మతం, హింస, నాగరికత భవిష్యత్తు--క్రైస్తవం ఇంత అమానుషమా?

11వ భాగం

మతం, హింస, నాగరికత భవిష్యత్తు

సృష్టికర్త మీరు నమ్మిన పవిత్రగ్రంథాన్ని రాసినట్లు ఎందరో విశ్వసిస్తున్నారు. ఎన్నో పుస్తకాలు దైవం పేరిట వచ్చినట్లు చూపారు. మనం ఎలా బతకాలో ఆ పుస్తకాలు చెబుతున్నాయి. పోటీపడుతున్న మత సిద్ధాంతాలు మన ప్రపంచాన్ని విడదీసి వివిధ నైతిక సమాజాల పేరిట సంఘర్షణలకు దారి తీశాయి.
ఇందుకు బదులుగా కొంతమంది ఇంగిత జ్ఞానం కలవారు మత సహనం కావాలన్నారు. మత యుద్ధాలకంటే మత సహనం మంచిదే, కానీ ఈ సాధనలో సమస్యలున్నాయి. ఆలోచిస్తే మత ద్వేషం ప్రబలి పోతుందేమోనని, మతపరంగా దారుణమైన భావాలను కూడా అంటుకోవడంలేదు. మనలను మనమే మోసం చేసుకుంటూ మత విశ్వాసాలకు వైజ్ఞానిక వివేచనకు పొందిక ఉన్నదని సరిపెట్టుకుంటున్నాం. పోటీ పడుతున్న మత విషయాలు విశ్వవ్యాప్తమైన నాగరికత ఆవిర్భవించకుండా అడ్డుపడుతున్నాయి. మతవిశ్వాసం -  ఏ పేర పిలిచినా ఒకే దేవుడున్నాడనడం, జీసస్ మళ్ళీ భూమి మీదకు తిరిగి వస్తాడనడం, ముస్లింలలో ఆత్మాహుతి త్యాగులు సూటిగా స్వర్గానికి పోతారనడం, తప్పుద్రోవను పట్టించే మాటలు.
మతం మానవ సంఘర్షణను చాలా పై స్థాయిలో విజృంభింప చేస్తున్నది. ఆటవికతకు జాతి విద్వేషానికి, రాజకీయాలకు, ఇవి మించిపోయాయి. శాశ్వత శిక్షలు, పారితోషికాలు ఉంటాయనే ఆలోచనలతో మత భావాలు ప్రభావితం చేస్తున్నాయి. పిల్లల్ని మత విశ్వాసంతో భయం అనే వాతావరణంలో పెంచి అమానుషంగా పెంపొదిస్తున్నాం. మూఢ విశ్వాసం, భక్తి రెండు విధాల హింసను పురికొల్పుతున్నాయి. సృష్టికర్త చేయమన్నాడనే నెపంతో మత విశ్వాసులు ఇతర మతస్థుల్ని చంపుతున్నారు. ఇస్లాం టెర్రరిజం అందుకు ఉదాహరణ మతాన్నిబట్టి నీతిని నిర్ణయించే వారు తమ మతాన్ని అంగీకరించి ఇతర మతాలతో సంఘర్షణకు దిగుతున్నారు. ముస్లింలు అందరూ తోటి ముస్లింలతో చేతులు కలపడం అలాగే, ప్రొటస్టెంట్ లు, కాథలిక్ లు, తమ వారితో కలిసి ఇతరులతో పోట్లాడడం జరుగుతున్నది. ఇవి అన్నివేళలా మతం పేరిటే జరుగుతున్నట్లు అనిపించకపోవచ్చు, కాని మత విధానాల నుండి జనించిన ద్వేషం సంఘర్షణలకు దారి తీస్తున్నది. మత విద్వేషాలను భౌగోళిక పోరాటాల విలయతాండవం చేస్తున్నాయి. పాలస్తీనాలో యూదులు – ముస్లింలు, సనాతన సెర్బియన్లు – కాథలిక్ క్రొయేషియన్లు, సనాతన సెర్బియన్లు – బాసియన్లు – అల్బేరియన్ ముస్లింలు, ఉత్తర ఐర్లండ్ లో ప్రొటస్టెంట్ లు – కాథలిక్ లు, కాశ్మీర్ లో ముస్లింలు – హిందువులు, సూడాన్ లో ముస్లింలు – క్సైస్తవులు – యానిమిస్ట్ లు, నైజీరియాలో ముస్లింలు – క్రైస్తవులు, ఇథియోపియాలో అల్ట్రియాలో ముస్లింలు – క్రైస్తవులు, ఐవరీ కోర్టులో ముస్లింలు – క్రైస్తవులు, శ్రీలంకలో తమిళ హిందువులు, ఫిలిప్పైన్స్ లో ముస్లింలు – ఇరాన్ ఇరాక్ లో షియా-సున్నీలు, కాకసన్ లో సనాతన రష్యన్ లు చెచీన్ ముస్లింలు, ముస్లిం అజర్ బైజాన్ – కాథలిక్ – సలాముల ఆర్మేనియన్లు ఇటీవల మతపరంగా విజృంభించి కొట్టుకుంటున్నారు.
