క్రైస్తవం ఇంత అమానుషమా? శామ్ హారి- 10వ భాగం

10వ భాగం


భూమిమీద జీవితానికి సంబంధించిన క్లిష్టదశలన్నీ సాధారణ స్థితి నుండి అనేక సంవత్సరాలుగా పెంపొందుతూ వచ్చాయి. ఈ వాస్తవాన్ని నేడు ప్రశ్నించడంలేదు. మానవుడు అంతకుముందున్న జీవుల నుండి పరిణమించిన విషయం సందేహిస్తే, సూర్యుడు ఒక నక్షత్రం అనేది కూడా సందేహించినట్లే, సూర్యుడు సాధారణ నక్షత్రం వలె కనిపించడు. కానీ అది నక్షత్రం అని మనకు తెలుసు. భూమికి సన్నిహితంగా ఉన్న నక్షత్రం సూర్యుడే. సూర్యుడు నక్షత్రమే కాదని భావించి మత విశ్వాసంపై ఆధారపడిన ధోరణి ఊహించండి. అమెరికాలో లక్షలాది క్రైస్తవులు ఖగోళ శాస్త్రజ్ఞులను, ఖగోళ భౌతిక విజ్ఞానులను ఎదుర్కోవడానికి లక్షలాది డాలర్లు వెచ్చిస్తున్నారు. ఆధారాలు లేని విషయాలను సూర్యుడిని గురించి జాతీయ పాఠశాలలో బోధిస్తున్నారు. పరిణామాన్ని గురించి ఇలాంటి స్థితి ప్రస్తుతం కనిపిస్తున్నది.
పరిణామ వాస్తవాలను సందేహిస్తున్న క్రైస్తవులు అది వాస్తవం కాదని, ఒక సిద్ధాంతం మాత్రమేనని అంటుంటారు. వైజ్ఞానికంగా సిద్ధాంతం అనే మాటను తప్పుగా అర్థం చేసుకోవడం వారి ప్రకటనలో కనిపిస్తున్నది. సైన్సులో వాస్తవాలను ఇతర వాస్తవాల దృష్ట్యా వివరించాలి. ఇలా విస్తృతంగా వివరణ చేసుకుపోయే నమూనాలను సిద్ధాంతం అంటారు. ఆ సిద్దాంతం కొన్ని భవిష్య ప్రణాళికలు వేస్తాయి. వాటిని పరీక్షకు పెట్టాలి. పరిణామ సిద్ధాంతం అనేది వాస్తవం కాదనే అర్థం ఈ సిద్ధాంతంలో లేదు. రోగానికి సంబంధించిన సూక్ష్మజీవుల సిద్ధాంతం, లేదా గురుత్వాకర్షణ సిద్ధాంతం అంటే రోగాన్ని గురించి కాని, గురుత్వాకర్షణ గురించి కానీ సందేహిస్తున్నామని అర్థం కాదు.
బైబుల్ లో ఉన్న అస్థవ్యస్థమైన విషయాలను హేతుబద్ధంగా చెప్పడానికి శాస్త్రీయ భాషలు కొందరు కావాలని వాడారు. అలా చేసిన వారిలో కొందరు పిహెచ్.డి లు కూడా పొందారు. మరికొందరు వీరి అడుగుజాడలలో నడవవచ్చు కూడా. సాంకేతికంగా వారిని సైంటిస్టులు అనవచ్చు. కాని వారు సైంటిస్టుల వలె ప్రవర్తించడంలేదు. విశ్వాన్ని గురించి చిత్తశుద్దిగా వారు అన్వేషించడంలేదు. దేవుని గురించి వారు చెప్పే మాటలు డార్విన్ వైఫల్యాలను గురించి చేసే ప్రకటనలను పరిణామ సిద్ధాంత వివాదానికి సంబంధించినవి కావు. 2005లో 34 దేశాలలో పరిణామం ఏమేరకు ఆమోదిస్తున్నారని సర్వే చేశారు. అందులో అమెరికా 33వ స్థానంలో ఉన్నది. అమెరికాలో హైస్కూలు విద్యార్థులు సైన్సును లెక్కలను అర్థం చేసుకోవడంలో యూరోప్, ఆసియోలకంటే తక్కువ స్థాయిలో ఉన్నారు. మనం అమెరికాలో అజ్ఞాన నాగరికతను నిర్మించుకుంటున్నాం.
