క్రైస్తవం ఇంత అమానుషమా-ముగింపు


21వ శతాబ్దంలో మానవులు ఎదుర్కొంటున్న పెద్ద నాగరిక సమస్యలు ఉన్నాయి. నీతి ఆధ్యాత్మిక అనుభవం మానవుల బాధలు ఇందులో ప్రధానాంశాలు. నిశిత పరిశీలన చిత్తశుద్ధితో ఈ సమస్యల్ని చర్చించాలి. ఇందులో మత విశ్వాసం గౌరవిస్తూనే చర్చ జరగాలి.
మతాన్ని మన మధ్య నుండి తొలగించే అవకాశం కనిపించడం లేదు. 18వ శతాబ్దంలో బానిసత్వం తొలగించాలని అంటే ఆనాడు అటువంటి అవకాశాలు కనిపించలేదు. 1775లో అమెరికాలో బానిసత్వాన్ని రూపుమాపాలంటే ఆనాడు అలా అన్నవారు కాలం వృధా చేసుకుంటున్నానని భావించారు. ఈ పోలిక సరైనదని కాకపోవచ్చు. ఇదొక సూచన ప్రాయంగా చెప్పే విషయమే. మున్ముందు మనం మతాన్ని దాటిపోయి వెనక్కు తిరిగి చూసుకుంటే మానవచరిత్ర అంత భయానకంగా ఉండేదా? అని ఆశ్చర్యపడతాం, 21వ శతాబ్దంలో ఇలాంటి నమ్మకాలు ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతాం. దేవుడు స్వర్గం పేరిట సమాజంలో అంత ప్రమాదకరంగా ఎలా చీలిపోయాయి అనుకుంటాం. 1859లో డార్విన్ జీవుల పుట్టుపూర్వోత్తరాలు ప్రచురిస్తుంటే అదే సంవత్సరంలో అమెరికాకు బానిసలతో కూడ చివరి ఓడ వచ్చి చేరింది.
మనం మానవ జీవితంలో పుట్టుక వివాహం మరణం వంటివి గమనిస్తూనే మార్పులను చేసుకుంటూ సాగిపోవాలి. పిల్లల్ని క్రైస్తవులుగా ముస్లింలుగా, యూదులుగా పెంచే అసహ్యకర పద్ధతిని దాటి పోవాలి. ప్రపంచంలో ప్రమాదకరంగా దెబ్బతీసిన వాటిని నయం చేసుకుంటూ సమాజాన్ని నిర్మించాలి.
క్రీస్తును ఆమోదించడంతోపాటు జీవితంలో కొన్ని ప్రత్యక్ష మార్పులు జరిగాయి. తోటివారిని అనూహ్యంగా నేడు ప్రేమిస్తున్నారు. ప్రార్థిస్తున్నప్పుడు దివ్య భావనలు పొందుతున్నారు. అటువంటి అనుభవాలను నేను వెక్కిరించడంలేదు. కాని మీతోపాటు అదే సమయంలో ఇతరచోట్ల కోట్లాదిమంది వారి అనుభవాలను చవి చూస్తున్నారని గుర్తుంచుకోవాలి. కృష్ణుడు, అల్లా, బుద్ధుడు మొదలైన వారిని గురించి ఆలోచిస్తున్నవారిని మనసులో పెట్టుకోవాలి. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నవారిని, కళలు, సంగీతం సమకూరుస్తున్నవారిని విస్మరించరాదు. జీవితాలలో మార్పు చేసుకున్నవారి అనుభవాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. వారికి వారి అనుభవాలపట్ల భ్రమలుండొచ్చు. విశ్వాన్ని గురించి అవగాహన చేసుకున్న వానికంటే ఇంకెంతో జీవితం ఉన్నదనుకోవచ్చు. అంతమాత్రాన విశ్వంపట్ల సమర్ధనీయం కాని విషయాలను అవలంబించరాదు.
మతానికి విజ్ఞానానికి ఉన్న విచక్షణ, నైతికాంశాలను దూరం చేసేది కాదు. ఆధ్యాత్మిక అనుభవాలు పక్కన పెట్టడం కాదు. మనం హేతుబద్ధంగా చిత్తశుద్ధితో ఎలాంటి నిర్ణయాలకు వస్తున్నామనేది ముఖ్యం. బుద్ధుడు, జీసస్ మానవుల శక్తియుక్తుల గురించి ప్రస్తావించి మన జీవితాలను ఆనందమయంగా మార్పు చేసుకోవచ్చు అన్నారు. అటువంటి ప్రమాణాలే, స్వీయ విమర్శలే మన చర్చలలోనూ రావాలి.
పరిణామంలో గతం నుండి లోతుపాతులతో మతం జనించింది. చరిత్రకు ముందు మానవులను పొందికగా నడిపించడానికి మతం ప్రధాన పాత్ర వహించిందని రూథర్ ఊహించాడు. ఇటువంటి ప్రయోజనం నేను ఉన్నది అనలేం. చెరచడం దుర్వ్యసనం. అంతమాత్రాన అది మంచిదే అనలేం. సభ్య సమాజంలో అది ఇమిడిపోయింది అనలేం. మన పూర్వీకులలో పరిణామ క్రమంలో అటువంటి చర్య కొన్ని అవకాశాలను ఇచ్చి ఉండవచ్చు. గతంలో మతం కొన్ని అవసరాలను తీర్చింది అన్నంత మాత్రాన సరిపోదు. నేడు విశ్వనాగరికతను నిర్వహించడానికి ప్రధానంగా అడ్డు వస్తున్నది మతమే.
లోగడ ఎందరో మతాన్ని అద్భుతంగా ఎదుర్కొంటూ విమర్శించారు. దేవుడు అస్తమించాడు. అని మా పాఠశాలలో చాటలేకపోయాం. మతం పేరిట మన నాయకులు ఘంటాపథంగా చెప్పే విషయాలు గొప్పవి. మన మీడియా విమర్శించలేకపోయింది. దేవుడి విషయంలో ప్రతి సమాజం దారుణంగా విఫలం అయింది. ఆ భావాన్ని గందరగోళంగా ప్రచారం చేసేవారిని ఎండగట్టలేకపోయింది.
ముస్లిం దాడులు చేస్తూ జాతి యావత్తూ నశించాలని నినాదాలిస్తుంటే నమ్మకం లేనివారు చూస్తూ అవాక్కయిపోయారు. అలాగే మత భ్రమలను సేవిస్తూ మానవుడు బాధల్ని, విస్మరిస్తున్నవారిని చూస్తున్నా అవాక్కయిపోతున్నారు. ఊహించుకున్న దేవుణ్ణి అంటిపెట్టుకున్నవారిని చూసినా అవాక్కయిపోతున్నారు. అలాంటి వారిని ఉద్దేశించి ఆశ్చర్యంతో విలువైన ఫలితం ఉండకపోతుందా అనే ఆశతో ఈ లేఖ రాశాను.

మూలం                                   అనువాదం

    శామ్ హారిస్                             ఎన్. ఇన్నయ్య

మతం, హింస, నాగరికత భవిష్యత్తు--క్రైస్తవం ఇంత అమానుషమా?

11వ భాగం

మతం, హింస, నాగరికత భవిష్యత్తు

సృష్టికర్త మీరు నమ్మిన పవిత్రగ్రంథాన్ని రాసినట్లు ఎందరో విశ్వసిస్తున్నారు. ఎన్నో పుస్తకాలు దైవం పేరిట వచ్చినట్లు చూపారు. మనం ఎలా బతకాలో ఆ పుస్తకాలు చెబుతున్నాయి. పోటీపడుతున్న మత సిద్ధాంతాలు మన ప్రపంచాన్ని విడదీసి వివిధ నైతిక సమాజాల పేరిట సంఘర్షణలకు దారి తీశాయి.
ఇందుకు బదులుగా కొంతమంది ఇంగిత జ్ఞానం కలవారు మత సహనం కావాలన్నారు. మత యుద్ధాలకంటే మత సహనం మంచిదే, కానీ ఈ సాధనలో సమస్యలున్నాయి. ఆలోచిస్తే మత ద్వేషం ప్రబలి పోతుందేమోనని, మతపరంగా దారుణమైన భావాలను కూడా అంటుకోవడంలేదు. మనలను మనమే మోసం చేసుకుంటూ మత విశ్వాసాలకు వైజ్ఞానిక వివేచనకు పొందిక ఉన్నదని సరిపెట్టుకుంటున్నాం. పోటీ పడుతున్న మత విషయాలు విశ్వవ్యాప్తమైన నాగరికత ఆవిర్భవించకుండా అడ్డుపడుతున్నాయి. మతవిశ్వాసం -  ఏ పేర పిలిచినా ఒకే దేవుడున్నాడనడం, జీసస్ మళ్ళీ భూమి మీదకు తిరిగి వస్తాడనడం, ముస్లింలలో ఆత్మాహుతి త్యాగులు సూటిగా స్వర్గానికి పోతారనడం, తప్పుద్రోవను పట్టించే మాటలు.
మతం మానవ సంఘర్షణను చాలా పై స్థాయిలో విజృంభింప చేస్తున్నది. ఆటవికతకు జాతి విద్వేషానికి, రాజకీయాలకు, ఇవి మించిపోయాయి. శాశ్వత శిక్షలు, పారితోషికాలు ఉంటాయనే ఆలోచనలతో మత భావాలు ప్రభావితం చేస్తున్నాయి. పిల్లల్ని మత విశ్వాసంతో భయం అనే వాతావరణంలో పెంచి అమానుషంగా పెంపొదిస్తున్నాం. మూఢ విశ్వాసం, భక్తి రెండు విధాల హింసను పురికొల్పుతున్నాయి. సృష్టికర్త చేయమన్నాడనే నెపంతో మత విశ్వాసులు ఇతర మతస్థుల్ని చంపుతున్నారు. ఇస్లాం టెర్రరిజం అందుకు ఉదాహరణ మతాన్నిబట్టి నీతిని నిర్ణయించే వారు తమ మతాన్ని అంగీకరించి ఇతర మతాలతో సంఘర్షణకు దిగుతున్నారు. ముస్లింలు అందరూ తోటి ముస్లింలతో చేతులు కలపడం అలాగే, ప్రొటస్టెంట్ లు, కాథలిక్ లు, తమ వారితో కలిసి ఇతరులతో పోట్లాడడం జరుగుతున్నది. ఇవి అన్నివేళలా మతం పేరిటే జరుగుతున్నట్లు అనిపించకపోవచ్చు, కాని మత విధానాల నుండి జనించిన ద్వేషం సంఘర్షణలకు దారి తీస్తున్నది. మత విద్వేషాలను భౌగోళిక పోరాటాల విలయతాండవం చేస్తున్నాయి. పాలస్తీనాలో యూదులు – ముస్లింలు, సనాతన సెర్బియన్లు – కాథలిక్ క్రొయేషియన్లు, సనాతన సెర్బియన్లు – బాసియన్లు – అల్బేరియన్ ముస్లింలు, ఉత్తర ఐర్లండ్ లో ప్రొటస్టెంట్ లు – కాథలిక్ లు, కాశ్మీర్ లో ముస్లింలు – హిందువులు, సూడాన్ లో ముస్లింలు – క్సైస్తవులు – యానిమిస్ట్ లు, నైజీరియాలో ముస్లింలు – క్రైస్తవులు, ఇథియోపియాలో అల్ట్రియాలో ముస్లింలు – క్రైస్తవులు, ఐవరీ కోర్టులో ముస్లింలు – క్రైస్తవులు, శ్రీలంకలో తమిళ హిందువులు, ఫిలిప్పైన్స్ లో ముస్లింలు – ఇరాన్ ఇరాక్ లో షియా-సున్నీలు, కాకసన్ లో సనాతన రష్యన్ లు చెచీన్ ముస్లింలు, ముస్లిం అజర్ బైజాన్ – కాథలిక్ – సలాముల ఆర్మేనియన్లు ఇటీవల మతపరంగా విజృంభించి కొట్టుకుంటున్నారు.
ఈ విధంగా మత చీలికలు స్పష్టంగా సంఘర్షణలకు దారి తీస్తుండగా, చాలామంది ఇంకా ఇదంతా చదువు లేనందువల్ల, పేదరికంవల్ల, రాజకీయాలవల్ల సంభవిస్తున్నాయని వివరిస్తున్నారు. నమ్మకం లేనివారు, ఉదారులు, మితవాదులు భావిస్తున్న తీరులో మత విశ్వాసాల పరంగా ఎవరూ జీవితాలను త్యాగం చేయబోవట్లేదు అని అనుకుంటున్నారు. స్వర్గంలో ఎలా ఉండబోతున్నారో వారికి తెలియదన్నమాట. అంటే స్వర్గాన్ని గురించి నిర్ధారణగా ఎవరికీ తెలియదని వారనుకుంటున్నారు. అమెరికాలో ప్రపంచ వాణిజ్య కేంద్రంపై సెప్టెంబరు 11న విమానాలతో దాడి చేసిన వారు కళాశాలలో చదువుకున్న మధ్యతరగతివారే. రాజకీయ అణచివేతకు గురయినవారు కాదు. స్వర్గంలో అమరజీవులుగా ఎలాంటి ఆనందాలు అనుభవిస్తారో వారు మసీదులలో కూర్చొని చర్చించుకున్నారు. జిహాద్ హింస కేవలం విద్యకు పేదరికానికి రాజకీయానికి సంబంధించింది కాదని ఎంతమంది గ్రహిస్తారు. తగిన వనరులు ఉండి మేథస్సు కలిగి న్యూక్లియర్ బాంబు తయారు చేస్తే అలాంటి వ్యక్తి స్వర్గానికి పోయి 72 కన్యలతో ఆనందించబోతున్నట్లు నమ్మకం పెరిగినవారు ఉన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి పాశ్చాత్యదేశాలలో సెక్యులరిస్టులు, ఉదారవాదులు, మితవాదులు ఇంకెంతో కాలం వేచి ఉండాలన్నారు. దేవుళ్ళ నమ్మకం అంటే ఎంత శక్తివంతమైనదో వారికి తెలియదు.
మతపరమైన యుద్ధాలను ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయికి తీసుకుపోతున్నాయో గమనించాలి. ముస్లింలు 1.4 బిలియన్లు ఉన్నారు. ప్రపంచంలో అందరూ ఇస్లాంలోకి మారతారని ముస్లిం రాజ్యంలోకి వస్తారని లేదంటే నమ్మకాలు లేని వారుగా చంపబడతారని భావిస్తున్నారు. యూరప్ లో ఇస్లాం అతి వేగంగా వ్యాపిస్తున్నది. ముస్లిమేతరులలో ఉన్నదానికంటే యూరోప్ ముస్లింలలో జనాభా 3 రెట్లు అధికంగా పెరుగుతున్నది. ఈ విధంగా కొనసాగితే 25 సంవత్సరాలలో ఫ్రాన్స్ లో అధిక సంఖ్యాకులు ముస్లింలు ఉంటారు. అది ప్రవాసుల రాకను ఆపేస్తేనే జరుగుతుంది. యూరోప్ లో ఉన్న ముస్లింలు ఆ దేశాల సెక్యులర్ పౌర విలువలను స్వీకరించడానికి సిద్ధపడడం లేదు. కాని ఆదేశాల విలువలను తమకు అనుకూలంగా వాడుకుంటూ తమ పట్ల జాలిచూపాలంటూ మసీదులలో మత ద్వేషాన్ని ప్రచారం చేస్తూ పోతున్నారు. సెక్యులర్ యూరప్ లో ఇస్లాం వాదన బలవంతపు వివాహాలు, గౌరవప్రదంగా హతమార్చడాలు, మూకుమ్మడిగా చెరచడాలు జరుగుతున్నాయి. (కుటుంబాలు ఏర్పాటు చేసిన పెళ్ళిళ్ళను నిరాకరించిన స్త్రీలను, విడాకులు కోరే స్త్రీలను, వ్యభిచరించిన స్త్రీలను పగవారుగా చూస్తున్నారు. అలాంటి స్త్రీలను వారి తండ్రులు భర్తలు తోబుట్టువులు చంపేస్తున్నారు. పైగా అదొక సంస్కృతిగా చెప్తున్నారు. ఇస్లాం ఈ ధోరణులను సమర్ధిస్తున్నది. స్త్రీలను కేవలం పురుషుల ఆస్తిగా పరిగణిస్తున్నారు. తనను చెరచినట్లు ఏ స్త్రీ అయినా చెబితే ఆమెను వ్యభిచారిణిగా ముద్రవేసి చంపుతున్నారు. వివాహము వెలుపల లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపిస్తున్నారు.) యూరోప్ లో జాతి విద్వేషం భయంతో రాజకీయంగా సక్రమ విధానాన్ని అనుసరిస్తున్నామని చూపడానికి చాలామంది మత తీవ్రవాదుల జోలికి పోవడంలేదు. యూరోప్ లో నేడు ఇస్లాం భీతికి వ్యతిరేకంగా నిలిచి మాట్లాడగలుగుతున్నవారు ఫాసిస్టులు మాత్రమే, మిగిలినవారు చెదురుమదురుగానే ఉన్నారు. ఈ ధోరణి నాగరికత భవిష్యత్తుకు మంచిది కాదు.
ఇస్లాం శాంతియుత మతం అని అతివాదులు దీనిని అపహరించుకు పోతున్నారని అనడం కేవలం భ్రమ మాత్రమే. అలాంటి భ్రమలో ఉండడం ముస్లిలకు కూడా ప్రమాదకరం. ముస్లింలతో ఈ విషయం సంభాషించడం చర్చకు దిగడం ఎలాగో స్పష్టపడలేదు. కాని ముస్లింల పట్ల భ్రమపూరితమైన ధోరణిలో ఉండడం మాత్రం తగిన పరిష్కారం కాదు. ముస్లిం ప్రపంచంలో సంఘర్షణలను చూస్తున్నారు. అలా చూడనివారిని ద్రోహులుగా అనుకుని ముస్లింలు చంపేస్తున్నారు.
మనం ముందుగా సహేతుకంగా లేకపోతే ముస్లిం ప్రపంచంతో హేతుబద్ధంగా ఎలా చర్చిస్తాం. మనందరం ఒకే దేవుని ఆరాధిస్తున్నామని చెబితే ఒరిగేదేమీ లేదు. మనం అందరం ఒకే దేవుణ్ణి ప్రార్థించడంలేదు. మతం పేరిట జరుగుతున్న రక్తపాతమే ఇందుకు ఉదాహరణ. ముస్లింలలో సైతం షియాలు సున్నీలు ఒకేదేవుణ్ణి, ఒకే తీరుగా ప్రార్థించలేకపోతున్నారు. ఆ విషయంలో శతాబ్దాలుగా చంపుకుంటున్నారు.
వివిధ మతాల మధ్య విబేధాలను పరిష్కరించడానికి పరస్పర మత చర్చలు దారితీస్తాయనుకోవడం పొరపాటు. ముస్లిం భక్తులకు వారి మతం సంపూర్ణమైనది. అందులో నుండి దారి తప్పితే నరకమే మార్గం. మతాల ప్రతినిధులు తరచూ సమావేశమై శాంతిని నెలకొల్పాలని వివిధ మతాల మధ్య దయ అనేది సాధారణ లక్షణంగా ఉండదని చెప్పటం పరిపాటి. కాని ఏ మతంలోనైనా ఆ మత నమ్మకం దృష్ట్యానే శాంతిని, దయను చూస్తారని మర్చిపోకూడదు. నీవు చెప్పే దయ అరబ్బు ప్రపంచంలో కాలు పెట్టక ముందు ఆహుతి కావడం అనేది లక్షలాది ముస్లింలు సిద్ధంగా ఉన్నారని విస్మరించవద్దు. మతాల మధ్య ఏ స్థాయిలోనైనా ప్రపంచానికి చెందిన దృక్పథాలు ఒక తీరుగా లేవని అవి పొసగవని గ్రహించకపోతే ఎలా? కోట్లాది ప్రజలు ఏది నమ్ముతున్నారో అనేది విడమరచి చూడాల్సిందే.

మూలం అనువాదం
శామ్ హారిస్ ఎన్. ఇన్నయ్య



.

క్రైస్తవం ఇంత అమానుషమా? శామ్ హారి- 10వ భాగం

10వ భాగం


భూమిమీద జీవితానికి సంబంధించిన క్లిష్టదశలన్నీ సాధారణ స్థితి నుండి అనేక సంవత్సరాలుగా పెంపొందుతూ వచ్చాయి. ఈ వాస్తవాన్ని నేడు ప్రశ్నించడంలేదు. మానవుడు అంతకుముందున్న జీవుల నుండి పరిణమించిన విషయం సందేహిస్తే, సూర్యుడు ఒక నక్షత్రం అనేది కూడా సందేహించినట్లే, సూర్యుడు సాధారణ నక్షత్రం వలె కనిపించడు. కానీ అది నక్షత్రం అని మనకు తెలుసు. భూమికి సన్నిహితంగా ఉన్న నక్షత్రం సూర్యుడే. సూర్యుడు నక్షత్రమే కాదని భావించి మత విశ్వాసంపై ఆధారపడిన ధోరణి ఊహించండి. అమెరికాలో లక్షలాది క్రైస్తవులు ఖగోళ శాస్త్రజ్ఞులను, ఖగోళ భౌతిక విజ్ఞానులను ఎదుర్కోవడానికి లక్షలాది డాలర్లు వెచ్చిస్తున్నారు. ఆధారాలు లేని విషయాలను సూర్యుడిని గురించి జాతీయ పాఠశాలలో బోధిస్తున్నారు. పరిణామాన్ని గురించి ఇలాంటి స్థితి ప్రస్తుతం కనిపిస్తున్నది.
పరిణామ వాస్తవాలను సందేహిస్తున్న క్రైస్తవులు అది వాస్తవం కాదని, ఒక సిద్ధాంతం మాత్రమేనని అంటుంటారు. వైజ్ఞానికంగా సిద్ధాంతం అనే మాటను తప్పుగా అర్థం చేసుకోవడం వారి ప్రకటనలో కనిపిస్తున్నది. సైన్సులో వాస్తవాలను ఇతర వాస్తవాల దృష్ట్యా వివరించాలి. ఇలా విస్తృతంగా వివరణ చేసుకుపోయే నమూనాలను సిద్ధాంతం అంటారు. ఆ సిద్దాంతం కొన్ని భవిష్య ప్రణాళికలు వేస్తాయి. వాటిని పరీక్షకు పెట్టాలి. పరిణామ సిద్ధాంతం అనేది వాస్తవం కాదనే అర్థం ఈ సిద్ధాంతంలో లేదు. రోగానికి సంబంధించిన సూక్ష్మజీవుల సిద్ధాంతం, లేదా గురుత్వాకర్షణ సిద్ధాంతం అంటే రోగాన్ని గురించి కాని, గురుత్వాకర్షణ గురించి కానీ సందేహిస్తున్నామని అర్థం కాదు.
బైబుల్ లో ఉన్న అస్థవ్యస్థమైన విషయాలను హేతుబద్ధంగా చెప్పడానికి శాస్త్రీయ భాషలు కొందరు కావాలని వాడారు. అలా చేసిన వారిలో కొందరు పిహెచ్.డి లు కూడా పొందారు. మరికొందరు వీరి అడుగుజాడలలో నడవవచ్చు కూడా. సాంకేతికంగా వారిని సైంటిస్టులు అనవచ్చు. కాని వారు సైంటిస్టుల వలె ప్రవర్తించడంలేదు. విశ్వాన్ని గురించి చిత్తశుద్దిగా వారు అన్వేషించడంలేదు. దేవుని గురించి వారు చెప్పే మాటలు డార్విన్ వైఫల్యాలను గురించి చేసే ప్రకటనలను పరిణామ సిద్ధాంత వివాదానికి సంబంధించినవి కావు. 2005లో 34 దేశాలలో పరిణామం ఏమేరకు ఆమోదిస్తున్నారని సర్వే చేశారు. అందులో అమెరికా 33వ స్థానంలో ఉన్నది. అమెరికాలో హైస్కూలు విద్యార్థులు సైన్సును లెక్కలను అర్థం చేసుకోవడంలో యూరోప్, ఆసియోలకంటే తక్కువ స్థాయిలో ఉన్నారు. మనం అమెరికాలో అజ్ఞాన నాగరికతను నిర్మించుకుంటున్నాం.
మనకు తెలిసింది ఇది. బైబిలు చెప్పేదానికంటే విశ్వం చాలా ప్రాచీనమైనది. భూమిపై సంక్లిష్టమైన జీవపదార్థాలు మానవునితో సహా లక్షలాది సంవత్సరాల నుండి పరిణమిస్తూ వచ్చాయి. ఇందుకు సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయి. మనం చూస్తున్న జీవిత వైవిధ్యం జన్యు సంకేతాలలో వ్యక్తమయింది. ఇది డిఎన్ఎ కణాలలో చూశాము. అవి యాదృచ్ఛికంగా గెంతులేస్తున్నాయి.  ఈ గెంతులేయడం మనుగడ సాగిస్తున్న జీవులలో పెరిగిపోతూనే ఉన్నాయి. ఒకానొక పరిణామం దృష్ట్యా పునరుత్పత్తి సాగుతున్నది. ఈ గెంతువేయడం సహజ ఎంపిక అనేవి ఏకాకిగా నిలిచిపోయిన జనాభాలో వారిలో వారు పెరగకుండా కొన్ని జీవులకే పరిమితమయి చాలా కాలం కొనసాగడం గమనార్హం. మానవులు పరిణామంలో ఈ విధంగా రావడం గమనించాం. జన్యు సాక్ష్యాధారాలుగా మనం కోతుల నుండి భాగం పంచుకున్న తీరు స్పష్టంగా బయటపడింది. జన్యు ఆధారాల పరంగా పూర్వీకులైన కోతులు వాటికి పూర్వీకులైన గబ్బిలాలు ఎగిరే పక్షులు ఇలా జన్యుపరిణామంలో భాగం పంచుకున్నాయి. జీవన శాఖోపశాఖలు పరిశీలిస్తే మౌలికంగా వాటి స్వభావాలు బాగా అర్థమవుతూ ఉన్నాయి. కనుక వ్యక్తిగతంగా కొన్ని జీవులు నేటి రూపంలో సృష్టి అయ్యాయి అనడానికి ఎలాంటి కారణం లేదు. పరిణామం ఎలా ప్రారంభం అయింది అనడం ఇంకా తెలియదు. దాని వెనక దైవం ఉన్నది అనుకోనక్కరలేదు. బైబిలును చదివితే జంతువులు చెట్లు దేవుడి సృష్టిగా పేర్కొన్నారు.  విషయంలో బైబిలు తప్పు అనడం సందేహించనక్కరలేదు.
చాలామంది క్రైస్తవులు పరిణామ వాస్తవాల్ని సందేహించదలచి, వివేచనాత్మక నమూనా పేరిట కొత్త వాదన చేస్తున్నారు. సైన్సుకు ముసుగు వేసి రాజకీయంగా మతపరంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడమే వీరి ఉద్దేశ్యం. బైబిల్ చెప్పే దేవుడిలో గట్టి నమ్మకం చూపలేక ప్రపంచంలో వైదొలగే అవగాహన పెరిగిపోతున్న సందర్భంలో వివేచనాత్మక నమూనా ఉన్నది అనేవారు తమ శాస్త్రీయ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు.
తెలివిగల నమూనా (ఇంటలిజంట్ డిజైన్) అనే వాదన చేసేవారు విశ్వం ఉనికికి వెనుక దేవుడున్నాడని నిర్ధారితమవుతుందని అంటున్నారు. వారి వాదన ఇలా ఉందిః ఉన్నదానినకి ఏదో ఒక కారణం ఉండి ఉండాలి. కాలం, ఆకాశం ఉన్నాయి. వాటి వెలుపల వాటికి ఏదో కారణం ఉండి ఉండాలి. వాటిని దాటిపోయి సృష్టించగల శక్తి దేవునికే ఉన్నది.  ఇలాంటి వాదన బావున్నదని చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నారు. అలాంటి వాదన చేసినప్పుడు ఇంకెంతో లోతుపాతులతో చర్చ అవసరం అవుతుంది. కాని వారు చెప్పే తీరులో తుది నిర్ణయం మాత్రం రాదు. కాలాకాశాలకు దేవుడే మూలం అని ఎలా చెప్పగలం మన విశ్వానికి నమూనా తెచ్చిపెట్టిన దేవుడు నిజమే అయితే, అది బైబిల్ లో చెప్పిన, క్రైస్తవులు ఆమోదించిన దేవుడు అని చెప్పనక్కరలేదు. తెలివిగా నమూనా రూపొందిస్తే మన విశ్వాన్ని లోకాతీత సూపర్ కంప్యూటర్ కూడా నడిపించవచ్చు. దుష్టదైవం ఆ పని చేయవచ్చు. విశ్వంతో ఆడుకునే ఇరువురు దేవుళ్లు ఇటువంటి పని చేయవచ్చు.
వాదనలో అనంతంగా వెనక్కుపోయే స్థితిని సృష్టికర్త భావనలో ఉన్నది. దేవుడు విశ్వాన్ని సృష్టిస్తే, దేవుణ్ణి ఎవరు సృష్టించాడు. మళ్ళీ దేవుడే అని సమాధానం ఇస్తే ప్రశ్న మొదటికి వస్తుంది. క్లిష్టమైన విశ్వాన్ని సృష్టించగల దేవుడు చాలా క్లిష్టమైనవాడుకావాలి. రిచర్డ్ డాకిన్స్ జీవ శాస్త్రజ్ఞుడిగా ఈ విషయంలో చెప్పినట్లు అటువంటి సహజ సంక్లిష్ట విధానాలు ఇప్పించగలిగింది పరిణామం మాత్రమే.
వాస్తవం ఏమంటే విశ్వం ఏ విధంగా, ఎందుకు వచ్చిందో తెలియదు. విశ్వ సృష్టిని గురించి పొందికగా మాట్లాడలేం. ఆ విషయాన్ని కాలంతో పోల్చి చెప్పవలసిందే. కాలం-ఆకాశం పుట్టుక గురించి మనం మాట్లాడుతున్నాం అన్నాడు (భౌతిక శాస్త్రజ్ఞుడు స్టీవెన్ హాకిన్స్ కాలాకాశాన్ని ఆద్యంతరహితమైన నాలుగు కోణాలమయంగా చెప్పాడు.) విశ్వం ఎందుకు ఉన్నదో తెలియదని చిత్తశుద్ధిగల మేధావి ఎవరైనా అంగీకరిస్తారు.  ఈ విషయంలో తమ అజ్ఞానాన్ని సైంటిస్టులు ఒప్పుకుంటారు. మత నమ్మకస్థులే ఒప్పుకోరు. మత చర్చలలో ఒక వైపున వినమ్రత, అణకువ ఉన్నట్లు తమలో తాము పొగుడుకుంటూనే సైంటిస్టులను, నమ్మకం లేనివారిని ఖండిస్తూ తలబిరుసుతనంతో ఉన్నారంటారు. మత నమ్మకస్థులు వెల్లడించే ప్రపంచ దృక్పథం వారి అహంభావానికి ప్రతీక. జుగుప్సాకరం కూడా, వారి దృష్టిలోః సృష్టికర్త నాపై శ్రద్ధ చూపుతాడు. నన్ను ఆమెదిస్తాడు, ప్రేమిస్తాడు, మరణానంతరం నాకు పారితోషికం అందిస్తాడు. పవిత్ర గ్రంథాల ఆధారంగా నవ్వుతున్న న్ను స్వీకరించి ఆ నమ్మనివారిని నరకంలోకి నెట్టేస్తాడు.
సాధారణ క్రైస్తవులు చర్చిలో ఆదివారాలు బోధలు విని తలబిరుసుతనం పెంపొందించుకుని ప్రవర్తిస్తారు. వైజ్ఞానిక విషయాలలో అలాంటి ధోరణి అనూహ్యం. తలబిరుసుతనంగల సైంటిస్టులలో సైతం ఆ ధోరణి ఉండదు.
భూమిపై పుట్టిన జీవులలో 99 శాతం నశించాయి కూడా తెలివిగల పథకం ప్రకారం సృష్టి జరగలేదనడానికి ఇదొక నిదర్శనం. ప్రకృతిని గమనిస్తే ఎంతో సంక్లిష్ట రీతులు చూడవచ్చు. ఇందులో పథకం ఏదీ లేదు. వచ్చిందే రావడం, వెనుకంజ వేయండ. అనవసర సంక్లిష్ట విషయాలు బాధలు, చాలా కనిపించాయి. ఎగరలేని పక్షులు ఉన్నాయి. కొన్ని రకాల చేపలకు కళ్ళు పనిచేయవు. లక్షలాది సంవత్సరాలుగా అవి చీకటిలో పరిణమించాయి. కొన్ని రకాల తిమింగలాలు పుట్టినప్పుడు పళ్ళను రూపొందించుకున్నాయి. అవి పెరిగి తరవాతనే తిరిగి వియోగంలోకి వస్తున్నాయి. తెలివిగా దేవుడు జీవులను భూమిపైన సృష్టిస్తే ఈ మార్మిక విషయాలకు అర్థం లేదు. పరిణామం దృష్ట్యా ఇందులో గందరగోళం పడాల్సింది ఏమీలేదు.
జీవశాస్త్రజ్ఞుడు జె.బి.ఎస్. హాల్దే చెబుతూ దేవుడు ఉంటే అతనికి తొలిచే పురుగుల పట్ల అపారమైన ప్రేమ ఉండి ఉండాలి అన్నాడు. అలాంటి మాటలు సృష్టివాదాన్ని చావు దెబ్బ తీశాయి. మూడు లక్షల ఏభయివేల తొలిచే పురుగుల రకాలు ఉన్నట్లు తేలింది. అయితే దేవుడికి వైరస్ అన్నా కాడు విపరీతమైన ప్రేమ ఉన్నట్లుంది. భూమి మీద ఉన్న వివిధ రకాల జంతువులలో ఒక్కొక్క దానికి పది తీరుల వైరస్ ఉన్నట్లు జీవ శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. ఇందులో కొన్ని హాని లేని వైరస్ లు. సంక్లిష్ట జీవులు ఆవిర్భవించడానికి కొన్ని వైరస్ లు తోడ్పడి ఉండవచ్చు. అయితే వైరస్ లు ఇతర జీవులను వినియోగించుకుంటాయి. మన కణాలను నాశనం చేస్తాయి. అదీ నిర్దయగా దారుణంగా నశింపచేస్తాయి. హెచ్.ఐ.వి. వైరస్ లు, హానికరమైన బాక్టీరియా పెంపొందుతున్నాయి. వీటికి విరుగుడుగా వస్తున్న మందులకు కట్టుబడకుండా వ్యాపిస్తున్నాయి. పరిణామ క్రమంలో వీటి గురించి ఊహించి వివరించారు. బైబిల్ లో అలాంటిది ఏమీ లేదు. మత విశ్వాసం  ఈ వాస్తవాలను ఎలా చెప్పగలుగుతుంది. వీటి వెనుక దయామయుడైన దేవుడున్నాడని అందులో ప్రయోజనం ఉన్నదని ఏవిధంగా చెబుతారు. దేవుడి అసమర్ధతకు మన శరీరాలే పెద్ద ఉదాహరణ. మన పిండాలలో తోకలు, సంచులు కోతికి ఉన్నట్లు జుట్టు ఉంటాయి. పుట్టుక ముందే అవి చనిపోతాయి కూడా. ఇందుకు పరిణామం జన్యు శాస్త్రం వివరణలు ఇచ్చింది. అదే తెలివిగల పథకం ప్రకారం సృష్టి జరిగి వుంటే మార్మికంగానే మిగిలిపోయి ఉండేవాళ్ళం. పురుషులకు మూత్రం ద్వారా ప్రోస్టేట్ గ్లాండ్ నుండి సూటిగా వెడుతుంది. ఇది జీవిత పర్యంతం ఉబ్బిపోతూనే ఉంటుంది. అరవై ఏళ్ళ తరవాత చాలామందికి  ఈ శారీరక పరిణామం కనిపిస్తుంది. ఇందులో దేవుడి తెలివిగల సృష్టే లేదు. స్త్రీల విషయంలో కూడా ప్రసవించడానికి తోడ్పడే రీతిలో అంగాలు లేవు. దీని ఫలితంగా చాలామంది స్త్రీలలో పిస్టులా పెంపొందుతున్నది. అలా ఉన్నప్పుడు వెనుకబడిన దేశాలలో భర్తలు ఆ స్త్రీలను వెలేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల వివరణబట్టి 20 లక్షల మంది స్త్రీలు ఇటువంటి పిస్టులా (భగంధరవ్యాధి)తో బాధపడుతున్నారు. ఇటువంటి వ్యాధికి శస్త్ర చికిత్స ఉండదు. ప్రార్థనలు చేస్తే అది పోదు. ప్రార్థనలతో చాలా వ్యాధులు పోతాయని విశ్వాసపాత్రులు నమ్ముతారు. ప్రార్థన పరిమిత వ్యాధులకు పనిచేస్తుందని అంటుంటారు. తెగిపడిన కాలు లేదా అంగం ప్రార్థనతో మళ్ళీరాదు. ఎందుకని... ప్రార్థనలకు దేవుడు స్పందిస్తే తెగిపడిన అంగాలను ఎందుకు తీసుకురాలేడు. ప్రార్థన వలన అలాంటివి సంభవమేనని నమ్మకస్తులు ఎందుకు అనుకోరు. దీనిని వివరించే వెబ్ సైట్ చూడండి. (www.whydoesgodhateamputees.com) దేవుడి తెలివిలేని పథకానికి ఉదారహరణ చెప్పాలంటే పెద్ద పుస్తకమే రాయాల్సి ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పి ఈ అంశాన్ని ముగిస్తాను. ఊపిరి తిత్తులు శ్వాసకోశం రెండూ భాగం పంచుకునే వాహిక గొంతులో ఉన్నది. దీనివలన సృష్టి నమూనాలలో ఎంత జరుగుతున్నదో చెప్పాలంటే, అమెరికాలోనే వేలాది మంది పిల్లలు ఏటా అత్యవసర చికిత్సకు ఆస్పత్రిపాలవుతుంటారు. కొంతమంది ఊపిరాడక చనిపోతుంటారు. మరి కొందరు మెదడు జబ్బులకు గురవుతున్నారు. ఇందులో భగవంతుడి దయ ఏమిటి? బహుశ భగవంతుడు ఒక ఉద్దేశ్యంతో చేసినట్లు ఊహించవచ్చు. అటువంటి బాధలకు లోనయిన పిల్లల తల్లిదండ్రులకు దేవుడు గుణపాఠం చెప్పదలచుకున్నారు. గొంతులో ఊపిరాడక చనిపోయిన పిల్లలకు స్వర్గంలో ప్రత్యేక స్థానం ఏర్పరచాడేమో. అయితే ఇటువంటి దురుద్దేశాలు ఏవిధంగా హేతుబద్ధంగా వివరిస్తారు. అలాంటి వివరణలో నీతి ఏమిటి?

.

విజ్ఞానానికి మతానికి ఉన్న సంఘర్షణ-క్రైస్తవం ఇంత అమానుషమా?శామ్ హారిస్

9వ భాగం

మతానికి విజ్ఞానానికి సంఘర్షణ
విజ్ఞానానికి మతానికి ఉన్న సంఘర్షణ పట్ల సైంటిస్టులు చిత్తశుద్ధితో మాట్లాడడం నైతిక ఆవశ్యకత. అయితే జాతీయ సైన్సు అకాడమి ఈ సంఘర్షణ భ్రమపూరితమైనదని పరిగణించింది :
“కొన్ని మతాలకు పరిణామానికి సంఘర్షణ ఉన్నదనే విషయంలో దురవగాహన ప్రబలింది.  మతానికి శాస్త్రీయ పద్ధతులకు మధ్య ఉన్న జ్ఞాన రీతులు నిశితమైన విబేధాలకు దారి చూపుతున్నదనే అభిప్రాయం ఉన్నది. మతాలు, విజ్ఞానం ప్రపంచాన్ని గురించిన భిన్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి. ఇష్టానికి, మానవమనుగడకు ఏమైనా ప్రయోజనం ఉన్నదా అనేది వైజ్ఞానిక సంబంధమైన ప్రశ్నలు కావు. మానవ జీవితంలో మత, వైజ్ఞానిక జ్ఞాన రీతులు చాలా ప్రధాన పాత్ర నిర్వహించాయి. ఇంకా నిర్వహిస్తాయి కూడా. ప్రకృతిని గురించి తెలుసుకోవడం సైన్సు వివరిస్తుంది. అలౌకిక విషయాలను గురించి సైన్సు ఏమీ చెప్పదు. దేవుడు ఉన్నాడా? లేడా? అనే విషయంలో సైన్సు తటస్థంగా ఉంటుంది.”
ఈ ప్రకటనలో స్వస్థత లేకపోవడం ఆశ్చర్యకరం. ప్రభుత్వధనం లభించదేమో అనే భయం సైంటిస్టులకు నిరంతరం ఉన్నది. కనుక జాతీయ సైన్సు అకాడమీ పన్ను చెల్లించేవారి దృష్టిని గమనించి ఇలాంటి భయాన్ని వ్యక్తం చేస్తుండవచ్చు. మతానికి సైన్సుకు సంఘర్షణ తప్పనిసరి విజ్ఞాన విజయాలు తరచు మత మూఢవాదాలను దెబ్బతీస్తూ ఉంటాయి. మతమౌఢ్యం సైన్సుకు చాలా ఇబ్బంది పెట్టే అంశంగా మారింది. మానవ మనుగడలో కేవలం ప్రయోజనం గురించే మతాలు ప్రస్తావించి ఊరుకోవు. సైన్సువలె ప్రతి మతం కూడా ప్రపంచాన్ని గురించి ప్రత్యేకమైన అంశాలను ప్రస్తావిస్తాయి. వాస్తవాలను గురించి ఇలాంటి ప్రకటనలు మతాలు చేస్తుంటాయి. సృష్టికర్త నీవు చేసే ప్రార్థనలు వింటాడని, వాటి ప్రకారం కోరికలు తీరుస్తాడని అంటారు. పుట్టినప్పుడు శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుందంటారు. దేవుడి గురించి సరిగా నమ్మకపోతే మరణానంతరం చాలా బాధలకు గురవుతాడంటారు. ఇలా చెప్పేవన్నీ విజ్ఞానానికి భిన్నంగా ఉన్న అంశాలే. పైగా మతాలు చెప్పేవాటికి ఘోరమైన సాక్ష్యాలున్నట్లు గొప్పలు చెప్పుకుంటారు.
సైన్సు అంటే తెలుసుకోవడం అని స్థూలంగా చెప్పవచ్చు. ప్రపంచాన్ని గురించి ఏది వాస్తవమో మనం చేస్తున్న ఉత్తమ ప్రయత్నాల ద్వారా కనుగొంటున్నాం. ఇందులో సైన్సులోని తరతమ స్థాయిలు, చరిత్రవంటి మానవ శాస్త్రాలకు సైన్సుకు ఉన్న తేడాలు గమనించనక్కరలేదు. 1941 డిసెంబరు 7న పెరల్ హార్బర్ పై జపానువారు బాంబు వేశారనేది చారిత్రక సత్యం. ప్రపంచ దృష్టిని గమనిస్తున్నప్పుడు వైజ్ఞానిక వివేచనలో ఇది ఒక సత్యంగా నమోదు అవుతుంది. ఆ తేదీన కాక మరొక తేదీన బాంబు వేశారని ఎవరయినా అంటే, లేక బాంబు వేసింది ఈజిప్టువారని ప్రకటిస్తే ఆ విషయాలను సమర్థించుకోవడానికి చాలా వివరణ కావాలి. సైన్సులో మేథస్సుపరంగా చిత్తశుద్ధి ఉంటుంది. కేవలం మన అదుపులో ఉన్న పరిశోధనలు, గణిత నమూనాలే సైన్సు కాదు. ఒక ప్రతిపాదనలో సత్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు దానికి సంబంధించిన సాక్ష్యాన్ని, తార్కిక వాదనలను పరిగణనలోకి తీసుకోవాలి. మతంలో ఇందుకు భిన్నంగా వేరే ప్రమాణాలు ఉన్నాయని ప్రజలు ఊహిస్తారు.
రోమన్ కాథలిక్ మతం ఇటీవల వేటికన్ లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 30 మంది మత విజ్ఞానులు సమావేశమయ్యారు. క్రైస్తవమతం పుచ్చుకునే బాప్టిజం అనే క్రతువు లేకుండా చనిపోయిన శిశువుల పరిస్థితి ఏమిటని చర్చించారు. మధ్య యుగాలలో కాథలిక్కులు నమ్మినదానిని బట్టి అటువంటి పిల్లలు సహజమైన సంతోషాన్ని అనుభవించే లింబో స్థితికి వెడతారని నమ్మారు. సెయింట్ థామస్ అక్వినాస్ అలాంటి అభిప్రాయాలు చెప్పగా అందుకు విరుద్ధంగా సెయింట్ అగస్టిన్ ఆ పిల్లలంతా నరకంలో శాశ్వతంగా ఉంటారని నమ్మారు. బైబిల్ లో ఈ లింబో అనే స్థితికి ఆధారం లేదు. క్రైస్తవమతం అధికారికంగా దీనిని సిద్ధాంతీకరించలేదు. అయినా శతాబ్దాలుగా ఇదొక ప్రధానాంశంగా కాథలిక్ సంప్రదాయం కొనసాగిస్తున్నది. 1905లో పదవ పోప్ పయస్ ఇలా అన్నారు. “జ్ఞాన స్నానం (బాప్టిజం) లేకుండా చనిపోయిన పిల్లలు లింబో స్థితిలోకి పోయి దేవుని సన్నిధి లేకుండా, బాధలు పడకుండా ఉంటారు.” ఈ విషయాన్ని చర్చించడానికి క్రైస్తవమతం వారిలోని మేధావులను సమావేశపరచింది.
అలాంటి చర్చాపథకాన్ని మనం ఊహించగలమా? ఆ చర్చలు ఎలా ఉంటాయో గమనించండి. ఎవరైనా సరే బాప్టిజం పుచ్చుకొని పిల్లల స్థితి మరణానంతరం ఎలా ఉంటుందో చెప్పగల సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టగలరా? చదువుకున్నవారెవరైనా ఈ విషయాన్ని దారుణమైనదిగా, కాలాన్ని వృధాపుచ్చేదిగా, హాస్యాస్పదమైనదిగా భావించరా? చిన్న పిల్లల్ని ఆచారాలకు గురి చేసిన వారిని కాపాడని సంస్థ కూడా  ఆ కాథలిక్ మతమే. మానవ శక్తియుక్తులను ఇంతగా వృధా చేయడం కాథలిక్ మతానికే చెందింది.
సైన్సుకు మతానికి ఉన్న సంఘర్షణ కనీస స్థాయికి తగ్గించవచ్చు. నమ్మేవారికి తగిన కారణాలు ఉండి ఉండాలి. లేదా కారణాలు లేకుండా ఉండాలి. జీసస్ కన్యకు పుట్టాడని, మహ్మద్ రెక్కలున్న గుర్రంపై స్వర్గానికి పోయాడని నమ్మడానికి తగిన ఆధారాలుంటే మనం విశ్వాన్ని వివరించడంలో వాటిని కూడా స్వీకరించవచ్చు. విశ్వాన్ని ఆధారంగా చారిత్రక సత్యాలు వివరించాలంటే అర్థం లేని విషయంగా భావిస్తాము. బైబిల్ కు ఖురాన్ కు మూలం ఏమిటని, జీసస్ తిరిగి లేచి వచ్చాడనడానికి, మహ్మద్ దేవదూత గాబ్రియేల్ తో సంభాషించాడనడానికి, తదితర మత మూర్ఖవాదనలకు ఎక్కడా సాక్ష్యాధారాలు లభించవు. కనుక వివేచన విఫలమయినచోట ప్రజలు నమ్మకంపై ఆధారపడుతున్నారని ఒప్పుకోవాలి.
సాక్ష్యాధారాలు లేకుండా నమ్మితే అదొక ఉన్మత్త స్థితి లేదా మూర్ఖత్వం అనుకోవాలి. కాని దేవునిపై విశ్వాసం ఇప్పటికీ మన సమాజంలో ప్రతిష్ఠాకరమైన నమ్మకంగానే చలామణి అవుతోంది. మనలో మతం అనేది ఒక ఉన్నతమైన అంశం అని మానవుడు యదార్థంగా చెప్పుకునే విషయం అని భావిస్తున్నారు. అలాంటి నమ్మకాన్ని ఉన్నతమైనదిగా చాలామంది పాటించడం ఒక ఆధారంగా చూపుతున్నారు. గ్రీకు దేవుడు వాసిడాన్ ను ఎవరైనా నేడు ఆరాధిస్తుంటే వారిని పిచ్చివాళ్ళుగా చూస్తారు.  

మూలం                                   అనువాదం
    శామ్ హారిస్                             ఎన్. ఇన్నయ్య



.

దివ్యవాణిలో ఎంత శక్తి ఉన్నది ?8వ భాగం శామ్ హారిస్

8వ భాగం

దివ్యవాణిలో ఎంత శక్తి ఉన్నది ?క్రైస్తవం ఇంత అమానుషమా
బైబులు దైవ వాక్యం అని కొత్త నిబంధనలో పేర్కొన్న సంఘటనలను పూర్వ నిబంధనలో చెప్పిన వాటిని ధ్రువపరచిందని నమ్మారు.  ఈ దివ్య వాక్యాలు రాసినవారు జీసస్ జీవితాన్ని చెప్పడానికి పూర్వ నిబంధనలో దివ్యవాక్కులకు అనుగుణంగా దానిని రూపొందించడానికి ఎంత కష్టమో ఆలోచించండి. గతంలో రాసిన పుస్తకంలో సూచించిన వాటికి అనుగుణంగా ఎవరైనా పుస్తకం రాయలేరా? బైబుల్ రచయితలను గమనిస్తే జరిగిందిదే.
లుక్, మాథ్యూ రాసిన దాని ప్రకారం మేరి కన్యగా ప్రసవించింది. గ్రీకులు పేర్కొన్న ప్రవచనం ప్రవక్త ఈసయ్య 7:14 పై ఆధారపడి ఇలా రాశారు. ఈసయ్య రాసిన హిబ్రూ వచనాలలో ఆల్మ అనే మాటకు యువతి అని అర్థం ఉన్నది తప్ప, కన్య అనే అర్థం లేదు. కన్యకు పుట్టడం అనే మూఢ వాదన క్రైస్తవులకు లైంగికత పట్ల ఉన్న ఆందోళనే కారణం. హిబ్రూ మాటల అనువాదంలో దొర్లిన పొరపాట్లే ఇందుకు దారి తీశాయి. కన్య ప్రసవించడం అనేది ఇతర సువార్త రచయితలు ప్రస్తావించలేదు. జీసస్ అక్రమ సంతానంగా జన్మించాడనడం మార్క్, జాన్ లకు ఇష్టం లేదు. వారు జీసస్ అద్భుత పుట్టుకను ప్రస్తావించలేదు. పాల్ ఆనాడు డేవిడ్, మరొక స్త్రీకి జీసస్ పుట్టాడని రాస్తూ మేరీ కన్యత్వాన్ని ప్రస్తావించలేదు. ఇతర దైవ ప్రచారకులు అనేక దోషాలు చేశారు. మేథ్యూ 27:9 – 10 ప్రకారం జెరీమియా చెప్పినట్లు జరిగిందన్నాడు. వాస్తవానికి జెఖారియా  11:12-13 ఈ విషయాలను రాశాడు. సువార్తలలో పరస్పర విరుద్ధ విషయాలున్నాయి. జాన్ ప్రకారం పాస్ వోవర్ ముందు రోజున జీసస్ ను శిలువపై కొట్టారన్నాడు. మార్క్  ఈ సంఘటన మర్నాడు జరిగిందన్నాడు. ఇలాంటి తేడాలున్న బైబుల్ నిర్దిష్టమైనది ఎలా అవుతుంది. ముస్లింలు, మోర్మోనులు, సిక్కులు అలాంటి పరస్పర వైరుధ్యాలను తమ పవిత్ర గ్రంథాలలో విస్మరించినప్పుడు వారిని గురించి ఏమనుకుంటారు. పవిత్ర ఆత్మకు దృగ్గోచరంగా ఉన్న కన్ను మాటలకు కట్టుబడేది కాదన్నారు (లూథర్),  ఈ మాటలవలన అటువంటి పవిత్ర గ్రంథాలు సృష్టికర్త సంపూర్ణ వాక్యాలు అవుతాయా?
క్రైస్తవుడు భవిష్యత్తు సంఘటనలను బైబుల్ అంచనా వేసిందంటారు. ద్వితీయోపదేశ కాండలో 28:64 దేవుడు నిన్ను అందరి మధ్య భూమికి ఒకవైపు నుండి మరో వైపుకు విసిరేస్తాడు అని ఉన్నది. ల్యూక్ 19..43-44 ప్రకారం జీసస్ చెబుతూ ఈ శత్రువును చుట్టుముట్టి నేలకేసి కొట్టి మీ పిల్లలు కూడా అలాగే చేసి ఏదీ వదలకుండా వెడతారు. వారు వస్తున్నట్లు నీకు తెలియకోవడమే ఇందుకు కారణం. ఇలాంటి మాటలు చెప్పినప్పుడు యూదుల చరిత్రను అంచనా వేసినట్లు నమ్మమంటారు. ఇది అలౌకిక వివరణ తప్ప మరేది కాదు.
సర్వజ్ఞుడైన దేవుడు భవిష్యత్తు చెబితే ఎంత నిర్దిష్టంగా ఉండి ఉండాలి. బైబుల్ అలాంటి గ్రంథం అయితే మానవ సంఘటనలను కచ్చితంగా చెప్పగలగాలి. 20వ శతాబ్దం ఉత్తరార్ధంలో కంప్యూటర్ల ద్వారా మానవుల మధ్య సంబంధాలు ఏర్పడతాయని ఇది ఇంటర్నెట్ అంటారని దీనిని లెవిటికస్ ప్రకరణలో ముందే చెప్పామని దేవుడు ప్రస్తావించి ఉండాలి. కాని బైబిలులో అలాంటివేవీ కనిపించవు. వాస్తవానికి మొదటి శతాబ్దంలో నివసించిన స్త్రీ పురుషులు రాయలేనిది ఏదీ బైబిలులో లేదు. అది చూచైనా మీకు కలవరపాటు వచ్చి ఉండాల్సింది.
సర్వశక్తివంతుడైన దేవుడు రాసి ఉంటే అందులో గణితంపై ఒక అధ్యాయం అయినా ఉండి ఉండాలి. అలా అయితే 2000 సంవత్సరాల తరువాత గణిత లోతుపాతులు తెలుసుకోవడానికి మానవాళికి ఎంతో ఉపయోగపడేది. బైబిలులో గణితం లాంఛనంగా నైనా చర్చించకపోగా కొన్ని స్పష్టమైన గణిత దోషాలు మాత్రం ఉన్నాయి. బైబిల్ ప్రకారం మొత్తం చుట్టు కొలత నిష్పత్తి దాని డయామీటరుతో పోల్చితే 3:1 ఉంటుంది. (ఒకటి కింగ్స్ 7:23-26, రెండు క్రానికల్స్ 4:2-5) ఇది మెచ్చదగిన అంశం కాదు. ఆధునిక కంప్యూటర్లు నిర్దిష్టంగా అంచనాలు వేస్తాయి. ఈజిప్షియన్, బాబిలోనియన్లు బైబిల్ ను పూర్వ గణిత అంచనాలు ఇంచుమించు సరిగానే వేశారు. ఇది (గణితంలో పై) పైకి సంబంధించిన విషయం. ప్రాచీన ప్రపంచపు ప్రమాణాలను బట్టి చూసినా బైబిల్ లో ఉజ్జాయింపుగా చెప్పినవి దారుణమైన అంశాలే. భక్తులు మాత్రం  వాటన్నిటినీ హేతుబద్ధం చేసే తీరు ఉన్నది. అయితే లోపాలు బైబిల్ కప్పిపుచ్చలేకపోయిందని గణితం విషయాలు స్పష్టంగా తేల్చి చెబుతున్నాయి. బైబుల్ లో 1. కింగ్స్, 2. క్రానికల్స్ ప్రకరణలు గ్రీకు గణిత శాస్త్రజ్ఞుడు ఆర్కిమెడిస్ రాసి ఉంటే సర్వజ్ఞుడికంటే ఎక్కువ సాక్ష్యాధారాలు ప్రస్తావించి సేకరించి ఉండేవాడు.
బైబుల్ లో విద్యుత్ ను గురించి, జీవాణువు (జిఎన్ఎ) గురించి విశ్వం పరిమాణం, వయస్సు గురించి విశ్వం వయస్సు పరిమాణం ఎందుకు చెప్పలేకపోయింది. కాన్సర్ కు చికిత్సమాటేమిటి? కాన్సర్ ను గురించి జీవశాస్త్రం పూర్తిగా అవగాహన చేసుకుంటే కొని పుటలలో సంక్షిప్తంగా వివరించగలరు. అలాంటిది బైబుల్ లో ఎందుకు లేదు. మంచివారు పవిత్రులు కాన్సర్ తో బాధపడుతూ చనిపోతున్నారు. వారిలో పిల్లలున్నారు. బైబుల్ మంచి గ్రంథం. దేవుడు బానిసలను అట్టిపెట్టుకోవడానికి జంతువులను బలి ఇవ్వడానికి సూచనలు ఇచ్చాడు. క్రైస్తవంపై నమ్మకం లేనివారు అలాంటి పుస్తకాన్ని చూస్తే సర్వజ్ఞుడు అదెలా రాశాడని ఆశ్చర్యపోతారు.



.

దేవుని మంచితనం-క్రైస్తవం ఇంత అమానుషమా?శామ్ హారిస్

7వ భాగం
Innaiah with Sam Harris
దేవుని మంచితనం
ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఒకమ్మాయిని ఒకతను ఎత్తుకు పోతాడు,  చెరుస్తాడు, చిత్రహింస చేస్తాడు. చంపేస్తాడు. ఈ క్షణంలో కాకపోతే మరికొన్ని గంటలలో, రోజులలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆరు మిలియన్ల మానవుల మధ్య ఇలాంటివి జరుగుతుండటం చూస్తున్నాం. అదే లెక్కల ప్రకారం ఆ అమ్మాయి తల్లిదండ్రులు – నువ్వు నమ్మినట్టే -  సర్వజ్ఞుడైన దేవుడు, కరుణామయుడైన దేవుడు, వారిని వారి కుటుంబాన్ని చూస్తూ వుంటాడు. అలా అని వారు నమ్మటం సరైనదేనా? అలా నమ్మటం మంచిదేనా?
కాదు.
దీనికి స్పందించడంలోనే నాస్తికవాదం ఉన్నది. నాస్తిక వాదం తప్పని కాదు. అదొక ప్రపంచ దృష్టీ కాదు. స్పష్టమైన దానిని అంగీకరించడమే నాస్తికవాదం. నాస్తిక వాదం అనే మాట వాస్తవానికి ఉండరాదు. ఎల్లరూ తామొక నమ్మకం లేని జ్యోతిష్యులమని, నమ్మకం లేని మాంత్రికులమని అనుకోరాదు. సుప్రసిద్ధ గాయకుడు ఎల్విన్ ఇంకా బతికున్నాడని, లోకాతీత వ్యక్తులు ఖండాంతరాలలో పయనించి పట్టుబడిన వారిని చిత్రహింసలు చేస్తారని, నమ్మేవారిని గురించి ఏమనాలో తెలియదు. నాస్తిక వాదం అంటే సమర్థనీయం కాని మత విశ్వాసాలను ముందుకు తెచ్చేవారి పట్ల అభ్యంతరాలను తెలపడమే. నాస్తికుడు అమెరికాలో నమ్ముతున్న 57 శాతం జనాభాను, దేవుడున్నాడనే విషయాన్ని సందేహించేవారిని ప్రశిస్తూ సాక్ష్యం చూపమని కోరతాడు. ప్రపంచంలో రోజూ అమాయకులను నాశనం చేస్తున్న తీరును చూస్తూ దయామయుడైన దేవుని ప్రశ్నించడమే నాస్తికత. లక్షలాది సంవత్సరాలలో ఒక్కసారైనా సరే ఒక చిన్న పిల్లను చంపేస్తే దయామయుడైన దేవుడనే భావాన్ని సందేహించడమే నాస్తికుడి ఉద్దేశ్యం.
ప్రతి చోటా మానవులను రక్షించడంలో దేవుడు విఫలమవుతున్నట్లు ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇటీవల అమెరికాలో న్యూ అర్లియన్స్ నగరం తుఫాను తాకిడికి విధ్వంసం అయింది. వెయ్యిమంది చనిపోయారు. వేలమంది ఆస్తులను పోగొట్టుకున్నారు. పదిలక్షలమంది నిరాశ్రయులయ్యారు. న్యూ అర్లియన్స్ లో కత్రినా తుఫానుకు గురయినవారంతా దేవుడు సర్వజ్ఞుడని సర్వాంతర్యామి అని దయామయుడని నీవు నమ్మినట్లే నమ్మారు. కత్రినా తుఫాను నగరాన్ని ఎడారి చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నట్లు. ఇళ్లల్లో, అటకల మీద ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రార్థించిన వృద్ధుల, స్త్రీల ప్రార్థనలు దేవుడు విని వారిని క్రమేణ నీట ముంచాడు. వారంతా నమ్మకాలున్న విశ్వాసపాత్రులే. జీవితమంతా ప్రార్థనలు చేసినవారే. ఇది స్పష్టమేనని ఒప్పుకునే ధైర్యం ఉందా? వారంతా ఊహించిన దైవంతో సంభాషిస్తూ చనిపోయారు.
న్యూ అర్లియన్స్ రాష్ట్రాన్ని, బైబిల్ ప్రస్తావించిన తీరులో, తుఫాను ముంచెత్తబోతున్నట్లు హెచ్చరికలు వచ్చాయి. అందుకు మానవులు సరిగా సంసిద్ధులు కాలేదు. వైజ్ఞానికంగా చూస్తే మరొక తీరుగా వుంటుంది. మతపరంగా ఈ ప్రమాదానికి ఎలాంటి ఆధారమూ లేదు. వాతావరణ శాస్త్రం శాటిలైట్ ప్రకృతిని పరిశీలించి కత్రినా దారిని సరిగా చెప్పడంలో విఫలమయ్యాయి. దేవుడు తన పథకాన్ని ఎవరికీ వెల్లడించలేదు. న్యూ అర్లియన్స్ పౌరులు దేవుని దయపై ఆధారపడ్డారు. కత్రినా మృత్యువాతకు గురికాబోతున్నామని అక్కడి పౌరులు తీవ్ర గాలులు తాకిడి సోకేవరకు అనుమానించలేదు. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సేకరించిన ప్రజాభిప్రాయం ప్రకారం కత్రినా తుఫాను తాకిడి నుండి బయటపడినవారిలో 80 శాతం దేవుని మీద నమ్మకం బలపడిందని చెప్పారు.
ఒకవైపు కత్రినా తుపాను న్యూ అర్లియన్స్ ను నేలమట్టం చేస్తుండగా, ఇరాక్ లో బ్రిడ్జిపై షియా భక్తులు మృత్యువుకు గురయ్యారు. ఈ యాత్రికులు కురాన్ దేవుని శక్తిలో నమ్మకం ఉన్నవారు. అతడి ఉనికి తిరుగు లేనిదని వారు తమ జీవితాలను రూపొందించుకున్నారు. వారి స్త్రీలు ముసుగును ధరించి దేవుని ఎదుట ఉండేవారు. దైవవాక్యాన్ని గురించి పరస్పర వ్యతిరేక భాష్యాలతో వారిలో వారు చంపుకుంటున్నారు. ఆ విషాద సంఘటనలో బతికినవాడు ఒక్కడైనా విశ్వాసాన్ని కోల్పోతే విశేషంగా చెప్పుకోవచ్చు. కాని అలా బతికి బయటపడడం దేవుని దయవలనేనని భావించారు.
బతికిన వాళ్ళలో స్వయంగా ఆత్మవంచన, స్వీయ ప్రేమ అనంతంగా ఉన్నది. అలాంటి సంఘటనలలో బతికిన వారు దయామయుడైన దేవుని వలన బతికామనుకోవడం, అదే దేవుడు పసివారిని పొట్టన పెట్టుకోవడం, గమనార్హమైన నమ్మకం. బాధలతో సతమతమవుతుంటే వాస్తవాన్ని మరచి మత భ్రమణంలో మునిగి తేలడం వివేచనా రహితం. కోట్లాది ప్రజలు తమ ఆనందాన్ని కుచింపచేసుకుని అందుకు తగిన కారణాలు లేకుండానే జీవించడం దారుణమైన అంశం.
ప్రపంచంలో విశ్వాసాన్ని కుదిపేయాలంటే ఎంత పెద్ద ప్రమాదం జరగాలో ఊహించుకోవల్సిందే. యూదుల సామూహిక హత్య అందుకు దారితీయలేదు. రవాణాలో తుడిచిపెట్టుకుపోయిన జనాన్ని చూసి అక్కడ కత్తులు దూసిన పురోహిత వర్గాలను గమనించి కూడా విశ్వాసం సడలలేదు. మశూచి వ్యాధివలన లక్షలాది మంది అందులో పసివారు 20వ శతాబ్దంలో చనిపోయారు. కనుక దేవుడు ఎలా చేస్తాడో తెలుసుకోజాలం అన్నారు. మత విశ్వాసాలకి ఏదీ పొందికగా లేదు.
అన్ని వర్గాలవారు ఒకరికొకరు అభయం ఇచ్చుకుంటూ మానవ బాధలకు దేవుడు బాధ్యుడు కాదని గట్టిగా చెప్పారు. అయినప్పుడు దేవుడు సర్వజ్ఞుడు, సర్వ శక్తివంతుడు ఎలా అవుతాడు. ఇది మత జ్ఞాన సమస్య. దేవుడు ఉంటే సామూహిక ప్రమాదాలను ఆపడానికి అతడు చేయగలిగింది ఏదీ లేదు. లేదా వాటిని పట్టించుకోడు. దేవుడు శక్తి లేనివాడయినా కావాలి. పాపాత్ముడయినా కావాలి. దేవుణ్ణి మానవ నైతిక ప్రమాణాలతో నిర్ధారించడానికి వీలులేదని అంటారు. అయితే దేవుడి నైతిక ప్రమాణాలను చూపడానికి దేవుడు మంచితనాన్ని నిర్ధారించడానికి మానవ ప్రమాణాలు వినియోగిస్తున్నారు. స్వలింగ సంపర్కుల మధ్య పెళ్ళి, అతనికి చేసే ప్రార్థనలు దేవుడు పట్టించుకుంటే అతడిని అర్థం చేసుకోవడం కష్టం కాదు.
బైబిలులో చెప్పిన దేవుడు కట్టుకథ. గ్రీకుల దేవుడు జ్యూస్ తదితర వేలాది మతప్రాయమైన దేవుళ్ళ వలె ఈ దేవుళ్ళను కూడా వివేక మానవులు అశ్రద్ధ చేయాలి. జ్యూస్ అనే దేవుడు లేడని రుజువు చేయగలవా? లేదు. అయితే ఇలాంటి సన్నివేశాన్ని ఊహించలేం. మనం ప్రాచీన గ్రీకుల కాలంలో ఉన్నామనుకోండి. ప్రజలు తమ ఆదాయంలో ఎంతో భాగాన్ని ఒలింపస్ పర్వతాలపై ఉన్న దేవుళ్లను సంతృప్తి పరచడానికి వెచ్చించారనుకోండి. ఆ దేవుళ్ళ పేరిట నెలకొన్న సమస్యల ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిందనుకోండి. లెక్కలేని ధనాన్ని, దేవాలయాలకు ఇచ్చారనుకోండి. ఇలియడ్, ఒడెస్సీల వరకు ఖర్చు పెడుతూ వైద్య పరిశోధనను నిలిపేశారనుకోండి. ప్రభుత్వ విధానాన్ని చర్చించకుండా ప్రాచీన రచయితలను సమర్ధించారనుకోండి. అటువంటి స్థితి వుంటే మన భౌతిక, నైతిక, మేథస్సు వనరులను దుర్వినియోగం చేసినట్లే. సరిగ్గా అలాంటి స్థితిలోనే నేడు మనం ఉన్నాము. విచారకరమైన నిర్హేతుకమైన ప్రపంచంలో మీరు మీ తోటి క్రైస్తవులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.
మనందరం చనిపోతాం. మనం ప్రేమించిందంతా కోల్పోతాం. బతికుండగానే ఎందరో బాధలకు లోనవుతారు. బాధలకు కారణం మతం అని సూటిగా చెప్పవచ్చు. మత ద్వేషాలు, మత యుద్ధాలు, మత నిషిద్ధాలు, మతం పేరిట వనరులను మళ్ళించటం జరుగుతూనే ఉన్నది. మత విశ్వాసాలు చిత్తశుద్ధితో విమర్శించడం నేడు నైతికంగా మేథస్సుతో అవసరమని భావించాలి. అలాంటి విమర్శలు నమ్మకం లేనివారిని సమాజానికి పణంగా అట్టిపెడుతున్నారు. వాస్తవానికి దగ్గరలో ఉన్నవారిని నేల విడిచి సాము చేస్తున్నట్లుగా పేర్కొంటున్నారు.


.

పవిత్ర గ్రంథంలో మంచిని ప్రవేశ పెట్టేదెవరు? క్రైస్తవం ఇంత అమానుషమా?

ఆరవ భాగం
పవిత్ర గ్రంథంలో మంచిని ప్రవేశ పెట్టేదెవరు?
దేవుడిమీద నమ్మకంవల్ల మానవ ప్రవర్తనలో ప్రభావం కనిపిస్తుందని అన్నప్పటికీ, దేవుణ్ణి నమ్మడానికి అదే కారణం అనలేం. దేవుడున్నాడని భావిస్తే దేవుణ్ణి నమ్మవచ్చు. నాస్తికవాదం నైతిక అరాచకాలకి దారితీస్తుందని అనుకున్నా, దానివలన క్రైస్తవ సిద్ధాంతం నిజంకాబోదు. అలాంటప్పుడు ఇస్లాం కూడా నిజం కావచ్చు. మతాలన్నీ ఫ్లాసిబో చక్కెర మాత్రలవలె పనిచేయవచ్చు. విశ్వాన్ని చిత్రించడంలో మతాలన్నీ తప్పు చేస్తున్నా, అవి ఉపయోగపడనూ వచ్చు. సాక్ష్యాధారాలనుబట్టి మతాలన్నీ తప్పుడువే కాక ప్రమాదకరం కూడా.
నమ్మకాలు మానవ నీతికి దారితీస్తున్నాయని అన్నప్పుడు మత ఉదార వాదులు, మత మితవాదులు చెప్పే ధోరణి అనుసరిస్తున్నారన్నమాట. ప్రమాణ గ్రంథం చెప్పే అద్భుతాలను బట్టి, బైబుల్ దోషజాలను బట్టి దేవుని నమ్ముతున్నామని అనకుండా, ఉదారవాదులు మితవాదులు సత్ఫలితాలను బట్టి నమ్ముతున్నామంటారు. అలాంటి నమ్మకస్తులు తమకు దేవుడు అర్థాన్ని కల్పించాడని అందుకే నమ్ముతున్నామంటారు. సునామీ 2004లో క్రిస్మస్ రోజున లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంటే దేవుడి ఆగ్రహానికి అదే సాక్ష్యమని మితవాద క్రైస్తవులు భావించారు. గర్భస్రావం, విగ్రహారాధన, స్వలింగ సంపర్కాలలో దోషాలను హెచ్చరిస్తూ దేవుడు సంకేతాలను పంపిస్తున్నాడని అంటారు. ఇలాంటి భాష్యాలు జుగుప్సాకరమైనవి. కానీ కొన్ని అంచనాలను గమనిస్తే వీటిలో కొద్దిగా హేతుబద్ధత కనిపిస్తుంది. ఉదారవాదులు, మితవాదులు దైవాన్ని గురించి ఇలాంటి నిర్ణయాలు ఏవీ రాబట్టరు. వారికి దేవుడు సంపూర్ణంగా కేవలం ఓదార్పు ఇచ్చేవాడు. దారుణమైన పాపానికి ఇలాంటి ధోరణులు సరిపోతాయి. ఆసియాలో జరిగిన సునామీపట్ల ఉదారవాదులు మితవాదులు పరస్పరం దూషించుకున్నారు. ఆ భారీ తరంగాలను తన శక్తితో దేవుడు మీదకు తెచ్చాడని వారు అనలేదు. అలాంటి తరంగాల ప్రజ్వలనను చూచి మానవుడు ఎలా స్పందించాడని వారు ఆలోచించారు. కళేబరాలు కొట్టుకు వస్తుంటే అందులో మానవుడు కారుణ్యము బయటపడిందా? లేక దైవశక్తి వెల్లడయిందా? లక్షమంది పిల్లలు తల్లి ఒడికి దూరమై నీటికి ఆహుతైపోతే ఉదార మతవాదులు కళ్ళు తెరిచి చూడవలసి ఉంది. నైతికంగా నటించడం మానేయవలసి ఉంది. మత జ్ఞానం మేథస్సు ప్రదర్శించేటప్పుడు ఒక అంశాన్ని గమనించాలి. దేవుడు ఉంటే, మానవుడి వ్యవహారాలలో ఆసక్తి కనబరిస్తే దైవేచ్ఛను విడమర్చి చూడవచ్చు. చూడలేనిది ఏమంటే  ఈ దారుణ సంఘటనల వెనుక దైవం నైతిక వివేచన కనబరిచిందని అనడమే.
చాలామంది క్రైస్తవులవలె, సాధారణ వ్యక్తులు దైవం రీతులను   కాదనలేరు అని వ్యాఖ్యానిస్తారు. దేవుడు ఆదికాండంలో జలప్రళయం తెచ్చి మానవాళిని ముంచేయడం తప్పు అని అనజాలరు అంటారు. మన పరిమితి దృష్టిలో అది అలాగే కనిపిస్తుంది. కాని జీసస్ దేవుని కుమారుడని, స్వర్ణ పాలన నైతిక వివేచనకు పరాకాష్ట అని, బైబిలులో అసత్యాలు లేవని నిర్ధారణగా చెబుతాడు. బైబుల్ వివేచనను ఘంటాపథంగా చెప్పడానికి మానవుని తన నైతిక ప్రేరణను ఆధారం చేసుకుంటున్నాడు. మరుక్షణమే అలాంటి నైతిక ప్రేరణ సరైన మార్గదర్శి కాదంటున్నారు. బైబుల్ లో చెప్పిన వాటిపై ఆధారపడాలంటున్నారు. నైతిక ప్రేరణలకు బైబులే హామీ అంటున్నారు, ఒకవైపున ఇలాంటి ప్రేరణలు ప్రాథమిక స్థాయిలో ఉండగా, హేతు వివేచనలో గిరిగీసుకుని చుట్టూ తిరుగుతున్నారు.
మంచి గ్రంథంలో ఏది ఉత్తమమో మనమే నిర్ణయిస్తాము. స్వర్ణ నియమాలను చదివి అదే అత్యుత్తమ, నైతిక ప్రేరణగా తీర్పు చెబుతాము. నీతి విషయమై దేవుని బోధనలు ప్రస్తావనకొస్తాయి. పెళ్ళినాడు పెళ్ళి పెళ్ళి కుమార్తె కన్యకాదని కనుగొంటే ఆమెను తండ్రి ఇంటి ముఖ ద్వారం వద్ద రాళ్ళతో కొట్టి చంపాలి. (ద్వితీయోపదేశ కాండం 22..11-21) మనం నాగరికులమైతే ఇది మన ఉన్మత్త చర్యకు పరాకాష్ఠ అని దానిని నిరాకరించాలి. మన నైతిక నిర్ణయాలను వినియోగించాలి. అక్కడ బైబుల్ దైవ వాక్యంగా నమ్మడం మనకేవిధంగానూ తోడ్పడదు.
ఇక్కడ నిర్ణయం చాలా సులభం 21వ శతాబ్దంలో నీతిని గురించి, మానవ సంక్షేమాన్ని గురించి మాట్లాడాలి. అందులో శాస్త్రీయ దృక్పథం తాత్విక వాదనలు 2000 సంవత్సరాల నుండి వస్తున్న వాటిని అంచనా వేయాలి. లేదా బైబుల్ లో మొదటి శతాబ్దంలో ఉన్న మాటల్ని అట్టిపెట్టుకోవాలి. ఎవరైనా బైబుల్ పంథాను ఎందుకు స్వీకరించాలి?

మూలం అనువాదం
శామ్ హారిస్ ఎన్. ఇన్నయ్య






.