దేవుని మంచితనం-క్రైస్తవం ఇంత అమానుషమా?శామ్ హారిస్

7వ భాగం
Innaiah with Sam Harris
దేవుని మంచితనం
ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఒకమ్మాయిని ఒకతను ఎత్తుకు పోతాడు,  చెరుస్తాడు, చిత్రహింస చేస్తాడు. చంపేస్తాడు. ఈ క్షణంలో కాకపోతే మరికొన్ని గంటలలో, రోజులలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆరు మిలియన్ల మానవుల మధ్య ఇలాంటివి జరుగుతుండటం చూస్తున్నాం. అదే లెక్కల ప్రకారం ఆ అమ్మాయి తల్లిదండ్రులు – నువ్వు నమ్మినట్టే -  సర్వజ్ఞుడైన దేవుడు, కరుణామయుడైన దేవుడు, వారిని వారి కుటుంబాన్ని చూస్తూ వుంటాడు. అలా అని వారు నమ్మటం సరైనదేనా? అలా నమ్మటం మంచిదేనా?
కాదు.
దీనికి స్పందించడంలోనే నాస్తికవాదం ఉన్నది. నాస్తిక వాదం తప్పని కాదు. అదొక ప్రపంచ దృష్టీ కాదు. స్పష్టమైన దానిని అంగీకరించడమే నాస్తికవాదం. నాస్తిక వాదం అనే మాట వాస్తవానికి ఉండరాదు. ఎల్లరూ తామొక నమ్మకం లేని జ్యోతిష్యులమని, నమ్మకం లేని మాంత్రికులమని అనుకోరాదు. సుప్రసిద్ధ గాయకుడు ఎల్విన్ ఇంకా బతికున్నాడని, లోకాతీత వ్యక్తులు ఖండాంతరాలలో పయనించి పట్టుబడిన వారిని చిత్రహింసలు చేస్తారని, నమ్మేవారిని గురించి ఏమనాలో తెలియదు. నాస్తిక వాదం అంటే సమర్థనీయం కాని మత విశ్వాసాలను ముందుకు తెచ్చేవారి పట్ల అభ్యంతరాలను తెలపడమే. నాస్తికుడు అమెరికాలో నమ్ముతున్న 57 శాతం జనాభాను, దేవుడున్నాడనే విషయాన్ని సందేహించేవారిని ప్రశిస్తూ సాక్ష్యం చూపమని కోరతాడు. ప్రపంచంలో రోజూ అమాయకులను నాశనం చేస్తున్న తీరును చూస్తూ దయామయుడైన దేవుని ప్రశ్నించడమే నాస్తికత. లక్షలాది సంవత్సరాలలో ఒక్కసారైనా సరే ఒక చిన్న పిల్లను చంపేస్తే దయామయుడైన దేవుడనే భావాన్ని సందేహించడమే నాస్తికుడి ఉద్దేశ్యం.
ప్రతి చోటా మానవులను రక్షించడంలో దేవుడు విఫలమవుతున్నట్లు ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇటీవల అమెరికాలో న్యూ అర్లియన్స్ నగరం తుఫాను తాకిడికి విధ్వంసం అయింది. వెయ్యిమంది చనిపోయారు. వేలమంది ఆస్తులను పోగొట్టుకున్నారు. పదిలక్షలమంది నిరాశ్రయులయ్యారు. న్యూ అర్లియన్స్ లో కత్రినా తుఫానుకు గురయినవారంతా దేవుడు సర్వజ్ఞుడని సర్వాంతర్యామి అని దయామయుడని నీవు నమ్మినట్లే నమ్మారు. కత్రినా తుఫాను నగరాన్ని ఎడారి చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నట్లు. ఇళ్లల్లో, అటకల మీద ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రార్థించిన వృద్ధుల, స్త్రీల ప్రార్థనలు దేవుడు విని వారిని క్రమేణ నీట ముంచాడు. వారంతా నమ్మకాలున్న విశ్వాసపాత్రులే. జీవితమంతా ప్రార్థనలు చేసినవారే. ఇది స్పష్టమేనని ఒప్పుకునే ధైర్యం ఉందా? వారంతా ఊహించిన దైవంతో సంభాషిస్తూ చనిపోయారు.
