స్తాన్ ఫర్డ్ యూనివర్సిటిలో శ్రిమతి డొరోతి

శ్రిమతి డొరోతి 1987 లో బొంబాయి లో జరిగిన భారత రాడికల్ హూమనిస్త్ సభలలో పాల్గొన్నారు .ఆమెకు ఎం ఎన్ రాయ్ , ఆయన తొలి భార్య ఎవిలిన్  ఆసక్తి వున్నది.

సెప్తెంబర్ 24, 2010 న నేను ఆమెను స్తాన్ ఫర్డ్ యూనివర్సిటిలో కలిసి చాలాసేపు ఇష్టా గోష్టిగా చర్చలు జరిపాము. భారత దెసంలో తాజు కలసిన హూమనిష్తులు గురించి అడిగారు. ప్రస్తుతం రాడికల్ హూమనిష్త్ ఎడిటర్ గా వున్న రేఖను మెచుకొని అడిగింది.

నేను ఎవిలిన్ పై రాశిన పుస్తకాన్ని మెచుకొని , స్తాన్

ఫర్డ్ యూనివర్సిటి లైబ్రరీ కి బహూకరించి నట్లు తెలిపారు.ళోగడ ఆమె భర్త ప్రొఫెస్సర్ రాబర్ట్ నార్థ్ ను నేను 1998 లో కలసిన సంగతి ఆమె గుర్తు చేసారు.ఇదొక చక్కని అనుభవం. నేడు దొరోతి అటార్ని గా రితిర్ అయ్యరు. తరచు రాదికల్ హూమనిస్ట్ పత్రికకు రాస్తున్నారు.

బి ఎస్ ఆర్ క్రిష్ణ

BSR Krishna in world Telugu federation with chief minister k.rosaiah
బి ఎస్ ఆర్ క్రిష్ణ 2010 సెప్టెంబర్ 10 న మద్రాస్ లొ 82 వ ఏట చనిపోయారు.

మెమిరువురము 55 ఏళ్ళుగా మిత్రులం. బి ఎస్ ఆర్ గుంటూర్ దగ్గరలో సిరిపురంలో పుట్టి, సత్తెనపల్లి, గుంటూర్ లో చదివారు. పొగాకు లోకం పత్రిక ఎడిటర్ గా మొదలుపెట్టి ,ఫ్రజా పత్రికలో కొద్ది రోజులు పనిచెసి ,ప్రజావాని వార పత్రికలో కొన్నెళ్ళు రాసారు. ఆచార్య రంగా గారి వాహిని పత్రికలో పనిచెస్తూ , మద్రాస్ లో అమెరికా కాన్సలెట్ లో టెలుగు విభాగ యజమానిగా చేసి రిటైర్ అయ్యారు.

తెలుగులో కధలు, అనువాదాలు రాసారు. ప్రపంచ తెలుగు సంస్థలో చాలాకాలం క్రిషి చేసారు. 1963లో అమెరికా ప్రభుత్వ ఆహ్వానాన్ని ఆవులగోపాలక్రుష్న మూర్తికి తెనాలిలో అందచేసినది వీరే .

BSR second from right in Vizac Telugu conference

ఇన్నయ్య పంతులు గారూ వందనములు

ఇన్నయ్య పంతులు గారూ వందనములు అని అమెరికా ప్రొఫెసర్ అంటే ఆశ్చర్యం వేయదూ?


విస్ కాన్సిన్ యూనివర్సిటీలో 50 ఏళ్లుగా పొలిటికల్ సైన్స్ చెబుతున్న రాబర్త్ బాబ్ ఫ్రికంబర్గ్ ను ఇటీవల మాడిసన్ లో కలిసినప్పుడు అనుభవం అది.

బంగోరే మీకు తెలుసా , ఆయన నాకు సన్నిహిత మిత్రుడు .మిస్తీ రియస్ గా చనిపోవడం చాలా బాధ అనిపించింది అని, తనకు తెలిసిన వారి పేర్లు చెబుతూ పోయారు.

రాబర్త్ ఊటీలో 1930 లో పుట్టారు .తల్లి తంద్రి స్వీడిష్ మిషనరీస్ .తనకు 12 ఏళ్ళు వరకూ గుంటూర్, నల్గొండ లో తిరిగినందు వలన తెలుగు బాగా పట్టుపదిందన్నారు .కాని 80 వ పడిలో మరచి పోతున్నానని ,పేర్లు గుర్తుకు రావడం లేదన్నారు.

