సప్త పర్ణి
భావలహరి
ఇది ఏ డుగురు సోదరీ మణులు రాసిన స్వీయ కవితల సంపుటి.
అన్నపూర్ణ, రమా సుందరి, ఉమాదేవి, నాగలక్ష్మి, ప్రభావతి, గాయత్రి, గీతాభవాని రాసి 2012 ఆగస్ట్ లొ వెలువరించారు .
ఈ సప్తపర్ణిలో రెండు ప్రత్యేకతలున్నాయి. ఏ డుగురు అక్కచెల్లెళ్ళు కవిత లల్లగలగడం .రెండు-వారి కవితలు ఒకే సంకలనంగా తీసుకరావడం.
సప్తపర్ణిని పరిచయం చేయడంలో నాకు నచ్చిన కవితలు చూపి మెచ్చుకోవడమే ప్రధానం. విమర్శ భాగాన్ని శ్రి మైనంపాటి భాస్కర్ తన ముందు, వెనుక మాటలో సద్విమర్శగా చేశారు.
ఇక వివరాలు:
అన్నపూర్ణ (పెద్దక్క) తన ముందు మాటలో తమందరికీ సాహిత్యంలో అభిరుచి తమ తండ్రి సుబ్బారావు (రాజు) గారి ద్వారా కలిగితే , కవితలు రాయడానికి తమ తల్లి సుబ్బులక్ష్మి (అమ్మాజీ) గారి ప్రోత్సాహం తోద్పడిందన్నారు .
తల్లి వారిని సప్తస్వరాలుగా భావించి వారిలో సంగీతం ,సాహిత్యం పట్ల ప్రేమను పెంచారన్నారు .
అన్నపూర్ణ తమ 53 కవితలను మనకందించారు .జాతస్య మరణం ధ్రువం లో తండ్రి అకాల మరణం మిగిల్చిన తీరని లోటును వ్యధాభరితంగా చెప్పారు .
`రాక్షస ఉగాదికి రమ్యాకాంక్ష ` లో స్వార్థపరులైన రాజకీయనాయకుల గురించి రాస్తూ ,వారికి ఓ టు వేసి గెలిపించి తాము ఓ డిపోయిన సామాన్య మానవులను సమ్రక్షించమంటున్నారు ఇలా :
రాబందులకూ, గుంటనక్కలకూ
నువు రాక్షసివని
అందుక్కే ఆకంక్షిస్తున్నాను నీ రాజ్యం
రామ రాజ్యం కావాలని
సవాలు లో ఆమె ప్రశ్నలు :
`సగటుమనిషి జీవితం ఎంత పెట్టి గుణిస్తే
పూర్తి జీవితం అవుతుంది ?
ఎందరు సూర్యులు ఎన్ని సార్లు ఉదయిస్తే
చీకటి బ్రతుకులు తెల్లవారతాయి?
న్యాయన్యాయాలు , అలిఖితం, చాయచాయ, సహజీవన సౌభాగ్యం, సమాజానికి సంజీవి , నత్తల్లారా బయటకు రండి, మొదలైనవెన్నో కవితలు చదివి ఆనందించదగ్గవి .
రమాసుందరి
తమ తల్లిదండ్రుల నుండి సంక్రమించిన సాహిత్య పరిమళం అక్క అన్నపూర్ణ ద్వారా జీవితమంతా గుభళిస్తుందంటున్నారు. పద్య సాహిత్యం అంటే మక్కువ, చందోబద్దంగా కవిత్వం రాయాలన్న తపన -రెండూ జోడై తనతో రాయించాయంటున్నారు .తోచీ తోచక కొన్ని, ఉత్చాహంతో కొన్ని ,ఉక్రోషం తో మరికొన్ని రాశినవి మొత్తం 36 కవితలు మనల్ని చదవమంటున్నారు .యువకవులు- నవకవులు, ఆశీస్సులు (చెల్లి ప్రభావతికి),తుంటరి అక్క చందమామ ఒంటరి అని రాస్తే , తాను తుంటరి అని రాశారు ). అదర్శంలో -
నాముందువాళ్ళు నాకోసం పరచిన బాట
భావితరాలకు బంగారు బాటగా చేస్తా
నా జీవితం నాది కాదు పదిమందిదీ
నా సుఖం నాది కాదు నావారందరిదీ
అంటూ నిస్వార్థతను వ్యక్తం చేశారు.
