు సంబంధించిన మహమ్మదు భావాలు వచ్చాయి. ఇవి మహమ్మదు నాకట్టుకున్నాయి. తుదిరోజును గురించి ఖురాన్ లో చాలా వివరమైన చిత్రీకరణ ఉన్నది. ఈ సంఘటన రణభేరిద్వారా తెలియపరుస్తారనీ, పర్వతాలు ధూళిగా మారిపోతాయనీ, ఆకాశంలో చీకట్లు కమ్ముకుంటాయనీ, సముద్రాలు మరుగుతాయనీ, సమాధులు తెరుచుకోగా, మనుషులను అగ్ని దేవతలు తీర్పుకు పిలుస్తారు. వారి చర్యలను తులనాత్మకంగా తూచి శాశ్వతమోక్షాన్ని లేదా చిత్రహింసల నరకాన్ని కేటాయిస్తారు. మక్కా సందేశాలలో తుదిరోజు భయానక దృశ్యాలను విపరీతంగా పునరావృతం చేశారు. చనిపోయిన స్త్రీ పురుషులందరినీ శారీరకంగా మళ్ళీ పైకి లేపుతారు.
      ఇలాంటి పునరుజ్జీవనం అరేబియన్లకు కొత్త ఆలోచన మక్కా పేగన్లు ఈ అసంభవ భావాన్ని కొట్టిపారేశారు. పేగన్ తత్వవేత్తలు క్రైస్తవులకు వ్యతిరేకంగా చేసిన వాదోపవాదాలలో చనిపోయిన వారెలా లేస్తారనీ, ఏ శరీరంతో ఉంటారనీ అడిగారు. కుళ్ళిపోయిన శరీరం మళ్ళీ ఎలా సరిఅవుతుందని ప్రశ్నించారు. సముద్రంలో మునిగిన వారూ, ఆడవి మృగాల బారిన పడిన వారూ వెనక్కు ఎలా వస్తారని నిలదీశారు (మోమిగ్లియానో సంపాదకత్వం. ది కాన్ ఫ్లిక్ట్ బిట్విన్ పేగనిజం అండ్ క్రిష్టియానిటీ, ఆక్స్ ఫర్డ్, 1970, పుట 161)
      మనుషులంతా చనిపోతారనేదానికి ఈ పునరుజ్జీవన సిద్ధాంతం విరుద్ధంగా ఉన్నందున తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. ముస్లిం సిద్ధాంతాల ప్రకారం శరీరం సజీవంగా వస్తుంది. స్వర్గాన్ని, భూమినీ సృష్టించిన దేవుడు తన ప్రతి రూపంలో మనుషులను సృష్టించిన తరువాత వారికి ఒక నిర్ణీత కాలాన్ని నిర్ధారించాడు. ఇదంతా పాపాత్ములు నమ్మరు. సురః 17.100
      ఆంథోనీ ఫ్లూ ఇలా అభ్యంతరం తెలిపాడు. (గాడ్ ఫ్రీడం అండ్ ఇమ్మోర్టరాలిటీ, పుట 107,  బఫెలో, 1984)
      అల్లాకు తన రూపంలో సృష్టించే సర్వశక్తివంతమైన లక్షణం ఉన్నది. ఈ విషయాన్ని ప్రవక్త నిర్దుష్టంగా చెప్పారు. ఒక వస్తువును నాశనం చేసిన తరువాత మళ్ళీ అలాంటిదే సృష్టించినప్పుడు తొలి వస్తువు ప్రతిరూపం అవుతుందే కాని నిజరూపం కాదు. తీర్పునాడు శిక్షలు విధించే విధానంలో అసలు వారి కంటే ప్రతిరూపాలే వాటిని స్వీకరిస్తాయి. ఇది కవలపిల్లలలో ఒకరు చేసిందానికి మరొకరిని శిక్షించటం వంటిది.