మనకు తెలిసింది ఇది. బైబిలు చెప్పేదానికంటే విశ్వం చాలా ప్రాచీనమైనది. భూమిపై సంక్లిష్టమైన జీవపదార్థాలు మానవునితో సహా లక్షలాది సంవత్సరాల నుండి పరిణమిస్తూ వచ్చాయి. ఇందుకు సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయి. మనం చూస్తున్న జీవిత వైవిధ్యం జన్యు సంకేతాలలో వ్యక్తమయింది. ఇది డిఎన్ఎ కణాలలో చూశాము. అవి యాదృచ్ఛికంగా గెంతులేస్తున్నాయి.  ఈ గెంతులేయడం మనుగడ సాగిస్తున్న జీవులలో పెరిగిపోతూనే ఉన్నాయి. ఒకానొక పరిణామం దృష్ట్యా పునరుత్పత్తి సాగుతున్నది. ఈ గెంతువేయడం సహజ ఎంపిక అనేవి ఏకాకిగా నిలిచిపోయిన జనాభాలో వారిలో వారు పెరగకుండా కొన్ని జీవులకే పరిమితమయి చాలా కాలం కొనసాగడం గమనార్హం. మానవులు పరిణామంలో ఈ విధంగా రావడం గమనించాం. జన్యు సాక్ష్యాధారాలుగా మనం కోతుల నుండి భాగం పంచుకున్న తీరు స్పష్టంగా బయటపడింది. జన్యు ఆధారాల పరంగా పూర్వీకులైన కోతులు వాటికి పూర్వీకులైన గబ్బిలాలు ఎగిరే పక్షులు ఇలా జన్యుపరిణామంలో భాగం పంచుకున్నాయి. జీవన శాఖోపశాఖలు పరిశీలిస్తే మౌలికంగా వాటి స్వభావాలు బాగా అర్థమవుతూ ఉన్నాయి. కనుక వ్యక్తిగతంగా కొన్ని జీవులు నేటి రూపంలో సృష్టి అయ్యాయి అనడానికి ఎలాంటి కారణం లేదు. పరిణామం ఎలా ప్రారంభం అయింది అనడం ఇంకా తెలియదు. దాని వెనక దైవం ఉన్నది అనుకోనక్కరలేదు. బైబిలును చదివితే జంతువులు చెట్లు దేవుడి సృష్టిగా పేర్కొన్నారు.  విషయంలో బైబిలు తప్పు అనడం సందేహించనక్కరలేదు.
చాలామంది క్రైస్తవులు పరిణామ వాస్తవాల్ని సందేహించదలచి, వివేచనాత్మక నమూనా పేరిట కొత్త వాదన చేస్తున్నారు. సైన్సుకు ముసుగు వేసి రాజకీయంగా మతపరంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడమే వీరి ఉద్దేశ్యం. బైబిల్ చెప్పే దేవుడిలో గట్టి నమ్మకం చూపలేక ప్రపంచంలో వైదొలగే అవగాహన పెరిగిపోతున్న సందర్భంలో వివేచనాత్మక నమూనా ఉన్నది అనేవారు తమ శాస్త్రీయ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు.