పట్టుకొమ్మలో -
నల్లధనం వద్దట,నల్లధనమైనా ముద్దట
లావయితే వద్దట, మాలావైన సంపాదన కావాలట
ఫట్టులాంటి చిత్తమున్న చిన్నదాని ఎన్నిక
ఎప్పటికైనా మాదేనా? అని ఆవెదన వ్యక్తం చేశారు.
సన్మాన సం రంభంలో -ఈ నాటి సన్మాన సభల తంతు , తీరూ , తెన్నూ అద్దం పట్టినట్లు చూపారు . ఆమె కవితలన్ని చదవదగినవే .
ఉమాదేవి
తన కవితలకు అన్నపూర్ణక్క స్పూర్తి అన్నారు. తన అక్క చెల్లెళ్ళు ఇంద్రధనస్సులో సప్త వర్ణాల్లా
అందరూ రాసిన ఈ కకవితా ఖండిక తాము ఆనందం కోసం రాశినవి, మరి కొంతమందిని ఆనందపరిచే విధంగా పుస్తకరూపం దాల్చడం చాలా ఆనందం అంటున్నారు .
మొదటి కవిత `పర్యవసానం` లో
చెడును మంచితో వంచించాలని
మాటలో కరుకుదనం కట్టిపెట్టి
మ్రు దుత్వాన్ని పెంపొందించుకోవాలని
మరెన్నో అనుకొంటునా నేను
అని తాను అశ పడుతుంటే లోకం తనని స్వార్థమంటున్నదంటారు .
స్వస్వరూపంలో
నేను మానవుడిని
ఆద్యంతాలమధ్య ఆదర్శ పాలన కోసం
అందులోని ఆనందం కోసం
అలమటించే అతి సామాన్య మానవుడిని
అంటూ సామాన్యుడి కోరికను వ్యక్తం చేశారు. బంగారు బుజ్జిగాడా మీరేమంటారో, చిరుదీపం మొదలైన కవితలన్నీ చదివి ఆనందించవచ్చు .
నాగలక్ష్మి
సాహితీ సమాఖ్యల మీటింగులకెళ్ళడం, అక్కల ప్రభావం ,బి.ఎ.లో స్పెషల్ తెలుగు చదవడం -అన్నీ ఆమెతో కవితలు రాయించాయి . తనలోనూ కవితా స్పూర్తి వున్నందుకు ఆనందిస్తామంటున్నారు . ఇందులో ఏ డు కవితలు పొందు పరిచారు .
ఉగాదిలో :
ఏ డాదికో బారసాల చేసుకుంటూ
తెలుగు జీవితంలో నవ నవోన్మెషంతో
నూతన చైతన్యాన్నందిస్తున్న నీకు ఇదే
స్వాగతాంజలి
అంటూ ఉగాదిని ఆహ్వానించారు .
కలల పూదోటలో తానూ ఒక పూ వునవగలిగితే ఎంత బాగుంటుందో అని ఊహా జగత్తులో విహరించారు .
తెలుగు లో
తేట తెలుగు తెల్లన
అమ్మ మనస్సు చల్లన
తెలుగు కూడ అమ్మ అని
తెలుసుకొని మసలరా
అంటూ తన మాత్రు భాషాభి మానాన్ని ముద్దుగా తెలిపారు. ఇంకా -
కాలచక్రం , అభినందనలు ,నీనీలి ఆకాశం
వంటి కవితలలో తన పటిమ చాటారు నాగలక్ష్మి .
ప్రభావతి
రాయడం కన్నా చిత్రలెఖనం మీద మక్కువ ఉంటాన ద్రుష్తి అటు సారించానంటున్నారు .తన భావాలకు అక్షర రూపాలే తన ఈ కవితలన్నారు .జ్ఞాపకాల ఝరితో ప్రారంభించి -రాగ రాగిణి తో కలిపి పది కవితలు మనముందుంచారు .
