ఎం.ఎన్.రాయ్ ఇంగ్లిష్ రచనలు


ఎం.ఎన్.రాయ్ ఇంగ్లిష్ రచనలు ఇప్పుడు వెభ్ సైట్ లో లభిస్తున్నాయి. ఈ అవకాశ సద్వినియోగం చేసుకొనండి.
ఇన్నయ్య నరిశెట్టి


Here are 8 more books of M.N. Roy on the following RH Web portal now for you to download and read directly on your Computers.


They are:

'Revolution and Counter-Revolution in China', 

'Science and Philosophy', 

'Memoirs', 

'India's Message: Fragments of a Prisoner's Diary',

'Materialism', '

'M.N. Roy: Philosopher Revolutionary', 

'Reason, Romanticism and Revolution' Volume I 

'Reason, Romanticism and Revolution' Volume II 

You may also download the following earlier uploaded books of Roy from this website:

'New Orientation',

'New Humanism', 

The Russian Revolution and the Tragedy of Communism',

'Politics, Power & Parties' 

'Men I Met'

'Historical Role of Islam' and 

'From the Communist Manifesto to Radical Humanism'.


.





--







M N Roy life and theory: book on line


కొగంతి రాధా క్రిష్న మూర్థి 1979 లోనె రాసి ప్రచురించిన ఎం.ఎన్.రాయ్ జీవితం, సిధాంతం బహుళ ప్రజాదరణ పొందినది. ఇప్పుడుఆ రచనను ఆన్ లైన్ లోఆనంద్ చిటిపోతు.  లభింప జేస్తున్నారు .దీనికి లింక్ :



కొగంతి రాధా క్రిష్న మూర్థి 1979 లోనె రాసి ప్రచురించిన ఎం.ఎన్.రాయ్ జీవితం, సిధాంతం బహుళ ప్రజాదరణ పొందినది. ఇప్పుడు సి. భాస్కరరావు ఆ రచనను ఆన్ లైన్ లో లభింప జేస్తున్నారు .దీనికి లింక్ :
http://ia600506.us.archive.org/2/items/mnraojivithamsid021460mbp/mnraojivithamsid021460mbp.pdf





యువతరానికి  కావలసిన ఈ రచన గురించి పలువురకు తెలియపరచండి 
Innaiah Narisetti





సర్వెంద్రియానాం మెదడు ప్రధానం




మనోభావాలు అనే మాట ఎక్కువగా వింటూంటాం. మనస్సు ఒక ప్రత్యేక పదంగా కవితలో, సాహిత్యంలో వున్నది.
అలాగే హృదయం కూడా చాలా ప్రాధాన్యత వహించింది. గుండె చెప్పినట్లు వినడం కూడా బాగా వ్యాప్తిలో వున్నది.
శరీరంలో గుండె అనేది నిరంతరం, అమాయకంగా కొట్టుకునే యంత్రం. అది ఆగితే మనిషి చనిపోతాడు. కాని గుండె ఆలోచించదు. అలాంటి శక్తి వున్నది. మెదడుకు మాత్రమే.
మన సాహిత్యంలో పాతుక పోయిన పదజాలం మనల్ని శాసిస్తుంది. ఆలోచించకుండానే అంగీకరించే పదాలున్నాయి. ఆత్మ అలాంటిదే. మనస్సు కూడా అంతే.
విడమరచి చూస్తే ఆత్మ, మనస్సు అనేవి సృష్టించిన పదాలే. అవి ఎక్కడ వున్నాయంటే ఎక్కడా లేవు. మన నమ్మకాలలో మాత్రమే వున్నాయి.
అయినా సరే, ఆత్మ, మనస్సు అనే పదాలకు చాలా ప్రాధాన్యత మతపరంగా యిచ్చారు. అవి నమ్మకాలలో గూడు కట్టుకున్నాయి. వాటిని ప్రశ్నించం. మన పెద్దలు, మన మతాలు, పవిత్ర గ్రంథాలు చెప్పాయని, ఒప్పేసుకుంటాం.
వాస్తవానికి ఎంత అన్వేషించినా ఆత్మ, మనస్సుకు వునికి లేదు.
మరి వున్నదేమిటి?
సర్వేంద్రియాణాం మెదడు ప్రధానం