న్యూ అర్లియన్స్ రాష్ట్రాన్ని, బైబిల్ ప్రస్తావించిన తీరులో, తుఫాను ముంచెత్తబోతున్నట్లు హెచ్చరికలు వచ్చాయి. అందుకు మానవులు సరిగా సంసిద్ధులు కాలేదు. వైజ్ఞానికంగా చూస్తే మరొక తీరుగా వుంటుంది. మతపరంగా ఈ ప్రమాదానికి ఎలాంటి ఆధారమూ లేదు. వాతావరణ శాస్త్రం శాటిలైట్ ప్రకృతిని పరిశీలించి కత్రినా దారిని సరిగా చెప్పడంలో విఫలమయ్యాయి. దేవుడు తన పథకాన్ని ఎవరికీ వెల్లడించలేదు. న్యూ అర్లియన్స్ పౌరులు దేవుని దయపై ఆధారపడ్డారు. కత్రినా మృత్యువాతకు గురికాబోతున్నామని అక్కడి పౌరులు తీవ్ర గాలులు తాకిడి సోకేవరకు అనుమానించలేదు. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సేకరించిన ప్రజాభిప్రాయం ప్రకారం కత్రినా తుఫాను తాకిడి నుండి బయటపడినవారిలో 80 శాతం దేవుని మీద నమ్మకం బలపడిందని చెప్పారు.
ఒకవైపు కత్రినా తుపాను న్యూ అర్లియన్స్ ను నేలమట్టం చేస్తుండగా, ఇరాక్ లో బ్రిడ్జిపై షియా భక్తులు మృత్యువుకు గురయ్యారు. ఈ యాత్రికులు కురాన్ దేవుని శక్తిలో నమ్మకం ఉన్నవారు. అతడి ఉనికి తిరుగు లేనిదని వారు తమ జీవితాలను రూపొందించుకున్నారు. వారి స్త్రీలు ముసుగును ధరించి దేవుని ఎదుట ఉండేవారు. దైవవాక్యాన్ని గురించి పరస్పర వ్యతిరేక భాష్యాలతో వారిలో వారు చంపుకుంటున్నారు. ఆ విషాద సంఘటనలో బతికినవాడు ఒక్కడైనా విశ్వాసాన్ని కోల్పోతే విశేషంగా చెప్పుకోవచ్చు. కాని అలా బతికి బయటపడడం దేవుని దయవలనేనని భావించారు.
బతికిన వాళ్ళలో స్వయంగా ఆత్మవంచన, స్వీయ ప్రేమ అనంతంగా ఉన్నది. అలాంటి సంఘటనలలో బతికిన వారు దయామయుడైన దేవుని వలన బతికామనుకోవడం, అదే దేవుడు పసివారిని పొట్టన పెట్టుకోవడం, గమనార్హమైన నమ్మకం. బాధలతో సతమతమవుతుంటే వాస్తవాన్ని మరచి మత భ్రమణంలో మునిగి తేలడం వివేచనా రహితం. కోట్లాది ప్రజలు తమ ఆనందాన్ని కుచింపచేసుకుని అందుకు తగిన కారణాలు లేకుండానే జీవించడం దారుణమైన అంశం.
ప్రపంచంలో విశ్వాసాన్ని కుదిపేయాలంటే ఎంత పెద్ద ప్రమాదం జరగాలో ఊహించుకోవల్సిందే. యూదుల సామూహిక హత్య అందుకు దారితీయలేదు. రవాణాలో తుడిచిపెట్టుకుపోయిన జనాన్ని చూసి అక్కడ కత్తులు దూసిన పురోహిత వర్గాలను గమనించి కూడా విశ్వాసం సడలలేదు. మశూచి వ్యాధివలన లక్షలాది మంది అందులో పసివారు 20వ శతాబ్దంలో చనిపోయారు. కనుక దేవుడు ఎలా చేస్తాడో తెలుసుకోజాలం అన్నారు. మత విశ్వాసాలకి ఏదీ పొందికగా లేదు.