    పరస్ప విరుద్ధాలతో ముస్లింల భావనలున్నాయి. తీర్పునాడు మానవులంతా ముఖాముఖి సృష్టికర్త వద్ద ఉంటారన్నారు. కాని సుర 2.159, 3.169 ప్రకారం దేవుని కోసం పవిత్ర యుద్ధాలలో చనిపోయినవారు ఆయన వద్ద బ్రతికే ఉన్నారని రాశారు. తుది తీర్పుకుముందే ఈ మృతులను దేవుడు పైకి తీసుకెళ్ళినట్లున్నది. అలాగే చివరి రోజు వరకూ ఆగకుండా ఇస్లాం శతృవులను దేవుడు సరాసరి నరకానికి పంపిస్తాడు. నేడు శరీరంలోని వివిధ అంగాలను చికిత్స ద్వారా మార్పిడి చేస్తున్నారు. ఇస్లాం ప్రచారంలో ఒక సైనికుడు చనిపోతే అప్పుడు ఏదైనా ఒక అంగం ఇతరులకు దానం చేస్తే ఆ సైనికుడిని పునరుజ్జీవనం ఎలా చేయిస్తారు ? అతడిలో లేని అంగం తిరిగి రాదు గనుక అతడి ప్రతిరూపమే రావాలి. దేవుడికి అన్నీ సాధ్యమే అంటే సిద్ధాంతపు నిర్హేతుకతను ఒప్పుకోవడమే. జీవితానంతరం బ్రతుకును గురించి శతాబ్దాలుగా ఎన్ని మంత్రాలు, మాయలూ, శక్తులూ, కథలూ అల్లినా ఏ ఒక్కరూ రుజువు చేయలేకపోయారు. చావు అంటే భయం వలన, భవిష్యత్తు జీవితంలో నమ్మకం వలనా ఇలాంటి ఆడంబరాలు చోటుచేసుకున్నాయి.
      తుది తీర్పుకు నైతిక అభ్యంతరాలు
      క్రైస్తవం నుండి మహమ్మద్ స్వీకరించినది ఏది ? తుది తీర్పు సిద్ధాంతం మాత్రమే.
నిషే, ది యాంటిక్రైస్ట్
      (ది పోర్టబుల్ నీషే, న్యూయార్క్, 1974, ఎడిటెడ్ డబ్ల్యు కాఫ్ మన్)
      వునరుజ్జీవన సిద్ధాంతానికి ప్రాపంచిక, తార్కిక అభ్యంతరాలమాట అలా ఉంచి కొన్ని నైతిక అభ్యంతరాలున్నాయి. ఈ జీవితాన్ని చిన్న చూపుచూడటమే జీవితానంతర సిద్ధాంతాలలో  ప్రధానంగా కనిపిస్తున్నట్లు నిషే వాదించాడు. జీవితాన్ని అర్థవంతం చేసుకునే బదులు జీవితానంతర సిద్ధాంతం వలన ఈ జీవితాన్ని అర్థంలేనిదిగా చూపుతున్నారు.
      ప్రపంచంలో జీవితానంతర విషయాన్ని గురించి కథలల్లటం అర్థరహితం. జీవితాన్ని గురించి అనుమానించటం ఎక్కువయింది. ఇంకేదో జీవితంలో ఉత్తమ రీతులున్నాయని అంటూ మన జీవితంపై పగ సాధిస్తున్నాము.
    (నిషే. పుటః484)
      తుదితీర్పు అనేది పగ సాధనలో ఒక తీయని ఓదార్పు, అతీతం అనడంలోనే ఈ ప్రపంచాన్ని గర్హించినట్లయింది. (నీషే. పుటః 535)
      ఈ అతీతం అనేది ప్రవక్తలుగా ముద్రవేసుకున్నవారికి, పురోహితులకూ, ఇతరులను అదుపులో పెట్టే అవకాశాన్ని ఇస్తున్నది. నరకం పేరిట జనాన్ని భయపెట్టటం, స్వర్గసుఖాల పేరిట ఆకర్షించటం కూడా ఉన్నది.  ఈ భావనల ఆధారంగానే పురోహితుడు యజమానిగా మారి అలా కొనసాగుతున్నాడు (నీషే.పుటః 612) ఖురాన్ బోధనలలో మహమ్మద్ పెంపొందించిన అధమాధమ సంప్రదాయం పవిత్ర యుద్ధాన్ని గురించే ఇస్లాం కోసం చనిపోయిన వారికి స్వర్గంలో సత్ఫలితాలుంటాయన్నాడు. స్వర్గంలో ఈ సమస్యకు సైనికపరమైన విలువలతో కూడినదని రసెల్ వ్యాఖ్యానించాడు. (రసెల్ వై అయాం నాట్ ఎ క్రిస్టియన్, పుటః 72)