ప్లాస్టిక్ పూలలో ఇలా వర్ణించారు .
మితి మీరిన చైతన్యంలో
జడ మనస్సుడైన ప్రతీకలు
తెలిసిందిలే , నిరీక్షణా , నీ కోసం జీవన రాగాలు
అంటూ చక్కని కవితలందించారు .
రాణీ గాయత్రి
జీవితంలో చమక్కులీ కవితలన్నారీమె . చురుక్కులూ ,కొంటె వ్యాఖ్యానాలు ,కొద్దిగా చివుక్కు మనిపించే భావాలు వున్నాయన్నారు. ఆస్వాదించి, ఆశీర్వదించమంటున్నారు .
అమ్మ కవిత లో
అమ్మ నన్ను వదలి
అల్లంత దూరాన చల్లగా నవ్వెను
అమ్మ ప్రేమను నేను
అందరకూ పంచాను
అంటూ మనసుకు చల్లదనం పంచారు.
`మా అక్కలు` లో
మా అక్కలు అనురాగపు మొక్కలు
ఊహ కందని అమ్మా నాన్నల స్తానంలో నిలిచిన పెద్ద దిక్కులు
మా చెక్కిళ్ళ్లపై విరబూసిన పూవుల సుగంధాలు
అంటూ రాసి అక్కలకు క్రుతగ్న తలు తెలిపారు.
సంక్రాంతి, బాల శివుదు, శివ తత్వం
ఇందులో కూర్చారు .
గీతా భవాని
రాయడం ఎప్పుడు మొదలు పెట్టానో గుర్తు లేదంటూనే 13 కవితలు పైగా రాసి మనల్ని చదవమంటున్నారు.
దాహం, వాన, తీయని నిజం, బాల్యం, ఆకలి, చిన్నచిన్న గా ముద్దు ముద్దుగా ఇక్కడ దర్శనమిచ్చాయి .
రాచపీడలో ఇలా వేడుకున్నారు .
వారసత్వపు రాజకీయాల బారినుండి
దేవుడా రక్షించు ఈ దేశాన్ని
కోర్కెల కర్కశ హస్తాలనుండి
సన్యాసి ముఠాల సర్కస్లనుండి
రక్షించు రాజకీయ రాక్షసులనుండి .
`మా స్నేహం` చక్కని కవిత.
అక్క చెల్లెళ్ళందరూ అమ్మ ,. రాగ రాగిణి రాశారు తమ తమ కవితా పటిమ ప్రతిభ ఫలించేలా.
అన్నపూర్న గారి `సహ జీవన సౌభాగ్యం`(72 పుట) ప్రభావతి గారి నాకోరిక( 175 పేజి) ఒకటె- పేరు తేడాగా ఉన్నా.ప్రభావతి కవిత `నిరీక్షణ`( 171 పేజ్) ,`నీ కోసం`(పేజ్ 172) రెండూ ఒకటే . రెండవ ముద్రణలో సవరిందుకోవచ్చు.
కవితా ప్రియులందరూ `సప్తపర్ణి` చదవదగ్గది. నవ కవులకూ, యువకవులకూ స్పూర్థి దాయకం ఇది. అక్కచెల్లెళ్ళు మరెన్నో కవితలల్లాలని ఆశిద్దాము .
2012 లో వెలువడిన ఈ గ్రంధం వెల పెట్టలేదు .లభించే చోటు తెలిపితే బాగుంటుంది.
పరిచయం : కోమల వెనిగళ్ళ
అమెరికాలో మేరీ లాండ్ లో వుంటున్నారు .
యంగ్ చాంగ్ , అయన్ హర్షి అలి, తస్లిమ నశ్రిన్ ,ఎం.ఎన్.రాయ్ రచనలు కొన్ని అనువదించి ప్రచురించారు . హైదరాబాద్ ఓపెన్ యూని వర్శిటి లో ఇంగ్లిష్ ప్రొఫెసర్ గా రెటైర్ అయ్యారు.