మన శరీరంలో అన్నిటి కంటె, అత్యంత ముఖ్యమైనది మెదడు. దానిని గురించి మనకు పరిమితంగానే తెలుసు. ఇంకా తెలుసుకుంటూ పోతున్నారు. ఇది నిరంతర శాస్త్రీయ కార్యక్రమం. అలా పొరలు విప్పుతుంటే అనేక ఆశ్చర్యకర సంగతులు తెలుస్తున్నాయి.
మెదడు చేసే పనిలో భాగమే మనస్సు. అంతేగాని మనస్సుకు ప్రత్యేక అంగంగాని, స్థానం గాని వుండదు. మెదడు ఆలోచనలనే ఆ పేరు పెట్టి పిలుస్తాం. జీవశక్తి అనేది అలాంటిదే.
నమ్మకాలన్నీ మెదడు నుండి వస్తాయి.
మెదడులో కణాలు పని చేసే తీరును బట్టి నమ్మకాలు, ఆలోచనలు, భావాలు, కవితలు, యిత్యాదులన్నీ వస్తాయి.
మెదడు చాలా క్లిష్టమైనది. మెదడులో వంద బిలియన్ న్యూరాన్ లు (సూక్ష్మకణాలు) వున్నాయి. ఇవి ఎన్నో రకాలు. ప్రతి దానికీ ఒక కణ (సెల్) భాగం వుంటుంది. ఒక కణం నుండి మరో కణానికి సంబంధం వుంటుంది. వంద బిలియన్ కణాల సంబంధం వూహించడమే కష్టం. ఇక లెక్కించేదెక్కడ?
న్యూరాన్స్ ను తెలుసుకోడానికి ఎలక్ట్రోడ్స్ తో ప్రేరేపిస్తారు. ఎన్నో రకాల న్యూరాన్లను స్థూలంగా ప్రేరిపితాలనీ, ప్రతి బంధకాలనీ విభజించవచ్చు.
న్యూరాన్స్ లో జరిగే ప్రక్రియ విద్యుత్ రసాయన చర్య అనవచ్చు. ఎలక్ట్రో కెమికల్ అన్నమాట. న్యూరాన్లు పరస్పరం స్పందనలు అందించుకునే తీరును తరచుగా ఫైరింగ్ చేయడం, ఎంత సంఖ్యలో ఫైర్ చేస్తుందో గమనించడం, ఏ స్థానంలో ఫైరింగ్ చేస్తుందో చూడడం అని మూడు తీరులుగా చూస్తారు. ఇది మెదడు పరిశీలనలో జటిలమైన కార్యక్రమం.
మన మెదడులో జరిగేది ఎలక్ట్రో మాగ్నటిక్ (విద్యుదయస్కాంత చర్య) అని తెలుసుగాని, దీని పూర్తి అవగాహన ఇంకెంతో జరగాల్సి వుంది.
వివిధ ఔషధాలు మెదడుపై తద్వారా శరీరంపై పని చేసే తీరు గ్రహిస్తున్నారు. ఎలాంటి మందు మెదడులో ఏ భాగంపై పనిచేస్తుందో తెలుసుకుంటున్నారు.
ఆల్డస్ హక్స్ లి అలాంటి ప్రయోగం తనపై కూడా చేసుకుని, వాటి ప్రక్రియను రికార్డు చేశాడు. వాటిని డోర్స్ ఆఫ్ పర్సెప్షన్, పేరిట రాశాడు. ఆధ్యాత్మిక, యోగ, చింతనల పేరిట జరిగే వాటిని రికార్డు చేశాడు. దైవ చింతన కూడా అలాంటిదే.
పరిశోధనల వలన ఇప్పటి వరకు తేలిందేమంటే, నమ్మకాలకు ప్రోది చేసే రసాయనిక ప్రేరణ డోపామైన్ (Dopamine) నుండి వస్తుంది. పైగా ఇదొక అలవాటుగా మారే లక్షణంతో వుంది. అలాంటి అలవాట్లలో మనోభావాలు అనే పేరిట చలామణి అవుతున్న మత విశ్వాసాలు, మూఢ నమ్మకాలు వున్నాయి. దీనిపై చాలా పరిశోధనలు చేశారు.
భావాలు సృష్టించే శక్తి మెదడుకు వుంది. దైవ భావం అలాంటిదే. దయ్యాలు, భూతాలు, పిశాచాలు, మొదలైనవన్నీ అలా సృష్టి అయినవే.
నమ్మకాలకు పుట్టిల్లు, మెదడు. అది సరైనది కాదని తెలిసి కూడా నమ్మడం చూస్తూనే వున్నాం. నమ్మకాలు ముందు ఏర్పరచుకుంటాం. అవి హత్తుక పోతాయి. ఇవి బయట నుండి బలపడేటట్లు అనేక శక్తులు తోడ్పడతాయి. నమ్మకం ఏర్పడిన తరువాత దానిని బలపరచడానికి కారణాలు వెతుకుతాం. ఇదీ తంతు.
