పాశ్చాత్య ప్రపంచంలో ఇస్లాం-concluding- నేను ముస్లింగా ఉండలేకపోతున్నాను ఎందుకని ?


ఇబన్ వారక్
17వ అధ్యాయం

ష్డీ ఉదంతం తరువాత యూరోప్ లో కొట్లాటలూ, ప్రదర్శనలూ, పుస్తకాల దహన కాండనూ ఛాందస ముస్లింలు సాగించారు. యూరోప్ వాసులు తమ మధ్య సెక్యులర్ విలువలను పాటించని వారినీ, వాటిని వ్యతిరేకించే వారినీ చూచి ఆశ్చర్యపోయారు. 1989 నుండి ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్లు భిన్నదృష్టిని అవలంబించారు. ముస్లింలు ఈ దేశాలలో తమ ఆచారాలు పాటించడానికి సెక్యులర్ చట్టాలను ఎదిరించడానికీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ముస్లింలు ఒక బ్రిటీషు పౌరుణ్ణి చంపగోరుతున్నారు. బ్రిటీషు పోలీసు అలాంటివారిని అరెస్ట్ చేయడానికి, రష్డీని చంపడానికి రెచ్చగొడుతున్న వారిని ఆపడానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎవరైనా హత్యను ప్రోత్సహిస్తే తక్షణమే అరెస్ట్ చేస్తామని ఫ్రాన్స్ ప్రధానమంత్రి మైకెల్ రొనార్డ్ అన్నారు. బ్రిటన్  ఈ విషయంలో గట్టి నిర్ణయం తీసుకోలేదు. లండన్ లోని ముస్లిం సంస్థకు చెందిన డా. సిద్ధిఖీ బ్రిటీషు చట్టాలను వ్యతిరేకించవలసి వస్తే, ఇస్లాం చట్టాన్ని పాటించవలసివస్తే, అలాగే చేయాలని ముస్లింలకు బాహాటంగా బోధించాడు. ఫ్రాన్స్ లో ఒక టర్కిష్ ఇమామ్  ఫ్రెంచి చట్టాలకంటే షరియాకే ప్రాధాన్యత ఇవ్వాలన్నప్పుడు 48 గంటల్లో అతన్ని పంపించివేశారు. ఆడపిల్లల సున్తీ విషయంలో కూడా ఇలాంటి విభిన్న దృక్పథాలు కనిపిస్తున్నాయి. 1992 జూలై 7న బ్రిటీషు దినపత్రిక ఇండిపెండెంట్లో  ఒక వ్యాసంలో ఇలా రాశాడు. బ్రిటన్ లో ఆఫ్రికా, 3వ ప్రపంచ సమాజాలకు చెందిన ఆడపిల్లలు సున్తీ విషయమై స్థానిక అధికారులు పట్టనట్లు ఉన్నారనీ, జాతి విద్వేషం అనే ముద్రపడుతుందని భయపడ్డారని పేర్కొన్నారు. సామాజిక ఆరోగ్యసేవా సంఘాలు కూడా సున్తీని నిరోధించడానికీ, ఆ విషయమై పై అధికారులకు తెలుపటానికి పూనుకోలేదు. సంస్కృతిలో ఏది చట్టబద్ధం... దేనిని గౌరవించాలి... మానవ హక్కుల దుర్వినియోగం ఏది అనేది కూడా గందరగోళంగా ఉన్నది. 1991 మార్చిలో ఫ్రాన్స్ లో ముగ్గురు మాలియన్ వాసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టబడ్డారు. హర్మటాకైటాపై అభియోగం మోపుతూ 15 సం.ల బాలికలకు సున్తీ చేశారని పేర్కొన్నారు. సోరీ, సెమిత్ కోలిబాలి అనే ఇరువురు ఆడపిల్లల తల్లిదండ్రులుగా సున్తీ నేరాన్ని తప్పించుకోటానికి ప్రయత్నించారన్నారు. అమాండ్ పత్రికలో నివేదికను 1991 మార్చి 24న గార్డియన్ వీక్లీ పునర్ముద్రించింది. కేథరిన్ స్విలాఫ్ అనే న్యాయవాది వాదిస్తూ సున్తీ ఆచారం వెనుక ఉన్న ఉద్దేశాన్ని సందేహించనక్కరలేదన్నారు. అయితే ఈ ఆచారాన్ని ఖండించకపోతే ఆమోదించినట్లవుతుందని కూడా అభిప్రాయపడ్డాడు.
    ప్రాసిక్యూటర్ వ్యాఖ్యానిస్తూ సున్తీని క్షమిస్తే ఫ్రాన్స్ లో చాలామంది ఆడపిల్లలు చట్టరక్షణకు గురికాకుండా పోయే అవకాశముందన్నారు. ఆర్మటాకైటాకు 5 ఏళ్ళ శిక్ష విధించారు. కోలిబేలకు కూడా ఇలాంటి శిక్షలే వేశారు. దీనివలన సాంస్కృతిక సాపేక్షతావాదం, బహుళ సాంస్కృతికవాదం, చట్టంముందు సమానత్వం, ఫ్రెంచి బ్రిటీషు సమాజాలలో గూడుకట్టుకుంటున్న మత సాంస్కృతిక ధోరణులు, సొంతనియమాలు పాటించే పద్ధతులు కనిపిస్తున్నాయి. మనకు ఎలాంటి సమాజం కావాలి ? ఎలాంటి దాన్ని సృష్టించుకోవాలి.. విధ్వంసక ఆటవిక వాదంపైకి పోవాలా, లేక మానవాళి అందరికీ చెందిన విలువలు కావాలా ? మెర్విన్ హిస్కట్ రచనలు సెక్యులర్ విలువలకు ప్రాధాన్యతనిచ్చేవారంతా. పాశ్చాత్య రాజకీయవాదులంతా చదవాలి. (సమ్ టు మక్కా టరస్ట్ టు ప్రే. ఇస్లామిక్ వాల్యూస్ అండ్ ది మోడరన్ వరల్డ్, లండన్, 1993) ఆర్థర్ స్లైసింగర్ కూడా అటవీకరణ, ముక్కలుగా చీలిపోవడం వంటి ప్రమాదాలు హెచ్చరించాడు. (డిజ్ యునైటింగ్ ఆఫ్ అమెరికా, రిఫ్లెక్షన్స్ ఆన్ ఎ మల్టీ కల్చరల్ సొసైటీ, న్యూయార్క్, 1992).
బ్రిటన్లో ముస్లింలు-వారికేం కావాలి.
    బ్రిటన్లో 15 లక్షలమంది ముస్లిలున్నారు. అందులో అధిక సంఖ్యాకులు భారత ఉపఖండం నుంచి వచ్చారు. చాలామంది తమ ఆర్థికస్థితిని మెరుగుపరచడానికి కోరివచ్చినవారే. గత 15 ఏళ్ళుగా తాము బ్రిటీషు సమాజంలో లీనం కాదలుచుకోనట్లు వ్యక్తపరుస్తూ వచ్చారు. తమకు ప్రత్యేక హక్కులూ, అవకాశాలివ్వాలంటున్నారు. డా. జకీబదానీ లండన్ లో ఇస్లాం సాంస్కృతిక కేంద్ర మాజీ డైరెక్టర్ (సమ్ టు మక్కా లరన్డ్ టు మక్కా టు ప్రే, సెయింట్  ఆల్బన్స్ 1993, పుటః 235)
      మతాన్ని మార్చే పద్ధతులున్న ఒక మతం స్థిరంగా ఉండజాలదు. అది పెరుగుతుంది. లేదా తరుగుతుంది. బ్రిటన్లో ఇస్లాం విస్తృత పడదలిచింది. ఇస్లాంది విశ్వమతం, నేల నాలుగు చరగులా సందేశాన్ని అందించాలని వారి ఉద్దేశం. ఒకనాడు మానవజాతి యావత్తూ ఒకే ముస్లిం సమాజంగా ఉండాలి.
    ఇంగ్లండులోని బ్రాడ్ ఫోర్డ్ లో ముస్లింల నాయకుడు ఇమామ్ అల్లా తప్ప మిగిలిన దేవుళ్ళను నిరాకరించి, క్రైస్తవుల త్రిమూర్తి సూత్రాన్ని తప్పుడు విధానంగా పేర్కొన్నాడు. ఇస్లాం వస్తేనే చీలిపోయిన, రుగ్మతలతో ఉన్న బ్రిటన్ బాగుపడుతుందన్నాడు. ఇస్లాం జీవన విధానంలో సంపూర్ణస్మృతి అందించేదనీ, అది గృహానికీ, వ్యక్తిగత సంబంధాలకూ పరిమితం కారాదనీ అన్నాడు. సెక్యులర్ రాజ్యంగా కాక ఇస్లాం పద్ధతులకనుగుణంగా ప్రభుత్వాన్ని తీసుకురావాలన్నాడు. ప్రతి ముస్లిం ఇస్లాం ప్రభావాన్ని ప్రపంచంలో వ్యాపింపజేయాలన్నాడు. ఒక వైపున క్రైస్తవాన్ని అవమానించటానికి తమకు స్వేచ్ఛ ఉన్నదనుకొంటున్న  ముస్లింలు ఇస్లాంను విమర్శిస్తే రెచ్చిపోయి హింసకు దిగుతున్నారు. ఇస్లాంను ముస్లిమేతరులు కూడా ముస్లింలవలె దైవప్రేరణగా ఆమోదించాలంటున్నారు. విద్యపట్ల సెక్యులర్ ధోరణి  అవలంబించటం కూడా బ్రిటన్ లో ఇస్లామిక్ అకాడమీ, ఇస్లామిక్ కల్చరల్  సెంటర్ నిరశిస్తున్నాయి.  తమ విలువలు అట్టిపెట్టాలని బ్రిటిషు చట్టాలను ధిక్కరించటానికైనా సంసిద్ధమేనని ముస్లింలంటున్నారు. హిస్కెట్ ఇదే విషయాన్ని రాశాడు. (పై పుస్తకం, పుట. 238-39)
ముస్లిం కోర్కెల పరిణామం
      బ్రిటిష్ సమాజంపై బహుశ సాంస్కృతిక ఉదారవాదం దాడి చేసి నైతికంగా, సామాజిక రీతుల్ని దెబ్బతీసే ప్రమాదమున్నది. బ్రిటన్ లో జంతు వధశాలలన్నీ చట్టరూపేణా అదుపులో ఉన్నాయి. పేటర్ సింగర్ యూనిమల్ లిబరేషన్ లో ఇలా రాశాడు.
      మత క్రతువు ప్రకారం జంతువుని చంపకముందు స్తంభింపచేయనక్కరలేదని అంటున్నారు. యూదు, ముస్లిం ఆహార నియమాలనుబట్టి ఆరోగ్యకరంగా తిరుగుతూ ఉండే జంతువులనే చంపాలిగానీ అనారోగ్యమైన వాటిని కాదు. జంతువుల్ని స్తంభింపజేస్తే వాటి గొంతు తెగ్గగ్గొట్టకముందు  దెబ్బతిన్నట్లుగా భావించి మతాలవారు అంగీకరించలేదు. జబ్బుచేసిన జంతువులను తినకుండా ఉండాలని చట్టాలు చేశారు. చంపకముందు జంతువు చేతనావస్థను తొలగించాలని సనాతనమతం చెబుతున్నది. యూదులు ఇలాంటి చట్టాలు చేసినప్పుడు ఆనాటికి అదే ఉత్తమమై  ఉంటుంది. నేడది ఉదార పరిస్థితి కాదు.
    ముస్లిం వ్యతిరేకత చూపటం అనే ప్రస్తావన ఇందులో లేదు.
    జంతువులపట్ల దయామయంగా ఉంటున్నామా అనేది చూచుకోవాలి. తమ మత నియమాలకు విరుద్ధంగా జంతువులను చంపినప్పుడు ఆ మాంసం తిందామనుకునేవారు. తినకుండా ఉండవచ్చు.
    నైతిక కారణాలుగా బ్రిటిషు శాసనాలు వచ్చాయి. జంతువుల్ని ఇంకేవిధంగా చంపటం అవినీతికరంగా ఉంటున్నాయి. వాటికి మినహాయింపు లివ్వటం ముస్లింలూ, యూదులూ కోరినట్లు ఒప్పుకోవటం లోగడ అవినీతికరమైనవాటిని  మళ్ళీ తెచ్చిపెట్టటమే. మత గౌరవం కోసం అవినీతిని ఆమోదిస్తామా... జంతువులపట్ల మతపరంగా క్రూరత్వాన్ని సరైనదే అంటామా....
      రష్డీ వ్యవహారంలోనూ ప్రమాణాలు ద్వంద్వంగా కనిపించాయి. పాశ్చాత్య లోకంలో ముస్లిం స్త్రీలపట్ల ఈ వైఖరి చూడవచ్చు. మత మౌఢ్యవ్యాధులు తమకు ముప్పు తెచ్చిపెడతారనే దృష్టితో ముస్లిం స్త్రీలు కొందరు సంఘాలు స్థాపించుకున్నారు. ఒక సంఘస్థాపకురాలు హనానా సిద్ధికీ ఇలా రాశారు. స్త్రీలను ముందే ఏర్పాటు చేసిన పెళ్ళిళ్ళకొప్పుకోమని అంటున్నారు. గృహవసతి, చదువూ నిరాకరిస్తున్నారు. బహుళ సంస్కృతికవాదులు జోక్యం చేసుకొని స్త్రీలకు అండగా నిలవటంలేదు. మతం, సంస్కృతి పేరిట ఇదంతా సహించాలంటున్నారు. జాతి వ్యతిరేకవాదులు ఇలాంటి పద్ధతులను అనుమతిస్తున్నారు. (న్యూ స్టేట్స్ మన్ అండ్ ది సొసైటీ, మే 1, 1992, పుటః19).
    బహుళ సంస్కృతివాదులు నిశిత పరిశీలన చేయలేకపోతున్నారు. జాతివాదులకంటే మించిపోయి వీరే జాతి పక్షపాతం చూపిస్తున్నారు. నల్లవారిపై నల్లవారూ, ముస్లింలపై ముస్లింలూ, హింసలు జరిపితే వీరు పట్టనట్టున్నారు. ముస్లిం యువతులు ఏర్పాటు చేసిన పెళ్ళిళ్ళు తప్పించుకోవటానికి ఇళ్ళనుండి వెళ్ళిపోతే, వెంటాడి మళ్ళీ ఇళ్ళకు తెచ్చి అప్పగిస్తున్నారు. ఫలితాలు కొన్నిసార్లు విషాదాంతమవుతున్నాయి. యువతి హత్యకు గురికావటం, ఆత్మహత్య చేసుకోవటం  కుటుంబంలో పురుషులు ఆమెను తీవ్రంగా శిక్షించటం జరుగుతున్నది. పోలీసులు, సంఘసేవకులూ పట్టించుకోటంలేదు. కనుక స్త్రీ సంఘాలు అవసరమయ్యాయి. బ్రిటిషు స్త్రీలకు బ్రిటిషు చట్టాలనుండి రక్షణ లేకపోవటం దారుణం.
      డా. ఖలీల్ సిద్ధిఖీ గ్రేట్ బ్రిటన్ లో ముస్లిం పార్లమెంటు స్థాపకసభ్యుడు, లండన్ లో ముస్లిం సంస్థ డైరెక్టరు, బ్రిటన్ లో ఆసక్తులను కాపాడటం, నిర్వచించటం, పెంపొందించటం వీరి లక్ష్యం. ఇస్లాంపై అనేక గ్రంథాలూ, వ్యాసాలూ డా. సిద్ధిఖీ రాశారు. అయోతుల్లా ఖొమేనీ గొప్పవాడనీ, ఇస్లాం విశ్వవ్యాప్తంగా  ఆధిపత్యం వహించాలనీ, సాయుధ పోరాటం అవసరమనీ, ఇస్లాం లోకంలో జొరబడిన పాశ్చాత్య నాగరికత, తాత్విక ప్రభావాలూ, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక రీతులు తొలగించాలనీ ఈ రచనల సారాంశం.
      ప్రజాస్వామ్యం, విజ్ఞానం, తత్వం, జాతీయవాదం, స్వేచ్ఛలపై ఈ రచనలలో ద్వేషం విప్పారుతున్నది. ఇస్లాం సెక్యులర్ రీతులతో, పాశ్చాత్య ధోరణులతో పొందికగా ఉండగలవారన్న వారి పట్ల జుగుప్స కనబరిచారు. (హిస్కట్, పుటః1969) ఇరాన్ ను ఉదార  ప్రజాస్వామిక జాతీయ రాజ్యంగా చూపారు. అందులో కొన్ని ఇస్లాం లక్షణాలను ఆకర్షణీయంగా ప్రదర్శించారు. పాశ్చాత్య విద్య వలన కొందరు రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, సైనిక పాలనా రీతులు అలవరచుకున్నారనీ, వాటిని నాశనం చేయాలనీ అన్నారు. అలాంటి మేధావులను వారి పూర్వౌన్నత్యాన్నీ తెలిపి ప్రాచ్య, పాశ్చాత్య అలవాట్లను పోగొట్టాలన్నారు. వందకోట్ల జనాభాగల ముస్లింలు  అపార సంపదతో ఉన్నారనీ, అన్ని శక్తులనూ వారు ఓడించగలరనీ అన్నారు.
      హిస్కెట్ ఇలా రాశారు. ఇస్లాంను పరిశీలించేటప్పుడు కొన్ని భావాలబలాన్ని గుర్తుంచుకోవాలి. మన తీరాలలో మన సంస్థలకు ప్రత్యామ్నాయంగా ఈ భావాలను చెపుతున్నప్పుడు ఒక ప్రశ్న రాకతప్పదు. పాశ్చాత్య, సెక్యులర్, బహుళార్థ సంస్థలు కావాలా ? ఇస్లాం మతజ్ఞానం కావాలా ? ఇస్లాం ప్రత్యామ్నాయాన్ని కోరేవారు ఏ మేరకు సాగిపోవచ్చు. ఉదార ప్రజాస్వామిక రాజకీయవాదులు అవసరమైన చర్యను ధైర్యంగా చేపట్టగలరా... లేదా క్రమేణా ముస్లిం పార్లమెంటుకూ, ముస్లిం ఆసక్తులకూ లొంగిపోతారా ? (హిస్కెట్, పుటః 273)
బహుళ సంస్కృతీవాదం
      ప్రవాసులుగా వచ్చిన వారి పిల్లలు బ్రిటీషు సంస్కృతిలో కలసిపోవటానికి విద్య తోడ్పడుతుందని. అనుకున్నారు కానీ ఎక్కడో లోపం జరిగింది. 1970 నుండి బహుళ సంస్కృతీవాదం, ద్వంద్వ భాషావాదం వచ్చాయి. ప్రవాసులను ఇంగ్లీషువారిగా మార్చటం సంకుచితమనీ సాంస్కృతిక సామ్రాజ్యవాదమనీ, సాంస్కృతిక హత్య అనీ, జాతివాదమనీ పేర్లుపెట్టారు.  అన్ని సంస్కృతులూ ఒకే విలువలు గలవనీ బహుళ సంస్కృతీవాదంలో దురభిప్రాయం ఉన్నది. విలువలు భిన్నంగా ఉంటే సమాన గౌరవం ఇవ్వాలన్నారు. సాపేక్షతావాదం నుండి పుట్టిన బహుళ సంస్కృతీవాదం వివిధ సంస్కృతులను విమర్శించ లేకపోతున్నది.
      అన్ని సంస్కృతులూ ఒకే విలువలు గలవికావు. అన్ని విలువలూ గౌరవించదగినవీ కావు. ఆచారాలూ, సాంస్కృతిక సంప్రదాయాలూ పవిత్రమైనవి కావు. విమర్శలతో అవి మారవచ్చు.  పాశ్చాత్య సెక్యులర్ విలువలు  రెండువందల ఏళ్ళ నుండే వచ్చాయి. మన సంస్కృతికి భిన్నంగా ఉన్న ఇతర సంస్కృతులను గౌరవించాలనటం నాగరిక ధోరణి. కాని, ఇతర  విలువలు మనం అభిలషించే విలువల్నిధ్వంసం చేస్తున్నప్పుడు, విమర్శతో, వివేచనతో, వాదనతో, చట్టంతో, మేథస్సుతో ఎదుర్కోటం సరైన పద్ధతి కాదా ? హిస్కెట్ ఇలా అన్నారు. మత నమ్మకాలను సహించవచ్చు. కాని రాజ్యంలో, విశాలమైన చట్టం, రాజ్యాంగాలకు విరుద్ధంగా మతాచారాలూ, సంస్థలూ ఉంటే వాటికి సమాన అర్హత ఇవ్వటం, స్వేచ్ఛను ఇవ్వటం పద్ధతి కాదు. ముస్లింలు ఇందుకు అంగీకరించటం లేదు. ప్రజాస్వామ్యంలో ముస్లింలకు, మతాన్ని పాటించే స్వేచ్ఛ ఉన్నది. కాని అతను ఆమోదించని వారిని
చంపేయమంటే ఎలా ?
      ప్రజారంగంలో ముస్లిం తన సాహిత్య సెన్సార్ షిప్పును విధిస్తున్నాడు. బ్రిటీషు పౌరురాలిగా ఉన్న తన కుమార్తెను అదుపులో పెట్టి, నిర్బంధ వివాహాలకు గురిచేస్తున్నాడు. దారుణంగా జంతువులను చంపుతున్నాడు. తన పిల్లలు వెళ్ళే బడిలో పరిణామ సిద్ధాంతం చెప్పరాదంటున్నాడు. మత ఉత్సవాలకనుగుణంగా విద్యాసంవత్సరాన్ని మలచమంటున్నాడు. (హిస్కెట్. పుటః 328)
రాజకీయవాదుల ద్రోహం
    హిస్కెట్ ఇలా రాశాడు. బ్రిటన్లో ప్రజాస్వామిక సెక్యులర్ ధోరణులకు విరుద్ధంగా                      ఇస్లాం వ్యాపిస్తున్నది. ముస్లిం ఓట్లకోసం, ముస్లిమేతర రాజకీయవాదులు  అవకాశవాదాన్ని అనుమతిస్తున్నారు. (హిస్కెట్, పుటః331) ఇందుకు ఆధారంగా బ్రిటీషు దినపత్రిక డెయిలీ టెలిగ్రాఫ్ లో 1990, డిసెంబరు 31న లేబర్ పార్టీ అభ్యర్థి రాసిన లేఖను ఉదహరించారు.
      ఒక జాతిగా మనం సనాతనవాదులమైన ఇస్లాంను సహించాం. ఈ విషయం డిసెంబరు 28 సంపాదకీయంలో సరిగా ఉదహరించారు. మన స్వేచ్ఛ సూత్రాలకు విరుద్ధంగా ఏ మతశాఖలకూ అవకాశాన్ని ఇవ్వరాదు. ఐనా ఇలా ఎందుకు చేశాం... ప్రభుత్వం, పార్లమెంటులో లేబర్ పార్టీ, దాని నాయకత్వం ఇందుకు కారణం, వ్యాపారం కోసం ప్రభుత్వం చేస్తే, ఎన్నికలకోసం, లేబర్ పార్టీ చేసింది.
    లేబర్ పార్టీ ప్రజాస్వామిక సూత్రాలకంటే ఓట్లకు ప్రాధాన్యత  ఇవ్వటం సిగ్గుచేటు.
      అనేక నియోజక వర్గాలలో ఇస్లాం మౌలిక వాదులు ఎన్నికల ఫలితాలను మలుపు తిప్పే స్థితిలో ఉన్నారు.
      ఎన్నికలలో విజయానికి గాను స్వేచ్ఛకు ద్వితీయస్థానం ఇచ్చి సాల్మన్ రష్డీ జీవితంకంటే ముస్లిం మౌలిక వాదులను వ్యతిరేకం చేసుకోకపోవటమే మంచిదని నిర్ణయించారు. అలాంటి నిర్ణయంతో ఓట్లకు మూలసూత్రాలను తాకట్టుపెట్టారు.
      లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే అమెరికాలో యూదు ఓట్ల పరిస్థితి వంటిదే ఇక్కడా తెచ్చిపెట్టారు.
      ఓటర్లలో కొద్దిమంది అభిలాషకు లొంగి  లేబర్ పార్టీ ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నది.
      ఎన్నికల విజయం కోసం సిగ్గు లేకుండా లేబర్ ఉద్యమాన్నిఇలా వమ్ము చేయటం అలాంటి పార్టీ కోసం 20 ఏళ్ళుగా నేను పనిచేయటం తలవంపులుగా ఉన్నది.
మైకెల్ నోల్స్
      మితవాద ప్రభత్వం వ్యాపార నిమిత్తం ప్రజాస్వామిక సూత్రాలకు ద్రోహం చేసింది. సౌదీ అరేబియాలో తమ ఆర్థిక ఆసక్తులు కాపాడుకోటానికి, బ్రిటీషు ఆయుధాలు అమ్ముకోటానికీ, సౌదీ అరేబియాలోని అప్రజాస్వామిక ఆచారాలను విమర్శించలేకపోయారు. సౌదీ అరేబియాను విమర్శించిన బిబిసి టెలివిజన్ కార్యక్రమాలను  నిషేధించారు. బ్రిటీషు క్రైస్తవులు సౌదీ అరేబియాలో  తమ మతాచారాల్ని దొంగచాటుగా పాటించాల్సినగతి పడితే బ్రిటీషు ప్రభుత్వం సహించింది.
      బ్రిటన్ లో ముస్లింలు ప్రార్థించుకోటానికి స్వేచ్ఛ ఉన్నది. సౌదీ అరేబియా డబ్బుతో లండన్ నడిబొడ్డున మసీదు నిర్మాణం జరిగితే పరిసరాల శిల్పసంపదను గమనించకుండా అనుమతించారు.
      ఫ్రాన్స్ కూడా వ్యాపార నిమిత్తం ఇరాన్ తో రాజీపడి ఇరాన్ హంతకులను శిక్షించలేదు. వారిని అప్పగించవలసిన చోట అప్పగించలేదు.
      పాశ్చాత్య ప్రభుత్వాలు కొన్ని ముస్లిం దేశాలను రాజకీయ వాస్తవాల దృష్ట్యా విమర్శించటం లేదు. కాని తమ ప్రజాస్వామ్య సూత్రాలను తమ దేశంలోనే ముస్లిం అల్పసంఖ్యాకులు వ్యతిరేకిస్తున్నప్పుడు. వారు కాపాడుకోవాలి.
చదువుకున్నవారి ద్రోహం
    ప్రవాసం వచ్చినవారి పిల్లలు సమాజంలో కలిసిపోవాలంటే వీలుకావటం లేదు. ఉపాధ్యాయులు తరగతిలో చెప్పేటప్పుడు జాతి, మత భేదాలను గుర్తు చేస్తూ సమాజంలో లీనం కావటానికి వీలులేని రీతిలో పిల్లల్ని వారి తల్లిదండ్రులనూ నడిపిస్తున్నారు. బ్రిటన్ లో మతం, రాజ్యం వేరు కాదు. అందరూ సమిష్టిగా పాఠశాలల్లో ప్రార్థిస్తారు. బహుళ సంస్కృతివాదం పేరిట ఇస్లాం తన ప్రచారం తరగతుల్లో ప్రవేశపెట్టింది. ఇంగ్లండు చర్చిని వ్యవస్థాపితం కాకుండా విద్యా విధానంలో గట్టి సమైక్య పునాదులు వేస్తేనే కలిసిపోవటం సాధ్యం.
      ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మతాలపట్ల మర్యాదపూర్వకమైన అజ్ఞేయవాదం చూపాలి.  ఏ మతంలోనూ భాగం పంచుకోరాదు. సమష్టి ప్రార్థనలు ఉండరాదు. క్రైస్తవ, ఇస్లాం తదితర మత విద్యలు చదువులో బోధించరాదు. బ్రిటీషు యూరోపు చరిత్రలు చెప్పాలి. యూదు, క్రైస్తవ సంస్కృతి, కెల్టిక్-ఆంగ్లో, శాక్సన్ క్రైస్తవ పరంపర చారిత్రకంగా పెంపొందిన రీతిని వివరించాలి. ఆధునిక, క్రైస్తవ అనంతర విధానాలు ఎలా వచ్చాయో విద్యార్థి అర్థం చేసుకోటానికి వీలుగా  చెప్పాలి.
    ఎట్టి పరిస్థితుల్లోనూ ఇస్లాంగానీ, మరే మతంగానీ సడలింపులు ఉండరాదు. కళ, సంగీతం, నాటకం పాఠశాలల్లో చెప్పాలి. అవన్నీ పాఠ్యాంశాలలో భాగాలని మినహాయింపులు ఉండవని అన్ని మతాల తల్లిదండ్రులకూ వివరించాలి.  (హిస్కెట్, పుటః 312)
మేథావుల ద్రోహం
    పాశ్చాత్య మేథావులు, పాశ్చాత్య సెక్యులర్ విలువలను ఎలా చూస్తున్నారో పరిశీలించాలి. తమను తాము నిందించుకోవటం ఇంగ్లీషువారి ప్రత్యేక దోషంగా కనిపిస్తున్నది. పాశ్చాత్య లోకంలోనూ ఈ ధోరణి ఉన్నది. అమెరికాలోని వామపక్షాల్లో  దేశభక్తిని ఎందుకు కనబరచవు ?  అని తాత్వికులు రిచర్డ్ రోర్టీ అడిగాడు. (న్యూయార్క్ టైమ్స్, ది ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్, 1994, ఫిబ్రవరి 15) అమెరికాలోని వామపక్షం వారు దేశభక్తిని చూపటంలేదు.
      రాజకీయాల్లో తేడాచూపే నెపంతో తామున్న దేశం గురించి పట్టించుకోటం లేదు. జాతీయదృష్టిపట్ల గర్వించటం, జాతితో తాదాత్మ్యం చెందటం సరైనది కాదంటున్నారు.
    సంప్రదాయ అమెరికా బహుళ వాదానికీ, కొత్తగా బయలుదేరిన బహుళ సంస్కృతీ వాదానికీ ఉన్న తేడానుబట్టి ఈ ధోరణి వచ్చింది.
    తాత్వికుడు జాన్ రాల్స్ రాస్తూ బహుళవాదమనేది సాంఘిక సంస్థల కూడలిగా ఏర్పడిందనీ, తేడాలను స్వీకరించే జాతిగా రూపొందినదనీ అన్నారు.
    బహుళ సంస్కృతీ వాదం ఈ సమాజాలను వేరుగా అట్టిపెడుతున్నాయి.
      పౌరసత్వానికి, జాతీయ ఐక్యత అందులో భాగం పంచుకోటం అవసరం. మన దేశంపట్ల మనం గర్విస్తూ, సాంస్కృతిక తేడాలను గౌరవిస్తాం. ఒక దేశం తనను గుర్తించి ఆనందిస్తూ, ఆలోచిస్తూ బ్రతుకు కొనసాగిస్తే తప్ప సంస్కరించుకోలేదు. మన దేశాన్ని చూచి సిగ్గుపడవచ్చు. ఐతే ఇది మన దేశమనీ, దానితో కలిసిపోయినప్పుడు మాత్రమే సిగ్గుపడటానికి, ఉద్వేగపూరితంగా స్పందించటానికీ వీలవుతుంది. పాశ్చాత్య ఉదార ప్రజాస్వామ్యం ఎన్ని లోపాలతో ఉన్నా, మనసును స్తంభింపజేసే పెత్తందారీ ఇస్లాం మత ధోరణికంటె అది మంచిదే. ప్రజాస్వామ్యాన్ని సమర్థించిన కార్లపాపర్ తమను తాము ద్వేషించుకునే పాశ్చాత్య మేధావులపట్ల విచారం వ్యక్తపరిచారు.
      ప్రజాస్వామ్యంలో తీవ్రమైన లోపాలున్నాయి. అవినీతి ఏ ప్రభుత్వంలోనైనా ఉండవచ్చు. చరిత్రలో పాశ్చాత్య ప్రజాస్వామ్యాలే సంపన్న సమాజాలు కాదని చదువుకున్న వారికి అర్థం అవుతుంది. ఇది ముఖ్యమైన విషయం. ఐతే, స్వేచ్ఛ, సహనం అణచివేతకు గురిచేయని సమాజాల దృష్ట్యానే ఇది ముఖ్యం. మన యువకులకు మన ప్రపంచం ఘోరమైనదనీ, పెట్టుబడిదారీ నరకంలో ఉంటున్నామనీ చెప్పి వారిని సంతోష రహితులుగా చేయటం తగదు. మనం నివసిస్తున్న లోకం అద్భుతమైనది, సుందరమైనది. అశ్చర్యకరంగా స్వేచ్ఛతో, బాహాటంగా ఉన్న సమాజం. దీనికి వ్యతిరేకంగా మాట్లాడటం కొందరు పాశ్చాత్య మేథావులకు నాజూకు అయింది. (కార్ల్ పాపర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిటికల్ డిస్ కషన్, ఫ్రీ ఎంక్వైరీ, రెండవ సంపుటి, సంచిక 1, బఫెలో, 1981- 1982).
      ప్రపంచంలో కూడా మన విలువలపట్ల సిద్ధమైన విశ్వాసం అవసరం. విదేశీ వ్యవహారాలను గురించి రాస్తూ జూడిత్ మిల్లర్ ఇలా అన్నాడు.
      మధ్య ప్రాచ్యంలో తీవ్రవాదంతో ఉన్న ఇస్లాం పాశ్చాత్యలోకాన్ని గురించి వ్యఖ్యానించవచ్చు. ఇస్లాం వాదులు వారిని ఎవరూ వ్యతిరేకించనప్పుడు అధికారంలోకి అమెరికావారు బహుళ వాదాన్నీ, సహనాన్నీ, భిన్నత్వాన్నీ ఆహ్వానిస్తున్నామని చెప్పటానికి సిగ్గుపడనక్కరలేదు. దేవుడు ఏ ఒక్కరి పక్షానో ఉన్నాడని అనక్కరలేదు. ఇస్లాం తీవ్రవాదులూ, పాశ్చాత్యలోకం పరస్పర విరుద్ధంగా ఉన్నందనవచ్చు. భిన్నత్వాన్ని ఉదారవాదులు సమానంగా గౌరవిస్తుండగా, ఇదొక బలహీనతగా ఇస్లాం వాదులు చూడవచ్చు.  ఉదారవాదం దీనిని ఎదుర్కోవాలని అనకపోవచ్చు. కాని నేడు తీవ్ర ఉదారవాదం కావాలి. జంకకుండా, క్షమాపణలు చెప్పకుండా సాగిపోయే తీవ్ర ఉదారవాదం పరస్పర విరుద్ధంగా కనిపించవచ్చు గాని అదే అవసరం  (ఫోరిన్ ఎఫైర్స్, స్ట్రింగ్, 1993, 72వ సంపుటి, 1వ సంచిక, పుటః43-56).
      పాశ్చాత్యలోకం ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా పట్టించుకోవాలి. తాత్కాలిక ప్రయోజనాల నిమిత్తం ఇంటా బయటా కూడా సూత్రాలతో రాజీపడే ధోరణి మానాలి. ఫాసిజం, జాతివాదం, పాశ్చాత్యలోకంలో తలెత్తాయంటే అందరికీ ప్రజాస్వామ్య ప్రీతి లేదనేది గుర్తుంచుకోవాలి. తుది పోరాటం ఇస్లాంకూ, పాశ్చాత్య లోకానికీ జరగాలనేదేమీ లేదు. స్వేచ్ఛకు విలువ ఇచ్చేవారికి, ఇవ్వనివారికీ, మధ్య ఈ పోరాటం సాగాలి.
      ఈ గ్రంథంలో కొన్ని ప్రత్యేక పదప్రయోగాలు ఉన్నవి. వాటికి అర్థం ఇలా ఉంటుంది.
     
   బిదా (BIDA)                   ముస్లింల ఆచారాలలో కొత్తవి
ధిమ్మి (DHIMMI)              ముస్లిమేతరులను ముస్లిం దేశాలలో రక్షించే తీరు,
చూపే సహనం, వారికి విధించే కొన్ని ప్రత్యేక పన్నులు.
   ఫత్వా                          చట్ట న్యాయవాది ఇచ్చే ఉత్తరువు
   హుదుద్                       ఖురాన్ ప్రకారం విధించే శిక్షల పరిమితులు
   హాదిద్                         ప్రవక్త ప్రవచనాలు, ఇస్లాం చట్టంలో ప్రధానమైనవి
   హాజ్                            త్ర (మక్కా)
   హిజ్రా                           మదీనా నుండి ప్రవక్త మక్కాకు పారిపోయిన విధానం
                                       622లో ముస్లిం కాలమానం ఆరంభం
   ఇబన్                          కుమారుడు
   ఇజ్మా                          ముస్లింలలో అంగీకారాభిప్రాయం
   జీహద్                         నమ్మకం లేనివారిపై ముస్లింల పోరాటం
   జిజియా                        థిమ్మీలపై విధించే పోల్ టాక్స్
   జిన్ (JINN)                     అగ్ని, వాయు, దేవతల సృష్టి
   ఖలీఫా                         ప్రవక్త అనంతర వారసులు
   కాబా                           మక్కామసీదు మధ్యగల నల్లరాయి
కాఫిర్                          ముస్లిమేతరుడు
ముల్లా                         ఉలేమా
ఖాది                           ఫిఖా న్యాయపాలకుడు
రమాదాన్                     రంజాన్
ఫిఖా                           ఇస్లాం చట్టం, ఖురాన్ ప్రవక్తమాటలు, ముస్లిం
                                అంగీకారాభిప్రాయాలు, ఉలేమానాల వివేచనా పద్ధతి
షియా                          ఖలీఫాగా చెప్పుకునే అలీ మద్దతుదారులు
సున్ని                          ముస్లింలలో అధిక సంఖ్యాకులు
ఉలేమా                        ముస్లిం పండితుడు
జినా                            వ్యభిచారం
జిందక్                         వ్యతిరేకి, ద్వంద్వవాది.
----
అనువాదం
నరిసెట్టి ఇన్నయ్య


మహమ్మద్ పై తుది అంచనా-part 16-నేను ముస్లింగా ఉండలేకపోతున్నాను ఎందుకని ?


ఇబన్ వారక్
16వ అధ్యాయం
మహమ్మద్
హమ్మద్ చరిత్రలో నిస్సందేహంగా గొప్ప వ్యక్తి. అతడే లేకుంటే చరిత్ర మరోరకంగా ఉండేది. కార్లపాపర్ ఇలా అన్నాడు. (ది ఓపెన్ సొసైటీ అండ్ ఇట్స్ ఎనిమీస్ 1వ సంపుటి పీఠిక) నాగరికత ఉండాలంటే పెద్దవాళ్ళపట్ల ఉదాసీనత  వహించే ధోరణి పోవాలి. పెద్దవాళ్ళు పెద్దతప్పులు చేస్తారు.
    ఇస్లాం పిడివాదం మహమ్మద్ ను ఎలాంటి పాప పంకిలం లేనివాడుగా చిత్రించినా, తాను సంపూర్ణుడననీ, నిర్దోషిననీ అతడెన్నడూ అనలేదు. అతనిలో ఇది చాలా ప్రీతిపాత్రమైన లక్షణంగా తోర్ ఎండ్రీ పేర్కొన్నాడు. తన లోపాలను తెలుసుకోవటం, తనను తాను విమర్శించుకోవటం అతనిలో గమనించవచ్చు.
      మహమ్మద్ ఆకర్షణీయమైనవ్యక్తి ఆహ్లాదంగా  నవ్వుతాడనీ, అనుచరుల విధేయత, ప్రేమను తన సమ్మోహనంతో చూరగొంటాడనీ ఆధారాలు తెలుపుతున్నాయి. ఇతడు మేథా సంపన్నతగల సైనిక నాయకుడు. లౌక్యం నచ్చ చెప్పే  శక్తిగల రాజనీతిజ్ఞుడు. అతడు సాధించిందేమిటి.... ఇంచుమించు ఆరాధించే వరకూ పోయే కొద్దిమంది పాశ్చాత్య పండితులలో ఒకరైన మాంట్ గోమరీ వార్ట్ మహమ్మద్ సాధించిన వాటిని ఇలా వ్యాఖ్యానించాడు. (కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇస్లాం, 1వ సంపుటి, పుటః55) అతడికి రుషి లక్షణాలున్నాయి. మక్కాలోని రుగ్మతలూ, సాంఘిక సంబంధాలూ బాగా తెలుసు.  అనేక భావాలు అతను రూపొందించాడు. మక్కా కలహాలను విశాల పరిధిలో పరిష్కరించడానికి కృషి చేశాడు.
    ఆనాడు మక్కాలో ఆధ్యాత్మిక సంక్షోభం ఉందనే విషయాన్ని బాస్క్వే, క్రోన్ నిరాకరించారు. మార్గోలియత్ కూడా వాట్ చేసిన వాదనలను ముందే ఊహించి కాబోలు నిరాకరించాడు. (మహమ్మద్ అండ్ ది రైజ్ ఆఫ్ ఇస్లాం, లండన్, 1905, పుటః 24, 25) ఇస్లాంకు ముందున్న అరబ్బులు చూపిన నమ్మకాల దృష్ట్యా సాంఘిక రుగ్మతలున్న ఆధారాలేవీ లేవన్నాడు. ప్రొ. వాట్ ఇలా రాశాడు.
      మహమ్మద్ కు మతపరంగానే నాయకత్వం లభించింది. అతని స్థితి పెత్తనాన్ని బట్టి వివిధ తెగలు జాతులూ కూడా అతని నాయకత్వాన్ని అంగీకరించారు. అందువలన సమాజం శాంతియుతంగా కొనసాగింది.
      మహమ్మద్ ను గురించి వాట్ చెప్పింది సబబుగా లేదు.  సిద్ధాంతానికీ, ఆచరణకూ తేడా ఉన్నది. అది గ్రహించలేదు. గోల్డ్ జిహర్ ఇలా అన్నాడు.  (ముస్లిం స్టడీస్ 1వ సంపుటి, పుటః25) మక్కా ప్రజలకూ అరేబియాలోని వారికి మహమ్మద్ చెప్చిందాన్నిబట్టి క్షమించటం బలహీనతకు నిదర్శనం కాదు. తనకు చేసిన అన్యాయాన్ని క్షమించటం అత్యున్నత ధర్మం. అల్లా బాటలో నడుస్తున్నట్లు.
    మహమ్మద్ ఇలా క్షమించడాన్ని బట్టి తెగలూ,  జాతులూ అతడు చెప్పింది విని సమాజైక్యతకు ఇస్లాం దారితీస్తుందని ఒప్పుకున్నారు.  అంతకుముందు శతాబ్దలుగా తెగలవారు కొట్టుకుంటూ, చంపుకుంటూ పగ ద్వేషాలతో గడిపారు. అల్లా ముందు అందరూ సమానమే అని మహమ్మద్ బోధించాడు. సిద్ధాంతం ఆచరణ వేరుగా నడిచాయి. తాను చెప్పింది మహమ్మదే ఆచరించలేదు. యూదులూ మక్కావాసులూ ప్రత్యర్ధులపట్ల క్షమాపణ లేకుండా మహమ్మద్ ఘోరమైన ధోరణి అనుసరించాడు. మహమ్మద్ క్రూరత్వానికి ఉదాహరణలు బుఖారీ చూపాడు. (డిక్షనరీ ఆఫ్ ఇస్లాం పుట. 63, 64)
      ఉకుల్ జాతివారు ప్రవక్త వద్దకు వచ్చి ఇస్లాంను స్వీకరించారు. వారికి మదీనా వాతావరణం నచ్చలేదు. వెళ్ళిపోవాలనుకున్నారు. ఒంటెలను బహుమానంగా ఇచ్చిన చోటకు వెళ్ళమని ఉత్తరువులిచ్చాడు. ఒంటె పాలు తాగమన్నాడు. వారు జబ్బునుండి కోలుకుంటారన్నాడు. ఇదంతా జరిగిన తరవాత ఆ తెగవారు ఇస్లాంను వదిలేసి ఒంటెలను తీసుకుపోయారు. ప్రవక్త తన మనుషులను పంపి వారిని బంధించి మదీనాకు తెచ్చాడు. దొంగతనానికి వారి కాళ్ళూ, చేతులూ నరికి, కళ్ళు పీకించాడు. వారంతా మరణించారు.
      విలియం మూర్ మరికొన్ని దారుణాలను వివరించారు.  (ది లైఫ్ ఆఫ్ మహమ్మద్ పుటః 497-98.
      మహమ్మద్ ప్రవర్తనలో ఔదార్యం శత్రువుల పట్ల ఎక్కడా కనిపించదు. బదర్ యుద్ధంలో తెగిపడిన ఖురేష్ శవాలను ఆయన సంతృప్తిగా చూశాడు. అనేకమంది ఖైదీలను రాజకీయ వ్యతిరేకతకూ సందేహం వాదం వ్యక్తం చేసినందుకూ చంపించాడు. ఖైబర్ యువరాజు కనుగొన్నసంపదను దాచిపెట్టాడని  క్రూరంగా అతన్ని చంపేశాడు. అతని భార్యను బందీగా తీసుకెళ్ళాడు. యూదు తెగలపై తీవ్రమైన శిక్షల్ని విధించి వారిని అల్ మదీనా నుండి ప్రవాసం పంపించాడు. స్త్రీలను పిల్లలనూ బందీలుగా అమ్మేశాడు. పురుషులను తన కళ్ళెదుటే చంపించాడు.
    వాట్ రచనలో మహమ్మద్ నాయకత్వాన తెగల మధ్య సమన్వయమున్నట్లు చూపాడు. అన్ని తెగలూ అతని నాయకత్వాన్ని ఆమోదించలేదు. ఇస్లాం ఖండించిన తరువాత కూడా తెగల మధ్య స్పర్థలు కొనసాగినట్లు గోల్డ్ జిహర్ రాశాడు. మహమ్మద్ చనిపోయే నాటికి జాతి ఐక్యంగా లేదు. వారసత్వ యుద్ధాలు జరిగాయి. రెండు మూడు నాలుగు ఖలీఫాలు హత్యకు గురయ్యారు. 656లో ఉత్మన్ హత్యతో గందరగోళం, అంతర్యుద్ధం ప్రబలింది.
      ప్రవక్త ముస్లిం జీవితాన్ని పవిత్రమైనదిగా రూపొందించే ప్రయత్నం చేశాడు. ఆటవిక విధానంలో కూడా లోగడ అలాంటి ప్రయత్నలు సాగాయి. కాని మహమ్మద్ విఫలుడయ్యాడు. అతని అనుచరులే అంతర్యుద్ధాలు సాగించారు. ఇస్లాం చరిత్రలో ముస్లిం సుల్తానులే ప్రవక్త వారసుల్ని, ముస్లిం సమాజాలనూ హతమార్చారు. (మార్గోలియత్, మహమ్మద్ 8వ సంపుటి, ఎన్ సైక్లోపీడియా ఆఫ్ రెలిజియన్ అండ్ ఎథిక్స్ పుట. 877)
      వాట్ ఇలా రాశాడు. (కేంబ్రిడ్జి హిస్టరీ ఆఫ్ ఇస్లాం, 1వ సంపుటి పుటః 55) ముస్లింలలో యుద్ధ శక్తిని నిరోధించి విధ్వంసానికి దారితీయకుండా ముస్లిమేతరుల పైకి పవిత్ర యుద్ధం పేరిట పురికొల్చారు.
    అరబ్బు విస్తరణ, ఇస్లాం సామ్రాజ్యాన్ని ఆభినందించిన వాళ్ళలో వాట్ ఏకాకి కాదు. నేడు సామ్రాజ్యవాదం అహ్వానించదగింది కాదు. కాని ఇస్లాం సామ్రాజ్యవాదాన్ని, ఫలితంగా జరిగిన విధ్వంసం, మరణాలను ఎవరూ విమర్శించటం లేదు. పవిత్రయుద్ధం పేరిట వేగన్లను చంపటం, కాఫిర్లను జయించటం, ఇతరుల భూభాగాలను అక్రమించటం వాట్ వంటివారు ఎలా హర్షిస్తరో అర్థం కాకుండా ఉన్నది.
మహమ్మద్ చిత్తశుద్ధి
    మహమ్మద్ చిత్తశుద్ధిని గురించి చాలా సిరాను చిందించారు. అతడు తెలిసి మోసగించాడా, లేక దేవుడు స్వయంగా కొరాన్ రూపేణా తనకు అందించినట్లు నమ్మాడా.... మహమ్మద్ చిత్తశుద్ధిని ఒప్పుకున్నా, అతని శీలంలో నైతిక నిర్ణయం ఎలా ఆమోదించాలో  అర్థం కాని విషయం. అప్పుడు నమ్మకాలను చిత్తశుద్ధిగా విశ్వసించేవారు ఉండవచ్చు. అవినీతికరమైన, గౌరవ ప్రదం కాని నమ్మకాలను చిత్తశుద్ధిగా అనుసరించేవారు ఉండవచ్చు. యూదుల్ని తుడిచిపెట్టాలని కొందరు జాతివాదులు చిత్తశుద్ధిగా నమ్ముతున్నారు. ఇందులో చిత్తశుద్ధి అనేది న్యాయస్థానాలలో ముద్దాయిని తప్పించటానికి పిచ్చివారని న్యాయవాదులు ముద్రవేసిన పద్ధతులే ఇందులో ఉన్నాయి. మహమ్మద్ ఈ విషయంలో అనుసరించిన ధోరణిని  వాట్ సహితం గుర్తించాడు. (మహమ్మద్ ఎట్ మదీనా, పుటః 325) మహమ్మద్ తన కోరికల కనుగుణంగా దైవ ప్రేరణలు ఉన్నట్లు, తన స్వార్థ ఆనందాలకు అనుకూలంగా వీటిని మలచుకున్నట్లు స్చష్టపడుతున్నది. బహుశ తనను తాను మోసగించుకునే ధోరణి కావచ్చు. అంటే చిత్తశుద్ధి ఉన్నా భ్రమపూరితంగా బ్రతికాడన్నమాట. మహమ్మద్ ను గొప్చ రాజనీతిజ్ఞుడనీ, చురుకైన రాజకీయవాది అనీ, వాస్తవవాది అనీ, న్యాయచట్టాలను అందించినవాడనీ, మూర్ఛరోగులకు లోను కాలేదనీ చెప్పిన వారు హఠాత్తుగా మహమ్మద్ తనను తానే మోసగించుకున్నాడనీ చెప్పజాలరు కదా. ఉత్తరోత్తరా తన జీవితంలో మహమ్మద్ కావాలనీ, గృహసమస్యలు తప్పించుకోవడానికి, దైవ ప్రేరణల కథ అల్లాడు. మక్కాలో అతడు చిత్తశుద్ధిగా ప్రవర్తించాడనీ, దైవంతో సంభాషించినట్లు నమ్మాడనీ చెప్పవచ్చు.
      మదీనాలో అతని ప్రవర్తన మారిందనటంలో సందేహం లేదు. మూర్ ఈ విషయాలను ఇలా రాశాడు. (లైఫ్ ఆఫ్ మహమ్మద్, ఎడింబరో, 1923, పుటః660)
      స్వర్గం నుండి సందేశాలు వచ్చాయని తన రాజకీయ ప్రవర్తనను సమర్ధించుకోటానికి చెప్పాడు. దేవునిపేరిట యుద్ధాలు చేసి, ఉరిశిక్షలు విధించి, భూభాగాలను దత్తం చేసుకున్నాడు. వ్యక్తిగత విలాసాలకు కూడా దైవానుమతి చూపాడు. అనేకమంది భార్యలకు ప్రత్యేకానుమతి ఉన్నట్లు పేర్కొన్నాడు. మేరీ అనే సేవకురాలితో సంబంధం సమర్థించుకోవడానికి ఒక సురను రాశాడు. తానగ దత్తత చేసుకున్న కుమారుడి భార్యనే స్వీకరించిన ప్రవక్తను దేవుడు మందలించినట్లూ, ఐతే ఆమెను చేసుకోవటానికి దంపతుల మధ్య విడాకులకు అనుమతించినట్లూ, ఇదంతా దైవ ప్రేరణగా జరిగినట్లు చూపాడు. అలాంటివన్నీ మహమ్మద్ నమ్మినా అందుకు అతడే బాధ్యతకూడా వహించాలి.  అతడు చేసిన పనులలో అన్ని సూత్రాలకూ విరుద్ధంగా ప్రవర్తించిన తీరు ఉన్నది.
      మహమ్మద్ ఉత్తరోత్తరా చూపిన దైవ ప్రేరణలు ఆషామాషీగా తెచ్చిపెట్టినట్లు కనిపిస్తున్నది. రెండవ ఖలీఫా ఉమర్ ప్రవక్త వద్దకు వెళ్ళి  తన శత్రువు అబ్దల్లా ఇబన్ ఉబే కోసం ప్రార్థించినందుకు నిరసన తెలుపుతాడు. అలా తెలపటం మంచిదేనా అని అనుమానిస్తాడు. కాని ప్రవక్త తన ప్రవర్తనకూ అనుకూలంగా దైవ ప్రేరణ వచ్చినట్లు చెపుతాడు. (మార్గోలియత్ మహమ్మద్ అండ్ ది లైజ్ ఆఫ్ ఇస్లాం, పుట 218, 219)
      తాము ప్రత్యేక దైవ దూతలమనీ, వ్యక్తులుగానీ, దేశాలుగానీ ఊహించుకుంటే అది చాలా ప్రమాదకరమైన భ్రాంతికి దారితీస్తుందనీ రసెల్ అన్నాడు. (అన్ పాప్యులర్ ఎస్సేస్, పుట 161) మహమ్మద్, ముస్లిములూ ఇలాంటి భ్రాంతితో బాధపడ్డారు. ముస్లింలకు మాత్రమే విమోచన ఉన్నది. ఇస్లాం వెలుపల ముక్తి అని అనుమానిస్తాడు. కాని ప్రవక్త తన ప్రవర్తనకు అనుకూలంగా దైవ ప్రేరణ వచ్చినట్లు చెపుతాడు. (మార్గోలియత్, మహమ్మద్ అండ్ ది లైజ్ ఆఫ్ ఇస్లాం, పుటః 218, 219)
      తాము ప్రత్యేక దైవదూతలమనీ, వ్యక్తులు గానీ, దేశాలు గానీ ఊహించుకుంటే అది చాలా ప్రమాదకరమైన భ్రాంతికి దారితీస్తుందని రసెల్ అన్నాడు. (అన్ పాప్యులర్ ఎస్సేస్, పుట 161) మహమ్మద్, ముస్లింలూ అలాంటి భ్రాంతితో బాధపడ్డారు. ముస్లింలకు మాత్రమే విమోచన ఉన్నది. ఇస్లాం వెలుపల ముక్తి అనూహ్యం. దైవ సందేశాన్ని వ్యాపింపజేయటానికి ముస్లింలను దేవుడు ఎంపిక చేశాడు.
నైతిక సంస్కరణలు
            మహమ్మద్ ఆడపిల్లలు పసివారుగా ఉన్నప్పుడు సజీవంగా పాతిపెట్టే ప్రాచీన సాంప్రదాయాన్ని రద్దు పరిచాడు. ఇస్లాంకు ముందు స్త్రీల పరిలస్థితి మనకు తెలియదు గనుక మహమ్మద్ వారి క్షేమానికి ఏమేరకు కృషి చేశాడో చెప్పజాలం. ఇస్లాంలో స్త్రీల పరిస్థితి  అంతకు ముందుకంటే అధ్వాన్నంగా ఉందని పెరాన్ రాశాడు. (Femmes Arabes Avant ET Depuis L’Islamisme) స్త్రీలు తమ నైతిక స్థితిని, మేథా స్థాయిని కోల్పోయారని కూడా రాశాడు.
      స్త్రీలకున్న సహజ హక్కులను ఇస్లాం కొన్ని రద్దు చేసింది. పేగన్ అరబ్బు స్త్రీకి వివాహ విషయంలో  స్వేచ్ఛ ఉండేది. తన స్థాయికి తగ్గట్టు భర్త కోసం అన్వేషించటం, వేచి ఉండటం ఆనవాయితీగా ఉండేది. (పెరాన్  Perron) పుటః 105).
    బాస్క్వే వంటివారు స్త్రీ ఉద్ధరణలో మహమ్మద్ కృషి చేసినట్లు పేర్కొన్నారు. ఆస్తి విషయంలో ఇస్లాంలో పురుషుడికి సమానంగా స్త్రీ ఉన్నది. మిగిలిన అన్ని విషయాలలో అమె తక్కువే. మహమ్మద్ ఇంకా బాగాచేసి ఉండవచ్చునని లేన్ పూలే అన్నారు.
      9యేళ్ళ ఆయేషాను పెళ్ళాడటంలో దారుణ ఉదాహరణ చూపాడని బాస్క్వే చెప్పాడు.
      ప్రమాణాల నిమిత్తం నష్టపరిహారం చెల్లించే ఒక విధానాన్ని మహమ్మద్ ప్రవేశపెట్టి తీవ్రమైన దోషాలను అలవాటు చేశాడు.
      సుర 16.93 ప్రమాణాలు కాపాడాలి.
    సుర 5.91 ఈ సూత్రాన్ని నష్టపరిహారం చెల్లించటం ద్వారా సవరించుకోవచ్చు. ప్రమాణాల్ని అధిగమించినప్పుడు మరొక రీతిలో వాటిని సరిపుచ్చుకోవచ్చు. మరొక సుర సూత్రం ద్వారా ఈ సూత్రాన్ని నిర్ధారించి ప్రవక్త తనకు అన్వయించుకున్నాడు. మహమ్మద్ చట్టంలో ప్రమాణం విధిగా పాటించాలని కట్టుబాటు లేదు. కురాన్ ప్రకారం కొన్ని దాతృత్వాలు చేసి చూపితే ప్రమాణాల బదులు సరిపోతాయన్నాడు. ప్రమాణం చేసిన వ్యక్తి దానికి బదులుగా మరొక చర్యను చేయటం మంచిదని భానిస్తే నష్టపరిహారంగా అలాగే చేయవచ్చు. (మార్గోలియత్ ది ఎర్లీ డెవలప్ మెంట్ ఆఫ్ మహమ్మదానిజం, పుటః 48, 49, లండన్ 1914)
      మహమ్మద్ జీవితంలో పరస్పర విరుద్ధాలున్నాయి. తరచు రాజకీయాధికారం కోసం అతడు రాజీపడే అవకాశం కనబరిచాడు. ఒక ధృవపత్రం నుండి దైవదూత అనే మాటను తొలగించడానికి అంగీకరించాడు. ఒక ఒడంబడికను ఆమోదించటం కోసం ఆ పని చేశాడు. విగ్రహారాధనకు వ్యతిరేకి. కాని పేగన్ అరబ్బుల విగ్రహారాధన అచారాలన్నీ నల్లరాతిని ముద్దుపెట్టుకోటం వంటివి ఆమోదిస్తూ ప్రవేశ పెట్టాడు. బాణం విసిరే మూఢాచారాన్ని రద్దు చేసిన మహమ్మద్, తన పూర్వీకుల గుర్తులనూ, చిహ్నాలనూ, ముఖ్యంగా పేర్లకు సంబంధించిన వాటిని అట్టిపెట్టాడు. దృష్టి దోషం నమ్మాడు. సురాలలో తొలుత తల్లిదండ్రులకు గౌరవం చూపాడు. తల్లిదండ్రుల ఇష్టాలకు వ్యతిరేకంగా మహమ్మద్ పక్షాన చేరుతున్న యువతను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులను సమర్థించటం మానేశాడు. తల్లిదండ్రులను పూజించాలనే ఆచారాన్ని నిషేధించాడు. బంధువుల మధ్య రక్త సంబంధాన్ని వదిలేయాలని మహమ్మద్ చెప్పటం కూడా దారుణ ఫలితాలకు దారి తీసింది. కొరాన్ రాను రాను అసహనం పెంచుకుంది. మహమ్మద్ శత్రువులను హత్య చేయటం ఉదాహరణగా చూపుతూ కొమినీ వంటివారు తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. మార్గోలియత్ ఇలా అన్నాడు. (పై పుస్తకం, పుటః 56-60)
      మహమ్మద్ జీవితానుభవాలు, మదీనాలో అతడు చిందించిన రక్తం, స్వర్గానికి పోవటానికి సన్మార్గాలని అతని అనుచరులు నమ్మారు  ముస్లిం గవర్నర్లూ, ఖలీఫాలూ, మంత్రులూ, హజాజ్, గజనీ మహమ్మద్ వంటివారు మహమ్మద్ ను ఆదర్శంగా చూపి చంపటం, దోచటం, విధ్వంసం సమర్ధించుకున్నారు. ఇస్లాంలో రక్తాన్ని చిందించటం, శత్రువులను ప్రవక్త సంహరించటం, కొరాన్లో విపరీతంగా రక్తపాతం చాలా బాధాకరమైన లక్షణాలని మార్గోలియత్ అన్నాడు. రసెల్ వంటి పాశ్చాత్య స్వేచ్ఛా ఆలోచనాపరులు సోక్రటీసు, బుద్దుడుకంటే జీసస్ క్రైస్ట్ అంత అభినందించ దగినవాడు కాదన్నాడు. మహమ్మద్ హత్యల్ని, పాశ్చాత్యులూ, ముస్లింలూ, ఇస్లాంను సమర్ధించేవారూ క్షమిస్తున్నారు. సోక్రటీస్, బుద్ధ, కన్ ఫ్యూషియస్, జీసస్ క్రైస్ట్ స్థాయిలో మహమ్మద్ ను చూడజాలం.
      ఖురాన్ దైవ వాక్యంగా నమ్మమనీ, అది శాశ్వతమనీ, సత్యమనీ, మహమ్మద్ చెప్పి నూతన భావాలనూ, స్వేచ్ఛాలోచననూ అరికట్టాడు. 21వ శతాబ్దంలోకి పురోగమించాలంటే స్వేచ్ఛా, నూతన భావాలు అవసరం.
అనువాదం
నరిసెట్టి ఇన్నయ్య