ముగింపు-శామ్ హారిస్ --Letter to Christian Nation




21వ శతాబ్దంలో మానవులు ఎదుర్కొంటున్న పెద్ద నాగరిక సమస్యలు ఉన్నాయి. నీతి ఆధ్యాత్మిక అనుభవం మానవుల బాధలు ఇందులో ప్రధానాంశాలు. నిశిత పరిశీలన చిత్తశుద్ధితో ఈ సమస్యల్ని చర్చించాలి. ఇందులో మత విశ్వాసం గౌరవిస్తూనే చర్చ జరగాలి.
మతాన్ని మన మధ్య నుండి తొలగించే అవకాశం కనిపించడం లేదు. 18వ శతాబ్దంలో బానిసత్వం తొలగించాలని అంటే ఆనాడు అటువంటి అవకాశాలు కనిపించలేదు. 1775లో అమెరికాలో బానిసత్వాన్ని రూపుమాపాలంటే ఆనాడు అలా అన్నవారు కాలం వృధా చేసుకుంటున్నానని భావించారు. ఈ పోలిక సరైనదని కాకపోవచ్చు. ఇదొక సూచన ప్రాయంగా చెప్పే విషయమే. మున్ముందు మనం మతాన్ని దాటిపోయి వెనక్కు తిరిగి చూసుకుంటే మానవచరిత్ర అంత భయానకంగా ఉండేదా? అని ఆశ్చర్యపడతాం, 21వ శతాబ్దంలో ఇలాంటి నమ్మకాలు ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతాం. దేవుడు స్వర్గం పేరిట సమాజంలో అంత ప్రమాదకరంగా ఎలా చీలిపోయాయి అనుకుంటాం. 1859లో డార్విన్ జీవుల పుట్టుపూర్వోత్తరాలు ప్రచురిస్తుంటే అదే సంవత్సరంలో అమెరికాకు బానిసలతో కూడ చివరి ఓడ వచ్చి చేరింది.
మనం మానవ జీవితంలో పుట్టుక వివాహం మరణం వంటివి గమనిస్తూనే మార్పులను చేసుకుంటూ సాగిపోవాలి. పిల్లల్ని క్రైస్తవులుగా ముస్లింలుగా, యూదులుగా పెంచే అసహ్యకర పద్ధతిని దాటి పోవాలి. ప్రపంచంలో ప్రమాదకరంగా దెబ్బతీసిన వాటిని నయం చేసుకుంటూ సమాజాన్ని నిర్మించాలి.
క్రీస్తును ఆమోదించడంతోపాటు జీవితంలో కొన్ని ప్రత్యక్ష మార్పులు జరిగాయి. తోటివారిని అనూహ్యంగా నేడు ప్రేమిస్తున్నారు. ప్రార్థిస్తున్నప్పుడు దివ్య భావనలు పొందుతున్నారు. అటువంటి అనుభవాలను నేను వెక్కిరించడంలేదు. కాని మీతోపాటు అదే సమయంలో ఇతరచోట్ల కోట్లాదిమంది వారి అనుభవాలను చవి చూస్తున్నారని గుర్తుంచుకోవాలి. కృష్ణుడు, అల్లా, బుద్ధుడు మొదలైన వారిని గురించి ఆలోచిస్తున్నవారిని మనసులో పెట్టుకోవాలి. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నవారిని, కళలు, సంగీతం సమకూరుస్తున్నవారిని విస్మరించరాదు. జీవితాలలో మార్పు చేసుకున్నవారి అనుభవాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. వారికి వారి అనుభవాలపట్ల భ్రమలుండొచ్చు. విశ్వాన్ని గురించి అవగాహన చేసుకున్న వానికంటే ఇంకెంతో జీవితం ఉన్నదనుకోవచ్చు. అంతమాత్రాన విశ్వంపట్ల సమర్ధనీయం కాని విషయాలను అవలంబించరాదు.
మతానికి విజ్ఞానానికి ఉన్న విచక్షణ, నైతికాంశాలను దూరం చేసేది కాదు. ఆధ్యాత్మిక అనుభవాలు పక్కన పెట్టడం కాదు. మనం హేతుబద్ధంగా చిత్తశుద్ధితో ఎలాంటి నిర్ణయాలకు వస్తున్నామనేది ముఖ్యం. బుద్ధుడు, జీసస్ మానవుల శక్తియుక్తుల గురించి ప్రస్తావించి మన జీవితాలను ఆనందమయంగా మార్పు చేసుకోవచ్చు అన్నారు. అటువంటి ప్రమాణాలే, స్వీయ విమర్శలే మన చర్చలలోనూ రావాలి.
పరిణామంలో గతం నుండి లోతుపాతులతో మతం జనించింది. చరిత్రకు ముందు మానవులను పొందికగా నడిపించడానికి మతం ప్రధాన పాత్ర వహించిందని రూథర్ ఊహించాడు. ఇటువంటి ప్రయోజనం నేను ఉన్నది అనలేం. చెరచడం దుర్వ్యసనం. అంతమాత్రాన అది మంచిదే అనలేం. సభ్య సమాజంలో అది ఇమిడిపోయింది అనలేం. మన పూర్వీకులలో పరిణామ క్రమంలో అటువంటి చర్య కొన్ని అవకాశాలను ఇచ్చి ఉండవచ్చు. గతంలో మతం కొన్ని అవసరాలను తీర్చింది అన్నంత మాత్రాన సరిపోదు. నేడు విశ్వనాగరికతను నిర్వహించడానికి ప్రధానంగా అడ్డు వస్తున్నది మతమే.
లోగడ ఎందరో మతాన్ని అద్భుతంగా ఎదుర్కొంటూ విమర్శించారు. దేవుడు అస్తమించాడు. అని మా పాఠశాలలో చాటలేకపోయాం. మతం పేరిట మన నాయకులు ఘంటాపథంగా చెప్పే విషయాలు గొప్పవి. మన మీడియా విమర్శించలేకపోయింది. దేవుడి విషయంలో ప్రతి సమాజం దారుణంగా విఫలం అయింది. ఆ భావాన్ని గందరగోళంగా ప్రచారం చేసేవారిని ఎండగట్టలేకపోయింది.
ముస్లిం దాడులు చేస్తూ జాతి యావత్తూ నశించాలని నినాదాలిస్తుంటే నమ్మకం లేనివారు చూస్తూ అవాక్కయిపోయారు. అలాగే మత భ్రమలను సేవిస్తూ మానవుడు బాధల్ని, విస్మరిస్తున్నవారిని చూస్తున్నా అవాక్కయిపోతున్నారు. ఊహించుకున్న దేవుణ్ణి అంటిపెట్టుకున్నవారిని చూసినా అవాక్కయి పోతున్నారు. అలాంటి వారిని ఉద్దేశించి ఆశ్చర్యంతో విలువైన ఫలితం ఉండకపోతుందా అనే ఆశతో ఈ లేఖ రాశాను.
        మూలం                                   అనువాదం
        శామ్ హారిస్    ఎన్. ఇన్నయ్య

No comments:

Post a Comment