మానసిక రుగ్మతలు, మెంటల్ యిత్యాది మాటలు వింటాం. మానసిక జబ్బుల్ని పిచ్చి (ఉన్మత్తత) అని కూడా ముద్రవేస్తారు. పిచ్చి అనగానే మనిషిని వెలివేసినట్లు చూస్తారు.
కాని జబ్బులనేవి – అది ఏమైనాసరే – శరీరానికి వచ్చేవే. ఒక్కొక్క అంగం జబ్బుకు గురైనపుడు దానికి చికిత్స వుంటుంది. మానసిక జబ్బులనేవి మెదడుకు చెందినవి. వాటిని కొన్ని గుర్తించగా, మరి కొన్ని పరిశోధనలో వున్నాయి.
శరీరం లేకుండా జబ్బులు లేవు. ఇంద్రియాతీతమైనవి అనేదంతా అసత్యం. అతీంద్రియ శక్తులు వుండవు. కాని ఆ పేరుతో చాలా దొంగ వ్యాపారం జరుగుతున్నది. ఇందుకు మూల కారణం మానసిక ఇంద్రియాతీత శక్తులున్నాయని గుడ్డిగా నమ్మడమే.
మెదడులో ఏ భాగం  ఏ పనికి చెందినదో గుర్తిస్తున్నారు. ఇంకా విశేష పరిశీలన జరుగుతున్నది. తెలియవలసినవి అనేకం వున్నాయి. ఇప్పుడిప్పుడే జన్యు శాస్త్రం చిగురించింది. ఇందులో చాలా రహస్యాలు పొరలు విప్పుకుంటున్నాయి. తదనుగుణంగా వైద్యశాస్త్రం విస్తరిస్తున్నది. ఈ లోగా చిట్కా వైద్యాలు, భూత ప్రేత చికిత్సలు, వుండనే వున్నాయి. మూఢనమ్మకాల కారణంగా చాలా అనర్థాలు జరుగుతూనే వున్నాయి. శాస్త్రీయ పద్ధతి ఒక్కటే నెమ్మదిగా యీ మూర్ఖత్వాన్ని పోగొట్టగలదు.
స్టీఫెన్ హాకింగ్ ను గమనించండి
శరీరంలో 90 శాతం  పనిచేయకపోయినా మెదడు శక్తితో స్టీఫెన్ హాకింగ్ ప్రపంచానికి విజ్ఞాన ఫలితాలు అందిస్తున్నారు. ఆయన మానవాళికి గర్వకారణం. ఇటీవలే గ్రాండ్ డిజైన్ శీర్షికన వెలువరించిన గ్రంథం విశ్వవ్యాప్తంగా ఆలోచింప జేస్తున్నది. దైవ భావన ఒక నమ్మకంగా తేల్చిన స్టీఫెన్ దాని అవసరం లేదని స్పష్టం చేశారు.
మరి అయితే, యీ మూఢ నమ్మకాలు ఎక్కడ నుండి వస్తున్నాయి? తల్లిదండ్రుల దగ్గర మొదలై, సమాజంలో వీటి విజృంభణ జరుగుతున్నది. కొన్నాళ్ళకు అది మూఢ భావన అని తెలిసి కూడా, అలవాటు పడినందున ఆనవాయితీగా ఆచరిస్తారు.
వైజ్ఞానిక పద్ధతి వలన (శాస్త్రీయ పంథా) మూఢ భావాల గుట్టు తెలిసినా వదలుకోలేకపోతున్నారు. పైగా మనలో వస్తున్న మూఢ నమ్మకాలను సమర్థించే విధంగా కారణాలు చూడడం కూడా వున్నది.
ప్రపంచంలో జరుగుతున్న ప్రగతి, మానవ పురోగతి అంతా శాస్త్రీయ (వైజ్ఞానిక) పద్ధతి వలనే అని గ్రహించాలి. దానికి మూఢ నమ్మకాలు అడ్డు రాకుంటే యింకెంతో ముందంజ వేస్తాం.
అంతా తెలుసు, అన్నీ మన పూర్వీకులు చెప్పారు. సత్యం అంతా పవిత్ర మూల గ్రంథాలలో వుంది అనేవి మానవ ప్రగతికి అడ్డం.
ప్రకృతిలో మనం వున్నాం, అందులో తెలిసింది కొద్ది. తెలుసుకోవలసింది అపారం, అది క్రమేణా నిరంతరం జరుగుతుంది అనేది వైజ్ఞానిక ధోరణి. మన పిల్లలకు అదే అవసరం
Innaiah Narisetti.