అన్ని వర్గాలవారు ఒకరికొకరు అభయం ఇచ్చుకుంటూ మానవ బాధలకు దేవుడు బాధ్యుడు కాదని గట్టిగా చెప్పారు. అయినప్పుడు దేవుడు సర్వజ్ఞుడు, సర్వ శక్తివంతుడు ఎలా అవుతాడు. ఇది మత జ్ఞాన సమస్య. దేవుడు ఉంటే సామూహిక ప్రమాదాలను ఆపడానికి అతడు చేయగలిగింది ఏదీ లేదు. లేదా వాటిని పట్టించుకోడు. దేవుడు శక్తి లేనివాడయినా కావాలి. పాపాత్ముడయినా కావాలి. దేవుణ్ణి మానవ నైతిక ప్రమాణాలతో నిర్ధారించడానికి వీలులేదని అంటారు. అయితే దేవుడి నైతిక ప్రమాణాలను చూపడానికి దేవుడు మంచితనాన్ని నిర్ధారించడానికి మానవ ప్రమాణాలు వినియోగిస్తున్నారు. స్వలింగ సంపర్కుల మధ్య పెళ్ళి, అతనికి చేసే ప్రార్థనలు దేవుడు పట్టించుకుంటే అతడిని అర్థం చేసుకోవడం కష్టం కాదు.
బైబిలులో చెప్పిన దేవుడు కట్టుకథ. గ్రీకుల దేవుడు జ్యూస్ తదితర వేలాది మతప్రాయమైన దేవుళ్ళ వలె ఈ దేవుళ్ళను కూడా వివేక మానవులు అశ్రద్ధ చేయాలి. జ్యూస్ అనే దేవుడు లేడని రుజువు చేయగలవా? లేదు. అయితే ఇలాంటి సన్నివేశాన్ని ఊహించలేం. మనం ప్రాచీన గ్రీకుల కాలంలో ఉన్నామనుకోండి. ప్రజలు తమ ఆదాయంలో ఎంతో భాగాన్ని ఒలింపస్ పర్వతాలపై ఉన్న దేవుళ్లను సంతృప్తి పరచడానికి వెచ్చించారనుకోండి. ఆ దేవుళ్ళ పేరిట నెలకొన్న సమస్యల ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిందనుకోండి. లెక్కలేని ధనాన్ని, దేవాలయాలకు ఇచ్చారనుకోండి. ఇలియడ్, ఒడెస్సీల వరకు ఖర్చు పెడుతూ వైద్య పరిశోధనను నిలిపేశారనుకోండి. ప్రభుత్వ విధానాన్ని చర్చించకుండా ప్రాచీన రచయితలను సమర్ధించారనుకోండి. అటువంటి స్థితి వుంటే మన భౌతిక, నైతిక, మేథస్సు వనరులను దుర్వినియోగం చేసినట్లే. సరిగ్గా అలాంటి స్థితిలోనే నేడు మనం ఉన్నాము. విచారకరమైన నిర్హేతుకమైన ప్రపంచంలో మీరు మీ తోటి క్రైస్తవులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.
మనందరం చనిపోతాం. మనం ప్రేమించిందంతా కోల్పోతాం. బతికుండగానే ఎందరో బాధలకు లోనవుతారు. బాధలకు కారణం మతం అని సూటిగా చెప్పవచ్చు. మత ద్వేషాలు, మత యుద్ధాలు, మత నిషిద్ధాలు, మతం పేరిట వనరులను మళ్ళించటం జరుగుతూనే ఉన్నది. మత విశ్వాసాలు చిత్తశుద్ధితో విమర్శించడం నేడు నైతికంగా మేథస్సుతో అవసరమని భావించాలి. అలాంటి విమర్శలు నమ్మకం లేనివారిని సమాజానికి పణంగా అట్టిపెడుతున్నారు. వాస్తవానికి దగ్గరలో ఉన్నవారిని నేల విడిచి సాము చేస్తున్నట్లుగా పేర్కొంటున్నారు.


.

No comments:

Post a Comment