      ఇస్లాం చరిత్రలో ఇలా చనిపోవటానికి సిద్ధపడిన వారిని భయంకరంగా రూపొందించారు. రాజకీయ హత్యలకు కూడా వీరిని వాడారు. 11, 12 శతాబ్దాలలో హత్యలకు ముందే ఇవన్నీ వచ్చాయి. ఆధునిక మధ్య ప్రాచ్య తీవ్రవాదులను రాజకీయ కారణాలుగా అమరులని ముద్రవేసి చూపుతున్నారు. వీరు భయాన్ని జయించేటట్లు శిక్షణ ఇచ్చారు. డాకిన్స్ చెప్పినట్లు ఈ అమరవీరులు తాము స్వర్గానికి పోతామని చిత్తశుద్ధితో నమ్ముతున్నారు. అదొక ఆయుధం. యుద్ధ సాంకేతికంలో మత విశ్వాసానికి ప్రత్యేక అధ్యాయం కేటాయించాలి. విల్లు, అశ్వం, టేంకు, న్యూట్రాన్ బాంబుకు సమానంగా మత విశ్వాసం కూడా చోటుచేసుకున్నది. (డాకిన్స్, ఎడిప్లోరబుల్ ఎఫైర్, న్యూ హ్యూమనిస్టు, 104 సంపుటి, లండన్, మే. 1989)
      ఈ ప్రపంచంలో జీవితం తాత్కాలికమని తెలుసుకున్న మానవుడు జీవిత రమణీయకతనూ, విలువనూ గ్రహిస్తాడు. ఈ జీవితం ఒక్కటే సత్యమని తెలిసిన తరువాత సాధ్యమైనంత మందికి దీనిని మెరుగులు పెట్టటానికి ప్రయత్నించాలి.
      జీవితంపై కాకుండా అతీతమైన శూన్యావస్థపై దృష్టి కేంద్రీకరిస్తే జీవితంలో ముఖ్యమైనదంతా పోగొట్టుకున్నట్లే. వ్యక్తిగత అమరత్వం అనేది వివేచనను నాశనం చేస్తుంది. జీవితాన్ని పెంపొందిస్తూ, భవిష్యత్తుకు బాటలు వేసేవన్నీ పోగొట్టేటట్లు చేస్తుంది. సమాజదృష్టి, పూర్వీకులకు కృతజ్ఞత, సహకారం, నమ్మకం, సంక్షేమం అనేవి ఎందుకనిపిస్తుంది. (నీషే, పుట 618)
భయంలో నీతి
    మతం ప్రధానంగా భయంపై ఆధారపడింది. కొంతవరకూ తెలియనిదాన్ని గురించి భయం,  అన్నికష్టాలలో, కలహాలలో నీ చెంత నిలిచే పెద్దన్న ఉన్నాడనే అభయం కొంత. మార్మికం, ఓటమి, మరణం పట్ల భయమే ప్రధాన ప్రాతిపదిక. క్రూరత్వానికి ఈ భయమే పితృస్థానం, క్రూరత్వం, మతం, చట్టపట్టాలేసుకుని సాగాయి  (బెర్ ట్రాండ్ రసేల్, పుటః 25)
      ఖురాన్ నీతి విధానం అంతా భయంపై ఆధారపడిందే. మహమ్మద్ దేవుని ఆగ్రహాన్ని ఆయుధంగా శత్రువులపై ప్రయోగించి, తన వారిని పవిత్ర చర్యలకు పురికొల్పే భయానక ధోరణి అవలంబించి సంపూర్ణ దాసోహానికి గురిచేశాడు. ముస్లిం మత శాస్త్రం, నీతి ప్రాతిపదిక అంతా సర్వశక్తివంతమైన దేవుడు అతని సృష్టిలోని మనిషి నిరంతరం దేవుని ఆగ్రహానికి గురవుతూ ఉండటమే ప్రధాన అంశాలు (సర్ హేమిల్టన్ గిబ్ ఇస్లాం, ఆక్స్ ఫర్డ్ 1953, పుటః 27)
      దయామయుడైన దేవుడి భావనకు శాశ్వత శిక్షల భావన పొసగదు. ఖురాన్ సిద్దాంతాలలో అంతా ముందే నిర్ధారించనట్లు చెప్పిన తరువాత ఈ శిక్షలు అసలే అర్థం కావు. దేవుడు జీవులను నరకానికి పంపే నిమిత్తం సృష్టించటమనేది వీరు పేర్కొన్నారు.