సి.ధర్మారావు-మాసపత్రిక ఆవలి తీరాన-Editor




సి.ధర్మారావు 80 పడిలోకి వచ్చి హైదరాబాద్ లో విశ్రాంతి గా ఒక వ్రుథుల మాసొ పత్రికకు ఎడిటర్ గా కాలక్షేపం చేయడం సంతోషంగా వున్నది.
వుద్యోగంలో వున్నప్పుడు రెటైర్ అయిన తరువాత కూడా పరిమితం గా రచనలు చేస్తూనే వున్నారు. 45 ఏళ్ళుగా పరిచయం గల ధర్మారావును తరచు ఫోన్ లో పలకరిస్తూనే వున్నారు.
ఇప్పుడు ఆయన ఎడిటర్గా వున్నమాసపత్రిక ఆవలి తీ రాన శీ ర్షిక తో 13 ఏళ్ళుగా మలక్పెట, హైదరాబాద్ నుంది వస్తున్నది.
వ్రుధుల నేస్తం గా ఈ పత్రికను పేర్కొన్నారు .చందాలకే. చందాలకే పరిమితం . బి-74 బి.బ్లాక్స్ ,మలక్ పేట్,హైదరాబాద్ .ధర్మారావు ఫోన్ 91-40-24041999
1969 లొస్ మెము గోరాశాస్త్రి సంచిక 50 వ జన్మ దిన సందర్భంగా వెలువరించాము. 
ధర్మారావు మితభాషి. అమెరికా వచ్చి తానాసభలో పాల్ గొన్నారు. 
వెల్చేరు నారాయణరావు ఆయన చిన్ననాటినుండీ మిత్రులు.
C.Dharmarao( standing) ,next Gorasastri, 
P.V.Narasimharao 1949 kurnool