తెనాలి రాడికల్స్ ఆవుల గోపాల క్రుష్న మూర్థి ,ఆలపాటి రవీంద్రనాథ్ తెలుసుననీ, ఆచార్య రంగా, ఆర్ వి ఆర్ చంద్రసేఖరరరావు, పి.వి.నరసిమ్హారావు, పి.వి.జి.రాజు, జలగం వెంగళరావు, భద్రిరాజు క్రుష్న మూర్థి , చేకూరి రామారావు , వకుళాభరనం రాజగోపాల్, ఎం పి పాయ్, వి.కె. బావా బాగా పరిచయమన్నారు.

రాబర్త్ 12వ ఏటా అమెకా వచి చదివి ప్రొఫెస్సర్ గా స్తిరపడ్డారు.

విస్కాన్సిన్లో తెలుగు ప్రవెస పెట్టదానికి,వెలిచేలు నారాయనరావును తీసుకరావడానికి ఈయనే కారణమని తెలుసుకొని సంతోషించాను.

రాబర్ట తొలి రచన గుంటూరు జిల్లా 1965 లో ఆక్స్ ఫర్డ్ వారు వెలువరించారు .

బ్రితిష్ పాలన, ముస్లింల ప్రభావము, కరణాల పట్టు ,వాసిరెడ్డి వెంకతాద్రి నాయుడు వంటివారి సంసంస్థానాల తీరు లోతుగా పరిషొధన చేసి రాసారు .

అప్పటినుండి వరుసగా తెలుగు వారి పాలన, డిల్లి పాలన పై అనేక రచానలు వెలువరించారు.

మా సంభాషణలో మధ్య తెలుగు పదాలు వాదుతూ పోయారు.

1975 లో హైదరాబాద్ లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు సభలకు కలక్తర్ గ్విన్ తో పాటు పాల్గొన్నారు .

భారత దేశంలో క్రైస్తవులు ఎలా తొలుత ప్రవేశించారు, పిమ్మట మత మార్పిడులు ఎలా జరిగాయి, 600 పుటలలో విపులంగా రాయగా ఇటీవల ఆక్స్ఫర్డ్ వారు ప్రచురించారు .

చివరలో ఇరువరం మాడిసన్లో స్వాగత్ హోటల్ లో భోజనము చేశాము. మాతో పాటు వున్న చెరుకూరి రవి ఫోటోలు టీసారు. ణేను తీసుకెళ్ళిన గుంటూర్ జిల్ల రచన చాసి ఆనందించి ఆటొగ్రాఫ్ చేసి ఇచారు.

ఇక వెళ్ళి రండి అంటూ కరచాలనము చేస్ ఇ సాగనంపారు.

అశ్రద్దకు గురైన తెలుగు సాహిత్య పంట ఏటుకూరి వెంకటనరసయ్య

ఏటుకూరి వెంకటనరసయ్య


అశ్రద్దకు గురైన తెలుగు సాహిత్య పంట

క్సేత్రలక్ష్మి కావ్యం తో ఆకట్టుకున్న ఏ టుకూరి వెంకటనరసయ్య (1 ఏప్రిల్ 1911-10 నవంబర్ 194 తెలుగు మాస్తారుగా గురిజాల, నిదుబ్రొలులో పనిచేస్తూ కావ్యాలు రాసారు .

5 భాగాలుగా పలనాటి వీరచరితము రాసారు.అవి అలుగురాజు ,నాయకురాలు, అలరాజు, మాంచాల .

మిగిలినవి: నీతిమంజరి ,రైతు హరికధ, సిద్దాస్రమము,ప్రేమాలొకం, అంగద రాయభారము( లభించుటలేదు.

చందమమ మాస పత్రిక ఈయన నీతి వాక్యాలు ప్రచురించినది .గో వాడలో జరిగిన సాహిత్య పోటీలో రైతుహరికథ ఎంపిక కాగా కవిబ్రహ్మ అని బిరుదు ఇచ్చారు.

1955 లో ఎ.సి.కాలేజిలో వి వి ఎల్ నరసిం హారావు చే కవిబ్రహ్మ సాహిత్యంపై నేను ఉపన్యాసము ఏర్పాటు చెయగా పూర్తి పాఠాన్ని ఆంధ్ర పత్రికలో ప్రచురించారు