      నిజమైన నీతికి భయం అడ్డు వస్తుంది. స్వార్థంతో నరక చిత్రహింసలు తప్పించుకోటానికి, స్వర్గ సుఖాలననుభవించటానికి మనుషులు ఉపక్రమిస్తారు.
దైవ శిక్షలు
    ఖురాన్ లోని శిక్షలు పాశవికాలు. ఖురాన్ నిర్ధారించిన శిక్షలు ఆనాడు సహజమైనవని సమర్థించేవారు. 20వ శతాబ్దంలో వాటిని అమలు పరుస్తుంటే గతుక్కుమన్నారు. కొరాన్ దైవ వాక్యం. శాశ్వత సత్యం గదా ? మరి.
ఆటంకాలు తొలగించుట
    సుర 5.38 అలా చెపుతున్నది. స్త్రీ పురుషులలో దొంగ ఎవరైనా సరే చేతులు నరికివేయి. వారి నేరానికి దేవుని శిక్ష అది. ముస్లిం చట్టం ప్రకారం దొంగ కుడిచేయి మణికట్టు దగ్గర నరకాలి. రెండవ నేరానికి ఎడమ పాదం, తరువాత చేసే నేరానికి
జైలు శిక్ష ఉండాలి. (డిక్షనరీ ఆఫ్ ఇస్లాం, పుట 285)
శిలువ
      సుర 5.33 ఇలా చెపుతున్నది. దేవుడూ, అతని దూతలపైన యుద్ధం చేసేవారిని ఉరితీయాలి. శిలువ వేయాలి. చేతులూ, కాళ్ళూ నరకాలి, దేశం నుంచి వెళ్ళగొట్టాలి. ఈ ప్రపంచంలో వారికి అది శిక్షగానూ, తరువాత ప్రపంచంలో భారీ శిక్షగానూ ఉండాలి.
స్త్రీలకు శిక్ష
      వ్యభిచారానికి కొరాన్ శిక్షలు పేర్కొన్నది. స్త్రీలు వ్యభిచార నేరంలో పట్టుబడితే వారిని బందీలుగా అట్టిపెట్టాలి. నలుగురు సాక్షులు వారి నేరాన్ని ధృవపరిస్తే చనిపోయేవరకూ అలాంటి వారిని గృహ నిర్భంధం చేయాలి. సుర 4.15.
దెబ్బలు
    సుర 24 .2-4 ప్రకారం స్త్రీ పురుషులలో వ్యభిచారానికి వంద కొరడా దెబ్బలు కొట్టాలి. దయ చూపరాదు.
      ఖురాన్ లో తరువాత ప్రవేశపెట్టిన రాళ్ళతో కొట్టే విధానం కొందరు పండితులు సందేహిస్తున్నారు. ఇస్లాం చట్టం మానవహక్కులూ సమానంగా ఉన్నాయని కొందరు ఇస్లాం వాదులు సరిపెట్ట జూస్తున్నారు. మానవహక్కుల ప్రకటన ఆర్టికల్ 5 ప్రకారం ఏ ఒక్కరినీ చిత్రహింస చేయరాదు. ఆమానుష శిక్షలు విధించరాదు. ఐనప్పుడు అంగాలు తొలగించటం, కొరడా దెబ్బలు, రాళ్ళతో కొట్టడం అమానుషం కాదా?
ఖురాన్ లో చారిత్రక దోషాలు
    హమాన్ పర్షియన్ రాజు అహసురస్ వద్ద మంత్రి. ఎస్తర్ లో ఈ ప్రస్తావన ఉంది. కాని కొరాన్ సుర 40.38లో ఇతనిని మోసెస్ కాలంలో పారోవావద్ద మంత్రిగా పేర్కొన్నారు.
      జీసస్ తల్లి మేరీకి మోసెస్, అరన్ ల సోదరి మేరీకి ఇలాగే పొరబడ్డారు. సుర 2.249, 250లో సాల్ కథకూ జడ్జిమెంట్ 7.5లో గిడియస్ కూ గందరగోళం ఉంది.
      చారిత్రకంగా అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి కొరాన్ 18.82లో తీవ్ర గందరగోళం ఉంది. అలెగ్జాండర్ ప్రేమ వ్యవహారం మెసడోనియన్ ముస్లిం కాజాలడు. అతడు వృద్ధాప్యం వరకూ జీవించలేదు. ముస్లింలు అన్నట్లు అతడు అబ్రహాం సమకాలీనుడు కాదు.