Meka chakrapani article in Mulukola in 1949 Bezwada


My ebook in Telugu

Please see and download my ebook Abaddaala veta Nizaala baata
link: http://paradarsi.wordpress.com/2012/02/01/book_review_abaddhalaveta/

విశ్వనాథ సత్యనారాయణ


విశ్వనాథ సత్యనారాయణ
వ్యాస నేపధ్యం
కోగంటి సుబ్రహ్మణ్యం సంపాదకత్వాన రాడికల్ హ్యూమనిస్ట్ పక్ష పత్రిక తెనాలి నుంచి ప్రచురితమైంది. 1958 ప్రాంతాలలో ఇన్నయ్య గారు విశాఖపట్టణం లో వుంటూ హ్యూమనిస్ట్ లో రాసిన ఈ వ్యాసం ఇటీవలనే లభించింది. విశ్వనాధ సత్యనారాయణ గారిపై ఆ నాటికే త్రిపురనేని రామస్వామి, శ్రీ శ్రీ, ఆవుల గోపాలక్రిష్ణమూర్తి, జాషువా వంటి వారు తీవ్ర విమర్శలు చేశారు.విమర్శకుల దృష్టిలో, కులం, మత ఛాందసం, దుష్టాచారాలను సమర్ధించిన విశ్వనాథ తిరోగమనవాది.

ఆంధ్ర ప్రదేష్ లో పాఠ్య పుస్తకాలను జాతీయం చేసిన సందర్భంలో విశ్వనాథ వారు, అభ్యుదయ మానవతావాదుల తీవ్ర విమర్శలను ఎదుర్కొనవలసివచ్చింది. బుద్ధుడిని రాక్షసుడిగా రాయటం జరిగింది. AGK తీవ్రంగా విమర్శించటంతో ఆ వ్యాసాన్ని పాఠాలనుంచి తొలగించారు. కులం పేర్కుంటూ, జాషువా పై అవహేళనగా వ్యాఖ్యలు చేసారు. ఇవి ఈ వ్యాసం రాసిన సమయాన ఉన్న నేపధ్యం. ఇన్నయ్య గారి వ్యాసం దిగువున ఇస్తున్నాము.

-cbrao


శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

అధికార కేంద్రీకరణ సాహిత్యరంగంలో ప్రబలుతున్నకొద్దీ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారిని రచయితగా, నవలాకారునిగా, నాటకకర్తగా, కవిగా, పండితునిగా, కవిపండిత, పండిత కవి వగైరాలుగా – విభజించి – ఏ రంగానికారంగమైనా సరే – మొత్తం కలిపి అయినాసరే – ఏరీ ఆధునికాంధ్ర సాహిత్య రంగంలో విశ్వనాథకు ఎదురేరీ – ఇదీ నేడు వీధి వీధినా జరుగుతున్న తోలుబొమ్మలాట, సాహిత్యంలో స్వాతంత్ర్య పిపాసువులూ, నిష్కర్ష విమర్శకులు లోపిస్తుండగా భట్రాజీయం విరివిగా – కలుపువలె పెరిగిపోతున్నది. ఎవరి స్వార్థములు వారివి. సత్యనారాయణగారితర్వాత ఎవరైతేనేమి... (నెహ్రూ తర్వాత ఎవరన్నట్లు) వర్తమానం గడవాలి. అంటే భజన చెయ్యాలి. అది సరేనయ్యా.