భావలహరి
ఇది ఏ డుగురు సోదరీ మణులు రాసిన స్వీయ కవితల సంపుటి.
అన్నపూర్ణ, రమా సుందరి, ఉమాదేవి, నాగలక్ష్మి, ప్రభావతి, గాయత్రి, గీతాభవాని రాసి 2012 ఆగస్ట్ లొ వెలువరించారు .
ఈ సప్తపర్ణిలో రెండు ప్రత్యేకతలున్నాయి. ఏ డుగురు అక్కచెల్లెళ్ళు కవిత లల్లగలగడం .రెండు-వారి కవితలు ఒకే సంకలనంగా తీసుకరావడం.
సప్తపర్ణిని పరిచయం చేయడంలో నాకు నచ్చిన కవితలు చూపి మెచ్చుకోవడమే ప్రధానం. విమర్శ భాగాన్ని శ్రి మైనంపాటి భాస్కర్ తన ముందు, వెనుక మాటలో సద్విమర్శగా చేశారు.
ఇక వివరాలు:
అన్నపూర్ణ (పెద్దక్క) తన ముందు మాటలో తమందరికీ సాహిత్యంలో అభిరుచి తమ తండ్రి సుబ్బారావు (రాజు) గారి ద్వారా కలిగితే , కవితలు రాయడానికి తమ తల్లి సుబ్బులక్ష్మి (అమ్మాజీ) గారి ప్రోత్సాహం తోద్పడిందన్నారు .
తల్లి వారిని సప్తస్వరాలుగా భావించి వారిలో సంగీతం ,సాహిత్యం పట్ల ప్రేమను పెంచారన్నారు .
అన్నపూర్ణ తమ 53 కవితలను మనకందించారు .జాతస్య మరణం ధ్రువం లో తండ్రి అకాల మరణం మిగిల్చిన తీరని లోటును వ్యధాభరితంగా చెప్పారు .
`రాక్షస ఉగాదికి రమ్యాకాంక్ష ` లో స్వార్థపరులైన రాజకీయనాయకుల గురించి రాస్తూ ,వారికి ఓ టు వేసి గెలిపించి తాము ఓ డిపోయిన సామాన్య మానవులను సమ్రక్షించమంటున్నారు ఇలా :
రాబందులకూ, గుంటనక్కలకూ
నువు రాక్షసివని
అందుక్కే ఆకంక్షిస్తున్నాను నీ రాజ్యం
రామ రాజ్యం కావాలని
సవాలు లో ఆమె ప్రశ్నలు :
`సగటుమనిషి జీవితం ఎంత పెట్టి గుణిస్తే
పూర్తి జీవితం అవుతుంది ?
ఎందరు సూర్యులు ఎన్ని సార్లు ఉదయిస్తే
చీకటి బ్రతుకులు తెల్లవారతాయి?
న్యాయన్యాయాలు , అలిఖితం, చాయచాయ, సహజీవన సౌభాగ్యం, సమాజానికి సంజీవి , నత్తల్లారా బయటకు రండి, మొదలైనవెన్నో కవితలు చదివి ఆనందించదగ్గవి .
రమాసుందరి
తమ తల్లిదండ్రుల నుండి సంక్రమించిన సాహిత్య పరిమళం అక్క అన్నపూర్ణ ద్వారా జీవితమంతా గుభళిస్తుందంటున్నారు. పద్య సాహిత్యం అంటే మక్కువ, చందోబద్దంగా కవిత్వం రాయాలన్న తపన -రెండూ జోడై తనతో రాయించాయంటున్నారు .తోచీ తోచక కొన్ని, ఉత్చాహంతో కొన్ని ,ఉక్రోషం తో మరికొన్ని రాశినవి మొత్తం 36 కవితలు మనల్ని చదవమంటున్నారు .యువకవులు- నవకవులు, ఆశీస్సులు (చెల్లి ప్రభావతికి),తుంటరి అక్క చందమామ ఒంటరి అని రాస్తే , తాను తుంటరి అని రాశారు ). అదర్శంలో -
నాముందువాళ్ళు నాకోసం పరచిన బాట
భావితరాలకు బంగారు బాటగా చేస్తా
నా జీవితం నాది కాదు పదిమందిదీ
నా సుఖం నాది కాదు నావారందరిదీ
అంటూ నిస్వార్థతను వ్యక్తం చేశారు.