ముస్లిం సమాజానికి అదుపులు
      కొత్త సమాజానికి ఖురాన్ నియమనిబంధనలు సూచించింది. ఆయా అధ్యాయాలలో వీటిని పరిశీలిద్దాం. ఉపవాసాలు, దానాలు, పన్నులు, పారంపర్యత మొదలైనవి ఉన్నాయి. ఖురాన్ నీతి సూత్రాలతో పేచీలేదు. అవి కొత్తవి కాదు. పెద్దల, తల్లిదండ్రులపట్ల దయ, గౌరవం, పేదలపట్ల ఔదర్యం, పగ బదులు క్షమించుట ఉన్నాయి. రామణీయకత, ఔన్నత్యాల ప్రస్తావన ఉంది. మొత్తం మీద పరికిస్తే ఖురాన్ బోధనలు మానవ వివేచనకు, సాంఘిక, నైతిక, మేధస్సు ప్రగతికి పెద్ద, అపరాధమే. దేవుని మాట సంగతి అలా ఉంచి, దేవుడికి తగని పాశవిక సూత్రాలెన్నో ఉన్నాయి. మహమ్మద్ చేయి కొరాన్ లో ఉన్నదనడానికి తగిన సాక్ష్యాధారాలున్నాయి. అందులో నైతిక దృష్టి 7వ శతాబ్ద పరిస్థితుల ప్రతిబింబమే. అది నేడు ఆమోదయోగ్యం కాదు.
మతం, ముఖ్యంగా ఇస్లాం
    మనిషిని ధర్మపరుడిగా చేస్తుంది. గనుక మతాన్ని విమర్శించడం తగదు అంటారు. కాని నాకెక్కడా అది కనిపించలేదు. బెర్ట్రాండ్ రస్సెల్ (వై ఐ యాం నాట్ ఎ క్రిస్టియన్, పేజి. 24)
      ఏ మతమైనా వాస్తవమనడానికి ఆధారాలు ఉండవు. చాలా వాటిలో అబద్ధమనడానికి సాక్ష్యాలు ఉంటాయి. అబద్ధాలైనా అవి నైతిక వర్తనకు ఉపకరిస్తున్నాయని కొందరు తాత్వికులు ప్రవచించారు. సాంఘిక స్థిరత్వానికి తోడ్పడుతున్నాయన్నారు. తాత్వికుడు క్వైన్ ఇలా రాశాడు. మతం విధించే నిబంధనల సాంఘిక విలువల సమస్య ఉత్పన్నమైంది. వాస్తవాలకు అవి ఎంత దూరంగా ఉన్నాయనే మాట అలా ఉంచండి. వీటివలన ఉత్పన్నమైనదైతే, శాస్త్రీయ వికాసానికీ, భ్రమలకూ మధ్య డోలాందోళిత స్థితి ఏర్పడక తప్పదు. ( W.V.O.Quine, Quiddities-Cambridge 1987, పేజి. 209)
    అలాంటి అభిప్రాయం ప్రాపంచిక అనుభవరీత్యా తప్పు. నైతికంగా జుగుప్సాకరం, రస్సెల్ ఇలా వాదించాడు.
      ఒక కాలంలో మత భావన, పిడివాద నమ్మకం ఎంత తీవ్రంగా ఉంటే. క్రూరత్వం అంతగా వ్యాపించడం గమనార్హం. క్రైస్తవాన్ని సంపూర్ణంగా నమ్మిన రోజుల్లోనే దారుణ హింసాకాండ సాగింది. లక్షలాది స్త్రీలను మంత్రగత్తెల పేరిట చంపారు. మతం పేరిట క్రూరత్వాన్ని పాటించారు.
    క్రైస్తవుల యుద్ధాలు మనకు సుపరిచితం. కాని ముస్లింలు చేసినవి అంతగా తెలియదు. 20వ శతాబ్దంలో అల్లా పేరిట దారుణ క్రూర హింసాకాండ చూద్దాం. అఫ్ఘనిస్తాన్ లో ఇస్లాం పేరిట అధికారం కోసం తీవ్ర అంతర్యుద్ధం సాగించారు. దయామయుడైన దేవునికి 5సార్లు ప్రార్థన చేస్తూనే, మధ్యలో వందలాది అమాయకుల్ని చంపేశారు. కొందరు పొరుగున ఉన్న పాకిస్తాన్ కు పారిపోయారు.  కమ్యూనిస్టుల రాజ్యాన్నిమరుపు తెచ్చే దారుణాలు వారు చనిచూశారు. అంతర్యుద్ధంలో 1994 నాటికే 10 వేలమంది హతమైనట్లు ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యునల్ ఏప్రిల్ 26, 1994  ప్రచురించింది. కాబూల్ లోనే 1994 జనవరి ... ఏప్రిల్ మధ్య 1500 మంది హతమార్చబడ్డారు.