ఈ విధంగా వీధి వీధినా ఏదో శక్తి వుండక పోతుందా – మళ్ళీ తిన్న అన్నమే తిని చూశాను. తిన్న అన్నం తింటే మనిషికి విషం కాదూ మరి ? పశువులైతే నెమరువేయగలవు కానీ పరిణామంలో ఆ శక్తిని అధిగమించాంగా. తిన్న అన్నము వంటిది తినగలము. అంతకుముందున్న అభిప్రాయాలు అవతలకు నెట్టి, పొగడే వారిపై గల గౌరవంతో మళ్ళీ కల్పవృక్షం తిరగేస్తే అంతా చిన్నము నిలువక వ్రాసినట్టే వున్నది. దీపికా లతాంతములో దివ్యజ్యోతి వుంటుందా, అక్కడక్కడ కవిత్వపు పటుత్వం, దుర్విదగ్ధతతో కూడిన శిల్పం మసక మసకగా కన్పించినవి. విశ్వనాథ పేరు నిలబెడితే, అంటే ఆయన తర్వాత కీర్తిని శేషింప చేయగలిగినది పలువురు పేర్కొంటున్న రామాయణ కల్పవృక్షమే యిటులుండ యిక మిగిలిన వాటి మాటేమిటి.

వ్రాసిన నవల లన్నిటిలోకి ఏకవీర అత్యుత్తమమన్నారెవరో. చదివి అభిప్రాయం సైతం యిదివరకే వ్రాశాంగాని, మరలా ఒక్కసారి తిరగేస్తే వంటబట్టని మనస్తత్వ శాస్త్రం కనిపించింది. అదే శరత్ అయితే.

వేయి పడగలు చిత్రం తెలుగు వికిపిడియా సౌజన్యంతో

పరిమాణాన్ని బట్టి అయినా – విశ్వనాథవారి ఓపిక చిహ్నమైన – వేయిపడగలు ఇది ఏ కోవలోకి చెందినదబ్బా? నవల అనటానికి వీలు లేదు. కేవలం వచన రచన అనలేం. అంత జుగుప్స కలిగించే సంభాషణలు, చాదస్తం ఎలా ప్రవేశపెట్టగలిగారో విశ్వనాథవారు. పండిత కవి కదా.

కొందరెవరో వీధి శృంగారమనేవారట విశ్వనాథవారి శృంగార వీధిని. ఏమోగాని వీధిలో సైతం అలాంటి శృంగారం కన్పట్టదు. ఆ మధ్య సన్నిధానం సత్యనారాయణ శాస్త్రిగారి నరస భూపాలీయం చూస్తుంటే శృంగార వీధి లోనిదంతా ఆరీతి అని అన్నారాయన. మరి తెలిసిన వారు ఎక్కడేమాట అనాలో అలాగే అంటారు. విశ్వనాథవారిని చదివి చదివి అభిప్రాయం చెప్పలేని నాలాంటివారికేం తెలుసు ఏమనాలో. తెలియనిచ్చేట్లు రాశారా ఆయన.
విశ్వనాథవారి రచనలన్నీ ఓపిగ్గా సేకరించి ( కొన్నట్లయితే ఎంత అదనంగా బాధపడేవాడినో) చదివిన తర్వాత ఎందుకు ఇంత కాలం వృధా చేశానా? అనిపించింది. అసలు మాతో రోశయ్యగారంటుండేవారు. – తపస్సు చేస్తే మాత్రం పానుగంటి సమాసపు కట్టు విశ్వనాథకు అబ్బుతుందా. విశ్వనాథవారు తన శక్తినంతా దుర్వినియోగమే చేశారు. చక్కని భాషలో గద్యరచన చేసినా బాగుండేది. అన్నిటిల్లో కాలు పెట్టి – దేనిలోనూ సాధన లేకుండా పాడు చేసుకున్నారు. అడుగడుగునా నాగుబాము వలె ఏమారక విషం కక్కుతూ, ఆ వైదికాధ్యాయత తొంగి చూస్తూనే ఉంటుంది ఆయన రచనల్లో. నన్నయకున్న లోటదేగా. ఎందుకో ఆయన శిష్యుడయ్యాడు విశ్వనాథవారు.