పట్టుకొమ్మలో -
నల్లధనం వద్దట,నల్లధనమైనా ముద్దట
లావయితే వద్దట, మాలావైన సంపాదన కావాలట
ఫట్టులాంటి చిత్తమున్న చిన్నదాని ఎన్నిక
ఎప్పటికైనా మాదేనా? అని ఆవెదన వ్యక్తం చేశారు.
సన్మాన సం రంభంలో -ఈ నాటి సన్మాన సభల తంతు , తీరూ , తెన్నూ అద్దం పట్టినట్లు చూపారు . ఆమె కవితలన్ని చదవదగినవే .
ఉమాదేవి
తన కవితలకు అన్నపూర్ణక్క స్పూర్తి అన్నారు. తన అక్క చెల్లెళ్ళు ఇంద్రధనస్సులో సప్త వర్ణాల్లా
అందరూ రాసిన ఈ కకవితా ఖండిక తాము ఆనందం కోసం రాశినవి, మరి కొంతమందిని ఆనందపరిచే విధంగా పుస్తకరూపం దాల్చడం చాలా ఆనందం అంటున్నారు .
మొదటి కవిత `పర్యవసానం` లో
చెడును మంచితో వంచించాలని
మాటలో కరుకుదనం కట్టిపెట్టి
మ్రు దుత్వాన్ని పెంపొందించుకోవాలని
మరెన్నో అనుకొంటునా నేను
అని తాను అశ పడుతుంటే లోకం తనని స్వార్థమంటున్నదంటారు .
స్వస్వరూపంలో
నేను మానవుడిని
ఆద్యంతాలమధ్య ఆదర్శ పాలన కోసం
అందులోని ఆనందం కోసం
అలమటించే అతి సామాన్య మానవుడిని
అంటూ సామాన్యుడి కోరికను వ్యక్తం చేశారు. బంగారు బుజ్జిగాడా మీరేమంటారో, చిరుదీపం మొదలైన కవితలన్నీ చదివి ఆనందించవచ్చు .
నాగలక్ష్మి
సాహితీ సమాఖ్యల మీటింగులకెళ్ళడం, అక్కల ప్రభావం ,బి.ఎ.లో స్పెషల్ తెలుగు చదవడం -అన్నీ ఆమెతో కవితలు రాయించాయి . తనలోనూ కవితా స్పూర్తి వున్నందుకు ఆనందిస్తామంటున్నారు . ఇందులో ఏ డు కవితలు పొందు పరిచారు .
ఉగాదిలో :
ఏ డాదికో బారసాల చేసుకుంటూ
తెలుగు జీవితంలో నవ నవోన్మెషంతో
నూతన చైతన్యాన్నందిస్తున్న నీకు ఇదే
స్వాగతాంజలి
అంటూ ఉగాదిని ఆహ్వానించారు .
కలల పూదోటలో తానూ ఒక పూ వునవగలిగితే ఎంత బాగుంటుందో అని ఊహా జగత్తులో విహరించారు .
తెలుగు లో
తేట తెలుగు తెల్లన
అమ్మ మనస్సు చల్లన
తెలుగు కూడ అమ్మ అని
తెలుసుకొని మసలరా
అంటూ తన మాత్రు భాషాభి మానాన్ని ముద్దుగా తెలిపారు. ఇంకా -
కాలచక్రం , అభినందనలు ,నీనీలి ఆకాశం
వంటి కవితలలో తన పటిమ చాటారు నాగలక్ష్మి .
ప్రభావతి
రాయడం కన్నా చిత్రలెఖనం మీద మక్కువ ఉంటాన ద్రుష్తి అటు సారించానంటున్నారు .తన భావాలకు అక్షర రూపాలే తన ఈ కవితలన్నారు .జ్ఞాపకాల ఝరితో ప్రారంభించి -రాగ రాగిణి తో కలిపి పది కవితలు మనముందుంచారు .