సూడాన్
    1983లో జనరల్ సుమైరి అనే నియంత ఇస్లాం చట్టాన్ని అమలు పరచి సూడాన్ లో మూకుమ్మడిగా హత్యాకాండ సాగించాడు (1994 జూన్ నాటికి) జనాభాలో 3వవంతు క్రైస్తవులు, యానిమిస్టులు దక్షిణాదిలో ఉన్న వీరిపై ఉత్తరాది ఇస్లాం వాదులు నిర్దాక్షిణ్య యుద్దకాండ జరిపారు. 1983 నుండి 5 లక్షలకు పైగా చంపేశారు. సూడాన్ రాజధాని ఖార్టూమ్ నుండి 5 లక్షలమందిని నిరాశ్రయులను చేశారు. వారంతా ఎడారుల్లో 120 డిగ్రీల వేడిలో ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు లేక మాడిపోయారు. ఎకానమిస్ట్ పత్రిక 1994 ఏప్రిల్, 9న ఇలా రాసింది.
      మత దీవెనల పేరిట ఇరాన్ అర్థిక సహాయంతో, చైనాలో తయారైన ఆయుధాలను సైన్యానికి అందించారు. జిహాద్ పేరిట పోరాటం సాగించారు. సూడాన్ ముజహిదీన్లు సైన్యంలో చేరి, ఇస్లాం కోసం చావడానికి సిద్ధమయ్యారు.
ఇండోనేషియా
    1965లో 250000 నుండి 6 లక్షల వరకూ ఇండోనేషియాలో హతమార్చబడిన ఉదంతాలు నేడు బయటపడుతున్నాయి. 1965లో కుట్ర విఫలం కాగా, ఇండోనేషియా సైన్యం (అమెరికా కనుసైగతో) కమ్యూనిస్టులపై పగ తీర్చుకున్నది. జాతీయ వాదులు, ముస్లింలు పగ తీర్చుకోవడానికి సైన్యం ప్రోత్సహించింది. చైనా రైతుల్ని ముస్లిం యువకులు హతమార్చారు. సాయంత్రం 6 తరువాత ఎవరూ బయటకు వచ్చేవారే కాదు. తూర్పుజావా పారిపోయిన చైనా రైతు ఈ విషయం చెబుతూ, స్త్రీల స్తనాల్ని కోసేశారని, చాలామంది శవాల్ని సముద్రంలో పారేసారని ఆ సముద్ర చేపలు తినడానికి జనం భయపడ్డారని చెప్పాడు.
      మనుషుల చెవులు కోసి మెడలో దండగా వేసుకొని యువ ముస్లింలు పొద్దున్నే తిరిగేవారు. (గార్డియన్ వీక్లీ 1990 సెప్టెంబరు 23) తూర్పు తైమూర్ దాడిలో 2 లక్షల పెరుల్ని చంపేశారు.
      ఆధ్యాత్మిక ప్రాచ్యం అనే అర్థం లేని మాట దృష్ట్యా ఈ దారుణాలను వెల్లడిస్తున్నారు. పాశ్చాత్యం నాస్తికమనీ, కుళ్ళిపోయిందనే ప్రచారం చేస్తుంటారు.  మతం మనిషిని ధార్మికుని గావిస్తుందంటారు. క్రూరత్వంలో యూరోప్ వారు, ఆసియావారు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ నేరస్తులే. వేలాది నాస్తికులు మచ్చలేని జీవితాలు గడిపారు. తోటివారికోసం నిస్వార్థంగా సేవ చేశారు.