తెలివిగల నమూనా (ఇంటలిజంట్ డిజైన్) అనే వాదన చేసేవారు విశ్వం ఉనికికి వెనుక దేవుడున్నాడని నిర్ధారితమవుతుందని అంటున్నారు. వారి వాదన ఇలా ఉందిః ఉన్నదానినకి ఏదో ఒక కారణం ఉండి ఉండాలి. కాలం, ఆకాశం ఉన్నాయి. వాటి వెలుపల వాటికి ఏదో కారణం ఉండి ఉండాలి. వాటిని దాటిపోయి సృష్టించగల శక్తి దేవునికే ఉన్నది.  ఇలాంటి వాదన బావున్నదని చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నారు. అలాంటి వాదన చేసినప్పుడు ఇంకెంతో లోతుపాతులతో చర్చ అవసరం అవుతుంది. కాని వారు చెప్పే తీరులో తుది నిర్ణయం మాత్రం రాదు. కాలాకాశాలకు దేవుడే మూలం అని ఎలా చెప్పగలం మన విశ్వానికి నమూనా తెచ్చిపెట్టిన దేవుడు నిజమే అయితే, అది బైబిల్ లో చెప్పిన, క్రైస్తవులు ఆమోదించిన దేవుడు అని చెప్పనక్కరలేదు. తెలివిగా నమూనా రూపొందిస్తే మన విశ్వాన్ని లోకాతీత సూపర్ కంప్యూటర్ కూడా నడిపించవచ్చు. దుష్టదైవం ఆ పని చేయవచ్చు. విశ్వంతో ఆడుకునే ఇరువురు దేవుళ్లు ఇటువంటి పని చేయవచ్చు.
వాదనలో అనంతంగా వెనక్కుపోయే స్థితిని సృష్టికర్త భావనలో ఉన్నది. దేవుడు విశ్వాన్ని సృష్టిస్తే, దేవుణ్ణి ఎవరు సృష్టించాడు. మళ్ళీ దేవుడే అని సమాధానం ఇస్తే ప్రశ్న మొదటికి వస్తుంది. క్లిష్టమైన విశ్వాన్ని సృష్టించగల దేవుడు చాలా క్లిష్టమైనవాడుకావాలి. రిచర్డ్ డాకిన్స్ జీవ శాస్త్రజ్ఞుడిగా ఈ విషయంలో చెప్పినట్లు అటువంటి సహజ సంక్లిష్ట విధానాలు ఇప్పించగలిగింది పరిణామం మాత్రమే.
వాస్తవం ఏమంటే విశ్వం ఏ విధంగా, ఎందుకు వచ్చిందో తెలియదు. విశ్వ సృష్టిని గురించి పొందికగా మాట్లాడలేం. ఆ విషయాన్ని కాలంతో పోల్చి చెప్పవలసిందే. కాలం-ఆకాశం పుట్టుక గురించి మనం మాట్లాడుతున్నాం అన్నాడు (భౌతిక శాస్త్రజ్ఞుడు స్టీవెన్ హాకిన్స్ కాలాకాశాన్ని ఆద్యంతరహితమైన నాలుగు కోణాలమయంగా చెప్పాడు.) విశ్వం ఎందుకు ఉన్నదో తెలియదని చిత్తశుద్ధిగల మేధావి ఎవరైనా అంగీకరిస్తారు.  ఈ విషయంలో తమ అజ్ఞానాన్ని సైంటిస్టులు ఒప్పుకుంటారు. మత నమ్మకస్థులే ఒప్పుకోరు. మత చర్చలలో ఒక వైపున వినమ్రత, అణకువ ఉన్నట్లు తమలో తాము పొగుడుకుంటూనే సైంటిస్టులను, నమ్మకం లేనివారిని ఖండిస్తూ తలబిరుసుతనంతో ఉన్నారంటారు. మత నమ్మకస్థులు వెల్లడించే ప్రపంచ దృక్పథం వారి అహంభావానికి ప్రతీక. జుగుప్సాకరం కూడా, వారి దృష్టిలోః సృష్టికర్త నాపై శ్రద్ధ చూపుతాడు. నన్ను ఆమెదిస్తాడు, ప్రేమిస్తాడు, మరణానంతరం నాకు పారితోషికం అందిస్తాడు. పవిత్ర గ్రంథాల ఆధారంగా నవ్వుతున్న న్ను స్వీకరించి ఆ నమ్మనివారిని నరకంలోకి నెట్టేస్తాడు.