ప్లాస్టిక్ పూలలో ఇలా వర్ణించారు .
మితి మీరిన చైతన్యంలో
జడ మనస్సుడైన ప్రతీకలు
తెలిసిందిలే , నిరీక్షణా , నీ కోసం జీవన రాగాలు
అంటూ చక్కని కవితలందించారు .
రాణీ గాయత్రి
జీవితంలో చమక్కులీ కవితలన్నారీమె . చురుక్కులూ ,కొంటె వ్యాఖ్యానాలు ,కొద్దిగా చివుక్కు మనిపించే భావాలు వున్నాయన్నారు. ఆస్వాదించి, ఆశీర్వదించమంటున్నారు .
అమ్మ కవిత లో
అమ్మ నన్ను వదలి
అల్లంత దూరాన చల్లగా నవ్వెను
అమ్మ ప్రేమను నేను
అందరకూ పంచాను
అంటూ మనసుకు చల్లదనం పంచారు.
`మా అక్కలు` లో
మా అక్కలు అనురాగపు మొక్కలు
ఊహ కందని అమ్మా నాన్నల స్తానంలో నిలిచిన పెద్ద దిక్కులు
మా చెక్కిళ్ళ్లపై విరబూసిన పూవుల సుగంధాలు
అంటూ రాసి అక్కలకు క్రుతగ్న తలు తెలిపారు.
సంక్రాంతి, బాల శివుదు, శివ తత్వం
ఇందులో కూర్చారు .
గీతా భవాని
రాయడం ఎప్పుడు మొదలు పెట్టానో గుర్తు లేదంటూనే 13 కవితలు పైగా రాసి మనల్ని చదవమంటున్నారు.
దాహం, వాన, తీయని నిజం, బాల్యం, ఆకలి, చిన్నచిన్న గా ముద్దు ముద్దుగా ఇక్కడ దర్శనమిచ్చాయి .
రాచపీడలో ఇలా వేడుకున్నారు .
వారసత్వపు రాజకీయాల బారినుండి
దేవుడా రక్షించు ఈ దేశాన్ని
కోర్కెల కర్కశ హస్తాలనుండి
సన్యాసి ముఠాల సర్కస్లనుండి
రక్షించు రాజకీయ రాక్షసులనుండి .
`మా స్నేహం` చక్కని కవిత.
అక్క చెల్లెళ్ళందరూ అమ్మ ,. రాగ రాగిణి రాశారు తమ తమ కవితా పటిమ ప్రతిభ ఫలించేలా.
అన్నపూర్న గారి `సహ జీవన సౌభాగ్యం`(72 పుట) ప్రభావతి గారి నాకోరిక( 175 పేజి) ఒకటె- పేరు తేడాగా ఉన్నా.ప్రభావతి కవిత `నిరీక్షణ`( 171 పేజ్) ,`నీ కోసం`(పేజ్ 172) రెండూ ఒకటే . రెండవ ముద్రణలో సవరిందుకోవచ్చు.
కవితా ప్రియులందరూ `సప్తపర్ణి` చదవదగ్గది. నవ కవులకూ, యువకవులకూ స్పూర్థి దాయకం ఇది. అక్కచెల్లెళ్ళు మరెన్నో కవితలల్లాలని ఆశిద్దాము .
2012 లో వెలువడిన ఈ గ్రంధం వెల పెట్టలేదు .లభించే చోటు తెలిపితే బాగుంటుంది.
పరిచయం : కోమల వెనిగళ్ళ
అమెరికాలో మేరీ లాండ్ లో వుంటున్నారు .
యంగ్ చాంగ్ , అయన్ హర్షి అలి, తస్లిమ నశ్రిన్ ,ఎం.ఎన్.రాయ్ రచనలు కొన్ని అనువదించి ప్రచురించారు . హైదరాబాద్ ఓపెన్ యూని వర్శిటి లో ఇంగ్లిష్ ప్రొఫెసర్ గా రెటైర్ అయ్యారు.