విశ్వనాథవారి రచనలు యికనుంచి రావు – వచ్చే అవకాశాల్లేవు – అని నిశ్చితాభిప్రాయాని కొచ్చిన తర్వాత పంచశతి కనిపించింది. అవినీతికి శిఖరాగ్రమందినట్లేనని నిశ్చయించుకున్నాను. ఏమైనా యీ ఆధునిక కాలంలో – అటువంటి రచనలు సాగిస్తూ చెలామణి కాగలుగుతున్నందుకు చెప్పదలచినది ఎవరేమనుకున్నా ధైర్యంగా చెబుతున్నందుకు ఆయన్నభినందించాలి. అయితే నా సందేహమల్లా? విశ్వనాథవారే స్వయంగా వెళ్ళి ఎన్ని సభల్లో తన కావ్యాల విశిష్టతను వివరించగలరు గనుక. వయసు మీరింది. త్వరగా కాలం వృధా చేయక పేరు నిలబడటం కోసం – వెంటనే రచనలన్నిటికీ టీకాతాత్పర్య సహిత వ్యాఖ్యానము వ్రాసిపెట్టిపోతే అభిమానులకు తర్వాత చదువుకునేందుకు బాగుంటుంది. ఈ ఉపన్యాసాలు తాత్కాలికమే కాని చెప్పినదంతా గుర్తుంచుకుంటారా ఏమన్నానా.
ఇంత వ్రాసిన తర్వాత మిత్రుడొకడు, ఎంత చెడ్డా కవిగదా, ఆయన కవిత్వంపై ఏమీ వ్రాయలేదేమన్నాడు. భట్రాజులంతా జీలగబెండులో సారం పిండిన తర్వాత, మిగిలినది పిండి నీవు అనుభవించు అన్నట్లుంది. శక్తి దుర్విదగ్ధతవల్ల చెడగొట్టుకున్నవారిని చెప్పిన తర్వాత, యింకా శక్తి విషయం చెప్పమనటంలో అర్థం లేదు.
మరి వూరూరా విశ్వనాథ సత్యనారాయణ గారికింత ప్రచారం సాగటంలో అంతర్యం? కవిత్వమా? కవిత్వం ఎవడికి కావాలి. లౌకికం. అదే భారతీయ సంస్కృతి లోతుపాతులు తెలిసిన వారికి ఈ విషయాలాట్టే చెప్పనక్కరలేదు. అమ్ముడుపోయే ప్రతులూ, భట్రాయాలూ కాదు. కవిత్వపు విలువను నిర్ణయించేది. అది కాలగమనంలో ఋజువౌతుంది. పేరుకు గ్రాంధికం, లౌక్యానికి వ్యావహారికం, యిది కాదు. సమ్రాట్ లక్షణాలు. అకాడమీలు విలువల్ని కొలవలేవు. అన్నీ ప్రియమైన సత్యాలు చెబుదామనే మొదలు పెట్టాను. సత్యంలో ప్రియత్వమేదీ? ఉంటే విశ్వనాథవారు కవిత్వమే వ్రాయక పొయ్యేవారు.

ఇంతకూ విశ్వనాథను గురించి ఏమంటావు? అన్నాడు మిత్రుడు. కచ్చితంగా చెప్పలేను, పండితుడని, సాహిత్య దృష్టిగలవాడని, తద్వారా ప్రయోజనాన్ని ఆశించిన వాడని సాహిత్య రంగంలో ప్రమాదకర వ్యక్తి అనీ – యింకా ఇలాంటివే ఏవో కొన్ని కారణాలు అందరికీ వంటబట్టవు. ఆహా సరుకుంటే యింత వందిమాగధత్వం ఎందుకవసరమౌతుందీ. ఏమైనా విశ్వనాథ కళ్ళతో తిక్కన, శ్రీనాథుల చూసే దౌర్భాగ్యం కలగకుండు గాక. సాహిత్య రంగంలో ఈ అవ్యవస్థకు భట్రాజీయం అంతిరించు గాక.
అసతోమా సద్గమయ.
Written in 1958 by Innaiah Narisetti
Published in Radical Humanist telugu fortnightly from Tenali edited by Koganti Subrahmanyam