సాధారణ క్రైస్తవులు చర్చిలో ఆదివారాలు బోధలు విని తలబిరుసుతనం పెంపొందించుకుని ప్రవర్తిస్తారు. వైజ్ఞానిక విషయాలలో అలాంటి ధోరణి అనూహ్యం. తలబిరుసుతనంగల సైంటిస్టులలో సైతం ఆ ధోరణి ఉండదు.
భూమిపై పుట్టిన జీవులలో 99 శాతం నశించాయి కూడా తెలివిగల పథకం ప్రకారం సృష్టి జరగలేదనడానికి ఇదొక నిదర్శనం. ప్రకృతిని గమనిస్తే ఎంతో సంక్లిష్ట రీతులు చూడవచ్చు. ఇందులో పథకం ఏదీ లేదు. వచ్చిందే రావడం, వెనుకంజ వేయండ. అనవసర సంక్లిష్ట విషయాలు బాధలు, చాలా కనిపించాయి. ఎగరలేని పక్షులు ఉన్నాయి. కొన్ని రకాల చేపలకు కళ్ళు పనిచేయవు. లక్షలాది సంవత్సరాలుగా అవి చీకటిలో పరిణమించాయి. కొన్ని రకాల తిమింగలాలు పుట్టినప్పుడు పళ్ళను రూపొందించుకున్నాయి. అవి పెరిగి తరవాతనే తిరిగి వియోగంలోకి వస్తున్నాయి. తెలివిగా దేవుడు జీవులను భూమిపైన సృష్టిస్తే ఈ మార్మిక విషయాలకు అర్థం లేదు. పరిణామం దృష్ట్యా ఇందులో గందరగోళం పడాల్సింది ఏమీలేదు.
జీవశాస్త్రజ్ఞుడు జె.బి.ఎస్. హాల్దే చెబుతూ దేవుడు ఉంటే అతనికి తొలిచే పురుగుల పట్ల అపారమైన ప్రేమ ఉండి ఉండాలి అన్నాడు. అలాంటి మాటలు సృష్టివాదాన్ని చావు దెబ్బ తీశాయి. మూడు లక్షల ఏభయివేల తొలిచే పురుగుల రకాలు ఉన్నట్లు తేలింది. అయితే దేవుడికి వైరస్ అన్నా కాడు విపరీతమైన ప్రేమ ఉన్నట్లుంది. భూమి మీద ఉన్న వివిధ రకాల జంతువులలో ఒక్కొక్క దానికి పది తీరుల వైరస్ ఉన్నట్లు జీవ శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. ఇందులో కొన్ని హాని లేని వైరస్ లు. సంక్లిష్ట జీవులు ఆవిర్భవించడానికి కొన్ని వైరస్ లు తోడ్పడి ఉండవచ్చు. అయితే వైరస్ లు ఇతర జీవులను వినియోగించుకుంటాయి. మన కణాలను నాశనం చేస్తాయి. అదీ నిర్దయగా దారుణంగా నశింపచేస్తాయి. హెచ్.ఐ.వి. వైరస్ లు, హానికరమైన బాక్టీరియా పెంపొందుతున్నాయి. వీటికి విరుగుడుగా వస్తున్న మందులకు కట్టుబడకుండా వ్యాపిస్తున్నాయి. పరిణామ క్రమంలో వీటి గురించి ఊహించి వివరించారు. బైబిల్ లో అలాంటిది ఏమీ లేదు. మత విశ్వాసం  ఈ వాస్తవాలను ఎలా చెప్పగలుగుతుంది. వీటి వెనుక దయామయుడైన దేవుడున్నాడని అందులో ప్రయోజనం ఉన్నదని ఏవిధంగా చెబుతారు. దేవుడి అసమర్ధతకు మన శరీరాలే పెద్ద ఉదాహరణ. మన పిండాలలో తోకలు, సంచులు కోతికి ఉన్నట్లు జుట్టు ఉంటాయి. పుట్టుక ముందే అవి