ప్రయోజన వాదానికి అభ్యంతరం
    క్రైస్తవ మతం వాస్తవమైనా కాకపోయినా దానిని బోధిస్తే నమ్మినవారు నేరాలు లేకుండా ఉంటారని చెప్పటం జుగుప్సాకరం, దిగజారుడుతనం, హేతుబద్దమైన విచారణ కంటె సుఖం, భద్రత కోరుకోవటం మత ఛాందస వాదంలో ప్రముఖంగా కనిపిస్తుంది. (రాబిన్ సన్, ఏన్ ఎథీయిస్ట్ వాల్యూస్, ఆక్స్ ఫర్డ్, 1964, పుటః పుట 117)
      మతం తప్పుడుదైనా నీతికోసం అట్టిపెట్టాలనటం నైతికంగానూ గర్హనీయమే. దీనివలన మనిషి వివేచన వక్రమార్గానపడి మోసానికి ప్రోత్సాహం లభించి సత్యాన్వేషణకు దూరమవుతాయి. రసెల్ ఇలా చెప్పాడు.
      వాస్తవం కాకున్నా నమ్మకాన్ని ప్రధానంగా స్వీకరించటం వలన అనేక దోషాలు తలెత్తుతాయి. జిజ్ఞాసకు ప్రోత్సాహం పోతుంది. సనాతనులకు పెత్తనం సంక్రమిస్తుంది. చారిత్రక వాస్తవాలు దోషాలుగా చూపవలసివస్తుంది. సనాతనత్వానికి వ్యతిరేకత నేరంగా పరిగణించి శిక్షలు విధిస్తారు. మతం వాస్తవం గనుక నమ్మాలి. అంటే, అర్థం ఉంది. అది ఉపయోగకరమైంది గనుక నమ్మాలి అంటే, వాస్తవం ఐనా కాకపోయినా అనుసరించాలి. అంటే దారుణ నీతిగా పరిగణిస్తాను (రసెల్, వై ఐయామ్ నాట్ ఎ క్రిస్టియన్, పుటః 156-57)
      కొందరు నిజమైన భక్తులు కూడా ఇలానే వాదిస్తారు. చాలా సందర్భాలలో ప్రొఫెసర్ వాట్ చారిత్రక సత్యం అంత ప్రధానం కాదనీ, సూచనప్రాయమైన సాంకేతిక ముఖ్యమనీ అన్నాడు. ఇది చిత్తశుద్ధిలేని మాట. పాల్ మాటలు ఈ విధంగా ఉన్నాయి. చనిపోయిన వారి నుండి క్రీస్తు లేచాడంటే వునరుజ్జీవనం లేదని ఎలా అంటారు ? చనిపోయిన వారిలో మళ్ళీ పునరుజ్జీవనం లేకపోతే క్రీస్తు కూడా తిరిగిరాడు. క్రీస్తు రాకుంటే బోధనలు వృధా, నమ్మకం వృధా. (కొరింథియన్ 15.12-14)
      కాబాను అబ్రహాం నిర్మించినట్లు ముస్లింలు నమ్ముతారు. అబ్రహాం అనేవాడు లేడంటే, ఉన్నా అరేబియాలో అడుగు పెట్టలేదంటే, అలాంటి చారిత్రక సత్యం వలన మక్కా యాత్ర అర్థంలేనిదవుతుంది. దేవునిలో నమ్మకం ఉన్న వ్యక్తి అలా వాదించినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది.
సత్యాన్వేషణనను దేవుడు ఆమోదిస్తాడు. తనను పూజించటానికి గాను అబద్దాలను దేవుడు ప్రోత్సహిస్తాడా ? ప్రయోజనతావాదం కొట్టిపారేయడానికి వీలులేకుండా మార్పులు చేస్తుంటారు. దారుణంగా బాధలు పడిన వ్యక్తి ఏ విధంగానూ ఈ లోకంలో బాగు పడలేని వ్యక్తి. జీవిత క్రూర సత్యాలకు బలి అయిన వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడదాం. జీవితానంతరం, దేవునిలో నమ్మకం పెట్టుకుంటే ఈ లోకంలో పడిన కష్టాలన్నీ తీరుతాయని అంటే అదొక కలగా మారుతుందా ? నమ్మకం ఒక్కటే ఈ కష్టాలను భరించేటట్లు చేస్తుంది. అలాంటి మాటలకు సమాధానం లేదు. మనిషి జీవితాన్ని చదువూ, రాజకీయ సామాజిక చర్యల ద్వారా బాగుపరచడానికి పూనుకోవాలి. అంతేగానీ సరిపెట్టుకొని ఊరుకోరాదు.

     రచయిత అనువాదం
ఇబ్నవారక్ నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment