`సప్తపర్ణి` -అక్క చెల్లెళ్ళ కవితా పటిమ

సప్త పర్ణి 
భావలహరి



ఇది ఏ డుగురు సోదరీ మణులు రాసిన స్వీయ కవితల సంపుటి.
అన్నపూర్ణ, రమా సుందరి, ఉమాదేవి, నాగలక్ష్మి, ప్రభావతి, గాయత్రి, గీతాభవాని రాసి 2012 ఆగస్ట్ లొ వెలువరించారు .

ఈ సప్తపర్ణిలో రెండు ప్రత్యేకతలున్నాయి. ఏ డుగురు అక్కచెల్లెళ్ళు కవిత లల్లగలగడం .రెండు-వారి కవితలు ఒకే సంకలనంగా తీసుకరావడం. 
సప్తపర్ణిని పరిచయం చేయడంలో నాకు నచ్చిన కవితలు చూపి మెచ్చుకోవడమే ప్రధానం. విమర్శ భాగాన్ని శ్రి మైనంపాటి భాస్కర్ తన ముందు, వెనుక మాటలో సద్విమర్శగా చేశారు. 
ఇక వివరాలు:
అన్నపూర్ణ (పెద్దక్క) తన ముందు మాటలో తమందరికీ సాహిత్యంలో అభిరుచి తమ తండ్రి సుబ్బారావు (రాజు) గారి ద్వారా కలిగితే , కవితలు రాయడానికి తమ తల్లి సుబ్బులక్ష్మి (అమ్మాజీ) గారి ప్రోత్సాహం తోద్పడిందన్నారు .
తల్లి వారిని సప్తస్వరాలుగా భావించి వారిలో సంగీతం ,సాహిత్యం పట్ల ప్రేమను పెంచారన్నారు .
         అన్నపూర్ణ తమ 53 కవితలను మనకందించారు .జాతస్య మరణం ధ్రువం లో తండ్రి అకాల మరణం మిగిల్చిన తీరని లోటును వ్యధాభరితంగా చెప్పారు .
`రాక్షస ఉగాదికి రమ్యాకాంక్ష ` లో స్వార్థపరులైన రాజకీయనాయకుల గురించి రాస్తూ ,వారికి ఓ టు వేసి గెలిపించి  తాము ఓ డిపోయిన సామాన్య మానవులను సమ్రక్షించమంటున్నారు ఇలా :
                       రాబందులకూ, గుంటనక్కలకూ
                       నువు రాక్షసివని 
                       అందుక్కే ఆకంక్షిస్తున్నాను నీ రాజ్యం 
                       రామ రాజ్యం కావాలని
సవాలు లో ఆమె ప్రశ్నలు :
                        `సగటుమనిషి జీవితం ఎంత పెట్టి గుణిస్తే 
                         పూర్తి జీవితం అవుతుంది ?
                         ఎందరు సూర్యులు ఎన్ని సార్లు ఉదయిస్తే 
                         చీకటి బ్రతుకులు తెల్లవారతాయి? 
న్యాయన్యాయాలు , అలిఖితం, చాయచాయ, సహజీవన సౌభాగ్యం, సమాజానికి సంజీవి , నత్తల్లారా బయటకు రండి, మొదలైనవెన్నో కవితలు చదివి ఆనందించదగ్గవి .

రమాసుందరి 
తమ తల్లిదండ్రుల నుండి సంక్రమించిన సాహిత్య పరిమళం అక్క అన్నపూర్ణ ద్వారా జీవితమంతా గుభళిస్తుందంటున్నారు. పద్య సాహిత్యం అంటే మక్కువ, చందోబద్దంగా కవిత్వం రాయాలన్న తపన -రెండూ జోడై తనతో రాయించాయంటున్నారు .తోచీ తోచక కొన్ని, ఉత్చాహంతో కొన్ని ,ఉక్రోషం తో మరికొన్ని రాశినవి మొత్తం 36 కవితలు మనల్ని చదవమంటున్నారు .యువకవులు- నవకవులు, ఆశీస్సులు (చెల్లి ప్రభావతికి),తుంటరి అక్క  చందమామ ఒంటరి అని రాస్తే , తాను తుంటరి అని రాశారు ). అదర్శంలో -
         నాముందువాళ్ళు నాకోసం పరచిన బాట 
         భావితరాలకు బంగారు బాటగా చేస్తా 
         నా జీవితం నాది కాదు పదిమందిదీ 
         నా సుఖం నాది కాదు నావారందరిదీ 
అంటూ నిస్వార్థతను వ్యక్తం చేశారు. 
పట్టుకొమ్మలో -
          నల్లధనం వద్దట,నల్లధనమైనా ముద్దట 
          లావయితే  వద్దట,  మాలావైన సంపాదన కావాలట 
          ఫట్టులాంటి చిత్తమున్న చిన్నదాని ఎన్నిక 
          ఎప్పటికైనా మాదేనా? అని ఆవెదన వ్యక్తం చేశారు. 
సన్మాన సం రంభంలో -ఈ నాటి సన్మాన సభల తంతు , తీరూ , తెన్నూ అద్దం పట్టినట్లు చూపారు . ఆమె కవితలన్ని చదవదగినవే .

ఉమాదేవి 

తన కవితలకు అన్నపూర్ణక్క స్పూర్తి అన్నారు. తన అక్క చెల్లెళ్ళు ఇంద్రధనస్సులో  సప్త వర్ణాల్లా
అందరూ రాసిన ఈ కకవితా ఖండిక  తాము ఆనందం కోసం రాశినవి, మరి కొంతమందిని ఆనందపరిచే విధంగా పుస్తకరూపం దాల్చడం చాలా ఆనందం అంటున్నారు .
మొదటి కవిత `పర్యవసానం` లో 
                    చెడును మంచితో వంచించాలని   
                    మాటలో కరుకుదనం కట్టిపెట్టి 
                    మ్రు దుత్వాన్ని  పెంపొందించుకోవాలని 
                    మరెన్నో అనుకొంటునా నేను 
అని తాను అశ పడుతుంటే  లోకం తనని స్వార్థమంటున్నదంటారు .
స్వస్వరూపంలో 
                  నేను మానవుడిని 
                  ఆద్యంతాలమధ్య  ఆదర్శ పాలన కోసం 
                  అందులోని ఆనందం కోసం  
                  అలమటించే అతి సామాన్య మానవుడిని
అంటూ  సామాన్యుడి కోరికను వ్యక్తం చేశారు. బంగారు బుజ్జిగాడా మీరేమంటారో, చిరుదీపం మొదలైన కవితలన్నీ చదివి ఆనందించవచ్చు . 

నాగలక్ష్మి 

సాహితీ సమాఖ్యల మీటింగులకెళ్ళడం, అక్కల ప్రభావం ,బి.ఎ.లో స్పెషల్ తెలుగు  చదవడం -అన్నీ ఆమెతో కవితలు రాయించాయి . తనలోనూ కవితా స్పూర్తి వున్నందుకు ఆనందిస్తామంటున్నారు . ఇందులో ఏ డు కవితలు పొందు పరిచారు . 

ఉగాదిలో :

ఏ డాదికో బారసాల చేసుకుంటూ 
తెలుగు జీవితంలో నవ నవోన్మెషంతో 
నూతన చైతన్యాన్నందిస్తున్న  నీకు ఇదే 
స్వాగతాంజలి 
అంటూ ఉగాదిని ఆహ్వానించారు .
కలల పూదోటలో  తానూ ఒక పూ వునవగలిగితే  ఎంత బాగుంటుందో అని ఊహా జగత్తులో విహరించారు . 
తెలుగు లో 
తేట తెలుగు తెల్లన 
అమ్మ మనస్సు చల్లన 
తెలుగు కూడ అమ్మ అని 
తెలుసుకొని మసలరా 

అంటూ తన మాత్రు భాషాభి మానాన్ని ముద్దుగా తెలిపారు. ఇంకా -
కాలచక్రం , అభినందనలు ,నీనీలి ఆకాశం
వంటి కవితలలో తన పటిమ చాటారు నాగలక్ష్మి .

ప్రభావతి 
రాయడం కన్నా చిత్రలెఖనం మీద మక్కువ ఉంటాన ద్రుష్తి అటు సారించానంటున్నారు .తన భావాలకు అక్షర రూపాలే తన ఈ కవితలన్నారు .జ్ఞాపకాల ఝరితో  ప్రారంభించి -రాగ రాగిణి తో  కలిపి పది కవితలు మనముందుంచారు .
ప్లాస్టిక్ పూలలో ఇలా వర్ణించారు .
                            మితి మీరిన చైతన్యంలో  
                            జడ మనస్సుడైన ప్రతీకలు 
                            తెలిసిందిలే , నిరీక్షణా , నీ కోసం జీవన రాగాలు 
అంటూ చక్కని కవితలందించారు .

రాణీ గాయత్రి 

జీవితంలో చమక్కులీ కవితలన్నారీమె .  చురుక్కులూ ,కొంటె వ్యాఖ్యానాలు  ,కొద్దిగా చివుక్కు మనిపించే భావాలు  వున్నాయన్నారు. ఆస్వాదించి, ఆశీర్వదించమంటున్నారు .

అమ్మ కవిత లో
అమ్మ నన్ను వదలి
అల్లంత దూరాన చల్లగా నవ్వెను 
అమ్మ ప్రేమను నేను 
అందరకూ పంచాను 
అంటూ మనసుకు చల్లదనం పంచారు. 
`మా అక్కలు` లో 
మా అక్కలు అనురాగపు మొక్కలు 
ఊహ కందని అమ్మా నాన్నల స్తానంలో నిలిచిన పెద్ద దిక్కులు
మా చెక్కిళ్ళ్లపై విరబూసిన పూవుల సుగంధాలు 
    అంటూ రాసి అక్కలకు క్రుతగ్న తలు తెలిపారు. 
సంక్రాంతి, బాల శివుదు, శివ తత్వం 
ఇందులో కూర్చారు . 

గీతా భవాని 

రాయడం ఎప్పుడు మొదలు పెట్టానో గుర్తు లేదంటూనే 13 కవితలు పైగా రాసి  మనల్ని చదవమంటున్నారు. 
దాహం, వాన, తీయని నిజం, బాల్యం, ఆకలి, చిన్నచిన్న గా ముద్దు ముద్దుగా ఇక్కడ దర్శనమిచ్చాయి .
రాచపీడలో ఇలా వేడుకున్నారు . 
వారసత్వపు రాజకీయాల బారినుండి 
దేవుడా రక్షించు ఈ దేశాన్ని 
కోర్కెల కర్కశ హస్తాలనుండి 
సన్యాసి ముఠాల సర్కస్లనుండి 
రక్షించు రాజకీయ రాక్షసులనుండి .

`మా స్నేహం` చక్కని కవిత. 

అక్క చెల్లెళ్ళందరూ అమ్మ ,.   రాగ రాగిణి రాశారు తమ తమ కవితా పటిమ ప్రతిభ ఫలించేలా. 
అన్నపూర్న గారి `సహ జీవన సౌభాగ్యం`(72 పుట) ప్రభావతి గారి నాకోరిక( 175 పేజి) ఒకటె- పేరు తేడాగా ఉన్నా.ప్రభావతి కవిత  `నిరీక్షణ`( 171 పేజ్)  ,`నీ కోసం`(పేజ్ 172)  రెండూ ఒకటే . రెండవ ముద్రణలో సవరిందుకోవచ్చు. 
      కవితా ప్రియులందరూ `సప్తపర్ణి` చదవదగ్గది. నవ కవులకూ, యువకవులకూ స్పూర్థి దాయకం ఇది. అక్కచెల్లెళ్ళు మరెన్నో కవితలల్లాలని ఆశిద్దాము .


2012 లో వెలువడిన ఈ గ్రంధం వెల పెట్టలేదు .లభించే చోటు తెలిపితే బాగుంటుంది.
 పరిచయం : కోమల వెనిగళ్ళ 
అమెరికాలో మేరీ లాండ్ లో వుంటున్నారు . 
యంగ్ చాంగ్ , అయన్ హర్షి అలి, తస్లిమ నశ్రిన్ ,ఎం.ఎన్.రాయ్ రచనలు కొన్ని అనువదించి ప్రచురించారు . హైదరాబాద్ ఓపెన్ యూని వర్శిటి లో ఇంగ్లిష్ ప్రొఫెసర్ గా రెటైర్ అయ్యారు.  

విమర్శాదర్శ విమర్శాదర్శం


పానుగంటి లక్ష్మినరసిం హారావు విమర్శనా పటిమ 

తెలుగు సాహిత్యంలో హాస్యం ,విమర్శ, నాటకాలు,నచ్చినవారికి పానుగంటి సుపరిచితులు .సాక్షి రచనలొ వాక్యాలు వుదహరించేవారున్నారు .కోకిల మొదలు సారంగధర చరిత్ర వరకు మెచ్చిన వారున్నారు. సాక్షి ప్రియులకు ఆయన గ్రాంధికము  అడ్డురాదు .
కాని పానుగంటి వారి విమర్సలో తలమానికము , గ్రాంధిక వాదాన్ని వెనకేసుక వచ్చిన రచన విమర్శాదర్శ విమర్శాదర్శం అని అధిక సంఖ్యాక పాఠకులకు తెలియదు. ఆయన గ్రాంధిక వాదాన్ని కాసేపు పక్కన పెడితే  హాస్యం, విమర్స ,వ్యంగ్యం ,ఎదుటివారి వారి వాదాన్ని చిత్తు చేయడంలో పానుగంటి ప్రతిభ అద్భుతంగా ఇందులో గమనించవచ్చు .విమర్శాదర్శ విమర్శాదర్శనం అంత సులభంగా లభించడం లేదు .
మొదట గుంటూర్ ఎ.సి. కళాశాలలొ మా గురువు ఎలవర్తి రోశయ్య ఆ రచనను పరిచయం చేసినప్పుడు చదివి చకితుడనయ్యాను .నేను గ్రాంధి క వాదిని కాదు .కాని ఆరచన లోని ఒరవడి ,పదును ,వాదనా పటిమ చాలా గొప్పది . లభిస్తే చదవండి. 
Innaiah Narisetti

నవీన ఇంగ్లీష్ కవితలు ఫీలింగ్స్

నవీన ఇంగ్లీష్ కవితలు ఫీలింగ్స్ కు మంచి చిత్రాలు భాస్కరరావు కూర్చారు
http://deeptidhaara.blogspot.com/2008/05/blog-post_7658.html