ఈ విధంగా మత చీలికలు స్పష్టంగా సంఘర్షణలకు దారి తీస్తుండగా, చాలామంది ఇంకా ఇదంతా చదువు లేనందువల్ల, పేదరికంవల్ల, రాజకీయాలవల్ల సంభవిస్తున్నాయని వివరిస్తున్నారు. నమ్మకం లేనివారు, ఉదారులు, మితవాదులు భావిస్తున్న తీరులో మత విశ్వాసాల పరంగా ఎవరూ జీవితాలను త్యాగం చేయబోవట్లేదు అని అనుకుంటున్నారు. స్వర్గంలో ఎలా ఉండబోతున్నారో వారికి తెలియదన్నమాట. అంటే స్వర్గాన్ని గురించి నిర్ధారణగా ఎవరికీ తెలియదని వారనుకుంటున్నారు. అమెరికాలో ప్రపంచ వాణిజ్య కేంద్రంపై సెప్టెంబరు 11న విమానాలతో దాడి చేసిన వారు కళాశాలలో చదువుకున్న మధ్యతరగతివారే. రాజకీయ అణచివేతకు గురయినవారు కాదు. స్వర్గంలో అమరజీవులుగా ఎలాంటి ఆనందాలు అనుభవిస్తారో వారు మసీదులలో కూర్చొని చర్చించుకున్నారు. జిహాద్ హింస కేవలం విద్యకు పేదరికానికి రాజకీయానికి సంబంధించింది కాదని ఎంతమంది గ్రహిస్తారు. తగిన వనరులు ఉండి మేథస్సు కలిగి న్యూక్లియర్ బాంబు తయారు చేస్తే అలాంటి వ్యక్తి స్వర్గానికి పోయి 72 కన్యలతో ఆనందించబోతున్నట్లు నమ్మకం పెరిగినవారు ఉన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి పాశ్చాత్యదేశాలలో సెక్యులరిస్టులు, ఉదారవాదులు, మితవాదులు ఇంకెంతో కాలం వేచి ఉండాలన్నారు. దేవుళ్ళ నమ్మకం అంటే ఎంత శక్తివంతమైనదో వారికి తెలియదు.
మతపరమైన యుద్ధాలను ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయికి తీసుకుపోతున్నాయో గమనించాలి. ముస్లింలు 1.4 బిలియన్లు ఉన్నారు. ప్రపంచంలో అందరూ ఇస్లాంలోకి మారతారని ముస్లిం రాజ్యంలోకి వస్తారని లేదంటే నమ్మకాలు లేని వారుగా చంపబడతారని భావిస్తున్నారు. యూరప్ లో ఇస్లాం అతి వేగంగా వ్యాపిస్తున్నది. ముస్లిమేతరులలో ఉన్నదానికంటే యూరోప్ ముస్లింలలో జనాభా 3 రెట్లు అధికంగా పెరుగుతున్నది. ఈ విధంగా కొనసాగితే 25 సంవత్సరాలలో ఫ్రాన్స్ లో అధిక సంఖ్యాకులు ముస్లింలు ఉంటారు. అది ప్రవాసుల రాకను ఆపేస్తేనే జరుగుతుంది. యూరోప్ లో ఉన్న ముస్లింలు ఆ దేశాల సెక్యులర్ పౌర విలువలను స్వీకరించడానికి సిద్ధపడడం లేదు. కాని ఆదేశాల విలువలను తమకు అనుకూలంగా వాడుకుంటూ తమ పట్ల జాలిచూపాలంటూ మసీదులలో మత ద్వేషాన్ని ప్రచారం చేస్తూ పోతున్నారు. సెక్యులర్ యూరప్ లో ఇస్లాం వాదన బలవంతపు వివాహాలు, గౌరవప్రదంగా హతమార్చడాలు, మూకుమ్మడిగా చెరచడాలు జరుగుతున్నాయి. (కుటుంబాలు ఏర్పాటు చేసిన పెళ్ళిళ్ళను నిరాకరించిన స్త్రీలను, విడాకులు కోరే స్త్రీలను, వ్యభిచరించిన స్త్రీలను పగవారుగా చూస్తున్నారు. అలాంటి స్త్రీలను వారి తండ్రులు భర్తలు తోబుట్టువులు చంపేస్తున్నారు. పైగా అదొక సంస్కృతిగా చెప్తున్నారు. ఇస్లాం ఈ ధోరణులను సమర్ధిస్తున్నది. స్త్రీలను కేవలం పురుషుల ఆస్తిగా పరిగణిస్తున్నారు. తనను చెరచినట్లు ఏ స్త్రీ అయినా చెబితే ఆమెను వ్యభిచారిణిగా ముద్రవేసి చంపుతున్నారు. వివాహము వెలుపల లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపిస్తున్నారు.) యూరోప్ లో జాతి విద్వేషం భయంతో రాజకీయంగా సక్రమ విధానాన్ని అనుసరిస్తున్నామని చూపడానికి చాలామంది మత తీవ్రవాదుల జోలికి పోవడంలేదు. యూరోప్ లో నేడు ఇస్లాం భీతికి వ్యతిరేకంగా నిలిచి మాట్లాడగలుగుతున్నవారు ఫాసిస్టులు మాత్రమే, మిగిలినవారు చెదురుమదురుగానే ఉన్నారు. ఈ ధోరణి నాగరికత భవిష్యత్తుకు మంచిది కాదు.
ఇస్లాం శాంతియుత మతం అని అతివాదులు దీనిని అపహరించుకు పోతున్నారని అనడం కేవలం భ్రమ మాత్రమే. అలాంటి భ్రమలో ఉండడం ముస్లిలకు కూడా ప్రమాదకరం. ముస్లింలతో ఈ విషయం సంభాషించడం చర్చకు దిగడం ఎలాగో స్పష్టపడలేదు. కాని ముస్లింల పట్ల భ్రమపూరితమైన ధోరణిలో ఉండడం మాత్రం తగిన పరిష్కారం కాదు. ముస్లిం ప్రపంచంలో సంఘర్షణలను చూస్తున్నారు. అలా చూడనివారిని ద్రోహులుగా అనుకుని ముస్లింలు చంపేస్తున్నారు.
మనం ముందుగా సహేతుకంగా లేకపోతే ముస్లిం ప్రపంచంతో హేతుబద్ధంగా ఎలా చర్చిస్తాం. మనందరం ఒకే దేవుని ఆరాధిస్తున్నామని చెబితే ఒరిగేదేమీ లేదు. మనం అందరం ఒకే దేవుణ్ణి ప్రార్థించడంలేదు. మతం పేరిట జరుగుతున్న రక్తపాతమే ఇందుకు ఉదాహరణ. ముస్లింలలో సైతం షియాలు సున్నీలు ఒకేదేవుణ్ణి, ఒకే తీరుగా ప్రార్థించలేకపోతున్నారు. ఆ విషయంలో శతాబ్దాలుగా చంపుకుంటున్నారు.
వివిధ మతాల మధ్య విబేధాలను పరిష్కరించడానికి పరస్పర మత చర్చలు దారితీస్తాయనుకోవడం పొరపాటు. ముస్లిం భక్తులకు వారి మతం సంపూర్ణమైనది. అందులో నుండి దారి తప్పితే నరకమే మార్గం. మతాల ప్రతినిధులు తరచూ సమావేశమై శాంతిని నెలకొల్పాలని వివిధ మతాల మధ్య దయ అనేది సాధారణ లక్షణంగా ఉండదని చెప్పటం పరిపాటి. కాని ఏ మతంలోనైనా ఆ మత నమ్మకం దృష్ట్యానే శాంతిని, దయను చూస్తారని మర్చిపోకూడదు. నీవు చెప్పే దయ అరబ్బు ప్రపంచంలో కాలు పెట్టక ముందు ఆహుతి కావడం అనేది లక్షలాది ముస్లింలు సిద్ధంగా ఉన్నారని విస్మరించవద్దు. మతాల మధ్య ఏ స్థాయిలోనైనా ప్రపంచానికి చెందిన దృక్పథాలు ఒక తీరుగా లేవని అవి పొసగవని గ్రహించకపోతే ఎలా? కోట్లాది ప్రజలు ఏది నమ్ముతున్నారో అనేది విడమరచి చూడాల్సిందే.

మూలం అనువాదం
శామ్ హారిస్ ఎన్. ఇన్నయ్య



.

No comments:

Post a Comment