చనిపోతాయి కూడా. ఇందుకు పరిణామం జన్యు శాస్త్రం వివరణలు ఇచ్చింది. అదే తెలివిగల పథకం ప్రకారం సృష్టి జరిగి వుంటే మార్మికంగానే మిగిలిపోయి ఉండేవాళ్ళం. పురుషులకు మూత్రం ద్వారా ప్రోస్టేట్ గ్లాండ్ నుండి సూటిగా వెడుతుంది. ఇది జీవిత పర్యంతం ఉబ్బిపోతూనే ఉంటుంది. అరవై ఏళ్ళ తరవాత చాలామందికి  ఈ శారీరక పరిణామం కనిపిస్తుంది. ఇందులో దేవుడి తెలివిగల సృష్టే లేదు. స్త్రీల విషయంలో కూడా ప్రసవించడానికి తోడ్పడే రీతిలో అంగాలు లేవు. దీని ఫలితంగా చాలామంది స్త్రీలలో పిస్టులా పెంపొందుతున్నది. అలా ఉన్నప్పుడు వెనుకబడిన దేశాలలో భర్తలు ఆ స్త్రీలను వెలేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల వివరణబట్టి 20 లక్షల మంది స్త్రీలు ఇటువంటి పిస్టులా (భగంధరవ్యాధి)తో బాధపడుతున్నారు. ఇటువంటి వ్యాధికి శస్త్ర చికిత్స ఉండదు. ప్రార్థనలు చేస్తే అది పోదు. ప్రార్థనలతో చాలా వ్యాధులు పోతాయని విశ్వాసపాత్రులు నమ్ముతారు. ప్రార్థన పరిమిత వ్యాధులకు పనిచేస్తుందని అంటుంటారు. తెగిపడిన కాలు లేదా అంగం ప్రార్థనతో మళ్ళీరాదు. ఎందుకని... ప్రార్థనలకు దేవుడు స్పందిస్తే తెగిపడిన అంగాలను ఎందుకు తీసుకురాలేడు. ప్రార్థన వలన అలాంటివి సంభవమేనని నమ్మకస్తులు ఎందుకు అనుకోరు. దీనిని వివరించే వెబ్ సైట్ చూడండి. (www.whydoesgodhateamputees.com) దేవుడి తెలివిలేని పథకానికి ఉదారహరణ చెప్పాలంటే పెద్ద పుస్తకమే రాయాల్సి ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పి ఈ అంశాన్ని ముగిస్తాను. ఊపిరి తిత్తులు శ్వాసకోశం రెండూ భాగం పంచుకునే వాహిక గొంతులో ఉన్నది. దీనివలన సృష్టి నమూనాలలో ఎంత జరుగుతున్నదో చెప్పాలంటే, అమెరికాలోనే వేలాది మంది పిల్లలు ఏటా అత్యవసర చికిత్సకు ఆస్పత్రిపాలవుతుంటారు. కొంతమంది ఊపిరాడక చనిపోతుంటారు. మరి కొందరు మెదడు జబ్బులకు గురవుతున్నారు. ఇందులో భగవంతుడి దయ ఏమిటి? బహుశ భగవంతుడు ఒక ఉద్దేశ్యంతో చేసినట్లు ఊహించవచ్చు. అటువంటి బాధలకు లోనయిన పిల్లల తల్లిదండ్రులకు దేవుడు గుణపాఠం చెప్పదలచుకున్నారు. గొంతులో ఊపిరాడక చనిపోయిన పిల్లలకు స్వర్గంలో ప్రత్యేక స్థానం ఏర్పరచాడేమో. అయితే ఇటువంటి దురుద్దేశాలు ఏవిధంగా హేతుబద్ధంగా వివరిస్తారు. అలాంటి వివరణలో నీతి ఏమిటి?

.

No comments:

Post a Comment